Monday, October 28, 2019

కార్తీక మాసము ముప్పది రోజులు /నెలలొ పాటించవలసిన నియమాలు

మొదటి రోజు

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది. ఎంగిలి. చల్లని వస్తువులు
దానములు :- నెయ్యి, బంగారం
పూజించాల్సిన దైవము :- స్వథా అగ్ని
జపించాల్సిన మంత్రము :- ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా
ఫలితము :- తేజోవర్ధనము

రెండవరోజు

నిషిద్ధములు :- తరగబడిన వస్తువులు
దానములు :- కలువపూలు, నూనె, ఉప్పు
పూజించాల్సిన దైవము :- బ్రహ్మ
జపించాల్సిన మంత్రము :- ఓం గీష్పతయే - విరించియే స్వాహా
ఫలితము :- మనః స్థిమితము

3 వ రోజు

నిషిద్ధములు :- ఉప్పు కలిసినవి, ఉసిరి
దానములు :- ఉప్పు
పూజించాల్సిన దైవము :- పార్వతి
జపించాల్సిన మంత్రము :- ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా
ఫలితము :- శక్తి, సౌభాగ్యము

4 వ రోజు

నిషిద్ధములు :- వంకాయ, ఉసిరి
దానములు :- నూనె, పెసరపప్పు
పూజించాల్సిన దైవము :- విఘ్నేశ్వరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం గం గణపతయే స్వాహా
ఫలితము :- సద్బుద్ధి, కార్యసిద్ధి

5 వ రోజు

నిషిద్ధములు :- పులుపుతో కూడినవి
దానములు :- స్వయంపాకం, విసనకర్ర
పూజించాల్సిన దైవము :- ఆదిశేషుడు
జపించాల్సిన మంత్రము :- (మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)
ఫలితము :- కీర్తి

6 వ రోజు

నిషిద్ధములు :- ఇష్టమైనవి, ఉసిరి
దానములు :- చిమ్మిలి
పూజించాల్సిన దైవము :- సుబ్రహ్మణ్యేశ్వరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా
ఫలితము :- సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి

7 వ రోజు

నిషిద్ధములు :- పంటితో తినే వస్తువులు, ఉసిరి
దానములు :- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం
పూజించాల్సిన దైవము :- సూర్యుడు
జపించాల్సిన మంత్రము :- ఓం. భాం. భానవే స్వాహా
ఫలితము :- తేజస్సు, ఆరోగ్యం

8 వ రోజు

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
దానములు :- తోచినవి - యథాశక్తి
పూజించాల్సిన దైవము :- దుర్గ
జపించాల్సిన మంత్రము :- ఓం - చాముండాయై విచ్చే - స్వాహా
ఫలితము :- ధైర్యం, విజయం

9 వ రోజు

నిషిద్ధములు :- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి
దానములు :- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
పూజించాల్సిన దైవము :- అష్టవసువులు - పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము :- ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః
ఫలితము :- ఆత్మరక్షణ, సంతాన రక్షణ

10 వ రోజు

నిషిద్ధములు :- గుమ్మడికాయ, నూనె, ఉసిరి
దానములు :- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె
పూజించాల్సిన దైవము :- దిగ్గజాలు
జపించాల్సిన మంత్రము :- ఓం మహామదేభాయ స్వాహా
ఫలితము :- యశస్సు - ధనలబ్ధి

11 వ రోజు

నిషిద్ధములు :- పులుపు, ఉసిరి
దానములు :- వీభూదిపండ్లు, దక్షిణ
పూజించాల్సిన దైవము :- శివుడు
జపించాల్సిన మంత్రము :- ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ
ఫలితము :- ధనప్రాప్తి, పదవీలబ్ధి

12 వ రోజు

నిషిద్ధములు :- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి
దానములు :- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ
పూజించాల్సిన దైవము :- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము :- బంధవిముక్తి, జ్ఞానం, ధన ధాన్యాలు

13 వ రోజు

నిషిద్ధములు :- రాత్రి భోజనం, ఉసిరి
దానములు :- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం
పూజించాల్సిన దైవము :- మన్మధుడు
జపించాల్సిన మంత్రము :- ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా
ఫలితము :- వీర్యవృద్ధి, సౌదర్యం

14 వ రోజు

నిషిద్ధములు :- ఇష్టమైన వస్తువులు, ఉసిరి
దానములు :- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె
పూజించాల్సిన దైవము :- యముడు
జపించాల్సిన మంత్రము :- ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా
ఫలితము :- అకాలమృత్యువులు తొలగుట

15వ రోజు

నిషిద్ధములు :- తరగబడిన వస్తువులు
దానములు :- కలువపూలు, నూనె, ఉప్పు
'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'

16 వ రోజు

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది ,ఎంగిలి, చల్ల
దానములు :- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము :- స్వాహా అగ్ని
జపించాల్సిన మంత్రము :- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః
ఫలితము :- వర్చస్సు, తేజస్సు ,పవిత్రత

17 వ రోజు

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు
దానములు :- ఔషధాలు, ధనం
పూజించాల్సిన దైవము :- అశ్వినీ దేవతలు
జపించాల్సిన మంత్రము :- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా
ఫలితము :- సర్వవ్యాధీనివారణం ఆరోగ్యం

18 వ రోజు

నిషిద్ధములు :- ఉసిరి
దానములు :- పులిహార, అట్లు, బెల్లం
పూజించాల్సిన దైవము :- గౌరి
జపించాల్సిన మంత్రము :- ఓం గగగగ గౌర్త్యె స్వాహా
ఫలితము :- అఖండ సౌభాగ్య ప్రాప్తి

19 వ రోజు

నిషిద్ధములు :- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి
దానములు :- నువ్వులు, కుడుములు
పూజించాల్సిన దైవము :- వినాయకుడు
జపించాల్సిన మంత్రము :- ఓం గం గణపతయే స్వాహా
ఫలితము :- విజయం, సర్వవిఘ్న నాశనం

20 వ రోజు

నిషిద్ధములు :- పాలుతప్ప - తక్కినవి
దానములు :- గో, భూ, సువర్ణ దానాలు
పూజించాల్సిన దైవము :- నాగేంద్రుడు
జపించాల్సిన మంత్రము :- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం
ఫలితము :- గర్భదోష పరిహరణం, సంతానసిద్ధి

21 వ రోజు

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం
దానములు :- యథాశక్తి సమస్త దానాలూ
పూజించాల్సిన దైవము :- కుమారస్వామి
జపించాల్సిన మంత్రము :- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా
ఫలితము :- సత్సంతానసిద్ధి, జ్ఞానం, దిగ్విజయం

22 వ రోజు

నిషిద్ధములు :- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి
దానములు :- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు
పూజించాల్సిన దైవము :- సూర్యుడు
జపించాల్సిన మంత్రము :- ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా
ఫలితము :- ఆయురారోగ్య తేజో బుద్ధులు

23 వ రోజు

నిషిద్ధములు :- ఉసిరి, తులసి
దానములు :- మంగళ ద్రవ్యాలు
పూజించాల్సిన దైవము :- అష్టమాతృకలు
జపించాల్సిన మంత్రము :- ఓం శ్రీమాత్రే నమః , అష్టమాతృ కాయ స్వాహా
ఫలితము :- మాతృరక్షణం, వశీకరణం

24 వ రోజు

నిషిద్ధములు :- మద్యమాంస మైధునాలు, ఉసిరి
దానములు :- ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు
పూజించాల్సిన దైవము :- శ్రీ దుర్గ
జపించాల్సిన మంత్రము :- ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా
ఫలితము :- శక్తిసామర్ధ్యాలు, ధైర్యం, కార్య విజయం

25 వ రోజు

నిషిద్ధములు :- పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు
దానములు :- యథాశక్తి
పూజించాల్సిన దైవము :- దిక్వాలకులు
జపించాల్సిన మంత్రము :- ఓం ఈశావాస్యాయ స్వాహా
ఫలితము :- అఖండకీర్తి, పదవీప్రాప్తి

26 వ రోజు

నిషిద్ధములు :- సమస్త పదార్ధాలు
దానములు :- నిలవవుండే సరుకులు
పూజించాల్సిన దైవము :- కుబేరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా
ఫలితము :- ధనలబ్ది, లాటరీవిజయం, సిరిసంపదలభివృద్ధి

27 వ రోజు

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, వంకాయ
దానములు :- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు
పూజించాల్సిన దైవము :- కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము :- మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి

28 వ రోజు

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి ,వంకాయ
దానములు :- నువ్వులు, ఉసిరి
పూజించాల్సిన దైవము :- ధర్ముడు
జపించాల్సిన మంత్రము :- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా
ఫలితము :- దీర్ఘకాల వ్యాధీహరణం

29 వ రోజు

నిషిద్ధములు :- పగటి ఆహారం, ఉసిరి
దానములు :- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము :- శివుడు (మృత్యుంజయుడు)
జపించాల్సిన మంత్రము :- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం,
ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్
ఫలితము :- అకాలమృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం

30 వ రోజు

నిషిద్ధములు :- పగటి ఆహారం, ఉసిరి
దానములు :- నువ్వులు, తర్పణలు, ఉసిరి
పూజించాల్సిన దైవము :- సర్వదేవతలు + పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము :- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః
ఫలితము :- ఆత్మస్థయిర్యం, కుటుంబక్షేమం

Sunday, October 27, 2019

దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీ స్తోత్రం

నమశ్రియై లోకధాత్ర్వై బ్రహ్మామాత్రే నమోనమః
నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమోనమః !!

ప్రసన్న ముఖ పద్మాయై పద్మ కాంత్యై నమోనమః
నమో బిల్వ వన స్థాయై విష్ణు పత్న్యై నమోనమః

విచిత్ర క్షామ ధారిణ్యై పృథు శ్రోణ్యై నమోనమః
పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమోనమః !!

సురక్త పద్మ పత్రాభ కరపాదతలే శుభే
సరత్నాంగదకేయూర కాంచీనూ పురశోభితే !!

యక్షకర్ధమ సంలిప్త సర్వాంగే కటకోజ్జ్వలే
మాంగళ్యా భరణైశ్చిత్రైః ముక్తాహారై ర్విభూషితే !!

తాటంకై రవతం సైశ్చ శోభమాన ముఖాంబుజే
పద్మ హస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే !!

ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమోనమః
ప్రసీదాస్మాన్ కృపాదృష్టి పాతై రాలోక యాబ్దిజే
యేదృష్టాతే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః

ఫలశ్రుతి
ఇతిస్తుతాతథాదేవైః విష్ణు వక్షస్స్థలాలయా
విష్ణునా సహసందృశ్య రమాప్రేతావదత్సురాన్
సురారీన్ సహసాహత్వా స్వపధాని గమిష్యథ
యే స్థానహీనాః స్వస్థానా ద్ర్భ్రం శితాయేనరాభువి
తేమామనే నస్తోత్రేణ స్తుత్వా స్థానమవాప్నుయుః !!🕉

 జై శ్రీమన్నారాయణ 

Saturday, October 26, 2019

నవగ్రహ దోషములు..పరిహారాలు.నవగ్రహ మంత్రములు

మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉం టాయి.
జ్యోతిష్యం పై నమ్మకం ఉన్నవారు సమస్యకు కారణం తెలిసిన వెంటనే సంబంధిత గ్రహానికి పూజించి
ఆ గ్రహానుగ్రహం పొంది తత్‌సంబంధమైన భాదల నుండి విముక్తి పొందుతుంటారు.
జ్యోతిష్య జ్ఞానం లేనివారు కూడా వారికి కలుగుచున్న కష్టాలకు కారణం అగు గ్రహం తెలుసుకొని ఆ గ్రహాని కి శాంతి మార్గములు చేసుకొనిన గ్రహ భాదల నుండి విముక్తి పొందుతారు.

సూర్యుడు:
ఎవరి జాతకంలో అయితే రవి బలహీనంగా ఉంటాడో వారికి అనారోగ్యము,
అధికారుల నుండి వేధింపులు,
తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత,
నేత్ర, గుండె సంబంధిత వ్యాధులు,
తండ్రి తరుపు బంధువులతో పడకపోవుట,
ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట,
ఆత్మ విశ్వాసం లేకపోవుట వంటి సమస్యలు
తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొనుట,
ఆదిత్య హృదయం పారాయణం,
గోధుమ లేదా గోధుమలతో తయా రుచేసిన ఆహారపదార్థ ములు దానం చేయుట.
తండ్రి గారిని లేదా తండ్రితో సమానమైన వారిని గౌరవించుట వలన రవి గ్రహదోషము తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది.

చంద్రుడు:
చంద్రుడు జాతక చక్రంలో బలహీనంగా ఉన్నప్పుడు మనస్సు నిలకడగా లేపోవుట, భయం, అనుమానం, విద్యలో అభి వృద్ధి లేకపోవుట,
తల్లిగారి యొక్క ఆరోగ్యం సరిగా లేకపోవుట,
స్ర్తీలతో విరోధము,
మానసిక వ్యాధులు,
రాత్రులు సరిగా నిద్రపట్టకపోవుట,
అధికమైన కోరికలు,
శరీరం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవుట,
బరువు తక్కువగా ఉండుట,
స్ర్తీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు కలుగుతున్నప్పుడు చంద్ర గ్రహ దోషంగా గుర్తించి,
చంద్ర గ్రహ అను గ్రహం కొరకు మాతృ సమానమైన స్ర్తీలను గౌరవించుట,
బియ్యం దానం చేయుట,
పాలు, మజ్జిగ వంటివి భక్తులకు చిన్న పిల్లలకు పంపిణీ చేయడం,
శివునికి ఆవుపాలతో అభిషే కం జరిపించుకొనుట, పార్వతీదేవి అష్టోత్తరం పారాయణం చేయుట
మొదలగు వాటి ద్వారా చంద్ర గ్రహ అనుగ్రహానికి పాత్రులు అయి అభివృద్ధి చెందుతారు.

కుజుడు:
జాతకచక్రంలో కుజుడు బలహీనంగా ఉండడం వల్ల ధైర్యం లేక పోవుట,
అన్నదమ్ము లతో సఖ్యత నశించుట,
భూమికి సంబంధించిన వ్యవహారాల్లో నష్టాలు,
కోర్టు కేసులు, రౌడీల వలన ఇబ్బందులు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు,
పోలీసుల వల్ల వేధింపులు అప్పులు తీరకపోవుట, ఋణదాతల నుండి ఒత్తిడి,
రక్త సంబంధించిన వ్యాధులు,
శృంగారంనందు ఆసక్తి లేకపోవడం,
కండరాల బలహీనత,
రక్తహీనత సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేకపోవుట మొదలగునవి కలుగుచున్నప్పుడు కుజ గ్రహ దోషముగా గుర్తించి కుజ గ్రహాను గ్రహం కొరకు సుబ్రహ్మ ణ్యస్వామి, ఆంజనేయ స్వామి వారిని పూజించాలి.
అలాగే హనుమాన్‌ చాలీసా పారాయణం,
కందులు దానం చేయడం, పగడం ఉంగరం ధరించడం, మంగళవారం రోజున నియమంగా ఉండడం,
అన్న దమ్ములకు సహాయం చేయడం,
వారి మాట లకు విలువ ఇవ్వడం,
స్ర్తీలు ఎర్రని కుంకుమ, ఎరుపు రంగు గాజులు ధరించడం వలన కుజ గ్రహ పీడలు తొలిగిపోతాయి.

బుధుడు:
జాతక చక్రంలో బుధుడు బలహీనంగా ఉన్నట్లయితే.. నరాల బలహీనత, జ్ఞా పకశక్తి లేకపోవటం,
చదువులో అభివృద్ధి లేక పోవడం, నత్తిగా మాట్లాడడం, వ్యాపారాల్లో నష్టాలు, సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం,
తెలివితేటలు లేకపోవడం,
ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు,
అనుమానం, తరుచూ ధననష్టం మొదలగునవి
జరుగు చున్నప్పుడు బుధ గ్రహ దోషంగా గుర్తించి..
బుధ గ్రహానుగ్రహం కొరకు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, వేంక టేశ్వరస్వామి వారిని, విఘ్నేశ్వర స్వామి వారిని ప్రార్థించుట,
వారికి సంబంధించిన క్షేత్రాలను దర్శించుట,
ఆవుకు పచ్చగడ్డి, తోటకూర లాంటివి ఆహారంగా ఇచ్చుట, పెసలు దానం చేయుట,
విద్యార్థు లకు పుస్తకాలను దానం చేయట వలన
బుధుని యొక్క అనుగ్రహం కలుగుతుంది.

గురువు:.
జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో జీవితంలో సుఖము, సంతోషం లేక పోవుట,
 దైవం పై నమ్మకం లేకపోవుట,
పెద్దల యందు గౌరవం లేకపోవుట,
ఆచారములు పాటించకుండుట,
ఉన్నత విద్యకు ఆటంకాలు, నియంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బందులు కలుగుట,
ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేకపోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచున్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి
గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పారాయణ చేయడం, గురువుల ను గౌరవించుట,
దైవ క్షేత్రములు సందర్శించుట, శనగలు దానం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.

శుక్రుడు:
జాతకంలో శుక్రుడు బలహీనము గా ఉన్నప్పుడు స్ర్తీలకు అనారోగ్యము కలుగు ట. వాహన సౌఖ్యము లేకపోవుట. భార్యా భర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట.
వ్యసనము ల యందు ఆసక్తి, వివాహం ఆలస్యం అగుట, కిడ్నీ వ్యాధులు, వ్యభిచారం,
మత్తుపానీయాలు సేవించుట,
కుటుంబంలోని స్ర్తీలకు అనారో గ్యము సరిగా లేనప్పుడు శుక్ర గ్రహ దోషము గా గుర్తించి శుక్ర గ్రహ అనుగ్రహం కొరకు లక్ష్మీ అమ్మవారిని పూజించుట,
లక్ష్మీ స్తోత్రము పారాయణం చేయుట,
బొబ్బర్లు దానం చేయుట, వివాహం కాని స్ర్తీలకు వారి వివాహం కొరకు సహకరించుట,
స్ర్తీలను గౌరవించుట. వజ్రం ఉంగరం ధరించుట, సప్తముఖి రుద్రాక్షను ధరించుట వలన శుక్ర గ్రహ అను గ్రహము పొందవచ్చును.

శని:
ఆయుష్షు కారకులు అయిన శని జాతక చక్రము నందు బలహీనముగా ఉన్నచో బద్ధ కము, అతినిద్ర
దీర్థకాలిక వ్యాధులు, సరయిన ఉద్యోగము లేకపోవుట, జన సహకారం లేకపోవుట, ఎముకలు,
తల్లిదండ్రులలో విరోధములు,
ఇతరుల ఆధీనములో పని చేయుట,
సేవకా వృత్తి, నీచ వృత్తులు చేపట్టుట,
గౌరవం లేకపోవుట,
పాడుపడిన గృహముల యందు జీవించుట,
ఇతరుల ఇంట్లో జీవన ము సాగించుట,
భార్య పిల్లలు అవమానించుట,
కుటుంబమును విడిచి అజ్ఞాతముగా జీవించుట, సరయిన భోజనం కూడా లేకపో వుట
మొదల గు కష్టములు కలుగును.
శని గ్రహ అనుగ్ర హమునకు శివునికి అభిషేకము చేయుట. విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయుట.

శనివారము నియమముగా ఉండుట,
ఆంజనేయ స్వామి వారిని ఆరాధించుట,
హనుమాన్‌ చాలిసా పారాయణం చేయుట,
హనుమాన్ కు తమలపాకు పూజ చేపిస్తే మంచిది.
స్వామి అయ్యప్ప మాల ధారణ చేయుట,
శని గ్రహానికి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయుట. నల్ల నువ్వులు దానము చేయుట,
దుప్పటి..వస్తువులు దానం చేయుట,
నీలము ఉంగరం గాని నాలుగు ముఖములు గల రుద్రాక్షను ధరించుట వలన శని గ్రహ అనుగ్రహం కలుగుతుంది.

రాహువు:
రాహువు జాతక చక్రంలో బలహీనముగా ఉన్నప్పుడు
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయుట,
నీచ స్ర్తీలతో సహవాసము, కుష్టులాంటి వ్యాధులు,
జైలు శిక్షలు అనుభవించుట,
విద్యార్థులు విద్య మధ్యలో మానివేయుట,
పాడుపడిన గృహములలో నివసించుట,
ఇంట్లో బొద్దింకలు, పందికొక్కులు, పాములు వంటివి సంచరించుట, శుభకార్యములు వాయిదా పడుట, వాహన ప్రమాదములు జరుగుట,
గృహంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాడగుట,
విలువైన వస్తువులు దొంగలు ఎత్తు కొనిపోవుట, మొదలగున వి సంభ వించు చున్నప్పుడు రాహుగ్రహ దోషముగా గుర్తించి దోష నివారణకు కనక దుర్గ అమ్మవారిని పూజించుట,
దేవి భాగవతం పారాయణం చేయుట,
గోమేధికం గాని  ఎనిమిది  ముఖములు గల రుద్రాక్ష ను గాని ధరించ వలెను.
భవాని మాల ధరిం చుట, స్ర్తీలను గౌరవించుట వలన రాహు గ్రహ అనుగ్రహం కలుగును.
దుర్గా సప్తశ్లోకి పఠించటం మంచిది.

కేతువు:
కేతువు జాతకంలో బలహీనంగా ఉన్నపుడు మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవితం మీద విరక్తి,
ఏకాంతంగా ఉండాలనే కోరిక,
లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం,
తన లో తానే ఊహించుకొనుట,
తనని తాను దేవుడు గానే దేవతగానే ఊహించుకోవడం, దేనిని చూసినా భయపడడం,
ఉద్యోగమును, భార్యా పిల్లలను వదలి వేసి దేశ సంచారం చేయుట. పిచ్చి వాని వలె ప్రవర్తించుట,
విచిత్ర వేషధార ణ, సంతానం కలుగకపోవుట,
గర్భం వచ్చి పోవుట, చిన్న పిల్లలకు తీవ్ర అనారోగ్యం, అంటు వ్యాధులు, వైద్యులు కూడా గుర్తించలేని విచిత్ర వ్యాధులకు కేతువు కారణం అగుచున్నాడు.
కేతు గ్రహ అనుగ్రహం కొరకు నలుపు తెలుపు రంగులో ఉన్న కంబళి దానం చేయు ట.
దేవాలయములు కట్టుటకు విరాళములు ఇచ్చుట.
పిచ్చి ఆసుపత్రిలో రోగులకు సేవ చేయుట.
అనాధ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయము కలిగించుట.
వైఢూర్య ము గాని తొమ్మిది ముఖములు గల రుద్రాక్ష ధరించుట వలన కేతు గ్రహ అనుగ్రహం పొందుతారు.

ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఇష్టమైన దేవాలయమును సందర్శించినచో ఎటువంటి గ్రహ దోషములు ఉన్నను పరిహారం జరుగును.

"ఆకృష్ణేన'' అను మంత్రముతో సూర్యుని,
"ఇమం దేవా' అను మంత్రముతో చంద్రుని,
""అగ్నిర్మూర్ధా'' అను మంత్రముతో కుజుని,
""ఉద్బుధ్యస్వ'' అను మంత్రముచే బుధుని,
""యదర్య'' అను మంత్రముచే గురువును, ""అన్నాత్పరిస్రుతః'' అను మంత్రముచే శుక్రుని,
""శం నో దేవీ'' అను మంత్రముచే శనిని,
""కాండాత్‌'' అను మంత్రముచే రాహువును,
""కేతుం కృణ్వన్న కేతవ'' అను మంత్రముచే కేతువును. ధ్యానించవలయును.

జల్లేడు. మోదుగు, జువ్వి ఉత్తరేణి, రాగి, మేడి, జమ్మి, గరక, దర్భలు, సమిధలు యథాక్రమముగా ఒక్కొక్క గ్రహమునకు 108, కాని 28 సార్తు కాని హోమమును చేయవలయును.
అట్లే తేనెతో, నేయితో, పెరుగుతో, పాలతో కాని హోమము చేయవలయును.

ఋగ్వేద యజుర్వేదముల  యందలి  నవగ్రహ  మంత్రములు:

1. సూర్య మంత్రము:
ఓం ఆ కృష్ణేన  రజసా  వర్తమానో  నివేశ  యన్న మృతం  మర్త్యంచ l
హిరణ్యేన  సవితా  రథేనాఽఽ దేవోయాతి  భువనాని  పశ్యన్ ll
(ఋగ్వేదము 1-35..2 యజుర్వేదము 33-43 )
ఓం భూర్భువః  స్వః  సూర్య  ఇహాగచ్ఛ  ఇహ సః  సూర్యాయ నమః
బీజ మంత్రము :-ఓం  హ్రాం  హ్రీం  హ్రౌం  సః  సూర్యాయ నమః
జపకాలము: ఉదయము

2. చంద్ర మంత్రము:
ఓం  హందేవా  అసపత్నం  సువధ్వం మహతే   క్షత్రాయ మహతే  జ్యేష్టాయ మహతే జ్ఞాన రాజ్యాయేంద్ర  స్యేంద్రియాయ l  ఇమమముశ్య పుత్రమముష్యే పుత్ర మస్యై విశాఽ ఎషవోఽ మీరాజా సోమోఽ స్మాకం  బ్రాహ్మణానాం రాజా ll
( యజుర్వేదము 9-40 )
ఓం భూర్భువః  స్వః  చంద్ర ఇహాగచ్ఛ ఇహ తిష్ఠ  సోమాయ నమః ll
బీజ మంత్రము :-ఓం  శ్రాం  శ్రీం  శ్రౌం  సః  చంద్రాయ నమః
జకాలము: సంధ్యా కాలము

3. మంగళ మంత్రము:
ఓం అగ్ని ర్మూర్దా  దివః  కకుత్పతి: పృథివ్యా  అయం l
అపాంరే తాంసి జిన్వతి ll
( యజుర్వేదము 8-44-16; యజుర్వేదము 13-14)
ఓం భూర్భువః  స్వః  భౌమా ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  భౌమాయ నమః
బీజ మంత్రము :-ఓం  క్రాం  క్రీం  క్రౌం  సః  భౌమాయ నమః
జపకాలము: రెండు గంటల సమయము

4. బుధ మంత్రము:
ఓం ఉద్బుద్య స్వాగ్నే ప్రతిజాగృ హిత్వమిష్టా  పూర్తేం
సంసృజేదామయంచ  అస్మిస్సదస్థే అధ్యుత్తరస్మిన్
విశ్వేదేవా  యజమానశ్చ సీదత ll
 ( యజుర్వేదము 15-54 )
ఓం భూర్భువః  స్వః  బుధ ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  బుధాయ నమః
బీజ మంత్రము :-ఓం బ్రాం బ్రీం భ్రౌంసః  బుధాయ నమః
జపకాలము: ఐదు గంటల సమయము.

5. గురు మంత్రము:
ఓం బృహస్పతే  అతియదయోం ఘ్రుమద్ విభాతి క్రతుమజ్జనేషు l
యద్దీదయచ్చ వనఋతుప్రజాత  తదస్మాసు ద్రవిణం దేహిచిత్రం ll
( ఋగ్వేదము 2-23-25 ; యజుర్వేదము 26-3 )
ఓం భూర్భువఃస్వః   బృహస్పతే ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  బృహస్పతయే నమః
బీజ మంత్రము :-ఓం  గ్రా౦  గ్రీం  గ్రౌం సః  గురవే నమః
జపకాలము:  సంధ్యా కాలము

6. శుక్ర మంత్రం :💐
ఓం అన్నాత్పరిశృతోరసం బ్రహ్మణాన్యపిబత్ క్షం పయః సోమం ప్రజాపతిః l
ఋతేన సత్య మింద్రియం విపానాం శుక్ర మందస ఇంద్ర స్యేంద్రియ మిదం పయో మృతం మధు l l
(యజుర్వేదం 19-65)
బీజమంత్రం: ఓం ద్రాం ద్రీం ద్రౌంసః శుక్రాయనమః
కాలము : సూర్యోదయ సమయం

7.  శని మంత్రము :💐
ఓం శంనో  దేవీరభిష్టయ ఆపోవబంతు పీతయే l
శంయోరభిస్ర  వంతునః ll
( ఋగ్వేదము 10-9-4 ; యజుర్వేదము 36-12 )
ఓం భూర్భువఃస్వః   శనై  శ్చరః  ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  శనైశ్చరాయ నమః
బీజ మంత్రము :-ఓం ప్రాం  ప్రీం  ప్రౌంసః  శనైశ్చరాయ నమః
జపకాలము:  సంధ్యా కాలము

8. రాహు మంత్రం :💐
ఓం కయానాశ్చిత్ర ఆభువధూతీ  సదావృధాఃసఖా l కాయాశాశ్చిష్ఠయావృతా l l
(ఋగ్వేదం 4-31-1, యజుర్వేదం 26-39)
ఓం భూర్భువః స్వః రాహో ఇహాగచ్ఛ ఇహతిష్ఠ l రాహవేనమః
బీజమంత్రం:- ఓం భ్రాం భ్రీం బ్రౌంసః రాహవేనమః
జపకాలం :- రాత్రి సమయం

9. కేతు మంత్రం:💐
ఓం కేతుం కృణ్వన్న కేతవేపేశే మర్యా అపేశసే l సముపద్భి రాజాయధాః l l
(ఋగ్వేదము 1-6-3; యజుర్వేదము 29-37)
బీజమంత్రంc :- ఓం స్త్రాం స్త్రీం సౌం సః l కేతవేనమః
జపకాలం :- రాత్రి సమయం.
బీజ మంత్రాలు గురువుల ఆధ్వర్యంలో మాత్రమే జపించవలెను.

నవగ్రహాలు.....

నవగ్రహాలు చాలా శ‌క్తివంత‌మైన‌వి. ప‌ద్ద‌తి ప్ర‌కారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అయితే ఎలా చేయాలి ? ఎన్నిసార్లు చేయాలి ? అనే విష‌యం తెలుసుకుందాం. నిజానికి న‌వ‌గ్ర‌హాల‌కు ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలో చాలా మందికి తెలియదు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది.

గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకూ ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి.

నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు, సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుండి అంటే చంద్రుని వైపు నుంచి.. కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు అంటే బుధుడి వైపు నుంచి.. రాహువు, కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.

చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి, నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది.

శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి. “ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:” అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణాలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు అంటే మొత్తం 11  చేస్తే చాలా మంచిదని చెప్ప‌వ‌చ్చు.

|| ఓం నమః శివాయ ||

రుద్రాక్ష ఫలాలు, వీటి గింజలే రుద్రాక్షలు

మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. " సంభవామి యుగే యుగే " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.

శివపురాణం, రుద్రాక్షోపనిషత్తు, రుద్రకారణ్యమహాత్యం, దేవిభాగవతం, రుద్రజాబాల్యుపనిషత్తు, లింగ పురాణం, స్కంద పురాణం, పద్మపురాణం లాంటి అనేక గ్రంథములలో రుద్రాక్షలవివరణ ఉన్నది.
రుద్రాకారణ్యమహాత్యం
ఒకప్పుడు త్రిపురాసుర పదార్థమైన నేను నిమిలిత నేత్రకుడినై యుండగా నాకన్నుల నుండి జలబిందువులు భూమ్మీద పడినవి ఆ జలబిందువుల నుండి సర్వజనులక్షేమార్థము రుద్రాక్ష వృక్షములు జనించినవి అని పరమేశ్వరుడు స్వయముగా చెప్పాడు.

''స్థావరత్వమనుప్రాప్య భక్తానుగ్రహకారణాత్
భక్తానాం ధారణత్పాపం దివారాత్రికృతం హరేత్
లక్షం తు దర్శనాత్పుణ్యం కోటిస్తద్ధారణాద్భవేత్"

అని రుద్రాక్షమాల గురించి "జాబాలోపనిషత్"లో పేర్కొనబడింది.

రుద్రుడు అంటే శివుడు, రాక్షసులతో ఫోరాడి, మూడు పురములను భస్మం చేసినపుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినపుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. వాటినుంచి నుంచి పుట్టినవే రుద్రాక్షలు. శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చెబుతారు.

"ధాత్రీఫలప్రమాణం యచ్చ్రేష్ఠమేతదుదాహృతం
బదరీఫలమాత్రం తు మధ్యమం ప్రోచ్యతే బుధై:
అధమం చణమాత్రం స్యాత్ప్రక్రియైష మయోచ్యతే"
అంటే ఉసిరిక కాయంత పరిమాణమున్నవి ఉత్తమమైనవిగా, రేగుపండంత పరిమాణమున్నవి మధ్యమ జాతికి చెందినవిగా, శనగ గింజ పరిమాణం ఉన్నవి అధమమైనవిగా పేర్కొనబడుతున్నాయి. కాబట్టి రుద్రాక్షలను ధరించే సమయంలో వాటి పరిమాణమును కూడా గమనించాల్సివుంటుంది. తంత్ర శాస్త్ర ప్రకారం రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత శక్తివంతమైనవి.

రుద్రాక్షలు
ఏకముఖి. (ఒక ముఖము కలిగినది) అత్యంత శ్రేష్టమయినది.
ద్విముఖి (రెండు ముఖములు కలిగినది) ఇది శివపార్వతుల స్వరూపం
త్రిముఖి (మూడు ముఖములు కలిగినది) త్రిమూర్తి స్వరూపం
చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది) నాలుగు వేదాల స్వరూపం
పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది) పంచభూత స్వరూపం
షట్ముఖి (ఆరు ముఖములు కలది) కార్తికేయ రూపం
సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది) కామధేనువుగా పరిగరించుతారు

అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది)విఘ్నేశ్వరరూపం
నవముఖి (తొమ్మిది ముఖాలు కలది) నవగ్రహ స్వరూపం.
దశముఖి (పది ముఖాలు కలిగినది) దశావతార స్వరూపం.

జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు. ఇండస్ట్రియల్ స్కానింగ్ కానీ , డెంటల్ ఎక్స్ రే యంత్రంతో తీసిన ఎక్స్ రే ద్వారా నిజమైన రుద్రాక్షని గుర్తించవచ్చు

జన్మనక్షత్ర రీత్యా ధరించవలసిన రుద్రాక్షలు

నక్షత్రము --- ధరించవలసిన రుద్రాక్ష
అశ్వని --- నవముఖి
భరణి --- షణ్ముఖి
కృత్తిక --- ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి --- ద్విముఖి
మృగశిర --- త్రిముఖి
ఆరుద్ర --- అష్టముఖి
పునర్వసు --- పంచముఖి
పుష్యమి --- సప్తముఖి
ఆశ్లేష --- చతుర్ముఖి
మఖ -- నవముఖి
పుబ్బ --- షణ్ముఖి
ఉత్తర --- ఏకముఖి, ద్వాదశముఖి
హస్త --- ద్విముఖి
చిత్త --- త్రిముఖి
స్వాతి --- అష్టముఖి
విశాఖ --- పంచముఖి
అనురాధ --- సప్తముఖి
జ్యేష్ఠ --- చతుర్ముఖి
మూల --- నవముఖి
పూర్వాషాఢ --- షణ్ముఖి
ఉత్తరాషాఢ --- ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం --- ద్విముఖి
ధనిష్ట --- త్రిముఖి
శతభిషం --- అష్టముఖి
పూర్వాభాద్ర --- పంచముఖి
ఉత్తరాభాద్ర --- సప్తముఖి
రేవతి --- చతుర్ముఖి

ఓం నమః శివాయ

ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ?

నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశించి , మరణ అనంతరం పుణ్య లోకాలు పొందుతాము ...
◆ గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !!
◆ శివాష్టకం - శివ అనుగ్రహం !!
◆ ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !! ◆శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !!
◆ అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !!
◆కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !!
◆ దుర్గష్టోత్తర శతనామం - భయహరం !!
◆ విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!
◆ సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !!
◆ హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !! ◆ విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!
◆ శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!
◆ భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !!
◆ శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !! ◆ లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !!
◆ కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !!
◆ ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !!
◆ శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !!
◆ లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !!
◆ శ్యామాల దండకం - వాక్శుద్ధి !!
◆ త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి !!
◆ శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి !!
◆ శని స్తోత్రం - శని పీడ నివారణ !!
◆మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం !!
◆ అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి !!
◆ కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం !!
◆ కనకధార స్తోత్రం - కనకధారయే !!
◆ శ్రీ సూక్తం - ధన లాభం !!
◆సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది !!
◆సుదర్శన మంత్రం - శత్రు నాశనం !!
◆ విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం !!
◆ రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!
◆దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!
◆ భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు !!
◆ వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!
◆దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!
◆ లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి !!  *పంచరత్నం - 5 శ్లోకాలతో కూడినది !!
*అష్టకం - 8 శ్లోకాలతో కూడినది !!
* నవకం - 9 శ్లోకాలతో కూడినది !!
*స్తోత్రం - బహు శ్లోకాలతో కూడినది !!
*శత నామ స్తోత్రం - 100 నామాలతో స్తోత్రం !!
*సహస్రనామ స్తోత్రం - 1000 నామాలతో స్తోత్రం !!
పంచపునీతాలు
● వాక్ శుద్ధి ● దేహ శుద్ధి ● భాండ శుద్ధి ● కర్మ శుద్ధి ● మనశ్శుద్ధి
● వాక్ శుద్ధి : వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు .... కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు .... పగ , కసి , ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు .... మంచిగా , నెమ్మదిగా , ఆదరణతో పలకరించాలి .... అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి ....
● దేహ శుద్ధి : మన శరీరం దేవుని ఆలయం వంటిది .... దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , రెండు పూటలా స్నానం చెయ్యాలి .... చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు ....
● భాండ శుద్ధి : శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం .... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి .... స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది ....
● కర్మ శుద్ధి : అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు .... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు .... తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు ....
●మనశ్శుద్ధి : మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి .... మనస్సు చంచలమైనది .... ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది .... దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి .... దీని వల్ల దుఃఖం చేకూరుతుంది .... కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి ...
★ ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది !!
★ ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది !!
★నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది !!
★యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది !!
★సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది !!
★గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది !!
★ సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది !!
★పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది !!
★ భక్తి ప్రవేశిస్తే మనిషి మనీషి అవుతాడు !!

నవగ్రహ దోషాలను తొలగించే నవగ్రహ గాయత్రి మంత్రం

‘న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌’ అంటే తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రం లేదని అర్థం. గాయత్రి మంత్రం గురించి ఋగ్వేదంలో తొలుత వివరించారు. గాయత్రి అనే పదం ‘గయ’ ‘త్రాయతి’ అను పదాలతో కూడుకుని ఉంది. ‘గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ’ అని ఆదిశంకరాచార్యులు తనభాష్యంలో వివరించారు.

‘ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్’ అనేది గాయత్రి మంత్రం.
ఈ మంత్రాన్ని పూర్వకాలంలో కొన్ని వర్ణాల వారు వేద పాఠశాలలో మాత్రమే నిర్దిష్టమైన పద్దతిలో జపించేవారు. కానీ కాలక్రమేణా విజ్ఞాన ఫలాల అందుబాటులోకి రావడం వల్ల గాయత్రి మంత్రాన్ని అందరూ పఠిస్తున్నారు. ఈ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్దతిలో జపించినా లేదా విన్నా వెలువడే ధ్వని తరంగాలు మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి.

అంతేకాదు మనోబుద్ధి కూడా వికసిస్తుంది. దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించడానికి పలువులు ప్రయత్నాలు కూడా చేశారు. దీని వల్ల మెదడులోనూ ఒక రకమైన ఆనందం, అనుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసం స్థాయి కూడా పెరుగుతాయి.
వేదాల ప్రకారం సవిత గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవత. అగ్ని ముఖం, రుషి విశ్వామిత్రుడు .... గాయత్రీ ఛందం.... ప్రణవ రూపమైన ఓంకారానికి నేను వందనం చేస్తూ విశ్వాన్ని ప్రకాశింపజేసే సూర్య తేజమైన సవితను ఉపాసిస్తున్నాను అనేది ఈ మంత్రానికి ఉన్న అర్థాలలో ఒకటి. అనేక విధాలుగా గాయత్రి స్తోత్రం చేస్తారు. వీటిలో నవగ్రహ గాయత్రి కూడా ఒకటి. ఈ మంత్రం జపించడం వల్ల నవగ్రహ దోషాలు తొలగి శుభం జరుగుతుందని పండితులు చెబుతారు.

నవగ్రహ గాయత్రీ

1. సూర్య గాయత్రి: ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్యః ప్రచోదయాత్

2. చంద్ర గాయత్రి: ఓం అమ్రుతేశాయ విద్మహే రాత్రిన్చరాయ ధీమహి తన్నశ్చంద్రః ప్రచోదయాత్.

3. కుజ గాయత్రి: ఓం అన్గారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్న: కుజః ప్రచోదయాత్.

4. బుధ గాయత్రి: ఓం చంద్ర సుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్.

5. గురు గాయత్రి: ఓం వృషభద్వజాయ విద్మహే కృణి హస్తాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్.

6. చంద్ర గాయత్రి: ఓం సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్

7. శుక్ర గాయత్రి: ఓం భార్గవాయ విద్మహే మంద గ్రహాయ ధీమహి తన్నః శనిః ప్రచోదయాత్

8. రాహు గాయత్రి: ఓం శీర్ష రూపాయ విద్మహే వక్ర పందాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్

9. కేతు గాయత్రి: ఓం తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్.

Thursday, October 24, 2019

కార్తీక మాసంలో పాటించ వలసిన నియమాలు, పటించవలసిన స్త్రోత్రాలు..

కార్తీక మాసంలో కార్తీక స్నానాలు, దీపాలు, క్షేత్ర దర్శనం, ఆహార నియమం, దానాలు, దీప దానం, నిత్యా దైవ నామ స్మరణ విశేష ఫలితం ఇస్తుంది.

🕉కార్తీక మాసం శివ కేశవులకు ఇరువురి కి విశేషం .కార్తీక మాసంలో సోమవారాలు శివారాధన, శనివారం విష్ణు ఆరాధన, నాగులు చవితి , కార్తీక పౌర్ణమి, ముఖ్యంగా కార్తీక మాసంలో ఆదివారం.. చేసే పూజలు చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది..ఆదివారం మాంసం తినకుండా కులదేవతను ఉపాసించాలి రోజు సూర్యుడికి నమస్కారం చేయాలి ఆదివారం రాత్రి అన్నం తినకుండా ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు.

🌞జాతకంలో ఎవరికి ఏ దోషం ఉంటే వాళ్ళు ఈ మాసం అంతా దానికి సంబంధించిన స్త్రోత్రాన్ని ఆ దేవతను ఆరాధించడం వల్ల విశేష మైన ఫలితం ఉంటుంది.
🌷కుజ దోషం ఉన్న వాళ్ళు , వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు ఈ మాసమంతా సుబ్రహ్మణ్య స్త్రోత్రం చదవాలి,
🌷ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం తో బాధపడే వాళ్ళు, బైద్యనాద్ స్త్రోత్రం,ఆదిత్య హృదయం పఠించాలి,
🌷వ్యాపారం లో నష్టాలు,  కుటుంబ కలహాలు, అప్పులు ,కోర్ట్ కేసుల్, అపనిందలు , రాహు గ్రహ దోషాలు ఉన్న వారు మంగళ చండికా స్త్రోత్రం చదవాలి,
🌷మంత్ర సాధన చేస్తున్న వాళ్ళు, కొత్తగా దీక్ష తీసుకుని ఉపాసన చేస్తున్న వాళ్ళు చర్మ వ్యాధులు, అధిక రక్తపోటు మధుమేహ వ్యాధి ఉన్న వారు ఈ మాసం మొత్తం మనసా దేవీ స్త్రోత్రం చదవాలి,
🌷 నేత్ర వ్యాధులు, ఏదైనా మీపైన ప్రయోగం జరిగింది అని అనుమానం ఉన్న వాళ్ళు, ఎంత కష్టపడ్డా ఎదుగుదల గుర్తింపు లేని వారు గరుడ ప్రయోగ మంత్రం చదవాలి..
🌷శత్రు బాధలు ఉన్నవారు దుర్గా స్త్రోత్రం ,
🌷శుభకార్యము జరగాలి అని కోరుకునే వారు లలితా సహస్త్ర నామం,
🌷కొత్త ఇల్లు కొనాలి అనుకునే వారు మణిద్వీప వర్ణన,
🌷భూమి అమ్మాలి అనుకునే వాళ్ళు గణేశ ప్రార్థన, 🌷భూమి కొనాలి అనుకునే వాళ్ళు లక్ష్మీ వరాహ స్వామి ప్రార్థన శ్లోకం,
🌷 ఉద్యోగం ,ప్రమోషన్ కోరుకునే వాళ్ళు కనకధార స్త్రోత్రం,
🌷 రాజకీయ నాయకులు, పోలీసు శాఖ వాళ్ళు, క్రీడా రంగం వాళ్ళు, వారాహి కవచం,
🌷నాటక రంగంలో ఉన్నవాళ్లు వైద్య వృత్తిలో వారు ప్రత్యంగిరి, నరసింహ స్త్రోత్రలు ఈ మాసంలో నియంగా నెల మొత్తం పారాయనఁ చేస్తుండాలి..
🌷విద్యార్థుల సర్వస్వతీ , హాయగ్రీవ, వినాయక స్త్రోత్రలు చదవాలి
🌷అన్ని విధాలా భయాలను తొలగించి కార్యసిద్ధి కలిగించే హనుమంతుడి స్త్రోత్రం ఇక్కడ ఇస్తాను గమనించండి అది వద్దు అనుకునే వాళ్ళు హనుమాన్ చాలీసా చదువుకోండి.

🌷🔱🌷ఆధ్యాత్మిక జ్ఞానం, దైవనుగ్రహం కోసం ఈ మాసం మొత్తం దామోదర అష్టకం ప్రతి రోజూ చదవాలి .

🌷ఈ నెల మొత్తం గడపలో దీపాలు పెట్టాలి తులసి కోటలో దీపం పెట్టాలి, ఉదయం సూర్యోదయానికి ముందు పెట్టె దీపాలు విష్ణు మూర్తికి చేoదుతుంది, సంధ్యకాలం ఆరు పైన పెట్టే దీపాలు శివయ్యకు  చేoదుతుంది.. అకండ దీపారాధన చేసే వాళ్లకు ఈ మాసం చాలా విశేషం 

🔱కొన్ని శ్లోకాలు ఇక్కడ ఇస్తాను గమనించండి.

🕉శ్రీ దామోదరాష్టాకం🕉

నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రాజమానం |
యశోదాభియోలూఖలాద్దావమానం పరామృష్టమత్యంతతో ద్రుత్య గోప్యా ||

రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం |
ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠస్థితగ్రైవ-దామోదరం భక్తి బద్ధమ్ ||

ఇతిదృక్ స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతమ్ |
తదీయేషితాశ్లేషు భకెర్జితత్వం పునః ప్రేమతస్తం శతావృత్తి వందే ||

వరం దేవ మోక్షం న మోక్షావధిం వా న చాన్యం వృణ్నేహం వరేషాదపీహ |
ఇదం తే వపుర్నాథ గోపాలబాలం సదా మే మనస్యావిరాస్తాం కిమన్యెః ||

ఇదం తే ముఖాంభోజమత్యంతనీలైర్వృతం కుంతలైః స్నిగ్ద -రకైశ్చ గోప్యా |
ముహుశ్చుంబితం బింబరక్త ధరం మే మనస్యావిరాస్తాం అలం లక్షలాభైః ||

నమో దేవ దామోదరానంత విష్ణో ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్దిమగ్నం |
కృపాదృష్టివృష్ట్యాతి దీనం బతాను - గృహాణేశ మాం అజ్ఞమేధ్యక్షిదృశ్యః ||

కువేరాత్మజౌ బద్దమూర్వైవ యద్వత్ త్వయా మోచితా భక్తిభాజౌ కృతా చ |
తథా ప్రేమభక్తిం స్వకం మే ప్రయచ్చ న మోక్షే గ్రహో మేపి దా మోదరేహ || 

నమస్తేస్తు దామ్నే స్ఫురదీప్తిధామ్నే త్వదీయోదరాయాథ విశ్వస్య ధామ్నే |
నమో రాధికాయై త్వదీయప్రియాయై నమో నంతలీలాయ దేవాయ తుభ్యం ||

ఇతి శ్రీమద్పద్మపురాణే శ్రీ దామోదరాష్టాకం సాంపూర్ణం ||

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

🕉లక్ష్మీ కటాక్షం🕉

"ఓం, ఐం, హ్రీం, శ్రియైనమౌ
  భగవతి మమ సంరుద్ధౌ జ్వల
  జ్వల మా సర్వ సంపదం దేహిదేహి
  మమ అలక్ష్మీ నాశయ హుం ఫట్ స్వాహీ''

ఈ మంత్రాన్ని మీ శక్తిని బట్టి పఠించండి. రోజూ 108 సార్లు మాత్రం తప్పకుండా జపించాలి. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ధనం రావటం మొదలవుతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నైతిక కార్యాల్లో విజయం లభిస్తుంది

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🌺🌺🌺🌺

🕉ఇంద్ర కృత మానసా దేవి స్తోత్రం🕉

దేవీ త్వాం స్తోతు మిచ్చామి స్వాధీనం ప్రవరామ్ వరామ్ |
పారత్‌పారాం ప చ పరమాం నహి స్టోతుం క్షమో ధూనా ||

స్తోత్రానామ్ లక్షణం  వేదే స్వభావాఖ్యాన తత్ప రమ్ |
న క్షమః ప్రకృతేవక్తూమ్ గుణానామ్ గణనం తవ ||

సుద్దసత్వ స్వరూపా త్వమ్ కోపహింసా వివర్జితా |
న చ  శక్తో  మునిస్తేన త్యక్తుo యాం చ కృతా యతః ||

త్వం మయా పూజితా సాద్వి జననీ మేయథో ధీతహ |
దయారూపా  చ భగినీ క్షమా రూపా యథా ప్రసూమ్ ||

త్వయా మే రక్షితా ప్రాణాః పుత్ర దారాః సురేశ్వరీ |
అహం కరోమి త్వత్పూజామ్ ప్రీతిశ్చ వర్ధతాం సదా  ||

నిత్యా యధ్యపి పూజ్యా త్వం సర్వత్ర జగదంబికే  |
తథాపి తవ పూజాం చ వర్ధయా మి సురేశ్వరీ ||

యే త్వా మాషాడ సంక్రాంత్యామ్ పూజ యిష్యంతి భక్తితహ |
పంచమ్యాం మానసాఖ్యాయ మాసాంతే వా దినే దినే ||

పుత్రపౌత్రాదయః తేషామ్ వర్దితే చ ధనాని వై |
యశస్వినః కీర్తి మంతో విధ్యావంతో  గుణాన్వితాః ||

యే త్వామ్ న పూజాశ్యంతి నిందం త్యజ్ఞాన తో జనాః  |
లక్ష్మి హీనా భవిష్యన్తీ తేషామ్ నాగభయం సదా  ||

త్వమ్ స్వయం  సర్వలక్ష్మీశ్చ  వైకుంటే  కమలాలయా |
నారాయణాంశో భగవాన్ జరత్కారు మునీశ్వరః  ||

తపసా తేజసా వా పిచ మానసా  సన్నుతే  పివా |
అస్మాకం రక్షణాయైవ తేన త్వమ్  మనసాబిదా ||

మానసాదేవి  శక్త్యాత్వమ్  స్వాత్మనా సిద్ధ యోగినీ |
తేన త్వమ్ మానసా దేవీ పూజితా వందితా భవ ||

యే భక్త్యా మానసా దేవ్యాహ్ పూజయం త్య నిశం భృశం |
తేన త్వామ్ మానసా దేవీం ప్రవదంతి మనీషిణః  ||

సత్య స్వరూప దేవీ  త్వామ్ శశ్వత్  సత్య నిషేవణాత్ |
యో హి త్వామ్ భావయే  నిత్యం  సత్వామ్ ప్రాప్నోతి తత్పరః  ||

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

🕉శ్రీ మారుతీ  బీజమంత్ర స్తోత్రమ్🕉

ఓం నమో భగవతే విచిత్రవీర హనుమతే ప్రలయం కాలానల ప్రభాప్రజ్వలనాయ | ప్రతాప వజ్రదేహాయ | అంజనీగర్భ సంభూతాయ ప్రకట విక్రమ నీరదైత్యదానవ యక్షరక్షోగణ గ్రహబంధనాయ | భూతగ్రహబంధనాయ | ప్రేతగ్రహబంధనాయ | పిశాచ గ్రహబంధనాయ | శాకినీ డాకినీ గ్రహబంధనాయ | చోరగ్రహబంధనాయ | కాకినీ కామినీ గ్రహబంధనాయ | బ్రహ్మగ్రహబంధనాయ | బ్రహ్మరాక్షసగ్రహబంధనాయ | చోరగ్రహబంధనాయ | మారీగ్రహబంధనాయ | ఏహి ఏహి | ఆగచ్ఛ అగచ్ఛ | ఆవేశయ ఆవేశయ | మమహృదయే ప్రవేశయ స్ఫుర స్ఫుత | ప్రస్ఫుర ప్రస్ఫుర | సత్యంకథయ వ్యాఘ్రముఖబంధన సర్పముఖంబరాజముఖంబ నారీముఖబంధన సభాముఖంబ శత్రుముఖం బసర్వముఖంబ లంకాప్రాసాద భంజనం | అముకం మే వశమానయ | క్లీం క్లీం క్లీం హ్రీం సశ్రీం శ్రీం రాజానం వశమానయ | శ్రీం క్లీం క్లీం స్తీ ఆకర్షయ శత్రూన్ మర్దయ మార్దయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే శ్రీ రామచంద్రాజ్ఞయా మమ మమ కార్యసిద్ధిం కురు కురు ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్ర: ఫట్ స్వాహా || విచిత్రవీర హనుమాన్ మమ సర్వ శత్రూన్ భస్మకురు కురు | హన హన హుం ఫట్ స్వాహా || ఏకాదశశతవారం జపిత్వా సర్వశత్రూన్ వశమానయతి నాన్యథా ఇతి ||

||ఇతి మారుతీస్తోత్రమ్ సంపూర్ణం ||

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

🕉నవగ్రహ పీడాపరిహార స్తోత్ర🕉

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారక: |
విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే రవి: ||
రోహిణీశ: సుధామూర్తి: సుధాగాత్ర: సుధాశన: |
విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే విధు: ||
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్సదా |
వృష్టికృద్వృష్టిహర్తాచ పీడాం హరతు మే కుజ: ||
ఉత్పాతరూపీ జగతాం చంద్రపుత్రో మహాద్యుతి: |
సూర్యప్రియకరో విద్వాన్పీడాం హరతు మే బుధ: ||
దేవమంత్రీ విశాలాక్ష: సదా లోకహితే రత: |
అనేక శిష్య సంపూర్ణ: పీడాం హరతు మే గురు: ||
దైత్య మంత్రీ గురుస్తేషాం ప్రణవశ్చ మహామతి: |
ప్రభుస్తారాగ్రహణాం చ పీడాం హరతు మే భృగు: ||
సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష: శివప్రియ: |
మందచార: ప్రసన్నాత్మా పీడాం హరతు మే శని: ||
మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబల: |
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ ||
అనేకరూప వర్ణైశ్చ శతశోఽథ సహస్రశ: |
ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమ: ||
|| ఇతి నవగ్రహ పీడాపరిహార స్తొత్రం సంపూర్ణం

🔺🔺🔺🌹🌹🔺🔺🔺🌹🌹🔺🔺🔺

🕉హయగ్రీవస్తోత్రం🕉

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః||

ఫలశ్రుతి :💐
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం||
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

🕉అస్యశ్రీ వారాహీ కవచస్య త్రిలోచన ఋషీః అనుష్టుప్ ఛందః శ్రీ వారాహీ దేవతా               
  ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః
                            ధ్యానమ్

ధ్యాత్వేంద్ర నీలవర్ణాభాం చంద్రసూర్యాగ్ని లోచనాం
విధివిష్ణు హరేంద్రాదిమాతృభైరవసేవితామ్ 1

జ్వలన్మణిగణప్రోక్త మకుటామావిలంబితాం
అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ 2

ఏతైస్సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం
పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తి ఫలప్రదమ్   3

పఠేత్త్రి సంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం
వార్తాళీ మే శిరః పాతు ఘోరాహీ ఫాలముత్తమమ్    4

నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ
ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంధినీ  5

పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంథమాదరాత్
స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా    6

సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా
నాభిం చ శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి 7

ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ        గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తంభినీ తథా  8
చండోచ్చండ శ్చోరుయుగం జానునీ శత్రుమర్దినీ
జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయో   9

పాదాద్యంగుళిపర్యంతం పాతు చోన్మత్తభైరవీ
సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా. 10

యుక్తాయుక్తా స్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే
సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరమ్.   11

సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే
సర్శశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా.   12

సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేష సంహతిః
వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః. 13

తథావిధం భూతగణా న స్పృశంతి కదాచన
ఆపదశ్శత్రుచోరాది గ్రహదోషాశ్చ సంభవాః.   14

మాతాపుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనం
తథాంగమేవ వారాహీ రక్షా రక్షాతి సర్వదా.   15

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

🕉 కుజదోష నివారణ శ్రీ షణ్ముఖదండకం🕉

ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్థూల సూక్ష్మ ప్రదర్శకాయం, ప్రకీర్తి ప్రదాయం, భజేదుర్ధరాయం, భజేహం పవిత్రం, భజే శివతేజం, భజే స్థాపకాయం, భజే ప్రసన్నరూపం, భజే దయామయివటంచున్ ప్రభాతంబు, సాయంత్రం మున్నీదు దివ్యనామ సంకీర్తనల్ జేసినన్, నీ రూపు వర్ణించి, నీ మీదనే దండకం బొక్కటిన్ జేయనూహించి, నీ దివ్యగానంబు కీర్తించి, నీ దాసదాసుండనై శివభక్తుండనై నిన్ను నే గొల్చేదన, నీవు దయాదృష్టిన్ జూచితే వేడుకల్ జేసితే, నా మొరాలించితే, నన్ను రక్షించితే శివపార్వతీ ప్రియపుత్రాయ, నిన్నెంచ నేనెంత వాడన్, కరుణా కటాక్షంబున జూచితే దాతవై బ్రోచితే, తొల్లి షణ్ముఖుండవై, కార్తికేయుండవై, శివాహ్వానాన్ని మన్నించి, కైలాసమునకున్ బోయి దేవసైన్యాధ్యక్షుండవై, కీర్తిమంతుడవై, చిత్ర బర్హణవాహనుండవై, పార్వతీ పరమేశ్వరాశీస్సులన్ బొంది, కార్యసాధకుండవై, నీ వీరపరాక్రమంబులన్ జూపి అమరులకున్ అభయమున్నిచ్చిత్రైలోక్య పూజ్యుండవై, ముప్పది మూడు కోట్ల ద్వతలకున్నిష్ణుండవై, తారకాసుర సంహరివై, శోణిత పురంబువై దండయాత్రన్ ప్రారంభించి పురంబు ముట్టడించి, రణభేరుల్ మ్రోగించ, విశాఖునిన్ రాయబారిగా ఆ యసుర పురంబుజకున్ జంప, తారకాసురుండు రెట్టించి హెచ్చించి నాగ్రహంబుతో నీ మీదకున్ దండెత్త, మ నీవప్పుడే శివపంచాక్షరిన్ జపించి మంత్రించి, నీ దివ్య తేజంబుజన్ జూప తారకాసురుండచ్చెరువంద, అమితోత్సాహుండవై పాశుపతాస్త్రమున్ ప్రయోగింప, దైత్యులంతటన్ కకావికలైపోవన్నట్టి సమయంబునన్, తారకాసురన్, దృంచ, నా దుష్టుడన్ పునర్జీవించి బాధనొందింపగా, నాతని కంఠమునందున్న శివలింగమున్నీవు చ్చేదించి ఆ యసరునిన్ జంప, లోకంబులానందమై యుండ నీ దివ్య తేజంబు సమస్త లోకంబులన్ బ్రసరింప వేల్పులందరున్ వేనోళ్ళ బొగడంగ త్రిమూర్తులన్ హర్షించి, మోదంబునన్ నీకు కళ్యాణమున్ జేయబోవంగ, దేవసేనిన్ బెండ్లాడి సుఖంబునుండన్ నీవు శ్రీ వల్లినిన్ జూచి మోహింప ఉమామహేశ్వరుడన్నది గ్రహించి వైభవోపేతంబుగా శ్రీ వల్లిన్నిచ్చి వివాహంబుజేయ, శ్రీ శివామోదంబుగా నిన్ను నే సేవించి నా కుజ దోష నివారణకున్ నిన్ ప్రార్థింప, ఆమోదంబు దేల్పినన్ బాయవే, అష్టైశ్వర్య సామ్రాజ్యముల్ గల్గవే నీవే సమస్తంబుగా నెంచి యీ దండకంబున్ పఠించుచున్ శివేశ్వరాయంచున్ శివతేజంబుజన్ వేల్గుదువో వీర సుబ్రహ్మణ్యేశ్వరా! నీదు నామంబు స్మరించినంతన్ అంగారక గ్రహదోష నివారణన్ జేసి నీ దివ్య రూపంబునుం జూపి హృదయాంతరంగయటంచున్ నన్నేలు నా స్వామి ఓం సుబ్రహ్మణ్యేశ్వరా! తారకాసుర సంహారా! దేవసే శ్రీ వల్లీస నాథా! నమస్తే నమో కుజదోష నివారకాయ నమస్తే నమస్తే నమ:
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

🕉 మంగళచండికా స్త్రోత్రం 🕉

​రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే​
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే.
హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే.
మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే
సతాం మంగళతె దేవీం సర్వేషామ్ మంగళాలయే
పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే
పూజ్యే మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్
మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని
సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే

🔱ఈ మంగళ చండికా స్త్రోత్రం ప్రతి రోజూ రాహుకాలంలో చదవటం వల్ల రాహు గ్రహ దోషాలు, ఎన్నో ఆటంకాలు సమస్యలు తీరుతుంది🔱

♦♦♦♦♦♦♦♦♦♦♦♦
ఈ స్త్రోత్రలు తో పాటు శివ స్ట్రోత్రాలు కూడా పారాయనఁ చేయాలి ఎవరికి ఏది అవసరమో అది నిత్యా పారాయనఁ చేయాలి...అన్ని కూడా పూజ సమయంలో గృహంలో పటించడం మంచిది

🔱శ్రీ మాత్రే నమః🔱

Tuesday, October 22, 2019

ఫలాలు ఫలహారాలు - తెలుగు పేర్లు

1. #చూతఫలం = మామిడిపండు
2. #ఖర్జూర = ఖర్జూరం.           
3. #నింబ = నిమ్మపండు
4. #నారింగ = నారింజ
5. #భల్లాతకీ = జీడిపప్పు
6. #బదరీ = రేగు
7. #అమలక = ఉసిరికాయ
8. #శుష్కద్రాక్ష = కిస్మిస్
9. #అమృత లేక బీజాపూరం = జామపండు
10. #ఇక్షుఖండం = చెఱకుముక్క
11. #కధలీఫలం. రంభా ఫలం = అరటిపండు
12. #నారికేలం = కొబ్బరికాయ
13. #జంభీర = కమలాఫలం
14. #దాడిమీ = దానిమ్మపండు
15. #సీతాఫలం = సీతాఫలం
16. #రామఫలం = రామఫలము
17. #కపిత్త = వెలగ పండు
18. #శ్రీఫలం. బిల్వఫలం = మారేడు
19. #మాధీఫలం = మారడి  పళ్లు
20. #జంభూఫలం = నేరేడు ప్రసాధములు.
===========================
1. #కుశలాన్నం = పులగం
2. #చిత్రాన్నం = పులిహోర
3. #క్షీరాన్నం = పరమాన్నం
4. #పాయసం = పాయసం లేదా తిమ్మణం
5. #శర్కరాన్నం = చక్రపొంగలి
6. #మరీచ్యన్నాం = కట్ లేదా మిరియాలపొంగలి
7. #ధద్యోజనం = పెరుగు అన్నము
8. #తిలాన్నం = నువ్వులపొడితో చేసిన అన్నం
9. #షాకమిశ్రీతాన్నం = కిచ్చిడీ
10. #గుడాన్నం = బెల్లపు పరమాన్నం
11. #సపాదభక్ష్యం = గోధుమనూకతో చేసిన ప్రసాదం
 (గోధుమ నూక చీనీ నెయ్యి సమపాళ్ళలో వేసి చేసిందిగాన ఆపేరు)
12. #గుడమిశ్రితముద్గసూపమ్ = వడపప్పు
13. #గుడమిశ్రీత_తండులపిష్టం = చనివిడి
14. #మధురపానీయ = పానకం
15. #పృథక్ = అటుకులు
16. #పృథకాపాయస = అటుకుల పాయసం
17. #లాజ = పేలాలు
18. #భక్ష్యం = పిండివంటలు
19. #భోజ్యం = అన్నము మొదలగునవి
20. #వ్యంజనం = పచ్చడి
21. #అపూపం = అరిసెలు లేదా అప్పములు
22. #మాషచక్రం = గారెలు
23. #లడ్డుక. = లాడూలు
24. #మొదకం = ఉండ్రాళ్ళు.

Saturday, October 19, 2019

నిత్యం చదువుకోదగిన కొన్ని శ్లోకాలు:

👉నిద్రలేచి కరదర్శనం:

కరాగ్రే వసతే లక్ష్మీ: I కర మధ్యే సరస్వతీ I
కర మూలే స్థితా గౌరీ I ప్రభాతే కర దర్శనం II

👉నిద్రలేచి భూ ప్రార్ధన:
సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే I
విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే II

👉ప్రాతః స్మరణం

గోవిందం మాధవం కృష్ణం హరిం దామోదరం తధా I
నారాయణం జగన్నాధం వాసుదేవ మజం విభుం I
సరస్వతీం మహాలక్ష్మీం సావిత్రీం వేద మాతరం I
బ్రాహ్మణం భాస్కరం చంద్రం దిక్పాలాంశ్చ గృహం స్తథా II

శంకరంచ శివం శంభుం ఈశ్వరంచ మహేశ్వరం I
గణేశంచ తథా స్కందం గౌరీ భాగీరధీం శివాం I
పుణ్యశ్లోకో నలో రాజా పుణ్యశ్లోకో జనార్దనః I
పుణ్యశ్లోకా చ వైదేహీ పుణ్యశ్లోకో యుధిష్టరః

అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః I
కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః I

(ఫలశ్రుతి: బ్రహ్మ హత్యాది పాపాలు పోతాయి. సమస్త యజ్ఞ ఫలం సిద్ధిస్తుంది. లక్ష గోవుల్ని దానం చేసిన ఫలితం సిద్ధిస్తుంది)

👉నవగ్రహ స్తోత్రం:
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ I
గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః II

👉సూర్య స్తుతి:

ఓం మిత్ర రవి సూర్య భాను ఖగ పూష I
హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవితృర్క భాస్కరేభ్యో నమః II

నమో ధర్మవిధానాయ నమస్తే కృతసాక్షిణే I
నమః ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః II

భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర I
ఆరోగ్య మాయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహిమే II

👉శ్రీరామ ప్రాతఃస్మరణం:

ప్రాతః స్మరామి రఘునాథ ముఖారవిందం I
మన్దస్మితం మధురభాషి విశాలఫాలమ్ I
కర్ణావలమ్బిచలకుండలశోభిగన్డం I
కర్ణాoతదీర్ఘ నయనం నయనాభి రామమ్ II

👉ఆంజనేయ ప్రార్థన:

మనోజవం మారుతతుల్య వేగం I
జితేంద్రియం బుద్ధి మతాంవరిష్ఠం I
వాతాత్మజం వానరయూధ ముఖ్యం I
శ్రీ రామదూతం శిరసా నమామి II

బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత I
అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణా భవేత్ II

నమస్తేస్తు మహావీర నమస్తే వాయునందన I
విలోక్య కృపయానిత్యం త్రాహిమాం భక్త వత్సల II

అమలకనక వర్ణం పృజ్వలత్పావకాక్షం I
సరసిజనిభవక్త్రుం సర్వదాసుప్రసన్నం I
పటుతరఘన గాత్రం కుండలాలంకృతాంగం I
రణజయకరవాలం రామదూతం నమామి II

నాదబిందుకళాతీతం ఉత్పత్తి స్థితివర్జితం I
సాక్షాదీశ్వరరూపంచ హనుమంతం నమామ్యహం II

సువర్చలాకళత్రాయ I చతుర్భుజ ధరాయచ I
ఉష్ట్రారూడ్హాయ వీరాయ I మంగళం శ్రీహనుమతే II

👉దధివామన స్తోత్రం:
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం I
హరిం నరహరిం రామం గోవిందం దధివామానం II
(బ్రహ్మవైవర్త పురాణం)

👉కృష్ణ స్తుతి:

కస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం I
నాసాగ్రే నవమౌక్తికం కరతలేవేణుం కరేకంకణం I
సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠీచ ముక్తావళిం I
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గొపాలచూడామణి: II

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం I
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుం II

కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే I
నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే II

కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే I
ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః II

ఇమం మంత్రం జపం దేవి ! భక్త్యా ప్రతిదినం నరః I
సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకమవాప్నుయాత్II

👉శ్రీ వేంకటేశ్వర స్తుతి:
ఓం నమో వేంకటేశాయ పురుషాయ మహాత్మనే I
ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నం నమః II

👉విష్ణు స్తుతి:
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం I
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమం II

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం I
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం I
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం I
వందే విష్ణుం భవ భయ హారం సర్వలోకైక నాథం II

👉లక్ష్మీ స్తుతి :

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం I
దాసీభూతసమాస్త దేవ వనితాం లోకైక దీపంకురాం I
శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం I
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం II

పద్మప్రియే పద్మిని పద్మహాస్తే !
పద్మాలయే పద్మదలాయతాక్షి !
విష్ణుప్రియే విష్ణుమనోనుకూలే !
త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ II

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే I
శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే II

👉శివ స్తుతి :
శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం I
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం I
నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే I
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి II

వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం I
వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం I
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం II

👉భోజనము చేసే ముందు పఠింపదగిన శ్లోకములు :

శ్లోకం: " త్వదీయం వస్తు గోవింద
తుభ్యమేవ సమర్పయే
గృహాణ సుముఖోభూత్వ
ప్రసీద పరమేశ్వర"

తాత్పర్యం: 'ఓ గోవిందా! నీ వస్తువును నీకీ సమర్పిస్తువున్నాను. నీవు నా యందు ప్రసన్నుడవై ప్రసన్నముఖముతో దీనిని గ్రహించు'

శ్లోకం: " బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మాగ్నౌబ్రహ్మణాహుతం I
బ్రహ్మైవతేన గన్తవ్యం బ్రహ్మ కర్మ

Friday, October 18, 2019

పరిషేచన అంటే ఏమిటి ?

ఈ పరిషేచన ఏమిటి? అన్నం తినే ముందు తినే పళ్ళెం చుట్టూ అలా మంత్రం చదివి నీళ్ళేందుకు చల్లి అలా మెతుకులు నోట్లో వేసుకుంటున్నారు?
(ఇతఃపూర్వం మరొక పోస్ట్ లో కొద్దిగా చెప్పిన విషయం కొంచెం విస్తారంగా వివరణ)

ఇప్పుడే చదివాను ఒక మహానుభావుడు ఇలా కంచం చుట్టూ నీళ్ళు పొయ్యడం వలన చీమలు దోమలు మనం తినే ఆకు మీదకు రావు, కంచం లోకి రావు, కాబట్టి మనకు ఇలా చెయ్యమని చెప్పారు.  ఉత్తినే చేస్తే బావుండదని ఒక రెండు మంత్రాలు చెప్పారు అని. అటువంటి మహానుభావుని తలకు నా పాద అభివందనం. తమకు మాత్రమె తర్కం తెలుసు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలన్న తపన వలన ఇటువంటి అద్భుతమైన రత్నాలు అలా జాలువారుతూ ఉంటాయి.
నిజంగా అనుష్టానం చెయ్యని వాడు ఏది చెప్పినా చెప్పు పుచ్చుకు తరమాలి తప్ప వాటిని యే రకంగాను ప్రామాణికంగా తీసుకోకూడదు.

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇలా భోజనం ముందు పరిషేచన చెయ్యడం లో ఒక పెద్ద రహస్యం దాగి వుంది.
మనం తినే ప్రతీ మెతుకు మీదా మన రాసి ఉంది అంటారు పెద్దలు. అది నీకు ప్రాప్తం ఉండబట్టే అన్నం తినగలుగుతున్నావు, అరాయించుకోగలుగుతున్నావు.  ఒక బ్రాహ్మణుడు సాత్వికాహారం పరిశుద్ధంగా తీసుకుని తనలోని సాత్త్విక శక్తిని ఉద్దీపింపచేసుకోవాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినే మనం మన ప్రాణం నిలబెట్టుకోగలుగుతున్నాము. శక్తిని సంపాదించి పనులు చెయ్యగలుగుతున్నాము. ఇలా మనలోని అన్నం అరగాలన్నా, అన్నం శక్తిగా మారాలన్నా జఠరం సరిగ్గా పని చెయ్యాలి. ఇలా చేస్తున్న ఈ జీర్ణవ్యవస్థ మనకు దేవుడు పెట్టిన భిక్ష. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు.
“”అహం వైశ్వానరో భూత్వాప్రాణినాం దేహమాశ్రితః ! ప్రాణాపానస మాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ !! (5-14)””
అంటే: నేనే ప్రాణాపానసంయుక్తమైన వైశ్వానరుడు అనే అగ్ని రూపములో సర్వప్రాణుల శరీరములయందుండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును.
ఆయన మనలో ఉండి అగ్నిరూపంలో మన ఆహారాన్ని జీర్ణం చేసి మనకు శక్తిని ఇస్తున్నాడు.  మనలో దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నవారికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏమి కావాలి.

మడిగా వంట చెయ్యడం కూడా ఒక యజ్ఞం, ఇంటి ఇల్లాలు శుచి శుభ్రత పాటిస్తూ తనను, తన పరిసరాలను శుచిగా ఉంచుతూ ఆ అగ్నిభట్టారకుని సహాయంతో ధర్మంగా సంపాదించిన దినుసులతో, కూరగాయలతో వంట చేస్తుంది. మడిగా ఉంటూ కేవలం భగవదారాధన తన మనస్సంతా నింపుకుని చేసిన వంట ముందుగా ఆ భగవంతునికి నివేదించి వీరు తింటారు. వంట చేసేవారి మానసిక స్థితి ఆ తినే వారి మానసిక స్థితిమీద ప్రభావం చూపుతుంది అని నిన్న మొన్న ఒక గొప్ప university వారు కనుక్కున్నారు.  ఇది మనం ఎప్పటినుండో ఆచరిస్తున్న ఒక సదాచారం.

మరి భోజనం చెయ్యడమో? అది కూడా ముమ్మాటికీ యజ్ఞమే. ఇక ఆ భోజనాన్ని భుజించేవాడు కూడా తాను తింటున్న ఆహారాన్ని లోనున్న ఆత్మారాముని సంతృప్తి పరుస్తున్నానని, లోన అగ్ని రూపంలో ఉన్న వైశ్వానరుడికి (జఠరాగ్ని లో హవిస్సు వేసినట్టు నువ్వు నీ భోజనం అందిస్తే ) యజ్ఞం (మనం మామూలుగా యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా ! అదితే అనుమన్యస్వ. అనుమతే అనుమన్యస్వ. సరస్వతే అనుమన్యస్వ. దేవ సవితః ప్రసువ అంటూ చేస్తున్న మనస్సుహోమగుండం చుట్టూ నీటితో పరిషేచన చేసి అగ్నిదేవునికి స్వాహాకారాలతో యజ్ఞం చేసినట్టు) తో పరిషేచన చేసి భోంచేస్తాడు. వాడు తింటున్న ఆహారం కూడా ఒక పూజ, ఒక యోగం. నీలో ఉన్న దేవునికి నువ్వు హవనం చేస్తున్నానని నమ్మి తింటే అది కూడా పూజే. అందుకే కంచం ముందు కూర్చున్నప్పుడు ఇతర విషయాలు మాట్లాడకుండా కేవలం భోజనం మీద మనస్సు లగ్నం చేసి తినమని ఆయుర్వేదం చెబుతుంది. నువ్వు భోజనం ఒక పూజలా చేస్తే నీలో ఉన్న ఆ వైశ్వానరుడు త్రుప్తి చెంది నీకు తగిన శక్తినిచ్చి ఆయుష్షుని అభివృద్ధి చేస్తాడు.

మన తర్వాతి తరాలకు చెప్పవలసిన విషయం చెప్పేవిధంగా చెబితే తప్పక గౌరవించి పాటిస్తారు. ఇది మనందరి కర్తవ్యం.
ఇక్కడ బ్రాహ్మణులకు మాత్రమే అని కొందరు అనుకుంటున్నారు కానీ కాదు...బ్రాహ్మణులకు ఒక విధం గా అలాగే మిగిలిన వాళ్ళకి ఒక విధం గా చెయ్యవచ్చు

మిగతా వారు అందరూ కూడా భగవద్గీతలో రొండు శ్లోకాలు ఉన్నాయి..

పైన పోస్టులు లో  "అహం వైశ్వా నరో భుత్వ" ఒకటి...రొండోది "బ్రహ్మర్పణం బ్రాహా హవిహి" అనేవి చెప్పుకోవాలి...మొదటి దాని అర్థం పోస్టులో ఉంది.. రొండోవ దాని అర్థం ఓండేవాడు తినేవాడు ఓండే పాత్రలు అన్ని బ్రహ్మమే అనే ఉద్దేశం..

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

Saturday, October 12, 2019

వారణాసి పీఠస్థాన వివరములు: (వివిధ భైరవ రూపాలు)...


ఇక్కడ ఇవ్వబడ్డ వివరాలు అన్ని కాశీ లోని శివలింగం రూపాల్లో ఉన్న భైరవులు ఇవి చాలా వరకు భూగర్భంలో కలసి పోయింది , కొన్ని మటుకే ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయి ..మొత్తం వారణాసిలో 10,000 పైన శివలింగాలు భూగర్భంలో ఉన్నాయి వాటికి రక్షణగా ఈ బైరావులు ఉంటారు, కాలక్రమంలో కొన్ని దాడుల వలన చాలా ఆలయాలు భూమట్టంలో కలిసిపోయాయి అందువల్ల ఈ శివలింగ రూపంలోనే భైరవ రూపాలు నామాలు చాలా మందికి తెలియదు, అలాగే  విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే కాస్మిక్ ఎనర్జీ శక్తి కేంద్రాలు ఒక్క కాశిలోనే 51 ప్రాంతాలు ఉన్నాయి వాటికి గుర్తుగా వినాయక పురాతన ఆలయాలు అక్కడ ఉన్నాయి..

కాశీ క్షేత్రం మహా మహిమాన్వితమైన నది ,ఇది శతకోటి యొగినులుతో పరివేష్టితమై యుండును.ఈ స్థానం మండాలాకార రూపముగా మాతృకా స్వరూపముగా విరాజిల్లుతుంది.కోటానుకోట్ల స్వయంభూలింగములు సాధకులకు అభీష్టములు నెరవెర్చుతుంది.. ఎక్కడ జపం చేసే త్వరగా మంత్రం సిద్ధిస్తుంది, కాశీలో మరణించిన వారు శివుని రూపంలోనే కైలాసం చేరుకుంటారు అంటారు..అటువంటి కాశీ క్షేత్రంలో ఏ దిశలో ఏ రూపంలో భైరవుడు లింగ రూపంలో ఉంటారో ఇక్కడ వివరాలు తెలుసుకుందాము. బైరవుడి అనుగ్రహము ఆజ్ఞ లేకుండా కాశీలో అడుగు పెట్టలేరు... ఈ నామాలు చదివి భైరవుడికి నమస్కరించు కున్నా ఎన్నో భయాలు తొలగిపోతాయి ఆ స్వామిని తలుచుకున్నాను అంత అనుగ్రహం దక్కుతుంది.

  పూర్వదిశయందు దశలింగములు ముఖ్యమైనవి కలవు.వాటిపేర్లు 1.జటిల  2.కాల  3.ఉన్మత్త  4.క్రోధరాజ  5.సదాశివ  6.దధీచినాధ  7.సువాశీ  8.ప్రమధేశ్వర  9.యఙనాధేశ్వర  10.అయితేశ్వర వల్లభ.

  ఆగేయదిశలో 10 లింగములున్నవి. 1.వజ్రధర  2.మహాకాల  3.కపిలేశ్వర  4.పంచానన  5.యోగినాధ  6.ఘఘిరేశ  7.పినాకదృక్  8.పశుపాల  9.క్షేమద  10.బ్రహ్మనాధ.

  దక్షిణదిశలో 10 లింగములున్నవి. 1.వీరేశ్వర  2.శూలేశ్వర  3.సిద్దేశ్వర  4.శ్రీ పార్వతీశ్వర  5.గణనాదీశ్వర  6.శంభు  7.ప్రచండ  8.దక్షయఙహా  9.కామరాజేశ్వర  10.కామకలేశ.

   పశ్చిమ దిశలో 10 లింగములున్నవి. 1.ఆరుణేశ్వర  2.యోగేంద్రేశ్వర  3.ఈశాన  4.అసురాంతకేశ్వర  5.త్రిశూలేశ్వర  6.వరుణేశ్వర  7.కాళేశ్వర  8.కామదాయకేశ్వర 9.కాలఙిరుద్రేశ్వర  10.భద్రేశ.

  వాయువ్యదిశలో 10 లింగములున్నవి. 1.మహారుద్ర  2.వాతనాధ  3.రుద్రాత్మ  4.రౌద్రరూపక  5.రూపనాధ  6.హనుమాన్  7.సూర్యేశ  8.వసుదేశ్వర  9.వాసుకీవల్లభ  10.సత్యపతి.

  ఉత్తరదిశలో 11 లింగములున్నవి.  1.ఉత్తరాస్య  2.కుబేరేశ్వర  3.ఈశ్వర  4.పంచాధార  5.పరమేశ  6.పరహంస  7.ప్రభాకర  8.ఆనంతేశ  9.కామరక్ష  10.రత్నేశ్వర  11.ఉమాపతి.

  ఈశాన్యదిశయందు 11 లింగములున్నవి. 1.ఈశ  2.వైశ్వానరేశ్వర  3.ఈశాన  4.మాయేశ  5.బటుకేశ  6.రామేశ్వర  7.కాలంతకేశ  8.విస్వామిత్రేశ్వర  9.మహాకామపురీశ్వర  10.సర్వరూపప్రకాశక  11.కామాఖ్యేశ్వర.

   మండలములో క్రిందభాగమందు 13 లింగములున్నవి. 1.మృత్యుంజయ  2.మోక్ష  3.శివేశ  4.భైరవేశ  5.భూతనాధ  6.భూతకర్తా  7.క్షేత్రపాల  8.పరాపర  9.మృత్యుఘోషేశ్వర  10.కాలదమన  11.కౌశలేశ్వర  12.మునినాధ  13.వర్ణమాలి.

  ఈ భైరవరూప రుద్రమూర్తులు 10వేలలింగములకు ప్రతినిధులుగా ఉన్నవి.పంచతత్వములతో సాధకులను రక్షించిచూ అభీష్టసిద్దినిచ్చుచున్నవి.

   ఊర్ధ్వస్థానమున 13 లింగములున్నవి. 1.బ్రహ్మేశ  2.బ్రహ్మకులేశ  3.బ్రహ్మలింగ  4.విధీస్వర  5.బ్రహ్మాండభేదక  6.ఆత్మరామ  7.వక్రేశ్వర  8.బలీశ  9.భార్గవేశ  10.సదానందేశ్వర  11.హర  12.కృష్ణేశ్వర  13.రామనాధ.

   కాశీనాధుడు అర్చించిన 12 మహావిద్యలు కలవు. 1.త్రిపురసుందరి  2.త్రిపుర భైరవి  3.భువనేశీ  4.అన్నపూర్ణ  5.మాతంగి  6.వింధ్యవాసిని  7.చినమస్తా  8.బగళాముఖి  9.త్రికూటా  10.పంచమి  11.కాళీ  12.తార.

  ఇవి తంత్రోక్త పూజావిధానములో అర్చించిన సాధకుల అభీష్టములు నెరవేర్చ గలవు.

శ్రీ మాత్రే నమః

How many deities are mentioned in Gayatri Mantra ?

There are 26 gods in gayatri mantra:

tat - ganesh
sa - Narasimha
vi - vishnu
tu - siva
va - krishna
re - radha
Ni - lakshmi
yam - agni
bha - indra
Rgo - saraswati
dE - durga
va - hanuman
sya - prithvi
dhee - surya
ma - Sriram
hi - seetha
dhi - chandra
yO - yama
ya - brahma
na - varuna
chO - hayagreeva
da - hamsa
yaat - tulasi

One should chant 1008 times, or 108 time of 28 times or atleast 10 times
gayatri has fire in face, brahma the creator in forehead, vishnu the protector in heart and Siva the destroyer on top of head.

So its a combination of all gods.

Gayathri Manthra should be chanted 3 times a day.

Goddess Gaythri confers the boon of Intelligence as Gayathri, Protection as Savithri and Learning as Saraswathi. Gayathri is therefore called Sarvadevata Swarupini 

Friday, October 11, 2019

Know something about Telugu

For those whose mother tongue is Telugu
Who loves Telugu and who wants to

Our Mother Tongue Telugu....

Interesting Facts of Telugu Language
1. Telugu Language was  known to exist since the Time period 400 BCE.
2. In 2012 Telugu has been voted as the 2nd best script in the world by International Alphabet Association, Korean ranks no 1.
3. Speaking Telugu Language activates about 72000 neurons in your body, highest for any Language in the world proven by Science.
4. An ethnic group from Sri Lanka called Sri Lankan Gypsy people mostly speak Telugu.
5. There are many many Telugu communities in Myanmar Just do a Google Search.
6. In 16th century an Italian Explorer Niccolò de’ Conti found that the words in Telugu language end with vowels, just like those in Italian, and hence referred it as “The Italian of the East”.
7. Telugu ranks 3rd by the number of native speakers in India (75 million people), and 15th in the Ethnologue list of most-spoken languages worldwide.
8. Telugu derived from trilinga, as in Trilinga Desa, “the country of the three lingas”. According to a Hindu legend, Shiva descended as a linga on three mountains: Kaleswaram in Nizam, Srisailam in Rayalaseema and Bhimeswaram in Kostha;
9. Telugu is the only language in the Eastern world, that has every single word ending with a vowel sound.
10. Telugu language has the most number of सामितलु i.e., idioms and proverbs.
11. Telugu language previosuly also known as Tenungu or Telungu.
12. Rabindranath Tagore is said to have stated that Telugu is the sweetest of all Indian Languages.
13. About 200 Years ago about 400 people Telugu speaking people were taken to Mauritius as plantation workers, now Prime Minister is one of their descendants.
14. A Palindrome of 40 slokas which when read from start to end is Ramayana and end to start Mahabharata, there is no other Language like this.
15. Sri Krishnadevaraya visited this temple in Srikakulam and paid homage to the deity. It was here that Krishnadevaraya wrote the literary classic, Amuktamalyada at the order of the Lord Andhra Vishnu who had said “Des Bhashalandu Telugu Lessa” (Telugu is the greatest among the state’s languages”) and ordered Sri Krishnadevaraya to adopt Telugu as the official language of his province.
16. We have a single lettered poem in Telugu also called ekakshara padhyamulu
Often said by all Greatest Saints that...Telugu language is greatest boon from Creators .........
Be proud to Be a Telugu person....

Thursday, October 10, 2019

కార్తవీర్యార్జున ద్వాదశనామస్తోత్రమ్ స్తోత్రం

అప్పు  ఇచ్చి తిరిగిరాదు అనుకున్న సొమ్ము , పోయాయి అనుకున్న వస్తువులు, ...... ఇల్లు వదిలి వెళ్ళిన వ్యక్తులు,  వంటివి మనం     తిరిగి   పొందడానికి ,  స్థల సంబంధిత వివాదాలు , ఆస్తితగాదాలు  నివారణకు చదువవలిసిన  స్తోత్రం

కనీసం 28 సార్లు  మండలం  రోజులు   చదవడం  వలన  ప్రయోజనం  ఉంటుంది

కార్తవీర్య ద్వాదశనామస్తోత్రమ్ 

కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ ।
తస్య స్మరణమాత్రేణ గతం నష్టం చ లభ్యతే ॥ ౧॥

కార్తవీర్యః ఖలద్వేషీ కృతవీర్యసుతో బలీ ।
సహస్రబాహుః శత్రుఘ్నో రక్తవాసా ధనుర్ధరః ॥ ౨॥

రక్తగన్ధో రక్తమాల్యో రాజా స్మర్తురభీష్టదః ।
ద్వాదశైతాని నామాని కార్తవీర్యస్య యః పఠేత్ ॥ ౩॥

సమ్పదస్తత్ర జాయన్తే జనస్తత్ర వశం గతః ।
ఆనయత్యాశు దూరస్థం క్షేమలాభయుతం ప్రియమ్ ॥ ౪॥

కార్తవీర్య మహాబాహో సర్వదిష్టవిబర్హణ ।
సర్వం రక్ష సదా తిష్ఠ దుష్టాన్నాశయ పాహి మామ్ ॥ ౫॥

సహస్రబాహుసశరం మహితం
సచాపం రక్తామ్బరం రక్తకిరీటకుణ్డలమ్ ।
చోరాది-దుష్టభయ-నాశం ఇష్టదం తం
ధ్యాయేత్ మహాబల-విజృమ్భిత-కార్తవీర్యమ్ ॥ ౬॥

యస్య స్మరణమాత్రేణ సర్వదుఃఖక్షయో భవేత్ ।
యన్నామాని మహావీర్యశ్చార్జునః కృతవీర్యవాన్ ॥ ౭॥

హైహయాధిపతేః స్తోత్రం సహస్రావృత్తికారితమ్ ।
వాఞ్చితార్థప్రదం నృణాం స్వరాజ్యం సుకృతం యది ॥ ౮॥

   ॥  ఇతి కార్తవీర్య ద్వాదశనామ స్తోత్రమ్ ॥

ధ్యానం - నీ లోనికి నీ పయనం

ధ్యానం -

నీ లోపల, నీ బయట, సర్వత్రా వ్యాపించివున్న పరమాత్మను దర్శించటానికి నీ లోనికి, నీ పయనం చేసి ఆత్మదర్శనం పొందడం.

ధ్యానం -

మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో మనలోనికి మనం చేసే ప్రయాణం.

ధ్యానం -

ఆత్మ, పరమాత్మల కలయిక కోసం చేసే ప్రయత్నంలో ఓ మార్గం.

ధ్యానం -

వంచించే ఇంద్రియాలు ద్వారా పరమాత్మను గ్రహించగలమన్న అజ్ఞానమును వీడి, బాహ్యవిషయములనెరిగే మనస్సుని, ఎగిసిపడే అహంకారాన్ని అంతమొందించి హృదయంలోని అవ్యక్తమైన కాంతినీ, స్వస్వరూపస్థితిని ఎరుక లోనికి తెచ్చే ప్రక్రియ.

ధ్యానం -

మనస్సు యొక్క నిశ్చలత్వం.

ధ్యానం -

మనల్ని పరమసత్యానికి దగ్గరగా తీసుకెళ్ళే మార్గం.

ధ్యానం -

ఇతరభావాలను విడిచి ఒకే ఒక భావంపై ఏకాగ్రతను కల్గించడం.

ధ్యానం -

అంతరంగ చైతన్యముకు చేరువకావడం.

ధ్యానం -

హృదయాంతర్గత ఆత్మచైతన్యంలో జీవించడం.

ఎందఱో ధ్యానసిద్ధిని పొందినవారు ధ్యానత్వంలో ఉన్న మహిమత్వాన్ని ఇలా ఎన్నోరాకాలుగా నిర్వచించినను ఇది ఎవరికి వారే తెలుసుకోవాల్సిన సత్యం. ఎవరికి వారే తప్పనిసరిగా చేయాల్సిన అంతర్ముఖప్రయాణం. ఎవరికివారే పొందాల్సిన స్థితి. ఎవరికి వారే పొందాల్సిన అనిర్వచనీయమైన చైతన్యానుభూతి.
                           
ప్రాపంచిక జీవనం, పారమార్ధిక జీవనం సమతుల్యముగా ఉన్నప్పుడే మానవుడిది పరిపూర్ణజీవితమౌతుంది. ప్రాపంచిక, పారమార్ధిక జీవనగమనములో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత తప్పనిసరి. ఈ రెండూ ధ్యానం వలనే సాధ్యం.

పరిపూర్ణజీవనానికి ధ్యానమే మార్గమని శ్రీకృష్ణ పరమాత్మ, పతంజలి, బుద్ధుడు, గురునానక్, మహావీరుడు మొదలు రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, నేటి సద్గురువులు వరకు; అలానే ఎందఱో ఆధునిక శాస్త్రీయ పరిశోధకులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ధ్యానం మైండ్ ని శుద్ధిచేసే ఓ ప్రక్రియ. ఎన్నెన్నో సంఘటనలతో, ఒడిదుడుకులతో, మార్పులూచేర్పులతో, సుఖదుఃఖాలతో కూడుకున్నదే జీవితం. వీటన్నిటినీ యధాతధంగా స్వీకరించేశక్తి  ధ్యానంవలన అలవడుతుంది. ధ్యానంవలన సాక్షిభావం, తద్వారా భావసమతుల్యత అలవడుతుంది. గతాన్ని నెమరువేసుకోకుండా, భవిష్యత్తు గురించి ఊహాగానాలు చేయకుండా, దేన్నీ ఆశించకుండా ఏ క్షణంకా క్షణం  జాగురుకతతో, ఎరుకతో సంపూర్ణముగా జీవించడం ఎలాగో ధ్యానం ద్వారానే అలవడుతుంది. అంతే కాదు, సంస్కారశుద్ధి, విషయవాసనలనుండి విముక్తి ధ్యానసాధన ద్వారానే సాధ్యమౌతుంది. పరమాత్మ ఎరుకలోనికి రావాలంటే హృదయం నిర్మలం కావాలి. హృదయం నిర్మలం కావాలంటే మానసిక అలజడులు, ఆలోచనలు, విషయవాసనలుండకూడదు. ఇవేవీ ఉండకూడదంటే ధ్యానం ఒక్కటే ఉపాధి.

ధ్యానం చేస్తున్నప్పుడు  ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. వాటిని అదిలించి నెట్టివేయలేము. అవి మరల మరల వస్తూనే వుంటాయి. అందుకే పుట్టుకొస్తున్న ప్రతీ ఒక్క ఆలోచనను సాక్షిభావంతో చూడడం, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టకుండా, కొనసాగించకుండా అలా గమనిస్తూ వుంటే కొంతకాలంకు ఆ ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఇదేరీతిలో ధ్యానం చేస్తున్నప్పుడు కొందరు - కృష్ణుడు, బుద్ధుడు, సూర్యుడు, దేవతలు, ప్రకృతి దృశ్యాలు దర్శిస్తూ తాము ధ్యానస్థితిలో ముందుకు పోతున్నామని, మంచి మంచి అనుభవాలు కల్గుతున్నాయని, ఉన్నతమైన ధ్యానస్థితిలో ఉన్నామని అనుకుంటారు. కానీ అది సరికాదు. నిజమైన ధ్యానంలో మనస్సు మహానిశ్చలంగా ఉండిపోతుంది. అలా నిశ్చలమైన మనస్సులో ఎటువంటి చిత్రణలు ఉండవు. ఇవన్నీ ఒకవిధంగా స్వాప్నిక దృశ్యాలే అని గ్రహించాలి. ధ్యానం దైవత్వాన్ని చేరుకోవడానికే తప్ప అనుభవాల కోసం కాదని గ్రహించాలి. ఇది పరిపూర్ణ ధ్యానం కాదని గ్రహించాలి.  ధ్యానమంటే కొన్నిమాటలు పునరుక్తి చేస్తూ, జపం చేస్తూ నియమిత సమయంలో కళ్ళుమూసుకొని కూర్చొని చేసే ప్రక్రియ కాదు. ఏ పని చేస్తున్నను ధ్యానం జరుగుతూ ఉండాలి. అంటే చేస్తున్న ప్రతీపనియందు సాక్షిభావంతో ఉండి పనిచేయగలిగినప్పుడు మాత్రమే అది అర్ధవంతమైన, ధ్యానయుక్తమైన పరిపూర్ణజీవితం అవుతుంది.

ధ్యాన సాధన చేస్తున్నమొదట్లో ధ్యానస్థితిలో ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయడానికి ఆలంబనగా తీసుకున్న ధ్యానవస్తువు (నామం, రూపం, దీపం, శ్వాస మొదలగునవి) ఉంటాయి. ధ్యానంలో కొంత ప్రగతి సాధించాక ధ్యానవస్తువు ఉండదు. ఇంకా ధ్యానం తీవ్రతరం అయ్యేసరికి ధ్యానం చేసే వ్యక్తి అంటే ధ్యాని కూడా ఉండడు. సమస్తమూ ధ్యానమందు లయమై పోతాయి. ధ్యానకేంద్రమైన విశ్వాత్మలో అంటే పరమచైతన్యంలో ధ్యాని దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, శ్వాస....అన్నీ అన్నీ సమీకృతమై వీలీనమైపోతాయి. ఇదీ పరిపూర్ణ ధ్యానస్థితి. ఇదే సంపూర్ణ ఆత్మధ్యానం. ఇదే ఆత్మనిష్ట.

ఆత్మనిష్ట కలుగుటకు ధ్యానమే సాధనమని, ఆ సాధన ఎలా చేయాలో కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయము నందు తెలియజేసెను.

మహర్షులనుండి ఇంద్రాది దేవతలవరకు; మహాయోగులనుండి ముముక్షువులవరకు; సద్గురువులనుండి సత్ సాధకులవరకు.........

ప్రతివొక్కరూ ధ్యానం చేసి జ్ఞానం పొంది తరించినవారే.

ఆత్మధ్యానం యొక్క మహిమత్వమును శుక మహర్షి ఇలా తెలియజేసెను -

ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః

ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణస్సదా

సమస్తమైన వేదశా

Wednesday, October 9, 2019

కామం పై విజయం.....

కామాన్ని జయించడం అంటే అందరూ అనుకున్నట్లు చాల కష్టమైన పనేమీ కాదు. దీనిని జయించడం చాల చాల సులువైన పని. దానికి మనం చేయవలసిందల్లా దానిని సానుకులపరచడమే అంతే. దాన్ని జయించినట్లే. దానిని సానుకులపరచడం అంటే దానికి శాస్వతతత్వాన్ని తెలియపరచి, శాశ్వతమైన దానిని తెలియజేసి నిత్యమైన దాని కోసం వెతకడం ప్రారంభిస్తే చాలు.

అది అప్పటి నుండి దాని మార్గాన్ని మార్చుకుంటుంది. అంటే ఇక్కడ మనం ఇంత వరకు అజ్ఞానంలో అనిత్యమైన వాటి  కోసం ప్రాకులాడుతున్నాము. ఇప్పుడు దాని మార్గాన్ని మరల్చాలి. మరల్చి భగవంతుని మీదకు ద్రుష్టి నిలిపేలా మనం గ్రహించిన జ్ఞానంతో మనకు ఉన్న బుద్ది అనే సాధనంతో మనస్సులో కరిగే కోరికలనన్నిటికి స్వస్తి పలికి శాశ్వతమైన, నిత్యమైన, లక్ష్యమైన ఆ పరమాత్ముని దివ్య దర్శనమే ఏకైక లక్ష్యంగా ఉండేలా గాఢమైన కోరికను మన మనస్సులో స్థిరపరచులోవాలి.

ఆ విధంగా స్థిరపరచుకుంటే మన మనస్సులో నిదానంగా అశాశ్వతమైన వాటి మీద ఉన్న ధ్యాస పోయి శాశ్వతమైన పరమాత్మమీద మాత్రమే కోరిక కలుగుతుంది. దీనితో పాటు మనం కొన్నిటిని ప్రతిదినం అలవారచుకుంటే మనం సంపూర్ణంగా, పరిపూర్ణంగా కామాన్ని జయించినట్లే. అవి మొదట మనం భగవంతుని ముందర కోరికలను కోరడం (అంటే అవికావాలి,ఇవికావాలి అని) కోరుకోకూడదు. జరిగిపొయినవి అన్నియు మన మంచికే, జరగబోతున్నవి కూడా మన మంచికే అని ముందు మన మనస్సును సమాధానపరచాలి.

రోజు చేసే పనిని అది ఏదైనా భగవంతార్పణ బుద్దితో, నిష్కల్మషంగా (అంటే ఎటువంటి కల్మషం లేకుండా), ఫలాపేక్షరహితంగా కర్మలను ఆచరిస్తూ వుంటే అప్పుడు నీ మనస్సు అంతఃకరణ నిదానంగా ఖచ్చితంగా పరిశుద్దమై అదే కోరికలను త్యజిస్తుంది ఎందుకంటే అప్పుడు నీ మనస్సుకు ఒక భావన కలుగుతుంది అది ఏమిటంటే ఇవి అన్నియు అనిత్యమైనవి కదా అనే భావన రోజు రోజుకు నీలో అధికమవుతుంది.

ప్రతి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మంచం దిగకుండా అలాగే కూర్చొని నీ హృదయంలో దివ్య జ్యోతి వుందని మనస్సులో సంపూర్ణంగా భావించుకొని నీ హృదయ స్పందన మీద మాత్రమే ఏకాగ్రతను నిలిపి 10 నిమిషాలు అట్లే కూర్చొని సాధన(ధ్యానం) చేస్తే నీలో సంపూర్ణంగా కోరికలు అన్నీ అవియే సమసిపోతాయి అంతేకాక నీ మనస్సు కూడ చాల హాయిగా, ఆనందంగా వుంటుంది.

అదే విధంగా ప్రతి రోజు రాత్రి నిద్ర పోయే ముందు కూడ మంచం ఎక్కగానే ఒక 10 నిముషాలు కూర్చొని నీ హృదయంలో దివ్య జ్యోతి వుందని మనస్సులో సంపూర్ణంగా భావించుకొని నీ హృదయ స్పందన మీద మాత్రమే ఏకాగ్రతను నిలిపి 10 నిమిషాలు కూర్చొని సాధన(ధ్యానం) చేసి ఆ తరువాత అలానే భావించుకుంటూ నిద్రపోతే చాల ప్రశాంతమైన మరియు చాల సుఖవంతమైన నిద్ర వస్తుంది. దీనినే నిద్రలో నిశ్చింతత అంటారు..

|| ఓం నమః శివాయ ||

హిందూ సనాతన ధర్మమునకు సంభదిత విషయములు తెలుసుకొనుటకు కొరకు టెలిగ్రామ్ ఎప్ వాడే వారు ఈ క్రింది లింక్ ద్వారా మన సమూహం నందు జాయిన్ అవచ్చును.....

రామాయణం గురించి నాలుగు విషయాలు

రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి..

1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
= వాల్మీకి.

2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
= నారదుడు.

3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
= తమసా నది.

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
=24,000.

5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
=కుశలవులు.

6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
=సరయూ నది.

7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
=కోసల రాజ్యం.

8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
=సుమంత్రుడు.

9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
=కౌసల్య, సుమిత్ర, కైకేయి.

10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
=పుత్రకామేష్ఠి.

11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.

12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?
=జాంబవంతుడు.

13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
= దేవేంద్రుడు.

14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
=హనుమంతుడు.

15. కౌసల్య కుమారుని పేరేమిటి?
=శ్రీరాముడు.

16. భరతుని తల్లి పేరేమిటి?
=కైకేయి.

17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.

18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
=వసిష్ఠుడు.

19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
=12 సంవత్సరములు.

20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
=మారీచ, సుబాహులు.

21.  రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
=బల-అతిబల.

22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
=సిద్ధాశ్రమం.

23. తాటక భర్త పేరేమిటి?
=సుందుడు.

24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
=అగస్త్యుడు.

25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
=భగీరథుడు.

26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.

27. అహల్య భర్త ఎవరు?
=గౌతమ మహర్షి.

28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
=శతానందుడు.

29. సీత ఎవరికి జన్మించెను?
=నాగటి చాలున జనకునికి దొరికెను.

30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
=దేవరాతుడు.

31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
=విశ్వకర్మ.

32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
=మాండవి, శృతకీర్తి.

33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
=జనకుడు.

34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
=కుశధ్వజుడు.

35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
=వైష్ణవ ధనుస్సు.

36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
=యధాజిత్తు.

37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
=మంధర.

38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
=గిరివ్రజపురం, మేనమామ యింట.

39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
=శృంగిబేరపురం.

40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
=గారచెట్టు.

41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
=భారద్వాజ ముని.

42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
=మాల్యవతీ.

43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
=తైలద్రోణములో.

44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
=జాబాలి.

45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
=నందిగ్రామము.

46. అత్రిమహాముని భార్య ఎవరు?
=అనసూయ.

47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
=విరాధుడు.

48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
=అగస్త్యుడు.

49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
=గోదావరి.

50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
=శూర్ఫణఖ.

51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
=జనస్థానము.

52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
=మారీచుడు.

53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
=బంగారులేడి.

54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
=జటాయువు.

55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
=దక్షిణపు దిక్కు.

56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
=కబంధుని.

57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
=మతంగ వనం, పంపానదీ.

58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
=ఋష్యమూక పర్వతం.

59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
=హనుమంతుడు.

60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
=అగ్ని సాక్షిగా.

61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.

62. సుగ్రీవుని భార్య పేరు?
=రుమ.

63. వాలి భార్యపేరు?
=తార.

64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
=కిష్కింధ.

65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
=మాయావి.

66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
=దుందుభి.

67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
=మతంగముని.

68. వాలి కుమారుని పేరేమిటి?
=అంగదుడు.

69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
=ఏడు.

70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
=ప్రసవణగిరి.

71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=వినతుడు.

72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=అంగదుడు.

73. సుగ్రీవునికి,  సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
=మామగారు, తార తండ్రి.

74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=శతబలుడు.

75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?
=మాసం (ఒక నెల).

76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
=దక్షిణ దిక్కు.

77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.

78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
=స్వయంప్రభ.

79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
=సంపాతి.

80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
=పుంజికస్థల.

81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
=మహేంద్రపర్వతము.

82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
=మైనాకుడు.

83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
=సురస.

84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
=సింహిక.

85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
=నూరు యోజనములు.

86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
=లంబ పర్వతం.

87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
=అశోక వనం.

88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
=రెండు.

89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
=త్రిజట.

90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
=రామ కథ.

91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
=చూడామణి.

92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
=ఎనభై వేలమంది.

93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.

94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
=విభీషణుడు.

95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
=మధువనం.

96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.

97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
=ఆలింగన సౌభాగ్యం.

98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
=నీలుడు.

99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
=నికుంభిల.

100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
=అగస్త్యుడు.

101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
=ఇంద్రుడు.

102.  రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
=మాతలి.

103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!

104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
=హనుమంతుడు.

105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
=శత్రుంజయం.

106.  శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
=స్వయంగా తన భవనమునే యిచ్చెను.

107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
=బ్రహ్మ.

108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన  బహుమతి ఏమిటి?
=తన మెడలోని.                 ముత్యాలహారం.

శ్రీ రామ జయం!🙏👍✍🏹

Tuesday, October 8, 2019

సాలిగ్రామం ఎలా పుట్టింది ?

సాలిగ్రామం .......? విష్ణు చిహ్నంగల శిలనే సాలిగ్రామం అంటారు.
అలాంటి సాలిగ్రామాలు ఒకటి కాదు రెండు కాదు వందలూ వేలు కాదు, లెక్కకు మిక్కిలిగా ఆ ఒక్క నదిలోనే పుడతాయి. మరెక్కడా దొరకవవి.
ఆనది పేరు గండకీ.

చిన్నగా పెద్దగా రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. గండకీ నదిలోనే దొరుకుతాయి. గుండ్రని రాళ్ళలా ఉన్నా – తాబేలు నోరు తెరచుకున్నట్టు ఉండి లోపల శ్రీ మహా విష్ణువే శేషసాయిగా ఉండి దర్శన మిస్తాడంటారు. పూజిస్తుంటారు. మరి గండకీ నదిలోనే ఈ సాలిగ్రామాలు పుట్టడానికి వెనుక ఒక కథ ఉంది!

గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక స్త్రీ, గండకీ పేరుతోనే శ్రావస్తి నగరంలో ఉండేది.
ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూవుండేవారు.

గండకీ అందరినీ అంగీకరించేది కాదు. ప్రతి రోజూ ముందొచ్చిన బేరం ఒప్పుకొనేది.
ఆరోజుకి అతనే భర్త. రెండో మనిషికీ రెండో బేరానికి ఒప్పుకొనేది కాదు.
ధనం ఆశ చూపినా దరి చేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండకిని మార్చాలని ఎన్నోవిధాల ప్రయత్నించి విఫలమైంది. సాక్షాత్తూ నారాయణుడికే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది.

ఒక రోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకొని కానుకలు ఇచ్చాడు.

అలవాటుగా గండకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే దుర్వాసన…
ఒళ్ళంతా పుండ్లు. ఈగల ముసిరాయి. కుష్టు వ్యాధి ఉందని కూడా గ్రహించింది. తల్లి తిట్టి పొమ్మనబోతే గండకి ఆమెనే తరిమేసింది.

సంపంగి తైలం పూసింది. గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయించింది. చేనేత వస్త్రాలు చుట్టింది. చక్కని భోజనం పెట్టింది. అతడు తినబోతే పుచ్చిన చేతులు. వేళ్లూడి పడితే పక్కన తీసి పెట్టింది. తినిపించింది.

అదే కంచంలో తానూ తిన్నది. పక్కమీదకు చేర్చింది. విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతడు ఆ రాత్రే ప్రాణాలు వదిలాడు. అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లీ బంధువులూ తల్లడిల్లినా ఆగలేదు. తాళి కట్టని భార్యలా తల్లడిల్లింది. తనువుని చాలించదలచింది. ఉన్న ధనమంతా బీదసాదాలకు పంచి పెట్టింది.

ధాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళ తాళాలతో వెళ్ళింది. శ్మశాసనంలో చితి పేర్చింది. తనే నిప్పంటించింది. తనూ చితిలోకి దూకింది. చిత్రంగా ఎగిసిన మంటలు మల్లెలయ్యాయి. కాలిన కట్టెలు పువ్వులయ్యాయి. లక్ష్మి సమేతంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు.
గండకి వారిని చూస్తూనే ముగ్దురాలైంది. చేతులు జోడించింది.

కన్నీళ్ళతో కీర్తించింది. కీర్తిస్తూ కాళ్ళు కడిగింది.  శరీరమూ మనసూ స్వచ్ఛంగా నిలిపింది.

గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్చలతకు చలించిపోయాడు. నిష్టకు ఇష్టపడ్డాడు.

ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గండకి డబ్బూ ధనం కోరలేదు. మోక్షమూ కోరలేదు. మాతృత్వాన్ని వరంగా కోరింది. మహా విష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది. ఫలితమే.

 మరు జన్మలో గండకీ నదిగా పుట్టింది. నది కడుపులో సాలిగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలందుకున్నాడు.

గండకి ఏకులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు.

ఆ విధంగా పవిత్రురాలైంది. విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకొని తల్లయింది. కృతయుగాన జరిగినా ఈయుగానికీ గండకీ కథ నిలిచిపోయింది!.

   గండకీ సరసస్తీరే చంద్ర తీర్థేన శోభితే|
   సాలగ్రామ పురశ్రేష్ఠ కనకాఖ్య విమానగ:||
   శ్రీ మూర్తిదేవ శ్శ్రీ దేవ్యా కుబేరోముఖ సంస్థిత:|
   గండకీ గణికా రుద్ర బ్రహ్మణా మక్షిగోచర:
   శ్రీవిష్ణుచిత్త కలిజిత్ స్తుతి భూషిత నిగ్రహ:||🙏

Monday, October 7, 2019

శ్యామలా దండకం

శ్యామల దండకాన్ని ఘంటసాల తో పాటు ఇంకా చాలా మంది పాడారు...

శ్యామలా దండకం

( ఇచ్చా జ్ఞాన క్రియా శక్తులలో జ్ఞాన శక్తి రూపిణి యగు సకల విద్యాధిదేవత శ్యామల. శ్రీ లలితా స్తోత్రములో మంత్రి అనబడిన దేవత ఈమెయే)

శ్లో|| మాణిక్య వీణా ముపలాలయంతీం | మదాలసాం మంజుల వాగ్విలాసామ్ |
    మహేంద్ర నీలద్యుతికో మలాంగీం | మాతంగ కన్యాం మనసాస్మరామి.       

శ్లో || చతుర్భుజే చంద్ర కళావతంసే - కుచోన్నతే కుంకుమరాగశోణే |
     పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ - హస్తే నమస్తే జగదేక మాతః

శ్లో || మాతా మరకత శ్యామా - మాతంగీ మధు శాలినీ
      కుర్యాత్క టాక్షం కల్యాణీ - కదంబవన వాసినీ. 

శ్లో || జయ మాతంగ తనయే - జయనీలోత్పలద్యుతే |
     జయ సంగీతరసికే - జయలీ లాశుక ప్రియే.

దండకం

జయ జనని ! సుధాముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాట
వీ మధ్యకల్పద్రు మాకల్ప కాదంబతార హసప్రియే ! కృత్తి వాసః ప్రియే ! సాద రారబ్ద సంగీత సంభావనా సంభ్ర మాలోలనీ వస్రగాబద్ద చూళీస నాధత్రికే ! సాను మత్పుత్రికే ! శేఖరీ భూత శీతాంశురె ఖామయూఖావళీనద్ద సుస్నిగ్ద నీలాలక శ్రేణి శృంగారితే ! లోక సంభావితే ! కామలీ లాధను స్సన్నిభ భ్రూలతా పుష్ప సందోహ సందే హకృచ్చారు గోరోచనా పంక కేళీలలామాభి రామే ! సురామే ! రమే ! ప్రోల్ల సద్వాలికా మౌక్తిక శ్రేణి కాచంద్రి కామండ లోద్భా సిలావణ్య గండ స్థలన్యస్త కస్తూరి కాపత్ర లేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భ్రంగాంగ నాగీత సాంద్రీ భవన్మంద్ర తంత్రీ స్వరే ! భాస్వరే ! వల్లకీ వాదన ప్రక్రియా లోలతాళీ దళాబద్ద తాటంక భూషా విశేషాన్వితే ! దివ్యహాలామదో ద్వేల హేలాల సచ్చక్షురాం దోళన శ్రీ సమాక్షిప్త కర్ధై కనీ లోత్పలే ! పూరి తాశేష లోకాభి వాంఛాఫలే ! శ్రీ ఫలే ! స్వేద బిందూల్ల సత్ఫాలలావణ్య నిష్యంద సందోహ సందే హకృన్నాసికామౌక్తికే ! సర్వమంత్రాత్మికే ! కుంద మంద స్మితొదార వక్త్రస్ఫుర త్పూగ కర్పూర తాంబూల ఖండోత్కరే ! శ్రీ కరే ! కుంద పుష్ప ద్యుతిస్నిగ్ద దంతావళీ నిర్మలాలొ లక లొల్ల సమ్మేళన స్మేర శోణాధరే ! చారువీణాధరే ! సులలిత నవ యౌవనారంభ చంద్రో దయోద్వేల లావణ్య దుగ్దార్ణవా విర్భ వత్కంబు బిబ్భోక హృత్కంధరే ! మంధరే ! బంధురచ్చన్నవీరాది భూషా సముద్ద్యోత మానానవ ద్యాజ్గ సోభే ! శుభే ! రత్న కేయూర రశ్మిచ్చటా పల్లవ ప్రోల్ల సద్దోర్ల తారాజితే !   యోగిభి: పూజితే !

విశ్వది జ్మన్డ లవ్యాపి మాణిక్య తేజస్స్ఫు రత్కం కాణాలంకృతే ! సాధుభి స్సత్కృతే ! వాసరారంభ వెళా సముజ్జ్రుంభ మాణార వింద ప్రతిచ్చన్న పాణిద్వయే ! సంతతోద్యద్దయే! దివ్యరత్నోర్మి కాదీ ధతిస్తోమ సంధ్యాయమానాంగుళీ పల్ల వోద్యన్నఖేందు ప్రభా మండలే ! ప్రోల్ల సత్కుండలే ! తార కారాజినీ కాశ హారావళి స్మేర చారుస్త నాభో గభారాన మన్మధ్య వల్లీ వళిచ్చే దవీచీ సముద్యత్స ముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే! శ్రీ కరే ! హేమకుంభో పమోత్తుంగ వక్షోజభా రావనమ్రే ! త్రిలో కావనమ్రే !  లసద్వ్రత్త గంభీర నాభీ సరస్తీర శైవాల శంకాకర శ్యామరోమావళీ భూషణే ! మంజు సంభాషణే ! చారుశింజత్కటీ సూత్ర నిర్భర్త్సితానంగ రేఖా ధనుశ్మిoజి నీడంబరే ! దివ్య రత్నాంబరే! పద్మ రాగోల్ల సన్మేఖలా భాస్వర శ్రొణి శోభాజిత స్వర్ణ భూభ్రత్తలే ! చంద్రికాశీతలే ! 
వికసిత నవకిం శుకా తామ్ర దివ్యాం శుకచ్చన్నచారూరు శోభా పరాభూత సింధూర శోణాయ మానేంద్ర మాతంగ హస్తార్గళే! వైభ వానర్గళే! శ్యామలే! కోమలస్నిగ్ద నీలోత్పలోత్పాది తానంగ తూణీరశంకాక రోదార జంఘాలతే ! చారులీ లాగతే ! నమ్రదిక్పాల సీమంతినీ కుంతల స్నిగ్ద నీల ప్రభాపుంజ సంజాత దూర్వాంకురాశంక సారంగ సంయోగరింఖన్న ఖేందూజ్జ్వలే ! ప్రోజ్జ్వలే ! ప్రహ్వదే వేళ దైత్యేశ లక్ష్మీశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయ్వగ్ని మాణిక్య సంఘ్రష్ట కొటీర బాలాత పోద్దామ లక్షార సారుణ్యతారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రి పద్మద్వయే! అద్వయే!
సురుచిరన వర్తన పీటస్థలే ! సుస్థితే ! శంఖ పద్మద్వయోపాశ్రితే ! తత్ర విఘ్నేశ దుర్గావటుక్షేత్ర పాలైర్యుతే ! మత్త మాతంగ కన్యా సమూహాన్వితే ! భైర వైరష్ట భిర్వేతే ! దేవి ! వామాదిభి స్సంశ్రితె ! ధాత్రి లక్ష్మ్యాది శక్త్యష్ట కాసేవితే! భైరవీ సంవృతే ! పంచ బాణేన రత్యాచ సంభావితే !
ప్రీతిశక్త్యా వసంతేన చానందితే ! భక్తి భాజాం పరం శ్రేయ సేకల్ప సేఛంద సామోజసా భ్రాజసే యోగినాం మానసే ధ్యాయసే గీత విద్యాది యోగా తి త్రుష్టేన కృష్ణేన సంపూజ్యసే భక్తి మచ్చేతసా వేధసాస్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గ యసే యక్ష గంధర్వ సిద్దాంగణా మండ లైర్మండితే ! సర్వ సౌభాగ్య వాంఛావతీ భిర్వ ధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యా విశేషాన్వితం చాటుగాధా సముచ్చారణం కంట మాలోల్ల సద్వర్ల రేఖాన్వితం కోమలం శ్యామలో దార పక్ష ద్వయం తుండ శోభాతి దూరీ భవ త్కింశుకాభం శుకం లాలయంతీ పరిక్రీడసే పాణి పద్మద్వయే నాక్ష మాలాగుణం స్పాటికం జ్ఞాన సారాత్మకం పుస్తకం చాప పాశాంకుశాన్ బిభ్రతీ యేన సంచింత్యస్షేఇ చేత సాతస్య వక్త్రుంత రాద్గద్య పద్యాత్మికా భారతీ నిస్సరే ద్యేన వాయావకాభాకృ తిర్భావ్య సేతస్యవ శ్యాభ వంతి స్త్రియః పూరుషాః యేనవా శాత కుంభ ద్యుతిర్భా వ్యసే సొపి లక్ష్మీ సహాస్త్రే: ! పరి క్రీడతేకిన్న సిద్ద్యేద్వ పుశ్శ్యామలం కోమలం చంద్ర చూడాన్వితం  తావకం ధ్యాయతస్తస్య లిలాసరో వారిధస్తస్య కేళీ వనం నందనం, తస్యభ ద్రాసనం భూతలం తస్య గీర్దే వతాకింకరీ తస్య చాజ్ఞా కరీ శ్రీ స్స్వయం సర్వతీర్ధాత్మికే ! సర్వ మంత్రాత్మికే ! సర్వముద్రాత్మికే ! సర్వశక్త్యాత్మికే !  సర్వవర్ణాత్మికే! సర్వ రూపే ! జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి.

ఇతి శ్యామలా దండకమ్...

Tuesday, October 1, 2019

శ్రీ దుర్గా సూక్తం


1.ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతే నిదహాతి వేదః |

స నః పర్‍షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః ||


2.తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్ |

 దుర్గాం దేవిగ్ం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః ||


3.అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంథ్స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా |

పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః ||


4.విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధున్న నావా దురితాతిపర్‍షి |

అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనామ్ ||


5.పృతనా జితగ్ం సహమానముగ్రమగ్నిగ్ం హువేమ పరమాథ్సధస్థాత్ |

స నః పర్‍షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితాత్యగ్నిః ||


6.ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి |

స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ ||


7.గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ |

నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతాం ||


ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి | తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||

|| ఇతి దుర్గా సూక్తమ్ ||

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...