Thursday, March 31, 2022

తెలుగు సంవత్సరాలు 60 - పేర్లు ఎలా వచ్చాయ

 శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భముగా


తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు కానీ వాటికి ఆ

పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం కొందరికే తెలుసు.


 అయితే వాటి

వెనుక ఓ కథ ఉంది. నారదమహాముని ఓసారి విష్ణు మాయలో చిక్కుకుని పెళ్లి చేసుకొని   60 మంది

ఆడపిల్లలకు తండ్రి అవుతాడు.  తరువాత కటిక దరిద్రము చేత 

ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ

బిడ్డలు  60 మంది ఇక మీదట 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా

ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.


తెలుగు సంవత్సరాలు, ఆయనములు, ఋతువులు, మాసములు, తిధులు నిర్ణయించబడ్డాయి.


మన తెలుగు సంవత్సరాల పేర్లు :

1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5.

ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ,

10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14.

విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18.

తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి,

23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ,

28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి,

32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36.

శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40.

పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ,

45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49.

రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి,

54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి,

58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.


సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అది

ఆయనమవుతుంది...


.ఆయనములు 2:

అవి...ఉత్తరాయణము :

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటకరాశిలో

ప్రవేశించువరకు గల కాలము 6నెలలు. అవి చైత్రం, వైశాఖం,

జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంతబాగము, పుష్యం, మాఘ,

ఫాల్గుణ మాసములలో ఉండును.


దక్షిణాయణం :

కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకరరాశిలో

ప్రవేశించు వరకు గల కాలము 6నెలలు. అవి ఆషాడ, శ్రావణ,

భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత

భాగము.


సంవత్సరాన్ని ఆరు భాగాలుగా విభజిస్తే అది ఋతువు

అవుతుంది.  ఋతువులు ఆరు...

వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిరఋతువు.


సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే అది మాసం

అవుతుంది...అందుకే

మాసములు 12 :

చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం శ్రావణ, భాద్రపదం,

ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం,

ఫాల్గుణం


 (2మాసములు ఒక ఋతువు)


పక్షములు 2 :

ప్రతి మాసమును కూడా రెండు పక్షాలుగా విభజించారు.. 


అవి

శుక్ల పక్షం

పౌర్ణమి పదిహేను రోజులకు గుర్తు...

పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం


కృష్ణపక్షం(కృష్ణ అంటే నలుపు అని అర్థం)ఇది పాడ్యమి నుండి

అమావాస్య పదిహేను రోజులకు గుర్తు.


ఒక్కో పక్షపు పదిహేను రోజులకు పదిహేను తిథులు

ఉంటాయి.. 


అవి

పాడ్యమి, విదియ తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి,

అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి,

పౌర్ణమి, అమావాస్య.


ఇక ఒక పక్షానికి రెండు వారములు.. ఒక వారమునకు ఏడు

రోజులు...


ఒక రోజుకు ఎనిమిది ఝాములు... ఒక ఝాముకు మూడు

గంటలు.. ఒక గంటకు అరవై నిమిషములు.. ఇలా ప్రతి

నిమిషమునకు వచ్చే నక్షత్రం తో సహా మన పంచాంగం చాలా

నిర్దిష్టంగా నిఖ్ఖచ్చితంగా ఉంటుంది.. 


ఎంత ఖచ్చితత్వమంటే

భారత యుద్ధం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని

కూడానమోదు చేయగలిగినంత...


 అందుకే మన హిందూ

సాంప్రదాయాలు గొప్పవయ్యాయి..


ఇప్పుడు మనం పాటించే అర్థం పర్థం లేని జనవరి ఒకటి

క్రొత్త సంవత్సరం కాదు. 


మనకు అసలైన నూతన

సంవత్సరం.. ఉగాదే..


 ఇప్పటినుండే వాతావరణంలో మార్పు

మొదలవుతుంది...


కొత్త పంచాగం మొదలవుతుంది..


అంటే సృష్టి

మొదలవుతుంది..


 అందుకే ఇది యుగ ఆది అయింది.. అదే

ఉగాది అయింది..


 ఇంకా వివరంగా చెప్పాలంటే శిశిర ఋతువులో రాలి

పోయిన ఆకుల స్థానంలో క్రొత్త చిగుళ్ళు ప్రారంభమయి.. 


అంటే క్రొత్త సృష్టి ప్రారంభమవుతుంది... అందుకే ఇది ప్రతి ఒక్కరిలో

నూతనత్వానికి నాంది పలకే నిత్య నూతన ఆశలతో క్రొత్త

సంవత్సరం ప్రారంభమవ్వాలని.. అందరికీ నూతనసంవత్సర

శుభాకాంక్షలు.!!


వారములు 7 : ఇలా కూడా పిలుస్తారు.

ఆదివారం - భానువాసరే

సోమవారం - ఇందువాసరే

మంగళవారం - భౌమ్యవాసరే

బుధవారం - సౌమ్యవాసరే

గురువారం - గురువాసరే

శుక్రవారం - భృగువాసరే

శనివారం - స్థిరవాసరే / మందవాసర


మన సాంప్రదాయం చాలా గోప్పవి

మనం వజ్రాన్ని వదలి పాశ్చాత్య రంగురాళ్ళకై ప్రాకులాడుతున్నాము.


ఇప్పటికైనా  మనము మన సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలను కాపాడుకుందాం.

మీ

వాసు

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం

జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం |

సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ||


జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే |

భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧ ||


జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ |

దిగంబరదయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తుతే || ౨ ||


కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ |

వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౩ ||


హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత |

పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౪ ||


యజ్ఞభోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ |

యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౫ ||


ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే దేవః సదాశివః |

మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౬ ||


భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |

జితేంద్రియజితజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౭ ||


దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ |

సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౮ ||


జంబుద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే |

జయమానసతాం దేవ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౯ ||


భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే |

నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౦ ||


బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |

ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౧ ||


అవధూతసదానందపరబ్రహ్మస్వరూపిణే |

విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౨ ||


సత్యరూపసదాచారసత్యధర్మపరాయణ |

సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౩ ||


శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర |

యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౪ ||


క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ |

దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౫ ||


దత్త విద్యాఢ్యలక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే |

గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౬ ||


శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ |

సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౭ ||


ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ |

దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ || ౧౮ ||

Wednesday, March 23, 2022

Are Shivlinga Radioactive?

Yes it is 100 % true!!


Pick up India's Radio Activity Map, you will be surprised! Apart from the nuclear reactor of the government of India, the highest radiation is found in the places of all Jyotirlingas.


▪️ Shivling is nothing but nuclear reactors, that's why they are offered water so that they may remain calm.


▪️ All the favorite substances of Mahadev such as Bilv Patra, Aakamad, Dhatura, Gudhal etc. are all nuclear energy soaking.


▪️ Because the water on Shivlinga also becomes reactive, that is why the drainage tube is not crossed.


▪️ The design of Bhabha Atomic Reactor is also like Shivling. [1]


▪️ Water offered on Shivling takes the form of medicine together with the flowing water of the river.


▪️ That's why our ancestors used to say to us that if Mahadev Shivshankar gets angry, then the holocaust will come.


▪️ Notice how deep science is hidden behind our traditions.


▪️ The culture of which we have been born, is eternal. Science has been dressed as the core of traditions so that it becomes a trend and we Indians should always live a scientific life.


▪️ You will be surprised to know that there are such important Shiva temples in India which are built in the same straight line from Kedarnath to Rameshwaram. Wonder what kind of science and technology our ancestors had that we didn't even understand till today? Kedarnath of Uttarakhand, Kaleshwaram of Telangana, Kalhasti of Andhra Pradesh, Ekambareshwar of Tamil Nadu, Chidambaram and finally Rameshwaram temples are built in a geographical straight line of 79°E 41'54 ′′ Longitude.


▪️ All these temples represent gender expression in the 5 elements of nature, which we call Panchabhut in common language. Panchbhut means earth, water, fire, air and space. Based on these five elements, these five Shivlingas have been installed.


Water is represented in Thiruvanaikwal temple,

The fire is represented in Thiruvannamalai,

The wind is represented in Kalahasti,

Earth is represented in Kanchipuram and at the end

Space or sky is represented in Chidambaram temple!


These five temples depict the amazing gathering of Vastu-Science-Vedas.


▪️ Geographically also featured in these temples. These five temples were built according to Yoga Science, and are placed in a certain geographical alignment with each other. There must be some science behind this that will affect the human body.


▪️ These temples were built about five thousand years ago when there was no satellite technology available to measure the latitude and longitude of those places. Then how so accurately five temples were installed? Only God knows the answer.


▪️ The distance between Kedarnath and Rameshwaram is 2383 km. But all these temples are almost in the same parallel line. After all, thousands of years ago, using which technique these temples were built in parallel line, this is still a mystery.


The twinkling lamp at Srikalhasti temple shows that it is air ......

The water spring in the interior plateau of the Thiruvanikka temple shows that it is a water .......

Huge lamp on Annamalai hill shows that he is a fire .....

Kanchipuram's sand self - ..... shows that it is earth gender and

From the formless state of Chidambaram, the formlessness of God means the sky element is known.


▪️ Now it's not surprising that the five genders representing the five elements of the universe have been installed centuries ago in the same line. We should be proud of the knowledge and intelligence of our ancestors that they had science and technology that even modern science couldn't distinguish. It is believed that not only these five temples but there will be many temples in this line which fall in a straight line from Kedarnath to Rameshwaram. This line is also known as ′′ Shiva Shakti Aksha Rekha Perhaps all these temples have been constructed keeping Kailash in mind, which falls in 81.3119° E!? Only Lord Shiva knows.


It is amazing. See the relationship between Shiva Jyotirlingas with ′′ Mahakal ′′


The distance between the remaining Jyotirlingas from Ujjain is also interesting -


▪️ Ujjain to Somnath-777 km


▪️ Ujjain to Omkareshwar-111 km


▪️ Bhimashankar from Ujjain-666 km


▪️ Ujjain to Kashi Vishwanath-999 km


▪️ Ujjain to Mallikarjuna-999 km


▪️ Ujjain to Kedarnath-888 km


▪️ Ujjain to Trimbakeshwar-555 km


▪️ Ujjain to Baijnath-999 km


▪️ Ujjain to Rameshwaram-1999 km


▪️ Ujjain to Ghrishneshwar-555 km


In Hindu religion nothing was done without reason.


Ujjain is considered the center of the earth, which has been considered for thousands of years in Sanatan Dharma. Hence, man-made instruments have been made for calculating sun and astrology calculations in Ujjain about 2050 years ago.


And when the fictional line (cancer) on earth was formed by the English scientist about 100 years ago, the middle part of it turned out to be Ujjain. Even today, scientists come to Ujjain for information about sun and space.

Tuesday, March 22, 2022

హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. జన్మం మీద కాదు

(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 


1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.


2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.


3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..


4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.


5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 


6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.


7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. 


వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 


8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.


9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.


ఇంకా ..


1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.


2.  ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)


3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.


ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు


1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.


2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..


3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 


4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.


5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.


6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)


7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది  ( విష్ణుపురాణం 4.1.13). 


8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).


9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).


10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.


తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టాన్ని వారికి అందించటంలో సహాయపడండి

ఇదే మన సనాతన ధర్మం యెుక్క గోప్పతనం

Monday, March 21, 2022

ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము

 1. మత్స్యపురాణం

 2. కూర్మపురాణం

 3. వామన పురాణం

 4. వరాహ పురాణం

 5. గరుడ పురాణం

 6. వాయు పురాణం

 7. నారద పురాణం

 8. స్కాంద పురాణం

 9. విష్ణుపురాణం

 10. భాగవత పురాణం

 11.అగ్నిపురాణం

 12. బ్రహ్మపురాణం

 13. పద్మపురాణం

 14. మార్కండేయ పురాణం

 15. బ్రహ్మవైవర్త పురాణం

 16.లింగపురాణం

 17.బ్రహ్మాండ పురాణం 

 18. భవిష్యపురాణం

ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.

మత్స్యపురాణం 

మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.

కూర్మపురాణం 

కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.

వామన పురాణం 

పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, ఋతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.

వరాహపురాణం 

వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.

గరుడ పురాణం 

గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.

వాయుపురాణం 

వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.

అగ్నిపురాణం 

అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.

స్కందపురాణం

కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.

లింగపురాణం 

లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.

నారద పురాణం 

బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.

పద్మపురాణం 

ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.

విష్ణుపురాణం 

పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.

మార్కండేయ పురాణం 

శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.

బ్రహ్మపురాణం 

బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.

భాగవత పురాణం 

విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.

బ్రహ్మాండ పురాణం 

బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.

భవిష్యపురాణం 

సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.

బ్రహ్మావైపర్తపురాణము

ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, *రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి

Friday, March 18, 2022

రుద్రాభిషేకం గురించి వివరణ

శివ.. శివ అంటే చాలు మంగళం, శుభం, సర్వకార్యజయం, సర్వపాపహరం అని వేదార్థాలు. మహాదేవున్ని శివుడని పరమశివుడని పలు పేర్లతో పిలుస్తారు... 

పండితుడు నుంచి పామరుడు వరకు, మహా చక్రవర్తి నుంచి కటిక పేదవాడి వరకు మనఃపూర్వకంగా ఒక్కసారి శివ అంటే చాలు కోరిన కోర్కిలు తీర్చే భోళాశంకరుడు ఆయన. 

శివున్ని అభిషేక ప్రియుడు అంటారు...

శివునికి నిత్యం అభిషేకం చేస్తే చాలు అన్ని ఉన్నట్లే. శివలింగం చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. 

దేశం శాంతిగా ఉంటుందని వేదోక్తి, అయితే శివుడికి అభిషేకాలు చేస్తుంటాం.. 

అయితే అభిషేకాలు ఎన్నిరకాలు ఏ విధంగా శివాభిషేకాలు చేస్తారో తెలుసుకుందాం…!!


శివాభిషేకాలు మంత్రపూర్వకంగా అంటే రుద్రభిషేకాలుగా వర్ణిస్తారు, అదేవిధంగా చేసే ద్రవ్యాలను బట్టి అభిషేకాలకు పేర్లు ఉన్నాయి. 

కానీ శాస్త్రం ప్రకారం రుద్రాభిషేకాలు రకాలనే పరిగణనలోకి తీసుకుంటాం...

పదార్థాలు మన కామ్యాలు అంటే కోరికలు తీరడానికి ఆయా పదర్థాలతో, పుష్పాలతో చేస్తాం...


రుద్రాభిషేకాలు 8 విధములు అవి..


రుద్రం అంటే నమకాలు -11, చమకాలు-11 అనువాకాలుగా (సింపుల్‌గా చెప్పాలంటే 11 స్టాన్జాలు అని ఇంగ్లిష్ మీడియం వారికి) సాధారణంగా రుద్రాభిషేకం అంటే 11 నమకాలను, 11/1 చమకాన్ని చెప్పితే ఒక అభిషేకంగా ఇంట్లో నిత్యం చేసుకునేవారు చేసే పద్ధతి...


ఇక అసలు అభిషేక సంప్రదాయ పరిశీలిస్తే…

1. వారాభిషేకం- నమకం 11 అనువాకాలను చెప్పి చమకంలో ఒక్కొక్క అనువాకం చొప్పున చెప్పవలెను. 

ఆ విధంగా నమకం 11 సార్లు (11X11) చెప్పిన, చమకం 11 అనువాకాలకు పూర్తగును. (నమకం 11సార్లు, చమకం 1 సారి) దీన్ని వారాభిషేకం అంటారు...


2. ఆవృత్తి – నమకం 121 సార్లు, చమకం 11 సార్లు చెప్పితే ఆవృత్తి అంటారు...


3. రుద్రం- నమకం 121 సార్లు, చమకం – 11 సార్లు


4. ఏకాదశ రుద్రం- నమకం 14,641 సార్లు, చమకం-1331 సార్లు..


5. శతరుద్రం- నమకం 1,61,051 సార్లు,చమకం 14,641 సార్లు,


6. లఘురుద్రం- నమకం 17,71,561 సార్లు, చమకం- 1,61,051 సార్లు,


7. మహారుద్రం- నమకం 1,94,87,171 సార్లు, చమకం- 17,71,561 సార్లు,


8. అతిరుద్రం - నమకం 21,43,58,881 సార్లు, చమకం -1,94,87,171 సార్లు,

ఇలా 8 రకాలుగా రుద్రాభిషేకాలను చేస్తారు...


పైనవి మీకుతెలుస్తుంటే మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. 

లేదంటే తెలుసుకొని ఇతరులకు తెలియజేయండి

Thursday, March 17, 2022

సమస్యలు తీర్చే దత్తాత్రేయ మంత్రాలు

 



1.సర్వ బాధ నివారణ మంత్రం.


"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ||

సర్వ భాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే||"


2. సర్వరోగ నివారణ దత్త మంత్రం.


"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో||

సర్వ రోగ ప్రశమనం కురు శాంతిమ ప్రయచ్ఛమే||"


3. సర్వ కష్ట నివారణ దత్త మంత్రం.


"అనసూయాత్రి సమభూతో దత్తాత్రేయో దిగంబర: స్మర్తృగామీ స్వభక్తానాం ఉధ్ధర్తా భవ సంకటాత్||


4.దరిద్ర నివారణ దత్త మంత్రం.


"దరిద్ర విప్రగ్రేహే య: శాకం భుక్త్వోత్తమ శ్రియమ||

దదౌ శ్రీ దత్త దేవ: సదా దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు||"


5.సంతాన భాగ్యం కోసం దత్త మంత్రం.


"దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం||

యో భూదభీష్టదః పాతు సనః సంతాన వృద్ధికృత్||"


6. సౌభాగ్యం కోసం దత్త మంత్రం.


"జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహా||

మృత్యుంజయః స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు||"


7. అప్పులు తీరుటకు, అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కోసం దత్త మంత్రం.


"అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవాన్ ఋణాత్||దత్తాత్రేయం  తమీశానం నమామి ఋణముక్తయే||"


8. సర్వ పాప నివారణ దత్త మంత్రం.


అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః||తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే||


9.దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం.


అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన||

దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ||


10. ఉన్నత విద్య కోసం దత్త మంత్రం.


విద్వత్సుత మవిద్యం య అగతం లోక నిందితం|| భిన్న జిహ్వం బుధం చక్రే శ్రీ దత్తః శరణం మమ||


11. పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించ బడ్డ ధనము లేక వస్తువుల తిరిగి పొందుటకు..


కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్|| తస్య స్మరణ మాత్రేన హృతం నష్టంచ లభ్యతే||


విధానం

ఈ మంత్రాలలో మీ సమస్యకు తగట్టు ఏది అవసరమో ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు లేక సమస్య తీవ్రత బట్టి 1008సార్లు గాని రోజూ ఉదయం జపం చేయాలి.. ఇలా 41 దినములు  చేయాలి ..

జై గురుదత్త

Thursday, March 10, 2022

నవ గోప్యాలు

1 ఆయువు,

2 విత్తము,

3 ఇంటిగుట్టు,

4 మంత్రం,

5 ఔషధం,

6 సంగమం,

7 దానం,

8 మానము,

9 అవమానం

అనే ఈ తొమ్మి దింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచా ల్సినవి.

భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.

1 ఆయువు :- రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. జరిగేది జరగకమానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆయుః ప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు.

2 ధనం ( విత్తం) :- ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగా రంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం.

అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగు తుంది.

3 ఇంటి గుట్టు:- ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్నే ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని.

సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.


4 మంత్రం:-  ‘మననం చేసేది మంత్రం’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.


5 ఔషధం:- ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరిస్తే ఎవ్వరంటేవారు తయారుచేస్తారు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.


6 సంగమం:- సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.


7 దానం:- దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.


 8 శీలం ( మానం ):- మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.


9 అవమానం :- తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవ మానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగు తుంది. దాంతో పగ.. ప్రతీకారాలు.. ఇక వాటికి అంతనేది ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం. 


 ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధను మనం తప్పక ఆచరించాలి.

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...