Thursday, May 24, 2018

The Story of Lalitha Devi .. from the Brahmanda Purana


This is a story of the days following the destruction of Daksha’s sacrificial rite by Shiva’s retainers and the rebirth of Dakshayani (Sati) as Gauri, daughter of the mountain-lord Himachal. The Asura leader Taraka had routed the gods who found out that only a son of Shiva could slay this invincible. But the lord was engrossed in meditation. So, the gods begged Kama, the god of love, to intervene. Shiva, disturbed with the flower-arrows of desire shot from Kama’s sugarcane bow, opened his third eye and burned the presumptuous god to ashes. Chitrakarma, a lord of Shiva’s hosts, made a wonderfully formed figure from these ashes. When Shiva cast his gaze upon this form, it assumed life as an extraordinarily powerful, resplendent person who worshipped Mahadeva with the Shatarudriya mantra that Chitrakarma taught him. Delighted, Shiva blessed him, “Bhanda (fortunate)! As you have wished, half the strength of your opponent’s strength will become yours and your rule shall last for sixty thousand years.”

Daityas flocked to join Bhanda who was advised by Shukra to rebuild the city of Shonitapur (Tejpur in Assam, or somewhere on the banks of Mandakini) from where Daityas had ruled the three worlds in earlier times. Crowned there with the crown Brahma had given Hiranyakashipu, he chose two chowries that dispelled all sickness as his insignia. Shukra gifted him an umbrella made by Brahma that sheltered one from all missiles, a bow named Vijaya, a conch called ‘slayer of enemies’ and an imperishable throne that shone like the sun.

Comprehending the needs of the time, the gods silently served Bhanda who, with his Danavas, worshipped Mahadeva. Thus sixty thousand years passed like the blink of an eye. Then Janardana, lord of the Devas, created an invisible, all-enchanting Maya to delude Bhanda. Seeing her with her attendant apsaras, Bhanda and his counsellors were infatuated. Immersed in lust, they forsook all auspicious rites and neglected their preceptor, much to the delight of Vasava and the gods.

Narada, the itinerant sage, now advised the gods to destroy the deluded Daitya by propitiating the transcendent Shakti. On the slopes of the Himalaya the gods performed a great yajna to worship Parashakti on the bank of the Bhagirathi for ten thousand years and ten days.

Noticing this, Shukra approached Bhanda and warned him that Vishnu had invariably slain leaders of Daityas. Therefore, he should abandon Maya and rush to frustrate the rites of the gods.

As they approached the site, the Creatrix reared up a rampart before them, which reappeared every time Bhanda shattered it with his missiles. Despondent, Bhanda returned to his city. Horripilating, Shakra decided to hold a maha-yajna to worship the transcendent Shakti by offering Mahamamsa, human flesh. And so they did, chopping off the flesh of the victim and dropping it into the holy fire including feet and hands. As they were offering the entire body, a massive wheel-shaped mass of dazzling lustre emerged from the flames. The gods saw Mahadevi Ambika in its centre.

The essence of beauty and bliss, she resembled the hibiscus in complexion, wore robes of pomegranate-red and ornaments of all types, bearing noose, goad, sugarcane-bow and five shining arrows in her four hands. The gods chanted the praises of this Kamakshi, Kameshi, Kali, celebrating her as Mother Shri Lalita. The goddesses Durga, presiding deity of all mantras, and Shyama, presiding deity of all lores, joined Shri Lalita.

Commanded by Brahma, Vishvakarma built a wondrous city on the spot. Brahma pronounced that by herself a woman could not rule over a kingdom. She needed a consort to be complete. Since she embodied love itself, Shankara alone could suit her. As Brahma mused thus, Maheshvara manifested in the form of Kameshvara, a million times more attractive than the god of love. The goddess garlanded him and was given in marriage by Vishnu. The Devas presented them with various weapons and ornaments.

Thereafter, Lalita Devi set out to conquer Bhanda. Out of her goad emerged the goddess Sampatkari, sword in hand, mounted on the elephant Kanakakolahala. From Lalita Devi’s noose emerged the swiftly moving deity Ativaritavikranti seated on the horse Aparajita, holding in her four hands the noose, the goad, the cane and the horse’s bridle. They were joined by the boar-faced Shakti Krodhamukhi leading an army carrying palm-leaf fans set with diamonds and dark Mantranayika on a chariot. Alighting from the elephant Shri Dandanatha mounted the lion Vajraghosha whose thunderous roar deafened the four quarters. From the parrot carried on the hand of dark Mantranayika (whose other names are Sangitayogini and Shukapriya), the science of archery emerged to hand over the bow Citrajiva and inexhaustible quivers. Lalita Devi moved ahead on a huge chariot on whose ninth step ten Siddhi Devis of china rose complexion were stationed (Anima, Mahima, Laghima, Garima, Ishita, Vashita, Prapatisiddhi, Prakamyashiddhi, Muktisiddhi and Sarvakama, each holding the Chintamani, skull, trident and collyrium. There were also eight Shaktis: Brahmi, Maheshvari, Kaumari, Vaishnavi, Varahi, Mahendri, Chamunda and Mahalakshmi, each holding skull and lotus, red in complexion and in red garments. Above them were the Mudradevis with two hands, expressing mystical gestures, resembling pomegranate flowers and dressed in yellow robes. In two arms they held shields and swords.

Each had her name preceded by “sarva”: Samkshobini, Vidravini, Karshanakrinmudra, Vashankari, Madnanamudra, Mahankushayashti, Khecharika, Bija, Yoni, Trikhandika. Above them were the 16 digits of the moon with secret names, resembling the coral tree, with four arms holding swords, shields, bows and arrows and three eyes each. On the seventh step were the Gupta Taras, with the lustre of the china Rose, each of whose names was preceded by “Ananga”: Madana, Madanatura, Lekha, Vega, Ankusha, Malangi, holding sugarcane bow, flowery arrows, bouquets of flowers and lotuses. Then were the Sampradayas on the sixth step who had risen from the ashes of Kama, wielding fiery bows and arrows, lustrous like the fire of death, each name preceded by “Sarva”: Samkshobini, Vidravini, Karshanika, Hladanika, Sammohini, Stambhana, Jrimbhana, Unmadana, Arthasadhika, Sampattipurani, Mantramayi and Dvandvakshayankari. On the fifth step were the ten Kulottirnas like crystals, holding axe, noose, mace, bell and gems. Their names, preceded by “Sarva” are: Siddhiprada, Sampatprada, Priyankari, Mangalakarini, Kamaprada, Duhkhavimochini, Mrityuprashamini, Vighnanivarini, Angasundari, Saubhagyadayini. On the fourth step were the benevolent Nigarbhayoginis of pearly lustre, whose names preceded by “Sarva” are: Yajna, Shakti, Aishvaryaprada, Jnanamayi, Vyadhivinashini, Dharasvarupa, Papahara, Anandamayi, Raksharupini and Ipsitaphalaprada. Each held the thunderbolt, javelin, iron club and discus. On the third step were the eight Rahasyayoginis, deities of speech, lustrous like the red Ashoka, holding bows and arrows, encased in armour, also carrying lutes and books: Vashini, Kameshi, Bhogini, Vimala, Aruna, Javini, Sarveshi and Kaulini. On the second step were three goddesses, with eight arms holding bows, arrows, drinking bowl, fruit, dagger, shields, noose and a bell: Kameshi, Vajreshi, Bhagamalini. On the step in the centre of the chariot were fifteen deities, all round on the Anandamahapitha, the great seat of bliss, who are eternal, resembling Lalita in forms and weapons: Kameshi, Bhagamala, Nityaklinna, Bherunda, Vahnivasini, Mahavajreshvari, Druti, Tvarita, Kulasundari, Nitya, Nilapataka, Vijaya, Sarvamangala, Jvalamalinika and Chitra.

Shridevi or Lalita’s favourite was Sangitayogini also called Mantini, deity of music, riding in the chariot Geyachakra on whose first step sat Mantini. On the second step were Rati, Priti and Manoja holding lutes and bows, dark like the Tamala tree. On the third step were the deities of Kama’s arrows: Dravini, Shoshini, Bandhini, Mohini and Unmadini with five gods named Kamaraja, Kandarpa, Manmatha, Makaradhvaja and Manobhava, glowing like the Palasha flower. On the fourth step were Lakshmi, Sarasvati, Rati, Priti, Kirti, Shanti, Pushti and Tushti, the eight Kumaris, holding lances and discus. On the fifth step were sixteen deities: Vama, Jyeshtha, Raudri, Shanti, Shraddha, Sarasvati, Shribhushakti, Lakshmi, Shrishti, Mohini, Paramathini, Ashvasini, Vichi, Vidyunmalini, Surananda and Nagabuddhika, lustrous like the ruby, covered in armour, holding thunderbolt, baton, shataghni and bhushundika. On the sixth step were the Bhairavas with trident and drinking bowl: Asitanga, Ruru, Chanda, Krodha, Unmattabhairava, Kapali, Bhishana, Samhara. On the seventh step were Matangi, Siddhalakshmi, Mahamantangika and Mahati holding bows and arrows. With them were the heads of Ganas, Kshetrapa, Durgamba and Batuka along with Lakshmi, Sarasvati and the treasures Shanka and Padma. On the same step were the ten deities of the quarters holding thunderbolt, spear, Kala’s staff, sword, noose, pennant, mace, trident, missile of darbha grass and the discus.

On the chariot Kirichakra rode Dandanatha, boar faced, dark complexioned. On the second step were Jrimbhini, Mohini and Stambhini with pestle, plough and liquor pot. On the third step were five deities led by Andhini seated on the Devi yantra. On the fourth step were six deities led by Brahmi. Beneath them were the seven Dhatunathas: Yakshini, Shankhini, Lakini, Hakini, Shakini, Dakini and another Hakini ready to consume the seven ingredients of the body. Krodhini and Stambhini fanned with chowries on the same step flanked by plough and pestle. The terrible lion Chandocchanda stood before Dandanatha with three eyes. On the sixth step were eight deities led by Vartali: Varahi, Varahamukhi, Andhini, Rodhini, Jrmimbhini, Mohini and Stambhini with a dusky white buffalo on their left to carry Dandanatha. Beneath them were Indra and the other guardian deities of the cardinal points. On the wheel were Jrimbhini, Stambini and Mohini presiding over the Northwest. At the end of the step was Kshetrapala holding skull and mace, damaru and serpent noose. Beneath them were ten Bhairavas: Hetuka, Tripurari, Agnibhairava, Yamajihva, Ekapada, Kala, Karalaka, Bhimarupa, Hatakesha and Achala.

Hearing the noise, Bhanda ordered Kutilaksha, “Drag that foolish woman conceited because of the strength of the Devas, by her tresses after defeating her.” Durmada was the first to attack and was slain by Sampatkari with her arrows. Kuranda now came forward, elder brother of Durmada, to attack Sampatkari. But she was approached by Chandi who requested permission to despatch this foe. Seated on a horse, she slew him with her blazing goad. Kutilaksha now sent five generals led by Karanka who created a huge serpent to swallow up the Shaktis. Goddess Nakuli riding on Garuda was born of the palate of Lalita, and presided over all speech. She turned her teeth into mongooses who despatched all the serpents. Then she beheaded the five generals.

Now Bhanda sent seven generals led by Balahaka. At the bidding of Dandanatha, her bodyguard Tiraskaranika blinded the foe and beheaded them. She made a garland of their seven heads and put it around her neck.

Bhanda now asked his brother Vishanga to attack Lalita from the rear while fifteen generals distracted her armies. They succeeded in occupying the ninth step of Lalita’s chariot and Vishanga’s arrow shattered her royal fan. At this, Shridevi knitted her brows, noticing which the fifteen Nitya deities of the moon’s digits came into the fray led by Kameshvari who split Vishanga’s armour and made him flee.

Bhanda now sent his thirty sons led by Chaturbahu. Hearing this, Lalita’s daughter Bala insisted on facing them. She was flanked by the worried Mantini and Dandanayika seated in a covered palanquin. Soon she destroyed the army and cut off the heads of all thirty sons of Bhanda with her arrows.

Bhanda now sent Vishukra, attacking in the dense darkness invisibly. He operated the great mystical yantra, Jayavighna because of which the Shaktis lost all will to fight. Mantini and Dandanatha, in great agitation, reported the calamity to Lalita who glanced at the face of Kameshvara and laughed with red teeth. From her laugh emerged the elephant headed lord of ganas. With his tusks he split apart the slab on which jayavighna had been drawn. The Shaktis regained their frenzy and with the army of ganas attacked the Danavas. Vishukra sent Gajasura against Ganeshvara who slew him. Vishukra fled. Lalita gave Ganeshvara the boon of being worshipped before all other deities.

Bhanda sent both his brothers Vishanga and Vishkura with his ten nephews born of his sister Dhumini into battle. Vishukra discharged the Trishna missile afflicting all shaktis with acute thirst. Mantini then advised Dandanatha to call forth the deity Surasindhu, ocean of liquor, who showered torrents of various types of liquor to reinvigorate the shaktis who drank joyously. Then they decimated the Danava army. Mantrini used the Brahmashiras to kill Vishukra while Dandanatha killed Vishanga with the plough and club.

Overwhelmed with grief, Bhanda himself attacked with Kutilaksha and thirty-five generals. Lalita herself faced him, knowing that the others could not withstand him. Bhanda released the Mahasurastra from which Madhu, Kaitabha, Mahisha, Dhumralochana, Chanda, Munda, Chikshura, Chamara, Raktabija, Shumbha, Nishumbha, Kalakeyas arose and smashed the army of Shaktis. Lalita became furious and burst into a loud angry laugh. From this appeared Durga. She stuck down these Danavas, bowed to Lalita. Bhanda now discharged the arnavastra, flooding the field, whereupon the goddess created a huge tortoise from the nail of her index finger who supported her armies. The Asura lord now discharged missiles named after Hiranyaksha, Hiranyakashipu, Bali, Shasrarjuna, Paulastya, Rajasura, Kali and Mahamoha. They were countered by the goddess creating from her nails Varaha, Nrisimha, Vamana, Parashurama, Kodandarama, Vasudeva-Samkarshana, Pradyumna and Aniruddha, Kalki and finally Shambhava. Ultimately, by the Narayana missile, she burnt up the entire army of Danavas, followed by the Pashupata missile which killed the generals. Bhana she killed with the Mahakameshvara missile.

The gods praised the goddess and brought before her forlorn Rati. From Lalita’s sidelong glance, Manmatha was reborn. She blessed him with the power to upset Shiva so that he weds Gauri and to penetrate everyone to give sexual pleasure. And that is how Dhurjati came to be infatuated with Gauri and they brought forth Mahasena with six faces, nursed by Ganga. He slew Taraka and married Devasena, Shakra’s daughter and lived in Shrinagara.

16 Shrinagaras were built where Lalita dwelt in different forms (nine mountains and seven oceans): Meru, Nishada, Hemakuta, Himalaya, Gandhamadana, Nila, Mesha, Shringara, Mahendra, the salt sea, sea of sugarcane juice, sea of liquor, sea of ghee, sea of curd, sea of milk and sea of pure water. Sahasra Sai
ఓం హ్రీం శ్రీం క్లీం ఐం శ్రీ లలిత త్రిపుర సుందరైనమః

Courtesy : Sahasra Sai

Srichakra

In the Shri Vidya school of Hindu tantra, the Sri Yantra ("sacred instrument"), also Sri Chakra is a diagram formed by nine interlocking triangles that surround and radiate out from the central (bindu) point. It represents the goddess in her form of Shri Lalita Or Tripura Sundari, "the beauty of the three worlds (earth, atmosphere and sky(heaven)"(Bhoo, Bhuva and Swa) The worship of the Sri Chakra is central to the Shri Vidya system of Hindu worship. Four isosceles triangles with the apices upwards, representing Shiva or the Masculine. Five isosceles triangles with the apices downward, symbolizing female embodiment Shakti. Thus, the Sri Yantra also represents the union of Masculine and Feminine Divine. Because it is composed of nine triangles, it is known as the Navayoni Chakra. "These nine triangles are of various sizes and intersect with one another. In the middle is the power point (bindu), visualizing the highest, the invisible, elusive centre from which the entire figure and the cosmos expand. The triangles are enclosed by two rows of (8 and 16) petals, representing the lotus of creation and reproductive vital force. The broken lines of the outer frame denote the figure to be a sanctuary with four openings to the regions of the universe".

The Sri Yantra in diagrammatic form, showing how its nine interlocking triangles form a total of 43 smaller triangles.

 Together the nine triangles are interlaced in such a way as to form 43 smaller triangles in a web symbolic of the entire cosmos or a womb symbolic of creation. Together they express Advaita or non-duality. This is surrounded by a lotus of eight petals, a lotus of sixteen petals, and an earth square resembling a temple with four doors. The various deities residing in the nine layers of the Sri Yantra are described in the Devi Khadgamala Mantra.

The Shri Chakra is also known as the nava chakra because it can also be seen as having nine levels. "Nine" comes from" Nava" of Sanskrit. Each level corresponds to a mudra, a yogini, and a specific form of the Deity Tripura Sundari along with her mantra. These levels starting from the outside or bottom layer are:

1. Trailokya Mohana or Bhupara, a square of three lines with four portals
2. Sarva Aasa Paripuraka, a sixteen-petal lotus
3. Sarva Sankshobahana, an eight-petal lotus
4. Sarva Saubhagyadayaka, composed of fourteen small triangles
5. Sara Arthasadhaka, composed of ten small triangles
6. Sarva Rakshakara, composed of ten small triangles
7. Sarva Rogahara, composed of eight small triangles
8. Sarva Siddhiprada, composed of 1 small triangle
9. Sarva Anandamaya, composed of a point or bindu

The Sri Chakra (called the Shri Yantra) is the symbol of Hindu tantra, which is based on the Hindu philosophy of Kashmir Shaivism. The Sri Yantra is the object of devotion in Sri Vidya.
The two-dimensional Sri Chakra, when it is projected into three dimensions is called a Maha Meru (Mount Meru).

Wednesday, May 23, 2018

వివిధ రకాల గణపతులు - పూజలు ఫలితాలు

**.... వినాయకుడు సర్వ విఘ్నాలకు అధిపతి .... గణేశుని కృపా కటాక్షం ఉంటేనే తలపెట్టిన ఏ కార్యమైన నిర్విఘ్నంగా సాగుతుంది....

వివిధ గణపతులను పూజించటం వల్ల వచ్చే ఫలితములు :

💫🌼💫🌼💫🌼💫

💠 ఎర్ర చందనం గణపతి  - అనారోగ్యం నుంచి విముక్తి !

💠ముత్యపు గణపతి  - రుణ విముక్తి !

💠 మరకత గణపతి   - వ్యాపారాభివృద్ధి !

💠 చందనం గణపతి - ఉద్యోగం , సంఘంలో గౌరవం !

💠 స్ఫటిక గణపతి - భార్యాభర్తలు సుఖజీవనం !

💠 నల్లరాతి గణపతి - అధిక శ్రమనుంచి విముక్తి !

💠 శ్వేతార్క గణపతి  - విఘ్న వినాశనం !

నవగ్రహ దోష నివారణకు వివిధ గణపతుల పూజాలు :

💫🌼💫🌼💫🌼💫

💠రవి : ఎర్ర చందనం గణపతి ఆదివారం పూజించాలి !

💠 చంద్రుడు : వెండి , ముత్యం లేదా పాలరాతి గణపతిని సోమవారం పూజించాలి !

💠 కుజుడు : రాగి లేదా పగడం గణపతిని మంగళవారం పూజించాలి !

💠 బుధ్ధుడు : మరకత గణపతిని బుధవారం పూజించాలి !

💠 గురువు : బంగారం , పసుపు లేదా చందనం గణపతిని గురువారం పూజించాలి !

💠శుక్రుడు : స్ఫటిక గణపతిని శుక్రవారం పూజించాలి !

💠 శని : నల్లరాతి గణపతిని శనివారం పూజించాలి !

 💠రాహువు : ఎర్ర చందనం గణపతిని ఆదివారం పూజించాలి !

సకల విఘ్నరాజైన పార్వతీ తనయుడి రూప విశేషాలు చాల విలక్షణమైనవి **

💫🌼💫🌼💫🌼💫

🐘  గణేశుడి పూర్ణకుంభం వంటి దేహం , బాన వంటి పొట్ట - ఇవి పరిపూర్ణ జగత్తుకి సంకేతం !

🐘గజముఖం , సన్నని కళ్ళు  - ఇవి సున్నితమైన పరిశీలనకి , గ్రహణ , మేధా శక్తులకు సంకేతాలు !

🐘వక్రతుండం - ఇది ఓంకారానికి సంకేతం !

🐘చుట్టి ఉండే నాగం - ఇది జగత్తు ఆవరించి ఉన్న మాయాశక్తికి సంకేతం !

🐘నాలుగు చేతులు - మానవాతీతశక్తి , సామర్థ్యాలకి సంకేతం !

🐘 ఒక చేతిలో పాశం , దండ - ఇది బుద్ధి , మనస్సులను సన్మార్గంలోకి నడిపించేందుకు సాధనం !

🐘 మరొక చేతిలో విరిగిన దంతం ( మహా భారత రచన కోసం ఆయన తన దంతాన్నే విరిచి కలంగా చేసుకొన్నాడు ) ఇది విజ్ఞాన సముపార్జన కొరకు చేయవలసిన కృషి , త్యాగలకు సంకేతం !

🐘 మరొక చేతిలో  మోదకం లేదా వెలగ పండు - ఇది  బాహ్యంలో గంభీరత , అంతరంగంలో సున్నితత్త్వానికి చిహ్నాలు !

🐘 చేటంత చెవులు - ఇవి భక్తుల మొర ఆలకించటానికి గుర్తు !

లక్ష్మణునినవ్వుకు కారణం


రావణుడు మరణించిన తరవాత కపి సైన్యంతో విభీషణ,అంగద,సుగ్రీవులతో, సీతా లక్ష్మణులతో అయోధ్య చేరి పట్టాభిషేకం చేసుకుంటూ ఉన్న సందర్భం. పట్టాభిషేకం అట్టహాసంగా జరుతోంది.రాముని పక్కనే సింహాసంకి దగ్గరగా నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. ఆ పరిస్థితులలో లక్ష్మణుడు ఒక సారి చిరునవ్వు దీర్ఘంగా నవ్వేడు.  అందరూ చూశారు.ఆ సందర్భంగా సభలో ఉన్న ఒక్కొకరు ఒకలా అనుకున్నారా నవ్వు చూసి.

ఆనాడు రాముని అడవులపాలు చేసి, భర్తను చంపుకుని,భరతునిచే తిట్లు తిని, నేడు ఆహ్వానం పలుకుతోందని, నా గురించే నవ్వేడా? అనుకుందిట కైక

సుగ్రీవుడు, అన్నను చంపించి రాజ్యాన్ని సంపాదించాడా అని నన్ను చూసినవ్వేడేమో అనుకున్నాడట.

తండ్రి ని చంపించిన పిన తండ్రి పంచ చేరినందుకు ఆక్షేపిస్తున్నాడా అనుకున్నాడట అంగదుడు.

ఇంటి గుట్టు చెప్పి అన్నను చంపుకుని రాజ్యం సంపాదించుకున్నానని ఎగతాళీగా నన్ను చూసినవ్వేడా అనుకున్నాడట విభీషణుడు.

రాముడి బాణాలను తండ్రి వాయుదేవుని అనుగ్రహంతో వక్ర మార్గాన నడిపించానని పరిహాసం చేస్తున్నాడా అని హనుమ అనుకున్నాడట.

బంగారు లేడిని తెమ్మన్ని కోరినందుకు నవ్వుకుంటున్నాడేమో అనుకుందిట సీత.

బంగారు లేడి ఉండదని తెలిసీ భార్య కోరిక తీర్చడానికి బయలుదేరి వెళ్ళి చిక్కులలో పడినందుకు నవ్వుతున్నాడా అని శ్రీరాముడు అనుకున్నాడట.

అందరి మనసుల్లోనూ ఉన్న అనుమానాలను గ్రహించిన రాముడు, తమ్ముడి నవ్వు విశేషార్ధాలకు దారి తీస్తుందని లక్ష్మణుని" ఏందుకు నవ్వేవు సోదరా?" అని అడిగాడు. దానికి లక్ష్మణదేవర "అన్నా!' సీతా రాముల సేవలో ఏమరు పాటు లేకుండేందుకుగాను నిద్రాదేవిని ఒక వరం అడిగాను. నన్ను వనవాస సమయం లో పదునాల్గు సంవత్సరాలూ ఆవహించవద్దని.'

దానికి నిద్రాదేవి అనుగ్రహిస్తూ 'పదునాలుగేళ్ళయిన తరవాత నిన్ను ఆవహిస్తానని' వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆవహించని నిద్రాదేవి ఇప్పుడు ఈ సంతోష సమయంలో నన్ను ఆవహిస్తానని వచ్చింది. నిలబడే ఒక చిన్నకునుకు తీశానన్నయ్యా! నిద్రా దేవి మరచిపోకుండా వచ్చి నన్ను ఆవహించినందుకు నవ్వేను, మరేమీ కాదు" అన్నాడు. దానితో అందరూ తమతమ మనసులలో అనుకున్నది నిజం కాదని అనవసరంగా గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నామనుకుని నవ్వుకున్నారట.

🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻

శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ - శ్రీ రామావతారానికి నాంది


నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః |
చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి న కంపతే ||

రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడి దెగ్గర అవసరంలేకపోయినా మెల్లగా వీస్తుంది, ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధపెడుతున్నాడు, ఎక్కడా యజ్ఞములు జెరగనివ్వడంలేదు, ఋషులని హింసిస్తున్నాడు, పర భార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించె మార్గం చెప్పవలసింది” అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మ ” నేనూ వాడి అకృత్యాలు వింటున్నాను, వాడు తపస్సుతో నన్ను మెప్పించి, రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు, కాని వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు” అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు.

ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా, అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయాముర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలొ తనంతట తానుగా వచ్చారు….

ఏతస్మిన్ అనంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః |
శఙ్ఖ చక్ర గదా పాణిః పీత వాసా జగత్పతిః ||

ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందొ, అందమైన రూపంతొ, మెడలొ వైజయంతి మాలతొ, శంఖ చక్ర గధ పద్మాలని పట్టుకొని శ్రీమహా విష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు……

హత్వా క్రూరం దురాధర్షం దేవ ఋషీణాం భయావహం |
దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ ||
వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృధ్వీం ఇమాం |
ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణుః ఆత్మవాన్ ||

మీరెవరు కంగారు పడొద్దు, రావణుడు చేసే అక్రుత్యాలన్ని నాకు తెలుసు, వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధపెడుతున్నాడు, అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద పదకొండు వేల సంవత్సరాలు ఉండి ఈ పృథ్వి మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు.

తతః పద్మ పలాశాక్షః కృత్వా ఆత్మానం చతుర్విధం |
పితరం రోచయామాస తదా దశరథం నృపం ||

నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు. అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలొ వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని, సింహంలా నడుస్తూ బయటకి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు.

దశరథుడు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమిచెయ్యగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు ” నాయనా దశరథా! నన్నుప్రాజాపత్ర్య పురుషుడు అంటారు, నన్ను ప్రజాపతి పంపించారు, ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధన ధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతొ ఉంటారు” అని చెప్పి వెళ్ళిపోయాడు.

వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురినీ పిలిచి, ఆ పాయసంలొ సగభాగం కౌసల్యకి ఇచ్చాడు, మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు, ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి, ఒక భాగాన్ని కైకేయకి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు.

యాగం పూర్తయ్యాక, అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. రుష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనని సత్కరించి శాంతా రుష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరిని తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు.

కొంత కాలానికి దశరథ మహారజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు.

తతః చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ |
నక్క్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్ఛ సంస్థేషు పంచసు ||
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహ |
ప్రోద్యమానే జగన్నాథం సర్వ లోక నమస్కృతం ||

జగన్నాధుడైన వాడు, సర్వలోకాల చేత నమస్కారింపబడే వాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి, చైత్ర మాసంలొ, నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలొ, కర్కాటక లగ్నంలొ రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలొ కైకేయకి పుష్యమి నక్షత్రంలొ, మీన లగ్నంలొ భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు.
తనకి నలుగురు కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు.

రామకార్యం

ఆంజనేయుడు  అంటే  శ్రీ  రామ  భక్తికి  పరాకాష్ట , ప్రభు  భక్తి  పరాయణుడు  సముద్రాన్నే  లంఘించి  సీతమ్మ  జాడను  కనుగొన్నాడు  ఈ  రోజు  మంగళవారం  మనస్ఫూర్తిగా ఆయన్ను  స్మరిస్తే  సర్వ  కార్యాలు  నెరవేరినట్లే

దేవా! సీతను చూసాను. దక్షిణ దిశగా వెళ్ళి అశోక వనంలో రావణ కట్టుబాటులో ఉన్న సీతను నేను చూసాను. మేము సీతను వెదుకుచూ వెళుతుండగా మాకు ఒక పెద్ద సొరంగం కనపడింది. ఆ సొరంగంలో ప్రవేశించి కొన్నాళ్ళకు ఒక నగరం చేరుకున్నాము. అక్కడ మాకు ఒక తాపసి కనపడింది. మమ్మలిని ఆదరించింది. తరువాత మలయ పర్వతం చేరుకున్నాము. అక్కడ ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రం దాటటానికి ఎవరికి శక్యం కాలేదు. సీతను వెదకకుండా వెనుకకు మరలడం కంటే చావడం మేలనుకున్నాము. అక్కడ ఒక పక్షిరాజు మాకు కనిపించాడు. మేము జరిగినదంతా చెప్పుకుని విచారిస్తుండగా ఆ పక్షిరాజు " అయ్యా! మీ మాటలలో జటాయువు అనే పేరు వినవచ్చింది. నేను నా తమ్ముడు ఒకసారి సూర్య మండలానికి ఎగిరాము నా రెక్కలు మాడి పోవడంతో నేను ఇక్కడ పడి ఉన్నాను. నా తమ్ముడు జటాయువు గురించి మీకు తెలిస్తే చెప్పండి " అని అడిగాడు. నేను సంపాతితో రావణుడు సీతను ఎత్తుకు వెళ్ళడం జటాయువును చంపడం చెప్పాను. జటాయువు మరణ వార్త విన్న సంపాతి " అయ్యా! నాకు రావణుని గురించి తెలియును. వాడు రాక్షసుడు. ఇక్కడికి నూరు యోజనముల దూరంలో ఉన్న లంకను రాజధానిగా చేసుకుని రావణుడు రాజ్యం చేస్తున్నాడు. మీకు అక్కడ సీతాదేవి కనిపించ వచ్చును " అన్నాడు. మాలో ఎవరికి సముద్రాన్ని దాటే శక్తి లేదు. నా తండ్రి వాయు దేవుని వలన నాకు సముద్రాన్ని దాటే శక్తి కలిగింది. నేను లంకకు వెళ్ళి సీతాదేవిని చూసి నన్ను రామ దూతగా నన్ను పరిచయం చేసుకుని మీ ముద్రికను ఇచ్చాను ఆమెకు మీ క్షేమం చెప్పాను . ఆమె నన్ను నమ్మ లేదు రావణుడు కామ రూపియై వచ్చాడు అనుకుంది. నేను ఆమెకు విశ్వాసం కలిగించాక ఆమె నన్ను నమ్మింది. తన ఆనవాలుగా ఈ శిరోభూషణం మీకు ఇమ్మంది. సుగ్రీవుని సాయంగా తీసుకు వచ్చి అతి త్వరలో తను తీసుకు పొమ్మని మీకు చెప్పమని చెప్పింది. ఆమెకు నేను ధర్య వచనాలు చెప్పి వచ్చాను. ఆమె నాకు చిత్రకూటం పై జరిగిన కాకాసురుని వృత్తాంతం చెప్పింది " అన్నాడు. హనుమంతుడు రామునికి శిరోభూషణం అందించాడు. రాముడు ఆ శిరోభూషణాన్ని గుండెలకు హత్తుకున్నాడు.
ఒకమారు ఆంజనేయుడు నిత్యకృత్త్యాలైన పనులు చేసుకుంటూ శ్రమపడినవాడై, మంచి ఆకలితో తన స్వామి అర్థాంగియైన సీతామాతను భోజనము వడ్డించమని అడిగాడు. అప్పుడే స్నానాధికాలు ముగించుకొన్న జానకీదేవీ 'హనుమా! కొద్దిసేపు ఆగు. మొదట పాపిటలో సిందూరము ఉంచుకుని తరువాత వడ్డిస్తాను' అని అన్నది.

అప్పుడు హనుమంతుడు 'అమ్మా ! పాపిటలో సిందూరం ఎందుకమ్మా' అని ప్రశ్నించాడు. "దీనిని నేను నీ ప్రభువు కళ్యాణ నిమిత్తమై పాపిట పెట్టుకొంటున్నాను సింధూరము సౌభాగ్య వృద్ధిని కలిగిస్తుంది. దీనిని ధరించిన వారి భర్తలు చిరాయువులై వర్థిల్లుతారు" అని సీతమ్మ జవాబు చెప్పింది. ఈ మాటవిన్న హనుమంతుడు అక్కడ నుండి వెళ్ళిపోయి కొద్దిసేపు తర్వాత తిరిగి వచ్చాడు ఆయన నఖశిఖ పర్యంతము సింధూరము పూసుకొని ఉన్నాడు.

సీతమ్మ ఆశ్చర్యపడి 'హనుమా ! శరీరమంతా సింధూరం ఎలా పూసుకొన్నావు ?' అని అడిగింది. అంత మారుతి వినమ్రుడై 'సిందూరము ధరిస్తే స్వామికి కళ్యాణ ప్రదమై ఉంటుందని నీవే అన్నావుగదా అమ్మా! నా ప్రభువు ఎల్లప్పుడు కళ్యాణప్రదంగా ఉండాలని నేను సిందూరము పూసుకొన్నానని' సమాధానం ఇచ్చాడు. హనుమంతుని సమాధానం విన్న సీత ఆనందపరవశ నేత్రాలతో, అతని ప్రభు భక్తికి సంతోషంతో హృదయ పూర్వకంగా ఆశీర్వదించింది. ఆంజనేయుని ప్రభుభక్తి పరాయణతకు ఇది నిలువెత్తు నిదర్శనము.

🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻

Tuesday, May 22, 2018

ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది ...

హనుమంతుడు కూడా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.
1. ప్రసన్నాంజనేయస్వామి. 2. వీరాంజనేయస్వామి. 3. వింశతిభుజాంజనేయస్వామి. 4. పంచముఖాంజనేయస్వామి. 5. అష్టాదశ భుజాంజనేయస్వామి. 6. సువర్చలాంజనేయస్వామి. 7. చతుర్భుజాంజనేయస్వామి. 8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి. 9. వానరాకార ఆంజనేయస్వామి

ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు - శనివారం, మంగళవారం మరియు గురువారం.

పురాణకథ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు
.
శ్రీ ఆంజనేయం శిరసా నమామి త్రేతాయుగమున దుష్ట శిక్షణ - శిష్ట రక్షణ కొఱకు, దానవులను సంహరించి ధర్మపాలన సంస్థాపన చేయుటకై మానవునుగా హరి, వానరయూధ ముఖ్యునిగా రుద్రాంశతో ఆంజనేయుడు జన్మించారు.

ఒకప్పుడు 'పుంజికస్థల ' అను అప్సరస శాపవశంచేత భూలోకమున అంజనగా జన్మించి వానర రాజైన కేసరిని వివాహమాడింది. ఆమె మహా పతివ్రత. వివాహమై చాలకాలమైనా ఆమెకు సంతానం కలుగకపోవడంతో సంతానంకై కఠోర తపస్సు ప్రారంభించింది. ఆమె తపస్సుకు మెచ్చి వాయుదేవుడు ప్రతినిత్యం ఒక ఫలంను అనుగ్రహిస్తే దానిని వాయుదేవుని ప్రసాదంగా స్వీకరించేది. ఒకనాడు శివపార్వతులు ఆ ప్రాంతమున స్వేచ్ఛా విహారులై వానరరూపాల్లో క్రీడిస్తుండగా స్ఖలించిన శివుని వీర్యమును భద్రపరిచిన వాయుదేవుడు ఆ వీర్యమును ఒక ఆకు దొప్పలో పండుగా మార్చి వాయువీవనచే అంజనాదేవి ముందు పడవేయగా ఆ శివవీర్యాన్ని ఆనాటి వాయుప్రసాదముగా భావించి అంజన భుజించినది. ఫలితంగా తక్షణమే గర్భం దాల్చింది. తనకు గర్భము ఎలా వచ్చిందో తెలియక దుఃఖించి దానికి కారణమైన వారిని శపించబోగా, వాయుదేవుడు ప్రత్యక్షమై ఆమె గర్భమున శివాంశతో పుత్రుడు జన్మిస్తాడని, అతడు వాయుపుత్రుడుగా వాసికెక్కుతాడని అభయమిస్తాడు. వానరరాజు అయిన కేసరి దీనిని దివ్యప్రసాదంగా భావించి సమ్మతించాడు. అటుపై - వైశాఖ మాసం, కృష్ణ పక్షం, తిధి దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నం, వైధృతి నామయోగం, గ్రహాలన్నీ శుభస్థానాలలో ఉన్న మధ్యాహ్న తరుణంలో ఆంజనేయుని జననం జరిగింది.

అభి షేకం ...... మన్యుసూక్తం

పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికల్ని తీరుస్తాడు.

స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం, నిత్యమూ చేయగలగటం మరీ మంచిది. ఆచరణ : మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి *

మంగళ వార సేవ మంగళవారంనాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదురనివారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం, అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాధ ఉంది.

* శనివార సేవ హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు, వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కలిగించాలి. * పంచ సంఖ్య హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెస్వ ప్రదక్షిణాలు, నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి వేవ యినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం.

* హనుమజ్జయంతి హనుమంతుడు వైశాఖ మాసంలో, కృష్ణ పక్షంలో, దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం, శనివారం, కర్కాటక లగ్నంలో, వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ, కల్పంతర గాధలను బట్టి ఎవరో చేప్పారని భిన్న భిన్న తిథులలో హనుమజ్జయంతి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమినాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు. విశేషార్చనలు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.

ఆచరణ : సంవత్సరంలో ఈ ఒక్క జయంతినాడ యినా భక్తులను మారేడుదళం, సింధూరం మల్లెపూలు లేదా త ములపాకులు, తులసిదళం, ప్రత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి. శాస్త్రమునందు హనుమకు వివాహం అయింది. ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు ప్రవర ఉన్నది. తండ్రిగారు కేసరి, తాతగారి పేరు, ముత్తాతగారిపేరు కళ్యాణంలో చెప్తారు. హేమగర్భుడు అని వారి ముత్తాతగారి పేరు. ఒకతండ్రి కడుపున పుట్టిన పిల్లవాడు వివాహం చేసుకోకుండా ఉండిపోతే తల్లిదండ్రులు దేహములు చాలించిన తరువాత వారి శరీరాలను చెట్లకి త్రిప్పి కట్టేస్తారు. ఎందుకంటే నువ్వు వివాహం చేసుకోనటువంటి సంసార భ్రష్టుడిని కన్నావు కనుక అని. అందుకని పిల్లలు వివాహం చేసుకోకుండా ఉండకూడదు. అలా చేయడం తల్లిదండ్రులయొక్క ప్రధానమైన బాధ్యత. నవ వ్యాకరణపండితులు, మహా బుద్ధిమంతుడైన హనుమ వివాహం చేసుకోకుండా అటు సన్యాసం తీసుకోకుండా ఉండరు కదా! మీకు అందుకే భారతీయ సంప్రదాయంలో ఋషులందరూ వివాహం చేసుకొని ఉంటారు. అలాగే హనుమ కూడా శాస్త్రమునకు సంబంధించినంతవరకు గృహస్థాశ్రమంలో ఉంటారు. కాపురం చేసినట్లు, పిల్లల్ని కన్నట్లు లేదు. ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞాని. అందుచేత సువర్చలను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ యోగమును అనుసంధానం చేశారు.

శ్రీమదాంజనేయ కల్యాణము

శ్రీ ఆంజనేయ స్వామి అజన్మ బ్రహ్మచారి.. యజ్ఞోపవీతము ధరించే పుట్టినవాడు. ఘోటక బ్రహ్మచారి అయినా వివాహము చేసుకున్నాడు.. వివాహము చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే మిగిలిపోయినాడు.. లోక కల్యాణము కోసము హనుమంతులవారు మొదట తన కల్యాణము చేసుకోవలసి వచ్చింది.. పరాశర సంహితలో ఆసక్తికరమైన ఈ ఉదంతము ఉంది.

ఒకప్పుడు సూర్యదేవుడు , విశ్వకర్మ కూతురైన సంజ్ఞాదేవిని పెళ్ళాడతాడు. అయితే , సంజ్ఞా దేవికి సూర్యుని తాపమును తట్టుకొను శక్తి లేదు..ఖిన్నురాలై , తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది.. కూతురి సమస్యను అర్థము చేసుకున్నదై, ఆమె తల్లి , విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది. విశ్వకర్మ , సూర్యుడి ప్రకాశమును కొంత తీసివేస్తాడు. సూర్యునినుండీ బయట పడ్డ ఆ ప్రకాశము , ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూప లావణ్యములను చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. సంగతేమిటో తెలుసుకోవాలని ఇంద్రుడు , బ్రహ్మ దేవుని వద్దకు వెళ్ళి , " ఆ కన్య ఎవరు ? " అని అడుగుతాడు. ఇంద్రుడి ఉద్దేశము కనిపెట్టిన బ్రహ్మ ,ఆమెకు కాగల పతి శివాంశ సంభూతుడైన హనుమంతుడు తప్ప వేరొకరు కారు అని చెబుతాడు.

బాల హనుమంతుడు తల్లి అంజనా దేవి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి , ఆమె అనుజ్ఞ మేరకు సూర్యుని దగ్గర విద్యాభ్యాసము చేస్తాడు. శిక్షణ పూర్తికాగానే గురువు వద్దకు వచ్చి వినమ్రుడై , " గురుదేవా , నా శిక్షణ పూర్తయిందని తమరి అనుజ్ఞ అయినది , నాకు ఇక వెళ్ళుటకు అనుమతినీయండి , మీకు గురు దక్షిణగా ఏమివ్వవలెనో చెప్పండి " అంటాడు. " శివాంశతో పుట్టినవాడవు , ఆంజనేయా , నిన్ను నేనేమని కీర్తించను ? సాగర మథనములో పుట్టిన గరళాన్ని జగద్రక్షణ కోసము మింగిన సాక్షాత్తూ ఆశివుడవే నువ్వు. నువ్వు వాయు దేవుడి పుత్రుడవు కూడా.. అగ్నికి పుత్ర సమానుడవు. మనము గురుశిష్యులమన్నది కేవలము ఔపచారికము మాత్రమే.. అయిననూ , అడిగినావు గనక , విను... విశ్వకర్మ , నాలోని ప్రకాశమును కొంత వేరుపరచినాడు. ఆ నాయొక్క ప్రభ ఇప్పుడు నా కూతురు రూపములో ఉన్నది. నా కాంతి నుండీ పుట్టిన నా కూతురు సువర్చలా దేవిని నీకిచ్చి వివాహము చేయవలెననునది నా కోరిక. ఇదే నువ్వు నాకు ఇవ్వవలసిన గురు దక్షిణ " అంటాడు సూర్యుడు. హనుమంతుడు వినీతుడై సూర్యునికి తలవంచి , రెండు చేతులూ జోడించి నమస్కరించి , " దేవా , నేను బ్రహ్మచర్యమును పాలించవలెనని తీర్మానించుకున్నాను.. అది మీకు తెలిసినదే కదా .. నా జీవన లక్ష్యము అదే. నేనీ వివాహము ఎలా చేసుకోగలను ? " అని అడుగుతాడు.

సూర్యుడు ఉత్తరమిస్తాడు , " సువర్చల దైవాంశ సంభూతురాలు. నేను నీకొక వరమునిస్తాను. నువ్వు ఆమెను పెళ్ళాడిననూ , ప్రాజాపత్య బ్రహ్మచారిగనే మిగిలిపోతావు. నీ ఈ వివాహము కేవలము జగత్కల్యాణము కోసమే తప్ప , నీ వ్రత భంగానికి కాదు. నువ్వు యజ్ఞోపవీతము ధరించియే పుట్టినవాడవు కాబట్టి పుట్టిన క్షణమునుండే నువ్వు బ్రహ్మచారివి. భవిష్యత్తులో , కలియుగానంతరము , ప్రళయానంతరము తరువాత తిరిగి జరగబోయే సృష్టికి నువ్వే బ్రహ్మవవుతావు. నువ్వు బ్రహ్మదేవుని పదవిని అలంకరించిన తరువాత , సువర్చలాదేవి వీణాపాణియైన ఆ వాణి స్థానములో ఉంటుంది.

సందేహ నివృత్తి అయిన హనుమంతుడు , సూర్యుని ఆజ్ఞమేరకు సువర్చలా దేవిని వివాహమాడుతాడు. హనుమంతుని కల్యాణమైన దినము , జ్యేష్ఠ శుద్ధ దశమి.. హనుమ పూజలో అగ్ని సూక్తముతోను , [ పంచామృతములతోను కూడా ] హనుమంతుడికి అభిషేకము [ విగ్రహ శోధన ] చేస్తారు. సువర్చలా పూజనుకూడా తమలపాకులపై సువర్ణ సహిత పుష్పాక్షతలతో చేస్తారు.  భక్తులందరూ ఈ హనుమ కల్యాణ గాథను చదివి తరింతురు గాక || శుభమస్తు ||

భృగు మహర్షి

భార్గవస గోత్రీకులకు గోత్ర పురుషుడు భృగువు. కానీ, 'భార్గవుడు' అనగానే మనకు భార్గవరాముడు గుర్తుకు రావటం సహజం. 'భార్గవరాముడు' అంటే పరశురాముడు. 'భృగు' శబ్దంలోంచి వచ్చిందే భార్గవుడు. భార్గవరాముడు లేదా పరశురాముడు భృగు వంశంలోని వాడే.

భృగు మహర్షి బ్రహ్మ మానస పుత్రుడైన ప్రజాపతి మరియు సప్తర్షులలో ఒకరు.మొట్టమొదటి జ్యోతిష రచయిత మరియు వేదాల కాలంలో రచించిన భృగు సంహిత కర్త. భృగు మహర్షి బ్రహ్మహృదయము నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు.

'భృగు' శబ్దానికి తెలుగులో ప్రథమావిభక్తి ప్రత్యయం అయిన 'వు' చేరటంవల్ల ఆయన పేరు 'భృగువు' అయింది.
భృగువు నవ ప్రజాపతులలో ఒకడు. సప్తర్షులలో ఒకడు.

భృగువు మహర్షి బంధుత్వాలు

భృగు మహర్షి, దక్షప్రజాపతికి అల్లుడు. దక్షుని కుమార్తె ఖ్యాతికి ఆయన భర్త. ఈ దంపతులకు ధాత, విధాత అని ఇద్దరు కుమారులు.
దక్షుని అల్లుడు గనుక, దక్షయజ్ఞం సమయంలో భృగువుకూడా ఉన్నాడని వాయుపురాణం చెప్తోంది.

యజ్ఞాల ప్రస్తావన వచ్చింది కనుక, ఇక్కడ తప్పక చెప్పుకోవాల్సిన విషయం ఒక్కటి ఉంది. యజ్ఞాలలో దేవతలకు సోమరసాన్ని నివేదించే విధానాన్ని భార్గవ వంశమునులే ప్రవేశపెట్టారు.

ఈయనకు పౌలోమ అనే మరో భార్య ద్వారా శుక్రుడు, చ్యవనుడు అనే కుమారులూ ఉన్నారు.

భృగువు కుమారుడైన చ్యవనుడి కుమారుడు ఋచిక. ఆయన కుమారుడు జమదగ్ని. జమదగ్ని కుమారుడు పరుశురాముడు. అంటే భృగువు, పరశురాముడికి ముత్తాత తండ్రి అవుతాడు. 

భృగువు, భరద్వాజ మహర్షులు సమకాలికులని మహాభారతం పేర్కొంటోంది.

భృగువు అతి గొప్పవాడని అంటారు. దీనికి సాక్ష్యంగా వారు, శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా 'నేను ఋషులలో భృగువును' అని చెప్పటాన్ని ఉటంకిస్తారు.

భృగుమహర్షి ఒక గొప్ప హైందవ జ్యోతిష్య శాస్త్ర పితామహుడు మరియు ఇతని మొదటి జ్యోతిష్య శాస్త్ర గ్రంథం భృగుసంహిత దానికొక తర్కాణం. ఈ గ్రంథంలో సృష్టిలోని దాదాపు అన్ని రకాల జీవుల గురించి వ్రాయబడ్డాయి. అనగా దాదాపు 50 లక్షల ప్రాణుల జాతకాలు పొందుపర్చబడ్డాయి. ఒక పరిసశీలన ప్రకారం ఇప్పుడు కేవలం 01 శాతం జీవులు మాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. భృగుమహర్షి ఒక గొప్ప ధర్మశాస్త్రప్రవక్తగా కాత్యాయనుడు పేర్కొన్నాడు.  అయితే, భృగువు సంకలించిన ఈ గ్రంథంలో అత్యధిక భాగం, నలందా విశ్వ విద్యాలయం అగ్నికి ఆహుతి అయినప్పుడు కాలిపోయింది. 

శ్రీ వేంకటేశ్వరుని కథలో భృగు మహర్షి

 శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమలలో వెలియటానికి వెనుక ఉన్న ఐతిహ్యంలో భృగు మహర్షికి చెప్పుకోదగిన పాత్ర ఉంది.                  ఆ ఐతిహ్యం:

నైమిశారణ్యంలో ఉన్న మునిపుంగవులకు ఒకసారి ఒక పెద్ద సందేహం వచ్చింది. ఉన్నది త్రిమూర్తులే అయినా, వీరిలోనూ సత్వ, తమో, రజో గుణాలకు అతీతులు (త్రిగుణాతీతులు) ఎవ్వరు అనేదే ఈ సందేహం. సందేహం కలిగిన తర్వాత, దాన్ని నివృతి చేసుకోవటం తప్పనిసరి గనుక ఆ విషయం తేల్చవలసిందిగా వారందరూ భృగువు మహార్షిని కోరారు. ఆయన, ఆ పనిమీద బ్రహ్మలోకం చేరాడు. అక్కడ బ్రహ్మదేవుడు తనని పట్టించుకోకపోవటంతో, బ్రహ్మదేవునికి భూలోకంలో ఎక్కడా దేవాలయం కానీ, పూజార్హత కానీ ఉండరాదని శపిస్తాడు. తర్వాత, కైలాసానికి చేరతాడు. అక్కడ, ఆ సమయంలో శివుడు, పార్వతితో ఉంటాడు. రతికాంక్షతో ఉన్న శివుడిని చూసి కోపించిన భృగువు, భూలోకంలో శివుడు లింగాకారంలోనే పూజార్హత పొందుతాడని శపిస్తాడు. తర్వాత మిగిలింది -వైకుంఠం. భృగువు అక్కడికీ చేరుకుంటాడు. ఆ సమయంలో మహావిష్ణువు, శ్రీమహాలక్ష్మితో పాలసముద్రంమీద పవళించి ఉంటాడు. తన రాకను శ్రీమహావిష్ణువు గమనించలేదని ఆగ్రహించిన భృగువు, ఆ కోపంలో మహావిష్ణువును గుండెలమీద తన్నాడు. ఇదే తగిన సమయమని భావిస్తూ, విష్ణువు, భృగువుకు కాలిలో ఉన్న నేత్రాన్ని చిదిమి, భృగువుకు గర్వభంగం చేశాడు. తను నివాసం ఉండే శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద భృగువు తన్నినా, దాన్ని గుర్తించని విధంగా తన భర్త  భృగువు పాదాలొత్తడం నిరసిస్తూ, ఆమె వెంటనే వైకుంఠంనుంచి పాతాళలోకానికి వెళ్లిపోయింది. అక్కడ కపిల మహర్షి కోరిన మీదట, ఆమె భూలోకానికి వెళ్లి, కరివీరపురం (నేటి కొల్హాపూర్‌)లో నివసించసాగింది. తన భార్య లక్ష్మీదేవి ఇలా వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవికోసం అన్వేషిస్తూ, భూలోకం చేరి, ఆమెను కరివీరపురంలో గుర్తించి, ఆమెను ప్రసన్నం చేసుకుని, ఆమె తిరుచానూర్‌లో పద్మావతిగా అవతరించి, తిరిగి, తన వక్షస్థలం చేరే విధంగా చేసుకుంటాడు. ఈ విధంగా శ్రీ వేంకటేశ్వరుడు, భూలోక వైకుంఠమైన తిరుపతికి చేరటంలో భృగువు మనకు గొప్ప సహాయం చేశాడనాలి.


భగవద్గీతలో   భ్రుగు ప్రస్తావన

భగవంతుడు శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీతలో మహర్షుల గురించి తెలియజేస్తూ ఈ భృగు మహర్షి  ప్రస్తావన కూడా రావడము జరుగుతుంది.

భ్రుగు  పౌత్రుడు అసురులకు గురువు అయిన శుక్రాచార్యులు. ఇదికాక ఇతనికి ఖ్యాతివలన ధాత, విధాత అని ఇరువురు కొడుకులు కలిగిరి. అందు ధాతకు మృకండుఁడు, విధాతకు ప్రాణుఁడును జన్మించిరి. ప్రాణుని కొడుకు వేదశిరుఁడు. వేదశిరుని కొడుకు ఉశేనస్సు. మృకండుని కొడుకు మార్కండేయుఁడు. ఇతని మీసములను దక్షయాగమున వీరభద్రుఁడు పెఱికివేసినట్లు పురాణముల వలన తెలియవచ్చుచున్నది.

భ్రుగువు  అగ్నిని శపించుట

పులోమ గర్భవతిగా ఉన్నప్పుడు, ఒకనాడు భృగువు "నేను నదీ స్నానానికి వెళ్ళొస్తాను, ఈలోగ నువ్వు నితయాగ్నిహోత్రానికి అవసరమిన సామాగ్రి కూర్చుము" అని చెప్పి వెళ్ళిపోతాడు. హోమగుండంలో అగ్ని వెలిగించి, మిగతా పనులు చేసుకుంటూ ఉంటుంది.

ఆ సమయంలో పులోముడు అను రాక్షసుడు, అక్కడికి వస్తాడు. ఆమెను చూసి కామించి, ఆమె గురించి అగ్నిదేవున్ని అడుగుతాడు. అగ్నిదేవుడు ఇలా ఆలొచించసాగాడు " నేను నిజం చెప్పిన పులోమకి హాని కలుగును, అబద్ధము చెప్పిన నాకు అసత్య దోషము అంటును అని" చివరికి నిజమ చెప్పాలని నిర్ణయానికి వచ్చి, ఆమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్తాడు.

పులోముడు ఆమెను గుర్తిస్తాడు. ఆమెకి పెళ్ళి కాకముందు పులోముడు ఆమెను ప్రేమిస్తాడు కాని పులోమ తిరస్కరిస్తుంది. ఇప్పుడు సమయం వచ్చిందని ఆమెను చెరబట్టాలనుకుంటాడు. అప్పుడు పులోముడు పేద్ద వరాహంగా మారి ఆమెను తన భుజాలపై వేసుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆమెకు ప్రసవం జరిగి మగ పిల్లవాడు పుడతాడు. అతనే చ్యవన, శక్తివంతమైన పిల్లవాడు. కోపంతో పులోమున్ని చూడగానె, మంటలలో పులోముడు కాలిపోతాడు. అప్పుడు పులోమ ఆ పిల్లవాని తీసుకొని ఆశ్రమానికి పోయి జరిగిందంతా భృగువు కి చెప్తుంది.

భృగువు కోపంతో నీ గురించి ఎవరు చెప్పారు అని అడుగుతాడు. అగ్నిదేవుడు చెప్పాడు అని పులోమ చెప్తుంది. అగ్నిదేవుడు నేను అబద్ధం చెప్పిన పాపం చుట్టుకుంటుందని నిజం చెప్పను అంటాడు. అప్పుడు భృగువు " ఇక నుండి నువ్వు సర్వభక్షకునివి అగుదువు" అని శపిస్తాడు.

అప్పుడు అగ్నిదేవుడు "నేను సర్వభక్షకున్ని అయిన, దేవతలకు హవిస్సులు ఎల తెసుకెళ్ళలి" అని, తన మటలను ఆపివేస్తాడు. ఇక హోమాలు, దేవతలకు హవిస్సులు లేకపోవడంతో బ్రహ్మదేవుడు అగ్ని దగ్గరికి వస్తాడు.

బ్రహ్మదేవుడు "ఓ అగ్నిదేవా, భృగువు శాపం ప్రకారం నువ్వు సర్వభక్షకునివే, కానీ నీ పవిత్రత పోలేదు కావున నువ్వు ఎప్పటిలాగే దేవతలకు హవిస్సులు చేరవేస్తూండు" అని చెప్తాడు. అందుకు అగ్నిదేవుడు అంగీకరిస్తాడు

భార్గవస గోత్రీకుల ప్రవర

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు !
భార్గవ , చ్యవన, ఆప్లువాన, ఔరవ, జామదగ్ని పంచాఋషేయ ప్రవరాన్విత భార్గవస  గోత్రః, ఆపస్తంభ సూత్రః, యజుశ్శాఖాధ్యాయీ, ------ శర్మా౦ అహంభో అభివాదయే ! 

బ్రహ్మర్షి విశ్వామిత్ర మహర్షి జీవిత విశేషాలు

విశ్వామిత్రుడు (Viswamitra) హిందూపురాణ గాధలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాధలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉన్నది. విశ్వామిత్రుని గురించిన గాధలలో ప్రధానమైనవి:

● 1) గాయత్రీ మంత్ర సృష్టి కర్త.

● 2) శ్రీరామున కు గురువు.

● 3) హరిశ్చంద్రుని పరీక్షించినవాడు.

● 4) త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు.

● 5) శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత.

గౌతమ మహర్షి, అహల్య ల కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుడి జీవిత వృత్తాంతాన్ని శ్రీరామచంద్రునికి వినిపిస్తాడు. ఆవిధంగా శతానందుడి చేత వివరింపబడిన విశ్వామిత్రుడి జన్మ వృత్తాంతాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం లోని బాలకాండలో 51-65 సర్గల మధ్య వర్ణించాడు.

వంశ వృత్తాంతం

బ్రహ్మ కుమారుడు కుశుడు. ఆయన పుత్రుడు కుశనాభుడు. ఆయనకు నూరుగురు కుమార్తెలు. ఆ నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత కుశనాభుడికి పుత్రసంతానం లేకపోవడం వల్ల పుత్రకామేష్టి యాగం చేస్తాడు. తండ్రి అయిన కుశ మహారాజు ప్రత్యక్షమై, అత్యంత పరాక్రమం కలిగి కీర్తిని ఇవ్వగల పుత్రుడుగా గాధి జన్మిస్తాడు అని వరమిస్తాడు. ఆ విధంగా కుశనాభుడికి జన్మించిన గాధి కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కుశవంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు అనే పేరు కూడా ఉంది.

వశిష్ఠుని విందు

విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్య పాలన చేశాడు. ఒకరోజు ఒక అక్షౌహిణి సైన్యంతో వేటకై వెళ్ళి, అలసి, వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకొంటాడు. కుశల ప్రశ్నలు, అర్ఘ్యపాద్యాదులు అయ్యాక, విశ్వామిత్రుడు సెలవు తీసుకోబోగా, వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు "మీ దర్శనం వల్ల, అర్ఘపాద్యాదుల వల్ల ఇప్పటికే సంతుష్టుడనయ్యాను. కాబట్టి సెలవు ఇప్పించవలసింది" అని అంటాడు. కానీ వశిష్ఠుడు ఆతిథ్యం తీసుకోమని బలవంతపెట్టడంతో, విశ్వామిత్రుడు అంగీకరిస్తాడు. వశిష్ఠుడు తన హోమధేనువు, కామధేనువు సంతతికి చెందినదీ అయిన శబల అనే గోవును పిలిచి మహారాజుకు, ఆయన సైన్యానికి వారివారి ఇచ్ఛానుసారం పదార్ధాలు తయారు చేసి, విందు చెయ్యమంటాడు. వశిష్ఠుని ఆజ్ఞ మేరకు శబల సైనికుల ఇష్ఠాలను గ్రహించి, ఆ మేరకు వారికి నచ్చిన పదార్థాలు సృష్టించి, అతిథి సత్కారాలు చేస్తుంది.

శబలను కోరడం, వశిష్ఠుడు నిరాకరించడం అది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్య చకితుడై ఆ శబలను తనకు ఇచ్చి లక్ష గోవులను దానంగా స్వీకరించమంటాడు. లక్ష గోవులు ఇచ్చినా శబలని ఇవ్వడానికి వశిష్ఠుడు అంగీకరించడు.

దానితో విశ్వామిత్రుడు కోపించి "నేను రాజును, రత్నం లాంటి ఈ గోవు నా వద్దే ఉండాలి" అంటాడు. అప్పుడు వశిష్ఠుడు శబల వల్లనే ఆశ్రమంలో హవ్యం (హవిస్సులు), కవ్యం (పితృకార్యాలు) జరుగుతున్నాయి, అసలు ఈ గోవు వల్లే ప్రాణయాత్ర నడుస్తోంది అన్నాడు. పద్నాలుగు వేల ఏనుగులు, ఎనిమిది బంగారు రథాలు, పదకొండు గుర్రాలు, కోటి గోవులు, బంగారం, వెండి బదులుగా ఇస్తాను, శబలను ఇమ్మంటాడు విశ్వామిత్రుడు.. వాటిని కూడా వశిష్ఠుడు నిరాకరించి మౌనం పాటిస్తాడు.

ఆ మహారాజు కోపించి శబలను రాజ్యానికి తోలుకొని పొమ్మని తన సైన్యానికి ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడి సైన్యం శబల మెడలో గొలుసు వేసి, తోలుకొని పోతుండగా శబల ఏడుస్తూ వశిష్ఠ మహర్షిని ఈ విధంగా ప్రశ్నిస్తుంది "నేనేమైనా లోపం చేశానా, నన్ను పరిత్యజిస్తున్నారు? మీరు నన్ను రక్షిస్తారా లేక నన్ను నేను రక్షించుకొనుమంటారా?" వశిష్ఠ మహర్షి దానికి అంగీకారాన్ని తెలుపుతాడు.అప్పుడు శబల ఒక హూంకారం (అంబా నాదం) చేసి, వెంటనే శూలాయుధులైన పహ్లవులు అనే యవనులకు జన్మనిచ్చి వారి ద్వారా విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేస్తుంది.అది చుసి క్రోధ పరవశుడైన విశ్వామిత్రుడు అనేక శస్త్రాస్త్రాలతో పహ్లవులను సంహరిస్తాడు. దానికి క్రుద్ధ అయిన శబల తన శరీరం నుంచి కాంభోజ వంశీయులను, పొదుగు నుండి పహ్లవులను, యోని స్థానం నుండి యవనులను, గోమయం వచ్చే స్థానం నుండి శకులను, రోమకూపాలనుండి హరీకులను, కిరాతకులను పుట్టించగా వారు విశ్వామిత్రుని సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. అది చూసిన విశ్వామిత్రుడి నూరుగురు కుమారులు వశిష్ఠమహర్షిని చంపేందుకు వెళ్తారు. వశిష్ఠ మహర్షి ఒక హుంకారం చేయడంతో నూరుగురు భస్మరాశులై పడిపోతారు. అది
చూసిన విశ్వామిత్రుడు విచారించి, తన దగ్గర ఉన్న శక్తులతో వశిష్ఠుని గెలవజాలనని తెలిసి, రాజ్యానికి తిరిగి వెళ్ళి, మిగిలిన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి, హిమాలాయాలకు వెళ్ళి పరమశివుడి తీవ్రమైన తపస్సు చేస్తాడు.

పరమ శివుడి కోసం తపస్సు

విశ్వామిత్రుడి ఘోర తపస్సుకు మెచ్చి, శివుడు ప్రత్యక్షమై తన కోరికను వెల్లడించమంటాడు. తనకు ధనుర్వేదం లోని సర్వ రహస్యాలు సాంగోపాంగంగా ఇప్పటికిప్పుడు బోధించమని విశ్వామిత్రుడు కోరుతాడు. శివుడు తథాస్తు అని దీవిస్తాడు. ఆ వరాన్ని పొందిన వెంటనే విశ్వామిత్రుడు పౌర్ణమి నాడు సముద్రం పోటెత్తినట్లుగా ఉత్సాహంతో ఉప్పొంగి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు.

వశిష్ఠుని మీద ధనుర్వేద ప్రయోగంవశిష్టుని ఆశ్రమంపై దండెత్తిన విశ్వామిత్రుడు తాను నేర్చిన అస్త్రాలను ఆశ్రమంపై ప్రయోగించగా ఆశ్రమవాసులు కకావికలై ప్రాణభయంతో పరుగులుతీస్తారు. వశిష్ఠ మహర్షి దానిని గమనించి కుటీరం నుండి బయటకు వస్తాడు. విశ్వామిత్రుడు ఆమహర్షిని చూసిన వెంటనే అగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు వశిష్ఠుడు తన బ్రహ్మదండము ను అడ్డు పెడితే ఆ ఆగ్నేయాస్త్రం బ్రహ్మదండంలోకి చేరిపోతుంది.

అది చూసిన విశ్వామిత్రుడికి కోపం వచ్చి తనకు వచ్చిన అస్త్రాలు వరసగా ఒకదాని వెంట మరొకటి ప్రయోగిస్తాడు.
ఐషికాస్త్రం, వారుణాస్త్రం, రౌద్రాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతం, మానవాస్త్రం, ముసలం, గదలు, ధర్మచక్రం, విష్ణుచక్రం, బ్రహ్మపాశం, కాలపాశం, విష్ణుపాశం అనే వివిధ అస్త్రాలు వేసినప్పటికీ వశిష్ఠమహర్షి నిశ్చలుడై ఉంటాడు. చివరకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సన్నద్ధం కాగా సముద్రాలు పోర్లుతాయి, పర్వతాలు బ్రద్దలౌతాయి.

బ్రహ్మాస్త్రాన్ని సంధించి వశిష్ఠుడి మీద ప్రయోగిస్తాడు. అప్పుడు బ్రహ్మాస్త్రం కూడా వశిష్ఠుడి బ్రహ్మదండం లోకి చేరి పోతుంది.

 అది చూసిన విశ్వామిత్రుడు చింతించి, బ్రహ్మణ బలాన్ని క్షత్రియ బలం తో జయించడం జరగదని భావించి, తాను కూడా బ్రహ్మర్షి కావాలని భావిస్తాడు.

దక్షిణ తీరాన బ్రహ్మ గురించి తపస్సు

భార్యాసమేతంగా దక్షిణ తీరానికి వెళ్ళి బ్రహ్మ గురించి వెయ్యి సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేస్తాడు. ఆసమయంలోనే విశ్వామిత్రుడికి హనిషేంద్రుడు, మధుస్సందుడు, ధృఢనేత్రుడు, మహారథుడు అనే నలుగురు కుమారులు జన్మిస్తారు. చతుర్ముఖబ్రహ్మ ఆ తపస్సుతో ప్రీతి చెంది, "విశ్వామిత్రా నువ్వు రాజర్షి వి అయ్యావు" అని దీవించి అంతర్ధానమౌతాడు. విశ్వామిత్రుడు దానితో ప్రీతి చెందలేదు. "ఎప్పటికి నేను ఋషిని అవుతాను? ఎప్పటికి మహర్షి అవుతాను? ఎప్పటికి బ్రహ్మర్షిని అవుతాను?" అని చింతిస్తాడు.

త్రిశంకు స్వర్గం

ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడు అనే మహారాజుకు ఒక విచిత్రమైన ఆలోచన కలుగుతుంది. తన పూర్వ వంశీయుల వలె కాక, తాను సశరీరంగా స్వర్గానికి చేరుకోవాలి అనే కోరిక పుడుతుంది. కులగురువులైన వశిష్ఠుడికి తన కోరిక విన్నవిస్తాడు. బొందితో స్వర్గానికి వెళ్ళడానికి తనచేత ఏదైనా యాగం చేయించుమని కోరగా అది కూడని పని, ధర్మశాస్త్ర విరుద్దమని వశిష్ఠుడు వారిస్తాడు.

అంతట వశిష్ఠుని నూరుగురు కొడుకుల వద్దకు వెళ్ళి తన ఇచ్ఛను ప్రకటిస్తాడు. సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం కూడని పని అని వశిష్టుని కుమారులు కూడా బోధిస్తారు. మీ వల్ల ఆ కార్యం కాకపోతే నేను వేరే గురువుని చూసుకొంటాను అని త్రిశంకుడు వశిష్ఠుడి కుమారులతో అంటాడు.

ఆ మాట విన్న వశిష్ఠకుమారులు కోపించి ఛండాలుడివి కమ్మని త్రిశంకుని శపిస్తారు. మరునాటి ఉదయానికి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఇనుప గొలుసులు గా మారిపోయి త్రిశంకుడు ఛండాలుడుగా మారిపోతాడు.

ఛండాలుడి గా మారిన త్రిశంకుడు దేశద్రిమ్మరిలా తిరుగుతూ దక్షిణ తీరంలో
తపస్సు ముగించిన విశ్వామిత్రుడి కంటపడి, తన వృత్తాంతాన్నంతా విశదీకరిస్తాడు. త్రిశంకుడి కథ విని సంతోషపడిన విశ్వామిత్రుడు వశిష్ఠుడు చెయ్యలేని పనిని తాను చెయ్యాలనే కోరికతో త్రిశంకుడికి అభయం ఇచ్చి,

తాను యాగం నిర్వహించి త్రిశంకుడిని సశరీరంగా ఛండాలావతారంతో స్వర్గానికి పంపుతానని చెబుతాడు. విశ్వామిత్రుడు తన కుమారులను పిలిచి సమస్త భూగోళంలో ఉన్న బ్రహ్మణులను యజ్ఞానికి అహ్వానించమంటాడు. వశిష్ఠుడి కుమారులు మరియు మహోదయుడు అనే  బ్రాహ్మణుడు యజ్ఞానికి రామన్నారని, మహోదయుడైతే క్షత్రియుడు చేయించే యజ్ఞంలో ఛండాలుడు హవిస్సులు ఇస్తే దేవతలు తీసుకోరని చెప్పాడనీ విశ్వామిత్రుని కుమారులు తండ్రికి విన్నవిస్తారు.

ఇది విన్న విశ్వామిత్రుడు క్రోధావేశంతో వశిష్ఠుని నూరుగురు కుమారులను భస్మరాసి అవుతారనీ, 700 జన్మలు శవమాంసాన్ని తింటూ బ్రతుకుతారనీ, ఆ తరువాత ముష్టికులుగా పుట్టి కుక్కమాంసం తింటూ బ్రతుకుతారనీ శపిస్తాడు. మహోదయుడు నిషాదుడిగా హీనమైన బ్రతుకు బ్రతుకుతాడనికూడా శపిస్తాడు. యాగంలో హవిస్సులు సమర్పిస్తుంటే హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రారు.

అది గమనించిన విశ్వామిత్రుడు తన తపోశక్తితో త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపుతాడు. అది చూసిన ఇంద్రుడు త్రిశంకుడితో గురుపుత్రుల శాపానికి గురైన నీకు స్వర్గ ప్రవేశం లేదని, వచ్చిన దారినే పొమ్మని త్రిశంకుడిని భూలోకానికి నెట్టేస్తాడు. అలా నెట్టి వేయబడ్డ త్రిశంకుడు తలక్రిందులుగా పడిపోతూ, విశ్వామిత్రా! రక్షించు అని ఆర్తనాదం చేస్తాడు.

అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడిని మార్గమధ్యంలో ఆపి, బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి (స్వర్గాన్ని, నక్షత్రమండలాన్ని) చేయనారంభిస్తాడు. దీనిని గమనించిన దేవతలు విశ్వామిత్రుడితో బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేయడం తగదని వారిస్తారు. వారి అభ్యర్థన మేరకు త్రిశంకు ఉండే స్వర్గాన్ని నక్షత్రమండలా

నికి ఆవల సృష్టించి, త్రిశంకుడు తలక్రిందులుగా ఆ త్రిశంకు స్వర్గం లో ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు.

అంబరీషుడి అశ్వమేథం - శునశ్శేఫుడికి విశ్వామిత్రుడి మంత్రాలు:

త్రిశంకుడిని ఆవిధంగా త్రిశంకు స్వర్గానికి పంపిన తరువాత విశ్వామిత్రుడు తపస్సుచేసుకోవడం కోసమని పశ్చిమ దిక్కు కు చేరుకొంటాడు. ఆ సమయంలోనే ఇక్ష్వాకు వంశానికి చెందిన అంబరీషుడు అనే మహారాజు అయోధ్య ను పరిపాలన చేస్తూ అశ్వమేథ యాగం లోని భాగంగా అశ్వాన్ని విడిచి పెడతాడు.

ఇంద్రుడు ఆ అశ్వాన్ని అపహరిస్తాడు.యాగం నిర్వహించే ఋత్విక్కులు అశ్వాన్ని వెతికి బలి ఇవ్వపోతే ప్రతికూలమైన చర్యలు జరుగుతాయి అనిచెప్పి దాని నివృత్తి కోసం అశ్వం తో సమానమైన పశువును తీసుకొని వచ్చి, అశ్వాన్ని పెట్టవలసిన స్థానం లో యూప స్తంభము నకు కట్టి ఉంచి బలి ఇవ్వాలని సూచిస్తారు.అశ్వంతో సమానమైన పశువు ని వెతికే పని మీద అంబరీషుడు తన రథం మీద వెళ్ళుతుండగా భార్యా సమేతంగా ఋచీకుడు అనే ఋషి భృతుంగ పర్వతం మీద కనిపిస్తాడు.

ఆ ఋషి కి తన కథచెప్పి యాగ సమాప్తి కొరకు సహాయం రూపం గా ఋషి కుమారుడిని అర్థిస్తాడు. మొదటి సంతానం పూర్వ కర్మ సుకృతం వల్ల జన్మిస్తుంది కనుక తన మొదటి సంతానాన్ని ఇవ్వ లేననీ, మిగిలిన సంతానం విషయమ్ లో తన భార్యను కనుక్కోవలసినదనీ ఋషి చెబుతాడు. చివరి సంతానం మైన శునేకుడిని ఇవ్వడానికి తల్లి నిరాకరిస్తుంది.

ఇక ఆమధ్య సంతానమైన శునశ్శేఫుడి ని అంబరీష మహారాజుకి దానమిచ్చేస్తాడు ఋచీకుడు. అంబరీషుడు ఆ ఋషికి మణులు,
మాణిక్యాలు, బంగారం, పది లక్షల గోవులు ప్రతిగా దానమిస్తాడు.
అంబరీషుడు శునశ్శేఫుడిని రథం ఎక్కించుకొని అశ్వమేథం చేసే స్థలానికి బయలు దేరుతాడు.

మార్గమధ్యంలో బడలిక తీర్చుకోవడానికి ఒక ప్రదేశం లో ఆగితే అక్కడ శునశ్శేఫుడికి విశ్వామిత్రుడు తపస్సు చేసుకొనే ఆశ్రమం కనిపిస్తుంది. శునశ్శేఫుడు విశ్వామిత్రుడి వద్ద కు వెళ్ళి తన కథంతా విన్న వించుకొని తనకు బ్రతికి ఉండవలెనని కోరిక ఉన్నదని, ఎంతో గొప్ప తపస్సు చేయాలనే తపన ఉన్నదని చెప్పగా విశ్వామిత్రుడు తన కుమారులను యాగం కోసం బలి గా వెళ్ళమంటాడు.

అది విన్న విశ్వామిత్రుడి కుమారులు "నాన్నా! నువ్వు చెప్పినది కుక్క మాంసం తిన మన్నట్లుంది, ఏవరినో రక్షించడం కోసం కుమారులను బలి ఇస్తావా?" అంటారు. విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై కుమారులను వెయ్యి సంవత్సరాలు వశిష్ఠ కుమారులకు పట్టిన గతే పట్టు గాక (కుక్క మాంసం తినేవాళ్ళు గా అవుదురు గాక) అని శపిస్తాడు. (వరుసకు విశ్వామిత్రుడు శునశ్శేఫుడికి మేనమామ అవుతాడు పరశురాముడు జన్మవృత్తాంతం చూడండి).

అలా కుమారులను శపించాక విశ్వామిత్రుడు శునశ్శేఫుడి వైపు తిరిగి "శునశ్శేఫా! నీకు నేను అభయం ఇస్తునాను, నిన్ను తీసుకొని పోయి యూప స్తంభానికి కట్టేస్టారు, ఎర్రటి బట్ట కడతారు,రక్త చందనం పూస్తారు, నీవు కలత చెందకు, అశ్వమేథ యాగం వైష్ణవ యాగం కాబట్టి ఇంద్రుడు ప్రీతి చెందేటట్లు నేను నీకు రెండు మంత్రాలు ఉపదేశిస్తున్నాను, వేరే చింతన లేకుండా ఈ రెండు మంత్రాలను మనస్సులో మననం చేసుకో, యాగం సమాప్తి అవడానికి మునుపే ఇంద్రుడు వచ్చి యాగం తోసంతృప్తి చెందాను ,యాగానికి కోటి రెట్ల ఫలాన్ని ఇస్తున్నాను అని చెబుతాడు." అని అంటాడు.

ఇది విన్న శునశ్శేఫుడు ఏంతో ఆనందంతో అంబరీష మహారాజు రథం ఎక్కి యాగానికి చేరు కొంటాడు.యాగం లో శునస్సేఫుడిని యూపస్తంభానికి కట్టేస్తారు. అయినా శునశ్శేఫుడు కలత చెందక విశ్వామిత్రుడు ఉపదేశించిన రెండు మంత్రాలు బాగా మననం చేసు కొంటూఉంటాడు. దీనితో ప్రీతి చెందిన ఇంద్రుడు యాగ సమాప్తికి మునుపే వచ్చి యాగం తో సంతృప్తి పొందాను అని చెబుతాడు. అంతే కాకుండా శునశ్శేఫునికి దీర్ఘాయువు ఇవ్వడంతో శునశ్శేఫుడు యూప స్తంభం నుండి విడుదలై స్వేచ్చగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళి పోతాడు.

మేనకా విశ్వామిత్రుల క్రీడలు

ఆవిధంగా శునశ్శేఫుడిని పంపించేశాక మళ్లీ పశ్చిమ తీరంలోని పుష్కర క్షేత్రం లో తపస్సు మొదలు పెట్టబోతాడు. ఆసమయం లో మేనక పుష్కరక్షేత్రం లో స్నానం చేయడానికి వస్తుంది. మేనకను చూసి కాముకుడై విశ్వామిత్రుడు మేనక తో రమించడం ప్రారంభిస్తాడు. ఒకటి రెండు రోజులలో రతి క్రీడ ముగించి తపస్సు ప్రారంభిద్దాం అనుకొంటాడు కాని అది పది సంవత్సరాలకు చేరుకొంటుంది. ఇలా ఉండగా ఒక రోజు విశ్వామిత్రుడికి పది సంవత్సరాలు అయిపోయాయి అని స్ఫురణలోకి వస్తుంది. ఇది దేవతల పని అని గ్రహించి, కామక్రోధాలకు వశుడునైయ్యాను అని భావించి పశ్చిమ తీరం నుండి మరల బయలు దేరి ఉత్తరాన హిమాలయా లకు చేరుకొంటాడు. మేనక,తనకు విశ్వామిత్రుడికి జన్మించిన ఆడుబిడ్డను మేనక అక్కడే విడిచి వెళ్ళి పోతుంది. అప్పుడు ఆ బిడ్డను పక్షులు తమ రెక్కల సహాయం తో నీడ కల్పించి రక్షిస్తాయి. ఆ మార్గంలో శిష్యులతో వెళ్ళుతున్న కణ్వ మహర్షి ఆ బాలిక ను చూసి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్లి, పెంచుతాడు కణ్వుడు ఆ బిడ్డకు శకుంతల అని నామకరణం చేసి పెంచి పెద్దచేస్తాడు. శకుంతల దుష్యంతుని వివాహము చేసుకొని తద్వారా భరతుని కి జన్మనిస్తుంది. ఈ భరతుని పేరు మీదగానే భారత దేశానికి భరతఖండమని పేరువచ్చిందని ప్రతీతి.
శకుంతల జన్మించిన కణ్వాశ్రమ ప్రాంతము భారతదేశములో వివిధ ప్రాంతాలలో ఉన్నదని చెపుతున్నప్పటికీ, రూఢిగా తెలియడంలేదు.

ఉత్తర తీరంలో తపస్సు - మహర్షి అవడం

ఉత్తర తీరానికి వెళ్ళి,అత్తగారైన సత్యవతి కౌశికి నది రూపం లో ఉండగా అక్కడ ఘోరాతి ఘోర మైన తపస్సు చేయనారంభించాడు.( పరశురాముడి జన్మ వృత్తాంతం చూడండి). వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసేటప్పటికి ఆ తపస్సుకి ప్రీతి చెంది చతుర్ముఖ బ్రహ్మ వచ్చి "విశ్వామిత్రా! నీ తపస్సుకి మెచ్చాను. నువ్వు మహర్షి వి అయ్యావు" అని అంటాడు. విశ్వామిత్రుడు బాధ పడక, ఆనందించక బ్రహ్మతో తాను జితేంద్రియుడిని అయ్యానా అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానం గా బ్రహ్మ ఇంకా జితేంద్రుడివి కాలేదు ఇంకా తపస్సు చేయ వలసి ఉంది అని చెప్పి అంతర్ధానం అవుతాడు.బ్రహ్మ అదృశ్యమై పోయాక మళ్ళీ ఘోరాతి ఘోరమైన తపస్సు చేయడం ఆరంభిస్తాడు. గ్రీష్మ ఋతువు లో పంచాగ్ని హోత్రం మధ్య నిలబడి, శిశిర ఋతువు లో నీళ్ళలో నిలబడి చేస్తున్న తపస్సుకు ఇంద్రుడు కంగారు పడి, పరీక్ష కోసంరంభ ను విశ్వామిత్రుడి వద్దకు పంపిస్తాడు. రంభ సంకోచిస్తుంటే ఇంద్రుడు తాను, వసంతుడు, మన్మథుడు ఆమె వెంట వస్తామని చెబుతారు. రంభ విశ్వామిత్రుడి ఆశ్రమానికి చేరుకోగా, ఆశ్రమమంతావసంత ఋతువు లా మారిపోయింది. ఆశ్రమం అంతా వసంత ఋతువు లా మారిపోవడం తో విశ్వామిత్రుడికి సందేహం వచ్చి ఇది అంతా ఇంద్రుడి మాయ అని గ్రహించి, రంభ తనను ప్రలోభ పెట్టడానికి వచ్చి నట్లు గ్రహించి, ఆమె పదివేల సంవత్సరాలు పాషాణ రూపంగా మారిపోయేటట్లు శపిస్తాడు. ఆ తరువాత క్రోధ వశుడనైనాను అని భావించి,రంభ తో బ్రాహ్మణోత్తముడు ఆవిడను ఉద్ధరించగలడు అని శాపవిమోచనం చెప్పి తూర్పు తీరానికి తపస్సు చేసు కోవడానికి వెళ్ళి పోతాడు.

బ్రహ్మర్షి అవడం

విశ్వామిత్రుని బ్రహ్మర్షిగా ప్రకటిస్తున్న బ్రహ్మ మరియు ఇతర దేవతలు
విశ్వామిత్రుడు తూర్పు దిక్కుకు వెళ్ళి మౌనంతో కామక్రోధాలను నిగ్రహిస్తు బ్రహ్మాండమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈ మారు తపస్సులో కుంభకం అనే ప్రక్రియను ఉపయోగించి శ్వాస తీసుకోవడం విడిచి పెట్టడం మానేస్తాడు. ఆవిధంగా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే శరీరం కాష్ఠం క్రింద (ఒక పుల్ల లా) మారిపోయింది. ఆ కాష్ఠాన్ని నిలబెట్టు కోవడం కోసం ఒకరోజు ఇంత అన్నం తినడం కోసం కూర్చొండగా ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి భిక్ష అడుగు తాడు. విశ్వామిత్రుడు అది గ్రహించి ఇంద్రుడుకి తాను తిన బోయే అన్నాన్ని (కబలం)ఇచ్చేస్తాడు.మళ్లీ కుంభకం అనే తపస్సు చేయనారంభిస్తాడు. అప్పుడు ఆయన బ్రహ్మ స్థానం నుండి పొగ వచ్చి లోకాలను కప్పేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి కౌశికా! బ్రహ్మర్షీ! అని పిలిస్తే సంతోషించి, బ్రహ్మ ను ఒకకోరిక కోరుతాడు. వశిష్ఠుని చేత బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉంది
అంటాడు. అప్పుడు దేవతలు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి విశ్వామిత్రుడి మనోగతాన్ని వ్యక్తం చేస్తారు. వశిష్ఠుడు విశ్వామిత్రుడి కోరిక మేరకు బ్రహ్మర్షి అని పిలిస్తే విశ్వామిత్రుడు సంతోషించి వశిష్ఠుని కి అర్ఘ్యపాద్యాలు ఇస్తాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుతాడు.

అయితే... వశిష్ఠుడు విశ్వామిత్రుడిలో మార్పును గ్రహించేందుకు పరీక్ష పెడతాడు. "బ్రహ్మర్షీ" అని పిలిపించుకునేందుకు తహతహలాడడం చూసి, ఇంకా అతనిలో కొంత అహం ఉందని గుర్తిస్తాడు. దీంతో తొలుత అతన్ని "రావయ్య పిలుస్తాను" అని ఆహ్వానిస్తాడు. దగ్గరకు రాగానే "ఇక్కడికెందుకొచ్చావ్? వెళ్లు" అంటూ గద్గద స్వరంతో దూరంగా వెళ్లమంటాడు. దీంతో  విశ్వామిత్రుడు సౌమ్యంగా ఆయనకు నమస్కరించి వెళ్తుండగా... మళ్లీ "అదేంటి...? వచ్చిన పని ముగించకుండా వెళ్లిపోతున్నావ్?" అనడంతో విశ్వామిత్రడు మళ్లీ నమస్కరించి ముందుకు రావడం... వశిష్టుల వారు చీదరించుకోవడం జరిగింది. అలా నాలుగైదు మార్లు జరిగాక... విశ్వామిత్రుడిలో పూర్తిగా కోపం పోయిందని, ఆయన బ్రహ్మర్షిగా అర్హుడని భావించాక "బ్రహ్మర్షీ" అని పిలుస్తాడు.

వారసత్వం (విశ్వామిత్ర గణ గోత్ర ప్రవరలు)

హిందూ వర్ణవ్యవస్థ లో విశ్వామిత్ర , కౌశిక గోత్రాలకు చెందినవారు విశ్వామిత్రుడు తమ వంశానికి ఆది పురుషునిగా భావిస్తారు. విశ్వామిత్ర గోత్రజులు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తమ మూలపూరుషునిగా భావిస్తారు. వీరిలో చకిత విశ్వామిత్ర గోత్రము అనే ఉపశాఖ కలదు. ఈ ఉపశాఖకు చెందినవారు విశ్వామిత్రుని ఆశ్చర్యమునుండి ఉద్భవించినారని వారి నమ్మకం.

అయితే ఇది కేవలం ప్రధానశాఖ నుండి ఉద్భవించిన ఒక చీలిక వర్గమే అన్నది మరింత సమంజసమైన తర్కము. అలానే, కామకాయన విశ్వామిత్ర అనే గోత్రము దక్షిణ భారతదేశము లో కనిపిస్తుంది.

కౌశిక గోత్రజులు రాజర్షి కౌశికుడు తమ మూలపురుషుడని అంగీకరిస్తారు. విశ్వామిత్రుని ప్రతినామమే కౌశికుడు. 96 మరాఠా వంశాలలో 11 రాజవంశాలు కౌశిక గోత్రానికే చెందినవి. ప్రసిద్ధి చెందిన ఛత్రపతి శివాజీ వంశము, రాష్ట్రకూట వంశములు కౌశిక గోత్రానికి చెందినవేనని భావిస్తారు. మరాఠా వంశాలలో రెండు వంశాలు విశ్వామిత్ర గోత్రానికి చెందినవి.
విశ్వామిత్ర , కౌశిక గోత్రాలకు చెందినవారు ఉత్తరాదిన క్షత్రీయులలో ఎక్కువగాను, దక్షిణాదిన బ్రాహ్మణులలో ఎక్కువగా కనిపిస్తారు. సూర్యవంశమునకు చెందిన బైష్ రాజపుట్ వంశము నకు కౌశిక గోత్రము కలదు.

సంస్కృతిలో విశ్వామిత్రుడు

విశ్వామిత్రుడు భారతీయ సంస్కృతికి గాయత్రీ మంత్రంతో పాటు, భారతీయ భాషలకు త్రిశంకు స్వర్గం అన్న పదాన్ని కూడా అందించాడు. అటుఇటు కాక నట్టనడుమ కొట్టుమిట్టాడే పరిస్థితిని త్రిశంకు స్వర్గమనటం నేటికీ పరిపాటే.

" బ్రహ్మర్షే స్వాగతం తే అస్తు తపసా స్మ సు తోషితాః |
బ్రాహ్మణ్యం తపసా ఉగ్రేణ ప్రాప్తవాన్ అసి కౌశిక " ||

ఓ కౌశికా! నీ తపస్సుకి సంతోషించాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతలందరితో కలిసి నేను నిన్నుబ్రహ్మర్షి అని పిలుస్తున్నాను, నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయిష్మంతుడవై జీవిస్తావు అన్నారు.
అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితో.......నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము,వషట్కారము వాటంతట అవి భాసించాలి అన్నాడు( ఓంకారము, వషట్కారము భాసిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు, అలాగే తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక). అలాగే, ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశానో, ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మగారు సరే అన్నారు.
అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా, ఆయన విశ్వామిత్రుడిని చూసి బ్రహ్మర్షి విశ్వామిత్రా అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి కాళ్ళు కడిగి పూజ చేశాడు. ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో, ఆ వశిష్ఠుడి కాళ్ళు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని శతానందుడు రాముడితో చెప్పాడు.
బ్రహ్మర్షి అవ్వడానికి, కామక్రోధాలని జయించడానికి మీ గురువు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఇలాంటి గురువుని పొందిన రామ నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. విశ్వామిత్రుడి కథ విన్న రాముడు పొంగిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా విశ్వామిత్రుడికి ప్రణిపాతం చేశారు.

నీతి మనం తెలుసుకోవలసినది

◆ ఎంత నియమ నిష్ఠలతో సాధన తపస్సు చేసినా కామం క్రోధం ద్వేషం అంతః కరణం లో ఉంటే సాధన వ్యర్ధం అవుతుంది.

◆ ఒక కుండ నిండా అమృతం నింపి అందుకు కామము క్రోధము ఇత్యాది రంధ్రాలు పెట్టిన ఆ అమృతం అందులోనుండి కారిపోతుంది వ్యర్థమైపొతుంది.ఈ ప్రక్రియ కి కుండకి కానీ అమృతానికి కానీ ఎలాంటి బాధ్యత ఉండదు.
అలాగే మనలో ఉన్న కామము క్రోధము ఎవరో మనల్ని గుర్తించాలి అని ఎవరో మనల్ని విలువ చేసి మర్యాదలు చేయాలని అనుకుంటూ చేసిన కాస్త సాధన ఫలం వ్యర్థం చేసుకోకూడదు...

ఎవరి కర్మ వారిదే ఎవరి గమ్యం వారిదే ... ఒక ఇంట్లో పుట్టినా ఒక ఊరిలో పెరిగినా ఒక గురు వద్ద విద్యాభ్యాసం చేసినా ఎవరి కర్మని అనుసరించి మరియు వారి అంతః కరణ శుద్ధిని అనుసరించి వారికి ఫలితం ఉంటుందనేది సత్యం.

నేడు మానవులు సత్యం మరచి ఇతర మనుషుల యొక్క చేష్టల వల్ల ప్రభావితులు అయ్యి...
అనవసరమైన మానసిక చింత లో ఉండటం లాభం లేనిది అని తెలుస్తున్నది....

ఉత్తమమైన నీతి ఏమిటంటే మనము, మన ఉన్నతి కేవలం మన సాధన తపస్సు మరియు మన పవిత్రత వల్ల మాత్రమే కలుగుతుంది కానీ ఇతరుల వల్ల మనకి మంచి జరుతుందేమో కానీ చేడు మాత్రం ఒక 10శాతం మాత్రమే జరుగుతుంది మిగతా 90 శాతం మన వల్ల మనకే...

ప్రపంచం.మారాలంటే మనం మారాలి....

ఆదిశంకరులు ఒక చోట ఇలా సెలవిచ్చారు " ఏ మానవుడు ఆశకి లోబడి ఉంటాడో అతడు ప్రపంచానికి వశుడై కష్టాల పాలు అవుతాడు అలాగే ఎ మానవుడికి ఆశ లోబడి ఉంటుందో ఆతడికి లోకమే వశమై ఉంటుంది "

యోగా యొక్క చరిత్ర మరియు కలిగే ప్రయోజనాలు

యోగా అనే సంస్కృత భాషకు చెందిన పదం.

యోగా ద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కాకుండా, వ్యాధులు కూడా తగ్గించబడతాయి.

యోగాసనాల ద్వారా అధిక రక్త పీడనం నియంత్రించబడుతుంది.

మధుమేహ వ్యాధి గ్రస్తులలో యోగా వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి.


యోగా అనే సంస్కృత భాషకు చెందిన పదం, యోగా అనగా ఐక్యం (ఏకం) అని అర్థం. ఐక్యం అనే పదానికి చాలానే నానార్థాలు ఉన్నాయి, కానీ యోగా వైద్య శాస్త్ర ప్రకారం, "మనసుతో శరీరాన్ని మిళితం చెందించి చివరకి ఆత్మకు చేరువ అవ్వటం". ధ్యానం వంటి లేదా కొన్ని ఇతర నైతిక పద్దతులను అనుసరించి మరియు సాంఘీక విధుల ద్వారా మీ ఆహాన్ని దూరం చేసుకునే ప్రాచీన, ఆధ్యాత్మిక పధ్ధతులుగా చెప్పవచ్చు. ఈ పద్దతులు ప్రాచీనం అయినప్పటికీ, జ్ఞానులు వీటి చరిత్ర గురించి గ్రంథములలో రాస్తూ, దీని ఉనికిని ప్రపంచానికి చాటారు. రెండు వేల సంవత్సరాల క్రితం బ్రతికి ఉన్న, ప్రాచుర్యం పొందిన మునులు యోగా మరియు వాటి గురించిన ప్రాముఖ్యతల గురించి ముందే గ్రంథములలో రాసి పొందుపరిచారు.

యోగా చరిత్ర

భారతదేశంలో వివిధ శాఖలకు చెందిన జ్ఞానులు యోగాసనాలను సాధన చేసి, మరియు యోగా వలన కలిగే ప్రయోజనాలు వాటి ప్రాముఖ్యతల గురించి ప్రచారం చేసారు. కానీ, వీరు ఆవిష్కరించిన సాధనల మరియు ప్రచారం గురించి ఎక్కడ పొందుపరచబడలేదు. ఇవి వారి శిష్యుల ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకురాబడ్డాయి. మొదటిసారి పొందుపరచిన లెక్కల ప్రకారం, సేజ్ అనే పతంజలి పుణ్య పురుషుడికి ఈ ఘనత దక్కింది. ఇతడు, యోగా గురించి కొన్ని సూత్రాలను మరియు తత్వాలను (వేదాలను) రచించి, నిపుణుల ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చాడు.

యోగాసనాలను నేర్పించే అనేక పాఠశాలలు ఉన్నాయి, అయినప్పటికీ, పతంజలి పుణ్య పురుషులు రచించిన ప్రాథమిక సూత్రాల ద్వారా మాత్రమె యోగాసనాలను అనుసరిస్తున్నారు. బౌద్ధమతం, జైనమతం మరియు శైవమతాలతో పాటుగా యోగా కూడా ఒక సంప్రాదాయ పద్దతిగా వెలిసింది.

యోగా వలన కలిగే ప్రయోజనాలు

యోగా వలన ఆధ్యాత్మిక ప్రయోజనాలు మాత్రమె కాకుండా, కింద పేర్కొనబడిన వ్యాధులకు కూడా శక్తివంతంగా తగ్గించి వేస్తాయి.

అధిక రక్త పీడనం

వివిధ రకాల మందులను వాడటం కన్నా, యోగాసనాలను రోజు అనుసరించటం వలన ఒత్తిడితో పాటూ రక్త పీడనం కూడా తగ్గుతుందని చాలా రకాల పరిశోధనలలో నిరూపించబడింది. రక్త పీడనం ప్రారంభమయ్యే దశలలో, రోజు యోగాను అనుసరించటం వలన వాటి స్థాయిలు తగ్గించబడతాయి. యోగా అనుసరణ వలన శరీరంలో సిరలు విశ్రాంతి చెందించబడి, వాటికి బలం చేకుర్చి, రక్త పీడన స్థాయిలు తగ్గించబడతాయి. కావున రోజు యోగాను అనుసరించటం ప్రారంభించండి.


మధుమేహం

మధుమేహ వ్యాధి గ్రస్తులు యోగాసనాలను అనుసరించటం వలన మంచి ఫలితాలను పొందుతారు. రోజు ఉదయానే యోగాసనాలను చేయటం ద్వారా, శరీర రక్తంలో ఉండే గ్లూకోస్ (చక్కెర) స్థాయిలు తగ్గించబడతాయి. వీటితో పాటుగా ఆహార ప్రణాలికలను పాటించటం మంచిది.

గుండె ఆరోగ్యం

యోగాసనాలను రోజు అనుసరించటం వలన, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చని పరిశోధనలలో వెల్లడించబడింది. హృదయ స్పందనలు రక్త పీడనంతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. యోగా వలన హృదయ స్పందన రేటు, రక్త పీడనం, రక్తంలో చక్కెర స్థాయిలు ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడతాయి.

ఇతర ప్రయోజనాలు

యోగా వలన చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు, ముఖ్యంగా శక్తి  స్థాయిలు పెరగటం, జ్ఞాపక శక్తిలో మెరుగుదల, వయసు మీరిన కొలది జరిగే మార్పులు ఆలస్యంగా బహిర్గతం అవటం మరియు వెన్నునొప్పి సమస్యల నుండి ఉపశమనం, ఇస్నోమ్నియా, కీల్లనోప్పుల నుండి ఉపశమనం మరియు ఆస్తమా వంటి వ్యాధుల నుండి కూడా ఉపశమనం పొందుతారు. 

Monday, May 21, 2018

... పూజ-పరమార్థాలు ...

పూజ --> పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణఫలాన్నిచ్చేది.

అర్చన--> అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.

జపం--> అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం.

స్తోత్రం--> నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.

ధ్యానం--> ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది, ఇష్టదేవతను చింతింపచేసేది ధ్యానం.

దీక్ష--> దివ్యభావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.

అభిషేక:--> అహంభావాన్ని పోగొట్టేది, భయాన్ని మథించేది, పవిత్రోదకాన్నిచల్లేది, ఆనందాదులను కల్గించేది.

మంత్రం--> తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం.

ఆసనం--> ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.

తర్పణం--> పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.

గంధం--> అంతంలేని దౌర్భాగ్యాన్ని, క్లేశాన్ని నశింపుచేసేది ధర్మఙ్ఞానాలనిచ్చేది.

అక్షతలు--> కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి.

పుష్పం--> పుణ్యాన్నివృద్ధిచేసేది, పాపాన్ని పోగొట్టేది, పుష్కలార్ధాన్ని ఇచ్చేది.

ధూపం--> చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది, పరమానందాన్ని ప్రసాదించేది.

దీపం--> సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది, అహంకారం లేకుండా చేసేది, పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది.

నైవేద్యం--> ఆరు రుచులతో నున్న నాల్గు విధాల పదార్ధాలను,దేవతకు తృప్తినిచ్చేదానిని నివేదన చేయుటయే.

ప్రసాదం--> ప్రకాశానందాల నిచ్చేది, సామరస్యాన్ని కల్గించేది, పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం.

ఆచమనీయం--> లవంగ, జాజి, తక్కోలములతోకూడిన ద్రవ్యం ఆచమనీయం .

ఆవాహనం--> పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవాహనం.

స్వాగతం--> దేవతను కుశలప్రశ్నవేయుట.

పాద్యం--> చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.

మధుపర్కం--> తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది.

స్నానం--> గంధం, కస్తూరి, అగరు మొవాటితో స్నానం.

వందనం--> అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం ఉరస్స(వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం సాష్టాంగం).

ఉద్వాసన--> దేవతను, ఆవరణ దేవతలను పదహారు ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసనమని అంటారు.

గ్రహణం-దర్భలు

దర్భల మీద 1982-83 ప్రాంతంలొ భారతదేశంలొ సూర్య గ్రహణం రోజున పరిశొధన జరిగింది.గరిక గడ్డి జాతికి చెందినది.అది నిటారుగా పైకి నిలబడి,సూర్యరశ్మి ద్వారా మొత్తం సూర్యశక్తిని గ్రహించి తనలొ దాచి ఉంచుకుంటుంది.అతినీలలొహిత కిరణాలను,గ్రహణ సమయంలొ భూమికి వచ్చే హానికరమైన కిరణాలను తన శక్తితొ అడ్డుకుంటుందని ఆ పరిశొధన ఫలితాలను అన్ని ప్రధాన దిన పత్రికల్లొ ప్రచురించడం జరిగింది

సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో గరికను ఆహార పదార్థాల్లో, ధాన్యాల్లో వేసి వుంచడం మనం గమనిస్తుంటాం. అయితే గరికను గ్రహణం సమయంలో ధాన్యాలు, ఆహార పదార్థాలకు చెందిన పాత్రలపై ఎందుకు ఉంచుతారనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. గ్రహణం సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల్లాంటివి ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ఈ పని చేయకూడదని, ఆహార పదార్థాలు ముట్టకూడదని పెద్దలు అంటారు. దాదాపు అన్ని ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం విడిచాక ఆలయాలన్నీ... గృహాలన్నీ సంప్రోక్షణ చేయడానికి గల కారణాలు కూడా ఆ కిరణాల విషప్రభావాన్ని తొలగిస్తాయి.

ఈ క్రమంలో దర్భలను కూడా ఆహార పదార్థాలు, ధాన్యాల్లో ఉంచుతారు. గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలు కలిగివున్నది. అందుకే గ్రహణం సమయంలో  మన ఇంట్లోని అన్ని పాత్రలపై, నీటి ట్యాంకులపై వీటిని ఉంచడం వలన రేడియేషన్ ప్రభావాన్ని కొంచెం తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోతే మంచిది.

గ్రహణ సమయంలో జాగ్రత్తలు

వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకని గర్భిణీస్త్రీలపైఆ కిరణాలు
పడకుండా ఉంటే మంచిదని శాస్రాలలో చెప్పడం జరిగింది.దాని వల్ల గర్భస్థ శిశువుకు కురూపిగానో, అంగవైక్యలంతోనో పుటతీరిడంజరుగుతుంది. కాని సృష్టితీరులో ప్రతిచర్యకు ప్రతిచర్యకు ఉంటుంది.

ఏది జరిగినాదాని ప్రభావం ఏదో ఒకరూపంలో వెల్లడి అవుతుంది. ఆ కారణంగా సాధారణంగా మంత్ర సాధకులు నిత్యపూజాది కార్యక్రమాలు దేవాలయాలు మూసిశాంత్యోపచరాలు చేసుకోవలసినదని జపతపాదులు చేసుకొమ్మని, సముద్రపు ఆటు పోటులు జాగ్రత్తగా పరిశీలించుకొమ్మని చెప్పడం జరిగింది.

ముఖ్యంగాగర్భిణీ స్త్రీలు వీటి ప్రభావం ఎక్కువై శరీరములో అధిక వేదనలు పడతాయనిదానికోసమే గ్రహణములు చూడరాదని కాస్మోటిక్ రేడియేషన్ తగలకుండా ఉంటుందని శాస్త్రజ్ఞలు పరిశోధన ఫలితాలు తెలియచేస్తున్నాయి.

ఇంటిలో

గ్రహణం పడుతున్నదని తెలిసినప్పడు ముందుగా దర్భలు ఇంటిలో వేసితరువాత పచ్చళ్ళమీద, ఆహారపద్ధారాల మీద దర్భలను వేయవలయును. సాధారణంగా గ్రహణానికి రెండుగంటల ముందే భోజనము పూర్తి చేయవలెను. గ్రహణం పట్టు, తర్వాత స్నానము, విడుపుస్నానము చెయ్యవలెను.

ఆసమయంలో మంత్ర పునరశ్చరణ చేయుటవలన అధిక ఫలితముల నొసగుననిశాస్త వచనము. భూమి ఎన్నో మార్పులకు లోనౌతుంది. ఎప్పడైనా మార్పులువస్తే దానికి అనుగుణంగా మన శరీరంలోను మన జీవన విధానంలోనుమార్పులు చేసుకోవాలి. అప్పడే ఆరోగ్యం బాగుంటుంది .

సూర్య, చంద్రులు ఆరోగ్యకారకులు అన్నది ఆరోగ్య జ్యోతిషసూక్తిగా చెప్పకోవాలి. గ్రహణసమయాలలో మనం వాటి కనుగుణంగా మార్పులు చేసుకుని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి.

దర్భలతో శుద్ధి ఎలా జరుగును

గ్రహణ సమయంలో దర్భలను ఆహారపదార్థలపైనే వేయవలసిన అవసరం
ఉన్నది. దర్భలు గరిక జాతిలో సన్నటి ఆకులు. వాటి చివళ్ళ చాలా పదునుగా సూదంటు గా ఉంటాయి. దర్భలను పుష్యమి నక్షత్ర యుక్త ఆదివారం నాడుకొయ్యాలి.

ఆ విధంగా చేసినటైతే ఆ దర్భలు రేడియేషన్ను తొలగిస్తాయి. గ్రహణ సమయాలలో ఉత్పత్తిఅయ్యే ఫలితాన్ని అల్త్రావైలెట్ కిరణాల ప్రభావాన్నిఅవి నిరోధిస్తాయి. ఆ కారణంగా నీటిలో గాని పచ్చళ్ళపైగాని వేసినటైతేఅవి బూజు పటతీరికుండా ఉంటాయని ఎన్విరాన్మెంట్ బయాలజీ విభాగంవారు పరిశోధించి తెలిపిన విషయం.

అందువల్ల దర్భలను పచ్చళ్ళవీుదనీళ్ళలో దర్భలను వేస్తారు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే ఆహారంజీర్ణం కాదు. వాతావరణ మార్పులే దీనికి కారణం.

ఇకపోతే.. మన దేశంలో సూర్య చంద్ర గ్రహణాలపై పలు భయాలున్నాయి. ఈ గ్రహణాల వల్ల గర్భస్థ శిశువులకు హాని జరుగుతుందని భావిస్తారు. గ్రహణం రోజున బయట తిరిగితే అరిష్టమని స్త్రీలు ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే కడుపుతో ఉన్నవారిని ఇంట్లోనే ఉంచుతారు. గ్రహణం ఉన్నంతసేపు వీరిని బయటికి రానివ్వరు. నిద్రపోనివ్వరు. ఇంట్లోనే మెల్లిగా నడవమని చెబుతుంటారు.

గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితమవ్వడం మంచిదని, అంతేగాక తమ నివాస గృహాలలో ఆ సమయంలో సూర్యుడి ఛాయలు పడకుండా జాగ్రత్తపడాలని వారంటున్నారు. గ్రహణ సమయంలో ప్రసరించే అతినీలలోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పండితులు హెచ్చరించారు. గ్రహణం ఏర్పడటానికి మూడు గంటల ముందు, ఏర్పడిన అనంతరం మరో మూడు గంటల వరకు పసి పిల్లలు, వృద్ధులు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని, యుక్తవయస్కులు మాత్రం గ్రహణ సమయానికి 12 గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలని వారు స్పష్టం చేశారు.

అలాగే, గ్రహణం రోజున ముందుగా వండిన పదార్థాలను కూడా పారవేస్తారు. అన్ని దేవాలయాలనూ మూసివేస్తారు. దోష న

ివారణకు ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రహణాల సమయంలో ముస్లింలు కూడా సలాతుల్-కుసుఫ్ అనే ప్రత్యేక ప్రార్థన చేస్తారు.
   
గ్రహణం పట్టే ముందుగా స్నానం చేసి జపం చేసుకుని గ్రహణానంతరం మరలా స్నానం చేసి మీ ఇంటి లోనున్న పూజా గృహాన్ని శుద్ధి చేసుకుని పటాలు లేక విగ్రహాలను కూడా ఆవుపాలు శుద్ధ జలంతో శుద్ధిపరచుకుని వారికి ఉపచారాదులు  చేసుకోవాలి. తదనంతరం మాత్రమే ఏదైనా స్వీకరించాలి.

ఈ ‘వృద్ధ’కాశీలో చనిపోతే స్వయంగా అమ్మవారే తన ఒడిలోకి తీసుకొని...

ఈ క్షేత్రంలో వ్యక్తుల చివరి ఘడియల్లో వారి తలను వృద్ధాంబిక అమ్మవారు తన ఒడిలో ఉంచుకొని చీర కొంగుతో విసురుతుండగా, వారి చెవిలో పరమేశ్వరుడు స్వయంగా మంత్రాన్ని ఉపదేశిస్తాడని చెబుతారు. అందువల్లే ఇక్కడ చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఇది కాశీ కన్నా పురాతన క్షేత్రమని నమ్ముతారు. ప్రళయ కాలంలో కూడా విరుదాలచం చెక్కుచెదరకుండా నిలిచిందని పురాణ కథనం. అందుకే దీనిని వృద్ధకాశీ అని కూడా అంటారు.

అంతే కాకుండా ఈ క్షేత్రం కాశీ కంటే పురాతనమైనది, పవిత్రమైనది కాబట్టి ఇక్కడ స్వామి వారిని సేవిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికన్నా ఎక్కువ పుణ్యం వస్తుందని చెబుతారు. చెన్నై నుంచి 230 కిలోమీటర్ల దూరంలో కడలూర్ జిల్లా ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

 2. ప్రళయ కాలంలో కూడా

ప్రళయ కాలంలో కూడా విరుదాలచం చెక్కుచెదరకుండా నిలిచిందని పురాణ కథనం. అంతే కాకుండా ఈ క్షేత్రం కాశీ కంటే పురాతనమైనది, పవిత్రమైనది కాబట్టి ఇక్కడ స్వామి వారిని సేవిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికన్నా ఎక్కువ పుణ్యం వస్తుందని చెబుతారు

 
3. అనంద తాండవం

చిదంబరంలో పరమశివుడు కాళీ మాతతో పోటీ పడి నత్యం చేస్తే ఇక్కడ ఆనంద తాండవం చేశాడని చెబుతారు. అందువల్ల ఈ క్షేత్రంలో పుట్టినా, గిట్టినా, నివసించినా భగవంతుడిని ప్రార్థించినా మోక్షం లభిస్తుందని చెబుతారు.

 
4. అందుకే పఝుమలై

శివుడు మొదట ఇక్కడ కొండరూపంలో వెలిశాడని చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రాన్ని మొదట పఝుమలై అని పిలచేవారు. అటు పై వరదాచలంగా ఖ్యాతి పొందింది.

 
5. స్వామివారిని సేవిస్తే

పూర్వం ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యం అష్టకష్టాలు పడేవారు. దీంతో స్థానికంగా ఉండే విభాసిత మహర్షి స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చెప్పాడు.

 
6. ఆ అనుమానం మొదలయ్యింది

దీంతో ఆ ఊరిపెద్దలంతా కలిసి స్వామి వారికి దేవాలయం నిర్మించాలని తీర్మానించారు. అయితే ఆ సమయంలో వారి జీవనం ఎలా అన్న అనుమానం మొదలయ్యింది.

 
7. స్వామివారి పై నమ్మకంతో

దీనికి విభాసిత మహర్షి స్వామి వారి పై నమ్మకంతో పనిచేయండి చేసుకొన్నవారికి చేసుకొన్నంతంగా లాభం చేకూరుతుందని చెప్పారు. దీంతో ప్రజలు అయిష్టంగానే ఆ పనికి పూనుకొన్నారు.

 
8. చెట్టు ఆకులు

ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేసిన వారికి విభాసిత మహర్షి స్థానికంగా ఉంటున్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకొని పనిచేసిన వారికి ఇచ్చేవాడు.

   9. ఆకులు నాణ్యాలుగా

ఎవరు ఎంత పరిచేసారో అంతకు సమానంగా ఆ ఆకులు నాణ్యాలుగా మారేవి. అప్పటి నుంచే చేసిన వారికి చేసినంత, చేసుకున్నవారికి చేసుకొన్నంత అనే నానుడి మొదలయ్యిందని చెబుతారు.

 
10.12వేల బంగారు నాణ్యాలు

ఒకసారి ఈ క్షేత్రం గుండా సుందరార్ అనే గాయకుడైన శివభక్తుడు ఈ దారి గుండా వెలుతూ ఇక్కడి స్వామివారిని స్తుతించాడు. దీంతో స్వామి వారు స్వయంగా 12 వేల బంగారు నాణ్యాలను అందజేస్తాడు.

 
11. దొంగల భయం

తాను తిరువారూర్ వెళ్లాల్సి ఉందని అయితే తోవలో దొంగల భయం ఉందని సుందరార్ భయపడుతాడు. ఇదే విషయాన్ని శివుడికి చెబుతాడు. దీంతో శివుడు తాను ఈ నాణ్యాలను ఇక్కడే ఉన్న మణిముత్తా నదిలో వేస్తానని నీవు తిరువారూర్ వెళ్లిన తర్వాత అక్కడి కొలనులో తీసుకోవచ్చని చెబుతాడు.

 
12.నాణ్యతను పరీక్షించిన వినాయకుడు

ఇందుకు అంగీకరించిన సుందరార్ తిరువారూర్ వెళ్లి అక్కడ కొలనులో నుంచి 12వేల బంగారు నాణ్యాలను తీసుకొన్నాడని కథనం. అదే విధంగా ఆ నాణ్యాల నాణ్యతను సాక్షాత్తు వినాయకుడు పరీక్షించి అటు పై ఆ భక్తాగ్రేసరుడికి ఇచ్చారని చెబుతారు.

 
13.ఇక్కడ కూడా భూ గర్భం నుంచి కిందికి

ఇక్కడ వినాయకుడు భూ గర్భంలో నుంచి కొంత కిందికి ఉంటాడు. అందువల్ల 18 మెట్లు దిగి ఇక్కడి వినాయకుడిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని వద్ధాంబిక అనే పేరుతో పిలుస్తారు.

 
14. ఈ విరదాచలాన్ని వృద్ధకాశీ అని కూడా

ఈ విరదాచలాన్ని వృద్ధకాశీ అని కూడా అంటారు. ఇక్కడ వ్యక్తుల చివరి ఘడియల్లో వారి తలను వృద్ధాంబిక అమ్మవారు తన ఒడిలో ఉంచుకొని చీర కొంగుతో విసురుతుండగా, వారి చెవిలో పరమేశ్వరుడు స్వయంగా మంత్రాన్ని ఉపదేశిస్తాడని చెబుతారు. అందువల్లే ఇక్కడ చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

 
15. ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ

అరుణాచలం అంటే తిరువణ్ణామలైలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికీ ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తాడు. దీని వల్ల వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సాయంత్రం తిరిగి 3.30 గంటల నుంచి 9 గంటల వరకూ తెరిచి ఉంచుతారు.

రావణాసురుడు

• కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని) చేసినవాడు అని అర్ధము .
• రావణుడు రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. పది రకాలుగా ఆలోచించేవాడనే దానికి, పది విద్యలలో ప్రవీణుడు అన్నదానికి ప్రతీకగా, కళారూపాలలో రావణుని పదితలలతో చిత్రిస్తారు.

 పదితలలు ఉండటం చేత ఈయనకు దశముఖుడు (పది ముఖములు కలవాడు), దశగ్రీవుడు (పది శీర్షములు కలవాడు), దశ కంథరుడు, దశకంఠుడు (పది గొంతులు కలవాడు) అన్న పేర్లు వచ్చాయి.

• బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్రవసునికి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు.

• కైకసికి తండ్రి సుమాలి.
• రావణుని భార్య ' మండోదరి ' .

రావణాసురుడి కి ఆరుగురు సోదరులు ,ఇద్దరు సోదరీమణులు, ఏడుగురు కొడుకులు .

• సోదరులు = 1. కుబేరుడు 2. కుంభకర్ణుడు 3. విభీషణుడు 4. ఖరుడు 5. దూషణుడు 6. అహిరావణుడు ,

• సోదరీమణులు = 1. శూర్పణఖ(చంద్రనఖు)2.కుంభిని .

• కుమారులు = 1. ఇంద్రజిత్తు , 2. ప్రహస్థుడు,3. అతికాయుడు, 4. అక్షయకుమారుడు,5. దేవాంతకుడు,6. నరాంతకుడు, 7. త్రిశిరుడు.

యక్ష ప్రశ్నలు – జవాబులు

మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నల్గురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదౄష్యవాణి పలికినది ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆదీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ఆ ప్రశ్నలు ఇవే!!! ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మౄత్యు భయమువలన)

12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ణ్జం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కూమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)

39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)

40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)

41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి, ఆకాశములందు)

43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ణ్జానం)

44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)

45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)

46. తపస్సు అంటే ఏమిటి? ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)

47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)

48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)

49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)

50. జ్ణ్జానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)

51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)

52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)

53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)

54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం కలిగి ఉండటం)

55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)

56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)

57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)

58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)

59. మూర్ఖుడెవడు

? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)

60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)

61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం)

62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)

63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)

64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు)

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు)

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)

69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు)

70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)

71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)

72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు)
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

Gayatri Mantra n few other facts

Gayatri Mantra
“Om Bhur Bhuvah Swaha Tat Savitur Varenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yonah Prachodayat”.

The Gayatri Mantra is one of the best known in the Sanskrit tradition and has layers of Depth and Meaning. It is a mantra of healing on physical, mental, and spiritual planes, aids in releasing negative karma and sin. It is a chant of forgiveness, and transcendence. It encourages Spiritual Awakening and Enlightenment. See and be the light.


Mantra for happiness......
" Om maha-hara-saaya namaha".
 Lord Shiva is said to be a creator of every emotions that human being experience in their life. This mantra will bypass negative emotions and create a sense of happiness to the devotee. This mantra contains the word 'maha' and 'harasa' which means greatly and happy. Through this mantra we pray to Lord Shiva to bless us with immense happiness which is very nature of Lord Shiva .


Chidambaram Rahasyam
Chidambara Rahasyam is a Hindu belief that there is a secret message conveyed through the embossed figure near the shrine of Shiva in the Chidambaram Temple. However, some believe that Chidamabara Rahasyam is when during Puja, the priest just draws open the curtain (Maya) for a split second to let devotees "see" the Linga, with the inherent lesson that God is everywhere and not just in a specified place in a temple.

The secret of Chidambaram temple
Thillai Natarajah Temple is a Hindu temple dedicated to Lord Shiva located in the town of Chidambaram, East-Central Tamil Nadu, South India. It is one of the "Five Elements" temples; particularly it is the temple of the Akasha Linga (or the Sky element) - the other four being Fire, Earth, Air and Water. Being an Akasa Linga, the main deity in the sanctum is invisible or rather, not present! There is simply a curtain behind which an empty space exists where the Lord is supposed to dwell.

Emperor Vikramaditya of Ujjain Actual Dates from Astrology & Puranas

Emperor Vikramaditya of Ujjain Actual Dates from Astrology & Puranas


Emperor Vikramaditya of Ujjain (city originally named as Ambavati) lived during 101 BCE – 19 CE based Jyotirvidabharana of Kalisada, Jyotishaphala Ratnamala of Krishna Misra, history of Nepal, Kashmir, Stapatha Brahmana, Bhavishya Purana.
This king is considered legend, while he is actually part of history and even referred in Puranas.
Few vedic astrology books written during his time prove his existence in 1st century BCE.
Vikrama Saka (era) followed in vedic panchangs since 57 BCE as Vikram Samvat.
Famous poet Kalidasa, Astrologer Varaha Mihira were among the 9 gems in his court.
Kalhana‘s Rajatarangini (river of Kings), Vikramditya’s contemporary Krishna Misra’s astrology book Jyotishaphala-Ratnamala, few mentions in Bhavishya Purana, recorded history of Nepal prove his existence with correct dates and years.
“purne thrimsachchate varsheKalau prapte bhayamkareSakanamcha Vinasardham AryaDharma vivruddhaye Jatassivajnaya sopi kailasatGuhyakalayat.”

– Bhavishya Maha Purana (3-1-7-14,15 verses)

“Vikramaditya namanam pita Krutwa mumodahaSa balopi mahaprajanah pithruMathru priyamkarah”(3-1-7-16)
“pancha Varshe vayah prapte Tapasordhe vanam gatahDwadasabdam prayathnenaVikramena krutam tapah” (Bhavishya 3-1-7-17)
“Paschadambavatim divyamPurim yatah sriyanvitahDivyam simhasanam ramyamDwathrimsan murthi samyutam” (Bhavishya 3-1-7-18)

Translation : At the completion of 3000 years after the advent of the terrible Kaliyuga, (ie.101 BCE.) a person descended from the abode of Guhyakas in Kailasa, at the command of Lord Siva, for the purpose of destroying the Sakas and uplifting Arya-Dharma. He was born to the Great King Gandharvasena. The father named him ‘Vikramaditya’ and felt very much rejoiced.

Though aboy he was very wise and pleased his parents.
Courtesy : Sahasra Sai
When he was 5 years old, Vikrama went to the forest and did penance for 12 years. Having enriched his greatness by penance he reached the city Ambavati (Ujjain) and was anointed as a king on a golden throne decorated with 32 golden dolls.

Borders of Vikramaditya’s Empire
paschime sindhu nadyante, setu bandhhehi dakshine
uttare badari sthane, poorvencha kapilantike

Translation : This verse from Bhavishya Purana states that, in the west the other bank of the Sindhu River; in the South the Setu; Badarinarayana in the Himalayas formed the North limit and the city of Kapilavastu, the boundary in the East. These were the limits of Vikramaditya’s Empire. Courtesy : Sahasra Sai


There are other instances which prove that he travelled beyond these borderd later to conquer other kingdoms.

Paramara Kings
Among the Paramara kings, the first one reigned between

Name of King Years
Paramar 2710 – 2716 Kali Yuga (392 – 386 BCE)
Mahamara 386 – 383 BCE
Devapi 383 – 380 BCE
Devdatta 380 – 377 BCE
Sakas defeated next kings, who left Ujjain and fled to Srisailam 377 – 182 BCE
Gandharvasena (1st time) 182 – 132 BCE
Sankharaja (son of Gandharvasena) went to forest for meditation and died without a child 132 – 102 BCE
Gandharvasena (2nd time) returned from exile and took over the throne again 102 – 82 BCE
Vikramaditya (2nd son of Gandharvasena born in 101 BCE i.e. 3001 kali yuga) 82 BCE – 19 CE
Devabhakta 19 – 29 CE
[Names of Kings not mentioned in Puranas] 29 – 78 CE
Salivahana dynasty rule From 78 CE
Salivahana established his own Saka in 78 CE, which is followed even today in most parts of India and years in panchang (vedic almanac) known as Saka Samvat or Shaka Samvat.

Paramara dynasty continued to rule Ujjain, which ended in 1305 CE, whose last king was Mahakaladeva.

One sloka in bhavishya purana mentions that Devabhakta knew that his killer was born and traced him to be in Pratishtana (modern day Paithan in maharashtra).
Courtesy : Sahasra Sai
In a war, Devabhakta, after ruling for ten years, was killed in a battle by the cruel Sakas. (Kali 3130 or 29 CE).

Vikramaditya conquered Middle-East

Victories of Babylon, Persia, Turks led Vikramaditya to the Arabia. When he conquered Arabia, he did so to cheers from the Jewish and Arab Community, who welcomed him as a liberator. He showed great forbearance and respect towards the religious beliefs and cultural traditions of other races. These qualities earned him the respect and homage of all the people over whom he ruled.

The victory over Arabia expressed all the facets of the policy of conciliation which Vikramaditya had followed until then. He presented himself not as a conqueror, but a liberator and the legitimate successor to the crown. He took the title of “King of Aryavrata and Liberator of the Arabs, Turks and Jews”.
Courtesy : Sahasra Sai

Vikramditya had no thought of forcing conquered people into a single mould, and had the wisdom to leave unchanged the institution of each kingdom he attached to the Aryavrata Crown. Vikramaditya was upright, a great leader of men, generous and benevolent. He spread the Vedic Culture in the land of Arabia. He also reconstructed the temple of Brahma and Mahesh and placed a Jiyotarlinga there. Several other Vedic Temples were made in Babylon, Persia and Turkistan. For the first time they got a King that cared for the inhabitants of his Empire. Arabs, Kurds and Persians saw him as ‘the annointed of the Lord’.

After the 4 year of Wars that saw whole west Asia under the belt of Vikramaditya Empire he stayed for a year in Arabia till the Mahadev Temple was not completely reconstructed.

He built admirable highways and developed an excellent postal system both of which allowed him to receive rapidly information from his provinces. He accepted Perisans as Aryans and called them as long-lost cousins. During the Vikramaditya’s regions persians felt like they felt under the region of Cyrus. He also bulit several monuments in the respect of Chandargupta Maurya and Cyrus. Another project undertaken by Vikramaditya was the royal road, the world’s longest, extending 1,700 miles. Due to an extensive network of relays, postmen could travel the road in six to nine days, whereas normal travel time was three months. The motto of the Vedic postal service became memorable: stopped by neither snow, rain, heat or gloom of night.

The US postal service also adopted this motto and the famous Pony Express mail delivery resembled the original Vedic design. Vikramaditya laid the foundation of Vardhan Dynasty. His empire controlled many parts of Modern day China, Entire Middle East and Many Parts of South East Asia. After his death his descendents and Parthians controlled Iran.

By 102 CE descendants of Vikramaditya lost control over Iran and Parthians established their empire in Iran and Babylon.
Courtesy : Sahasra Sai

Vikramaditya mentioned in Ancient Vedic Astrology Books

Jyotirvidabharana is an astrological work by Kalidasa.

Here, he mentions that he was writing it to enhance the fame of Vikramaditya of the Paramara dynasty (Panwar dynasty), his patron king. [Jyotirvidabharana. Sloka No. 4—89]

Kalidasa also defines the word Saka.

He says that whoever kills large number of Sakas, will become Saka-Karaka.

This book Jyotirvidabharana, says Kalidasa, he began to write in the month Vaisakha (around May) of 3068 Kali Era (or 33 BCE) and was completed in the month Kartika (around november) of the same year.

In the beginning of the 22nd chapter Kalidasa described, to some extent, the Emperor Vikramaditya and in the 6th sloka he says that this book of 22 chapters and 1474 slokas is written with the purpose of invoking good to Vikramaditya, the Emperor of Bharat.
Courtesy : Sahasra Sai

In the 7th sloka of Chapter 22 Kalidasa gives some particulars of Vikrama’s empire, which are as follows:-

1. It extended over the whole of Bharata-Varsha of 180 Big Jyotisar yojanas (approximately 1800 miles)in length and breadth. ( 1 Big yojana [not to be confused with Yojana in Ramayana etc] in those days is close to 10 miles )
2. The Bharata-Varsha shines forth with the culture of the Vedas and Dharma Sastras. This book is dedicated for the good of Vikramaditya, the emporer of Malwa, by me (Kalidasa).

In the 8th and 9th slokas of Chapter 22 Kalidasa gives a list of poets and pundits adorning the court of Vikrama.

1. Sanku, 2. Vararuchi, 3. Mani, 4. Angudatta, 5. Jishnu, 6. Trilochana, 7. Hari (Hariswamy, the commentator of Sukla Yajurveda and the head of the departments of Dana and Dharma (Daanaadhyakshaa and Dharmaadhyakshaa), 8. Ghata karpara, 9. Amarasimha, 10. Satyacharya, 11.Varahamihira, 12. Srutasena, 13. Badarayana, 14. Manittha, 15. Kumara Simha and astrologers like 16. Myself (Kalidasa), and others. (Slokas 22-8,9)
Courtesy : Sahasra Sai


9 Gems in court of Vikramaditya Kalidasa mentions the nine Gems of scholars adorning the court of Vikramaditya :

1. Dhanvantari
2. Kshapanaka
3. Amarasimha
4. Sanku
5. Vetalabhatta
6. Ghatakarpara
7. Kalidasa
8. Varahamihira
9. Vararuchi

In 22-11 Kalidasa gives a further account of the court of  Vikrama.

There were 800 Vassal kings, one crore of good soldiers, 16 great scholars, 16 astrologers, 16 efficient doctors, 16 bhattas and 16 scholars of Vedik lore; Vikrama sitting on his throne was illuminated by these scholarly courtiers.
Courtesy : Sahasra Sai
In 22-12 the following particulars are given about the army of Vikramaditya :-

His army continuously spread over 18 yojanas (small jyotisha yojanas, 1 small jyotisha yojana is around 5 miles) and consisted of the following: —
Courtesy : Sahasra Sai

1. There were 3 crores of soldiers.
2. Ten crores of various vehicles.
3. 24,300 elephants.
4. 4,00,000 (four lakhs) of ships,

This was the army that accompanied him in his expeditions. In this respect there was no emperor to be compared to Vikrama in those days, says Kalidasa.

Sloka 13 of the 22nd chapter says that Vikrama annihilated innumerable Sakas (who were Mlechcha Kshatriyas) and established the Era. Every day he made gifts of pearls, jems, gold, cow, horse, elepahnts to the four castes. Hence he was called “Suvarnaanana“.

Sloka 16 of chapter 22 says that Ujjyini, the capital of Vikrama gives salvation to the inhabitants on account of the persence of Lord “Siva” in the name of ‘Mahakala‘.
Courtesy : Sahasra Sai

Sri Krishna Misra, lived in the court of Vikramaditya wrote in his book, Jyotishaphala-Ratnamala, a book on astrology, that:

Let that Vikramarka, the Emperor, famous like the Manus, who protected me and my relations for seventy years, having endowed upon me one crore of gold coins flourish for ever with success and prosperity. [sloka 10 of Jyotishaphala Ratnamala]

Sri Krishna Misra was in court of Vikramaditya for 70 years from 57 BCE, which means that the emperor lived atleast till 13 CE.

Having consolidated his empire, Vikramarka went to Nepal; he made the king, Amsuvarma a feudatory, and as a symbol of his over-lordship founded his Saka in Nepal in 57 BCE.

Another book Satapatha Brahmana, also mentions of Vikramaditya.

A resident of Ujjain, who belongs to Parasara Gotra, the son of Naga Swamy, holding the offices of ‘Dharmadhyaksha’, (Justice of Vaidika Dharma) and “Danadhyakska” (Distributor of gifts) adorning the title of “Sarvavidyanidhana Kavindracharya Saraswati” (Treasure of all sciences and Learning, Professor of Poets or poet Laureate, the goddess of the Muses) in the court of Vikramaditya, the king of Avanti, by name “Hari Swamy“, has written commentary or Bhashya to Satapatha Brahmana.
Courtesy : Sahasra Sai

Vikramaditya in History of Kashmir

When 82nd king in the list of the Kashmir monarchs, Hiranya died without leaving any heir to the throne, the cabinet of the ministers, in Kashmir sent a prayer to their over-lord, Emperor Vikramaditya and requested him to depute a ruler. Then, out of his favour towards Matrigupta, a Scholar-poet of the court, Vikramaditya installed MatriGupta with the sovereignty of his vassal state, Kashmir in 14 CE. [Rajatarangini 3-125]
Courtesy : Sahasra Sai

Vikramaditya in History of Nepal

In the year 3044 Kali or 57 BCE, Vikramaditya visited his vassal state Nepal and established his Era there (Vikrama Saka). This information is published in the Indian Antiquary Vol. XIII. Pages 411 onwards.
Courtesy : Sahasra Sai

Several works by Jain authors include legends about Vikramaditya. These include:

Prabhachandra’s Prabhavaka-Charita (1127 CE)
Somaprabha’s Kumara-Pala-Pratibodha (1184 CE)
Kalakacharya-Katha (before 1279 CE)
Merutunga’s Prabandha-Chintamani (1304 CE)
Jinaprabhasuri’s Vividha-Tirtha-Kalpa (1315 CE)
Rajashekhara’s Prabandha-Kosha (1348 CE)
Devamurti’s Vikrama-Charitra (1418 CE)
Ramachandrasuri’s Pancha-Danda-Chhattra-Prabandha (1433 CE)
Subhashila’s Vikrama-Charitra (1442 CE)
various pattavalis (records of lineage of head monks)

Ayodhya re-discovered by Emperor Vikramaditya

A local legend in Ayodhya states that the city was re-discovered by Vikramaditya, after having been lost for centuries. Vikramaditya started searching for Ayodhya, and met Prayaga, the king of tirthas (Prayaga personified). Guided by Prayaga, Vikramaditya marked the place, but subsequently forgot its location. A yogi told him that he should let loose a cow and a calf: Ayodhya would be at the place where milk starts flowing from the cow’s udders. Using this advice, Vikramaditya managed to re-identify the site of ancient Ayodhya.

Courtesy : Sahasra Sai

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...