Tuesday, November 21, 2023

SNANA VIDHI – A VEDIC KARMA

 As per Dharmashastras there are 6 karmas which are recommended for every human being on a daily basis 

Snanam, Sandhya Japo, Homa, Devatanamcha poojanam Athityam, Vaiswadevam cha Shat Karmani dine dine

This means Snanam (having a bath - daily), Sandhyavandanam and Japam, Homa or fire sacrifice, doing pooja (propriation) of Gods, treating guests well and feeding other living beings like crows, cows, dogs and ants, these are the 6 karmas which have to be performed daily

As you can see, Snana here is a Karma (duty) and only Snana (bath) offers you the platform to perform the rest of the karmas. Two purposes of the Snana are cleanliness of the body and cleanliness of the mind (chitta shuddhi). The body has 9 holes and various waste products are being produced by these 9 holes, which make the body further impure. Snana cleans us of the dirt, both external and internal.

There are 3 classes of Snana:

  • Nitya Snana – Daily bath
  • Naimittaka Snana – Special occasional bath like death of relative, hair cut etc
  • Kamya Snana – Bath for special vows undertaken, like in a temple tank etc.

Apart from this, there are some more types of Snana which have been described in Dharma Shastras

  • Agneyam : Application of Bhasma (Ash) all over the body
  • Vaarunam : Bath at river, lake, home well, with mantras
  • Brahmam: Bath chanting “apohistha mantra” and sprinkling on chest
  • Vayavya: Bath with dust from the hooves of cows during dusk
  • Divya: Bath during uttarayana when Sun is shining and it rains
  • Kapilam: Bath by wiping onself with wet cloth
  • Gayatram: Reciting Gayatri mantra 10 times and sprinkling water on self
  • Manasam: Meditating on Lord Vishnu with 4 arms
  • Parthiva/mrittika: Bath with earth/soil (mud bath)


We should understand that water is a “Devata” (God) called “Varuna”. If we propitiate this Devata he will bless us with happiness, good rains, crops etc. And if we pollute it and disregard Varuna, he will play havoc like floods, tsunami etc. 

Having a bath in a holy river/or any river is not a joke or a casual process. Some people jump in the water, swim, wash up themselves, splash, play and leave, all for entertainment. But beware, Shastras completely forbid this type of behaviour. The water in the river is a Vedic God Varuna and during a bath, we are interacting with a Devata. We have to keep that in mind. 

We should go for having a bath in the river at “Brahmamuhurtha” (time of Brahma) which is 96 minutes before sunrise. We should wear 2 pieces of clothes (dhoti and upper cloth to cover upper body). Only these two clothes are allowed as clothing, for river bath (for ladies, saree). Here we would like to raise a question. Would you go to your club’s swimming pool without a proper swimming costume or would you swim with your shirt and pant on, in your club pool? Why can’t we respect a holy river? We probably don’t know the rules. This article is aimed at creating awareness of the same

Before you even enter the river for a bath, you need to have a bath at the bank to clean yourself before entering the river, as you cannot pollute the river with your dirt, as per Vedic texts. Now you can find exactly the same rule at a swimming pool, where we need to have a shower before, so that we are clean before entering the pool. Ironically, in Kali Yuga, swimming pools get more respect than a holy river! 

The rules for bathing in a river are described below:

1. Achamanam (sipping of water)

2. Pranayamam (controlled breathing)

3.Maha Sankalpam – Here you have to declare which location you are taking a bath, who you are (Gotra-lineage), which day it is etc as per astrological calendar and that you are going to take a bath for purity of the body and soul thereby relieving yourself of the sins you have committed till date. Sankalpam simply means “resolve”

4.Chanting praises of the River : If you are at a holy  river like Ganga then chant Ganga Strotram, if at Godavari, chant Godavari Stuti etc. You sing praises of the river before entering the water and pray that the water should be auspicious to you always.

5.Marjanam (Sprinkling of water on oneself) : With chant of 'Apohishta' mantras which are purificatory mantras, you sprinkle yourself with water to clean yourself. This will purify your mind of bad thoughts

6. Agamarshana Sooktam : Enter the water by chanting  'Agamarshana Sookta' which mentioned in the Vedas for destroying the sins you have committed. 'Aga' means dirt and 'Marshana' means to wipe away/cleansing the sins.

7. The holy dip : While chanting this sooktam (hymn-vedic verse), you take a dip with your head totally submerged into the water 3 times in quick succession. This can be repeated 1-2 times more during the chanting of Agamarshana sookta and your bath is complete. You cannot use soap, detergent, shampoo etc to clean yourself, it is totally prohibited as per Shastras. Remember, you cannot pollute the river.

8. Offering tarpana to Devas(Gods), Rishi(Sages) and Pitrus(Manes) : Offer arghya or oblation with water to Devas, Rishis and the Pitrus to satisfy their thirsty souls. They flock to the river and look forward to our oblations as soon as we do the sankalpam (point number 3 above). Once we tell them in the sankalpa, who we are and where we are, they come to accept our offerings. 

9. Vasodhakam: This is squeezing your upper cloth to satisfy the Pitrus (manes) who are trapped in the earth plane and not yet passed to the Pitru loka (the abode of ancestors). There are specific mantras for the same. You come out, on the bank and squeeze only your upper cloth or Uttareeya.

10. Yaksha Tarpana : Each river, lake, pond is guarded by a semi-divine being called 'Yaksha' and they can cause harm, if you do not thank them for allowing you to have a bath in their property. This is similar to the way we say thank you to our swimming coach. You should offer water oblation to them before leaving the river.

11. Change of clothes: Change to dry clothes and do Sandhya vandana and Gayatri Japa at the river bank and then leave for your house after the sunrise.

This process completes the Vedic bath which ancient Hindus used to practise daily (nithya snana). Nowadays it has become occasional (naimittaka snana) but still a few people staying near rivers practise the same. This type of bath only helps you attain purity and destruction of the sins committed, not the bath we take in the bathroom. Unfortunately in Kali yuga we have time to go for a movie, dining outside, playing games outdoor and indoor, watching TV but we don’t have time to learn or atleast practise, even occasionally, such Karmas which have been in practice since earlier than 5000 BC.  This is the reason for negative karmic overload and our current suffering in Kaliyuga, in terms of no mental peace or health, despite having money. We should be proud of our heritage and need to do everything to preserve it in its entirety, which is what Veda Ghosham aims at. 

All Veda Ghosham Vidhyarthis (who are students and working professionals across all ages) were trained for 1 month on this 'Snana Vidhi' as per Dharma Shastra with mantras. All Veda Ghosham Shishyas took a holy dip in the River Godavari in Nashik on the occasion of Mahakumbh which comes only once in 144 years. We also performed the same at River Kaveri at Srirangam last year


Om Varunaaya Namaha!

Monday, November 6, 2023

శనీశ్వరుడు

శని శని అని పిలువకూడదు శనైశ్చరుడు అనే పిలవాలి.. శనైశ్చరుడి ప్రభావం వద్దే వద్దు అనుకునే వారే అధికంగా ఉంటారు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనే ఈ పేర్లు వింటేనే చాలామంది వణికి పోతారు. 

కానీ శనీశ్వరుడు ఇచ్చే విశేషాలను గురించి తెలుసుకుంటే.. శని ప్రభావంతో ఏర్పడే నష్టాలను చూసి జడుసుకోం. 


శనైశ్చరుడిని ఆరాధిస్తాం. అదెలాగంటే?


 ''నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం'' అంటారు.


నీలాంజనం- అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడని, 

రవిపుత్రం అంటే.. సూర్యుని పుత్రుడని, యమాగ్రజం-అంటే యమునికి సోదరుడని, ఛాయా మార్తాండ సంభూతం- ఛాయాదేవికి మార్తాండుడికి అంటే సూర్యునికి జన్మించిన వాడైన శనీకి నమస్కరిస్తున్నానని అర్థం.

ఈ శ్లోకాన్ని స్మరిస్తే శనైశ్చరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. 


శనైశ్చరుడిని మనం ఎప్పుడు శని శని శని అని పిలవకూడదు. 

"శనైశ్చరుడు" అని మాత్రమే అనాలి.


ఈశ్వర శబ్ధం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. 

శివుడిని ఈశ్వరుడు అంటాం. 

మహేశ్వరుడు అని కూడా అంటాం. 

అలాగే వేంకటేశ్వర స్వామి వారి పేరులో కూడా వెంకట ఈశ్వరుడు అని వుంది. ఈశ్వర శబ్ధం ఉండబట్టే వెంకన్న కలియుగ దైవంగా మారాడు. కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడు. అలాగే శనినామధేయంలోనూ ఈశ్వరుడు (శనీశ్వరుడు) అనే శబ్ధం రావడంతో శనైశ్చరుడు కూడా శివునిలా, వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని విశ్వాసం. శనీశ్వరుడంటే భయపడాల్సిన అవసరం లేదు.


నవగ్రహాలను పూజించేటప్పుడు శనైశ్చరుడిని భక్తిగా నమస్కరించుకుంటే సరిపోతుంది. అలాగే ఆయనకు నీలం రంగు, నలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించడం.. శనీశ్వరునికి ప్రీతికరమైన చిమ్మిలి నివేదనం చేయడం ద్వారా, శివారాధన చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చు. తద్వారా శనిగ్రహ ప్రభావంతో ఏర్పడే దోషాలు.. యోగ ఫలితాలను ఇస్తాయి. శనైశ్చరుని ప్రభావంతో కొన్ని కష్టాలు కలిగినా.. ఆయనను పూజించడం, గౌరవించడం ద్వారా ఆయన అనుగ్రహం లభిస్తుంది.


కానీ శనిప్రభావం రావాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే శనీశ్వరుడు మిమ్మల్ని కొద్దిగా పీడించాంటే దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించి వెళ్తాడు. 

శనైశ్చరుడి ప్రభావం వద్దనుకుంటే.. యోగం, ఐశ్వర్యం కూడా వద్దనుకోవాల్సిందే. శనైశ్చరుడిని చక్కగా నీలిరంగు పుష్పాలతో అలంకరణ చేయించి.. పూజించండి. శివారాధన చేయాలి. హనుమంతారాధన, అయ్యప్ప స్వామి ఆరాధన చేయడం ద్వారా శనైశ్చరుడుని అనుగ్రహం పొందవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు

తిరుమల చేరాక వరుస క్రమంలో ప్రధాన ద్వారం నుండి బయటకు వచ్చే వరకు దేవాలయంలో దర్శించు

 ఓం నమో వేంకటేశాయ

చాలా మంది తిరుమల చేరాక ఎదో మొక్కుబడిగా ఓ నమస్కారం చేసి వచ్చేస్తారు. తిరుమల చేరిన తర్వాత మొదటిగా శ్రీ వరాహ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోండి..

ఇక స్వామి వారి ప్రధాన ద్వారం నుండి బయటకు వచ్చే వరకు దేవాలయంలో వీటి నన్నిటిని దర్శించుకొని బయటకు రండి..

వరుస క్రమంలో:

1. మహాద్వార గోపురం

2. శంఖనిధి - పద్మనిధి

3. కృష్ణరాయ మండపం

4. అద్దాల మండపం

5. రంగనాయక మండపం

6. తిరుమలరాయ మండపం

7. తులాభారం ( తులా దండం)

8. రాజా తోడరమల్లు

9. ధ్వజస్తంభ మండపం 

10. ధ్వజస్తంభం

11. బరి పీఠం

12. క్షేత్రపాలకశిల (గుండు)

13. సంపంగి ప్రదక్షిణం

14. నాలుగుకాళ్ల మండపాలు

15. శ్రీవేంకటరమణస్వామి కల్యాణమండపం

16. ఉగ్రాణం

17.విరజానది

18. పడిపోటు

19. పూల అర

20. పూలబావి

21.వగపడి అర

22. వెండివాకిలి

23. విమానప్రదక్షిణం

24. శ్రీరంగనాథుడు

25. శ్రీ వరదరాజస్వామిఆలయం

26. ఘంటామండపం

27.గరుడమందిరం

28.జయ విజయులు

29. బంగారువాకిలి

30. స్నపన మండపం

31.రాములవారి మేడ

32.శయన మండపం

33.కుల శేఖరపడి

34.శ్రీస్వామివారి గర్భాలయం

35.శ్రీ వేంకటేశ్వరస్వామి(మూలవిరాణ్మూర్తి)

36. భోగ శ్రీనివాసమూర్తి

37. కొలువు శ్రీనివాసమూర్తి

38. ఉగ్ర శ్రీనివాసమూర్తి

39. శ్రీ మలయప్పస్వామి

40. శ్రీ సుదర్శనచక్రత్తాళ్వారు 

41. శ్రీ సీతారామ లక్ష్మణుల

42. రుక్మిణీశ్రీకృష్ణులు

43. సాలగ్రామాలు

45. వకుళాదేవ

46. బంగారుబావి

47. అంకురార్పణ మండపం

48. యాగశాల

49. నాణేలపరకామణి

50. నోట్ల పరకామణి

51. చందనపు అర

52. ఆనందనిలయ విమానం

53. విమాన వేంకటేశ్వరస్వామి

54. రికార్డుల గది (సెల్)

55. వేదపారాయణలు

56. సభ అర

57. సంకీర్తన భండారం

58. సన్నిధి భాష్యకారులు

59.శ్రీవారి డాలర్లు

60. శ్రీ యోగనర సింహస్వామి

61. శంకుస్థాపన స్తంభం

62. పరిమళం అర

63. శ్రీవారి హుండీ (కొప్పెర)

64. బంగారువరలక్ష్మి

65. కటాహతీర్థం

66. శ్రీ విష్వక్సేనులవారు

67. ముక్కోటి ప్రదక్షిణం

68. సాష్టాంగనమస్కారాలు


Saturday, October 28, 2023

గ్రహణ కాలమందు మంత్ర పురశ్చరణము, దీక్షలు

శ్లో ll చంద్ర సూర్యగ్రహే తీర్దే మహా పర్వాదికే తథా మంత్ర దీక్షాం ప్రకుర్వాణో మాపర్ క్షాదీన్న శోధయేత్ ॥


తాత్పర్యము : చంద్ర సూర్య గ్రహణ కాలమందును, తీర్ధమందును,

మహాపర్వము మొదలగువాటి యందును మంత్రపురశ్చరణ దీక్షను గాని ఉప లక్షణములచే మంత్రోపదేశమును చేయువారికి మాస నక్షత్రాది (ముహూర్తము)  శోధన అక్కరలేదు. దీక్షాక్రమమును మంత్ర శాస్త్రోక్త ప్రకారముగ తెలియవలెను. 


శ్లో॥ యుగేయుగే తు దీక్షాసీ దుపదేశః కలౌయుగే చంద్రసూర్యగ్ర హేతీర్ధే సిద్ద క్షేత్రే శివాలయే మంత్రమాత్ర ప్రకథన ముపదేశస్య ఉచ్యతే ॥


తాత్పర్యము : ప్రతి యుగమందును మంత్రోపదేశము దీక్షారూపమై అనేక నియమములు కలిగి యుండును. కలియుగమందు మాత్రమే మంత్రోపదేశమే అయిఉండును. అదియును సూర్యచంద్ర గ్రహణములలో తీరమందును, సిద్ధక్షేత్రమందును, శివాలయమందును చేయవలయును.


మంత్రగ్రహణ విషయమై సూర్యగ్రహణమే ముఖ్యము చంద్ర గ్రహణమైనచో దారిద్ర్యాది దోషములు కలవని కొందరి వచనము.


మంత్ర పురశ్చరణ లేక జప నియమములు :


శ్లో॥ చంద్ర సూర్యోపరాగేచ స్నాత్వా పూర్వ ముపోషితః స్పర్శాది మోక్ష పర్యంతం జపేన్మంత్రం సమాహితః జపాద్దశాంశతో హోమస్తథా హోమాచ్చ తర్పణం హోమాశక్తౌ జపం కుర్యా ద్దోమ సంఖ్యా చతుర్గుణం || 


తాత్పర్యము : చంద్ర సూర్య గ్రహణ దినమందు భోజనము విడచి స్పర్శ  కాకముందే స్నానము చేసి అది మొదలుకొని శుద్ధమోక్ష మగునంతవరకు మంత్రమును ఏకాగ్రతతో జపించవలయును. అట్టి జపసంఖ్యకు పదియవ వంతు  హోమమును, దానికి పదియవ వంతు తర్పణమును చేయవలెను. హోమము చేయలేని ఎడల దాని సంఖ్యకు (నాలుగు రెట్లు)  చతుర్గుణముగ జపమే చేయవచ్చును. 


 తర్పణములు వదలునప్పుడు మూలమంత్రము ఉచ్చరించి మంత్ర దేవత నామమును ద్వితీయాంతముగ ఉచ్చరించి (దేవత పేరు) ....... దేవతాం తర్పయామి" (యవలతో కూడిన )  యవాదులతో కూడిన జలము దోసిలితో అర్పించవలయును. ఇట్లు నమశ్శబ్దమంతమగునట్లు మూలమంత్రము ఉచ్చరించి "....... దేవతా మహమభిషించామి" అని తన శిరస్సుయందు చల్లుకొనుచు మార్జనము తర్పణమునకు పదియవ భాగము చేయవలయును. మార్జన సంఖ్యకు దశమ భాగము బ్రాహ్మణ భోజనము. ఇట్లు జపహోమ తర్పణమార్జన, విప్ర భోజనమను అయిదు భాగములు కలది పురశ్చరణము. 'తర్పణముల'లో ఏదైన సంభవించని ఎడల అనగా చేయలేని ఎడల దాని సంఖ్యకు(నాలుగు రెట్లు ) చతుర్గుణము జపమే చేయవలయును. ఇట్టి పురశ్చరణము గ్రస్తోదయము, గ్రస్తాస్తమయము లందు అవసరము లేదు. పురశ్చరణాంగమైన ఉపవాసము పుత్రవంతుడైన గృహస్థు చేయ వచ్చును. పురశ్చరణ చేయువానికి స్నాన, దానాది నైమిత్తిక లోపముచే (పాపము) 'ప్రత్యవాయము కలుగును. కనుక అవి భార్యా పుత్రుడు మొదలగు ప్రతినిధులచే చేయించవలెను.


పురశ్చరణ చేయు విధానము :


 స్పర్శకు ముందే స్నానము, ఆసనము వేసుకొని (గోత్రము చెప్పవలయును)..... గోత్రో .......(పేరు చెప్పవలయును)..... శర్మాహం రాహుగ్రస్తే దివాకరే నిశాకరే వా "......... దేవతాయా....... మంత్రసిద్ది కామోగ్రాసాది ముక్తి పర్యంత .......మంత్రస్య జపరూపం పురశ్చరణం కరిష్యే" అని సంకల్పము చెప్పుకొని స్పర్శ మొదలుకొని మోక్ష పర్యంతము జపము చేయవలయును. ఆపైన పర దినమందు స్నానాది నిత్యకర్మలు చేసి "........ మంత్రస్య కృతై తద్గ్రహణ కాలికా...... సంఖ్యా జప సాంగతా సిద్ధ్యర్థం తర్దశాంగ హోమ తద్దశ్శాంశాంశ మార్జన తద్దశాంశ విప్ర భోజనాని కరిష్యే" అని సంకల్పించి హోమాదులైనను, తత్ చతుర్గుణ మంత్ర జపమైననూ చేయ వలయును. ప్రతినిధిగా ( నియమింపబడిన) ప్రేరణ చేయబడిన పుత్రాదులు గ్రహణ కాలమందే "...... గోత్రస్య........ శర్మణో గ్రహస్పర్శ స్నాన ప్రయుక్త శ్రేయః ప్రాప్త్యర్థం స్పర్శ స్నానం కరిష్యే" అని సంకల్పము చెప్పుకొని స్నాన దానాదికము చేయవలెను. పురశ్చరణ చేయనివారును తమతమ ఇష్ట దేవతా మంత్రజపమును గాయత్రి మంత్ర జపమును తప్పక చేయ వలయును. లేనిచో మంత్రమునకు మాలిన్యమగును.


గ్రహణకాలమందు శయనించినచో రోగము, మూత్రము విడిచినచో దారిద్ర్యము, (మలము) పురీషము విడిచినచో (పురుగు) కృమి జన్మము, మైథునము చేసినచో ఊరపంది జన్మము, (తలంటు స్నానము) అభ్యంగము జేసికొనినచో కుష్టురోగము, భోజనము చేసిన నరకము వచ్చును. గ్రహణమునకు ముందు వండిన అన్నము గ్రహణము తరువాత భుజింపకూడదు. గ్రహణకాల స్థితమైన జలమును త్రాగినచో (పాపము) పాదకృచ్చ్ర ము. కనుక త్రాగరాదు. మీగడ, మజ్జిగ, తైల పక్వము క్షీరము పూర్వ సిద్ధమైననూ గ్రహణము తరువాత గ్రహించవచ్చును. కానీ గ్రహణ కాలమందు వాటిలో దర్భముక్కను వేయవలయును.

మహర్షి వాల్మీకి ఎవరు ?

వల్మీకము (పుట్ట) నుండి వెలుపలికి వచ్చిన వారు కావున వాల్మీకి. మరామరా అని తపస్సుచేసిన వారు  కావున మహర్షి , రాముడి జీవితచరిత్రను రామాయణముగా మహాకావ్యరచన గావించినవాడిగా ఆదికవి అయ్యాడు.


అయితే వాల్మీకి జన్మము ఎట్టిది ? ఆయన తల్లితండ్రులు ఎవరు ?  అనే విషయము పై అనేక తర్జనభర్జనలు , కట్టుకథలు ప్రాచుర్యములో ఉన్నాయి. ఏ రచయత అయినా తన గురించి ఉపోధ్గాతము , పరిచయము తదితర అంశములను తెలుపుకోవటము ఈనాటి రచయతలు పాటిస్తున్న విధానము. వేదవ్యాసుడు తాను మత్స్యగంధి , పరాశరుల కుమారుడనని తన రచనలలోనే చెప్పుకోవడముతో వ్యాసుడు ఎవరన్నది కచ్చితముగా తెలిసింది. అదేవిధముగా రచయతగా తాను ఎవరన్నది ప్రత్యేకముగా వాల్మీకి వ్రాయనప్పటికీ సందర్భానుసారముగా సీతను రాముడికి అప్పచెబుతున్న సమయములో ఉత్తరకాండ (రామాయణము)లో వాల్మీకి ఇలా రాసాడు “రామా నేను ప్రాచేతసుడను ప్రచేతసుడి ఏడవ (దశమ) కుమారుడిని. వేలసంవత్సరాలు తపస్సు చేసి , ఏ పాపము చేయని , అబద్దమాడని మహర్షిని.   సీత నిన్ను తప్ప మనసా , వాచా పరపురుషుడిని ఎరగని మహాపతివ్రత. నా మాట నమ్ము , సీతను ఏలుకో. నా మాటలు తప్పు , అబద్దము అయితే ఇంతకాలము నేను చేసిన తపస్సు భగ్నము అవుగాక.”


వాల్మీకిగా పిలవబడుతున్న మహర్షి పేరు ప్రాచేతసుడని ఇక్కడ మనము గుర్తించవచ్చును. ఇది వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పుకున్న విషయము. ఆయన మాటలలో ఆర్ధత , నిజాయతీ ఉట్టిపడుతున్నాయి. అయితే ప్రచేతసుడు ఎవరు ?  ప్రచేతసుడు ఎవరి కుమారుడు ? ఆయనది ఏ వంశము ? ఈ విషయ ములను తెలుసుకోవటానికి అనేక పురాణములను , చరిత్రలను చదవవలసి ఉంటుంది. ప్రచేతసుల గురించిన ప్రస్తావన “శ్రీ మత్భాగవతము” లో ఉంది. శ్రీ మత్భాగవతము వేదవ్యాసవిరచితము. వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో శ్రీ మత్భాగవతము ఒక గొప్ప పురాణము.  భారతదేశములోని మహాపురుషుల చరిత్రలు పురాణములుగా వ్రాయబడి ఉన్నాయి. భారతదేశము పై మొదటగా మహమ్మదీయులు దాడి చేయటముతో భారత చరిత్రను వ్రాసిన వారు స్థిరత్వము , ప్రోత్సాహము లేని పరిస్థితులలో చరిత్రలను వ్రాసే స్థితిలో ఉండకపోవడం జరిగింది. ఆంగ్లేయుల పాలన మొదలైన తరువాత ప్రశాంత వాతావరణము ఏర్పడింది. (శ్రే వేమన పద్యసారామృతము-సి.పి.బ్రౌన్)  చరిత్ర అనగా హిస్=అతనియొక్క , స్టోరీ=కథ అని ఆంగ్లేయులు వచ్చిన తరువాతే చరిత్ర అనే పదము వాడుకలోకి వచ్చి చరిత్రలను వ్రాయటము మొదలు పెట్టారు. అంతకు ముందు భారతదేశ చరిత్రలను పురాణముల పేరుతో తెలుసుకునే వారు.  భారతదేశములో పురాణములను అనగా జరిగిపోయిన వాస్తవాలను (చరిత్రలను) కాలక్షేపానికో , పుణ్యానికో చదవటము , వినటము అలవాటుగా వస్తోంది. పురాణములంటే భారతీయులకు అత్యంత విశ్వాసము. 


పురాణములలోని వ్యక్తుల జీవిత కథలను , అందులోని నీతి , నిజాయతీలను , సంఘటనలను నిజమనే నమ్ముతారు. వారిని ఆదర్శముగా తీసుకొంటారు. పురాణాలలోని ఆచార వ్యవహారాలను , వ్రతములను , పూజాదికార్యక్రమములను, జన్మనుండి మరణము వరకు సాగే బారసాల , అన్నప్రాశన , అక్షరాభ్యాసము నుండి పుంసవనము , శ్రీమంతము , వివాహము  తరువాత అప్పగింతలు , మరణము తరువాత  పార్థీవశరీరానికి చేసే క్రతువులు అన్నీపురాణాలలో వివరించిన విధముగానే పాటిస్తారు. పురాణ రచయతలను భగవత్‌ సమానులుగా కొలుస్తారు. భగవంతుడే వాల్మీకిమహర్షిగాను (బ్రహ్మ) , వేదవ్యాసుడు (శ్రీ మహావిష్ణువు) గాను జన్మించి పురాణములను రచించినారని,  అవి విశ్వమానవ సౌభ్రాతత్వమును చాటుతాయని నమ్ముతారు. శ్రీ మధ్భాభాగవతము , శ్రీ విష్ణు పురాణము అన్నవి భగవాన్ విష్ణువు , ఆయన భక్తుల కథలు. ఎవరైతే శ్రీ మహా విష్ణువును నమ్మి కొలుచుకున్నారో , ఆయన వారిని కష్టాలబారి నుండి ఎలా రక్షించాడో తెలిపే కథలు ఈ పురాణాలలో తెలుపబడ్డాయి. శ్రీ మథ్భాగవతము ద్వాదశస్కంధములుగా వ్రాయబడింది. శ్రీ మథ్భాగవతము చతుర్థ స్కంధములో త్రయోదశోధ్యాయములో విదుర ఉవాచ:


కే తే ప్రచేతసోనామ కస్యాపత్యాని సువ్ర


కస్యా న్వవాయే ప్రఖ్యాతా: కుత్ర వా సత్రామాసత                                       


అర్థము:  గొప్ప భగవత్ భక్తిని గలిగిన ఆచార్యా    “ప్రచేతసులు చేయుచున్న సత్రయాగములో నారదులు గానము జేసితిరని చెప్పితిరి గదా. ఆ ప్రచేతసులు ఎవరు ?వారెవరి కుమారులు ? ఎవరి వంశమందు ప్రసిద్ధిని పొందిరి.” అని విదురుడు  ప్రశ్నిస్తూ మైత్రేయునితో ఇంకా ఇలా అన్నాడు. వైవియస్ఆర్


స్వధర్మశీ లై: పురుషైర్భగవాన్ పురుషోత్తమ:


ఇజ్యమానో భక్తిమతా నారాదేనేరిత:కి ల


అర్థము: క్షత్రియులైన ప్రచేతసులు తమతమ ధర్మముల మూలకముగా శ్రీ హరిని యజ్ఞ యాగాదులచే పూజించుచుండిరి. అచ్చటికి వచ్చిన నారదులు , యజ్ఞమయుడు , పురుషోత్తముడైన విష్ణువును గురించి ఉపదేశించిరని వినియున్నాము.


ఇక్కడ తెలిసిన విషయము ప్రచేతసులు విష్ణుభక్తులు. క్షత్రియులు. వీరికి విష్ణువు , యజ్ఞయాగాదుల గురించి నారదుల వారు ఉపదేశము చేశారు. ఆ తరువాత కథా క్రమములో ధ్రువుడి తపస్సు , శ్రీహరి ప్రత్యక్షమవటము , వరాల అను గ్రహము , ధ్రువ వంశవిస్తరణ , సూర్యవంశస్థులు , బోయలవంశక్రమము వత్సరుడు , పుష్పార్ణుడు , సాయంకాలుడు , చక్షుడు , ఉల్కకుడు , అంగుడు , వేనుడు , పృథ్వీరాజు , విజితాశ్వుడు , పావనుడు , హవిర్ధానుడు , ప్రచేతసుడు , ప్రాచేతసులు (10మంది) అని తెలియబడతారు. వీరి జన్మవృత్తాంతములు , అంగుడి బాధ , వేనుడి దుశ్చర్యలు , పృథ్వీ రాజు ఔన్నత్యము , నిషాదుడు అడవులలోకి పంపబడి కిరాతరాజవ్వటము , ప్రచేతసుడికి 10 మంది ప్రాచేతసులు జననము వివరించబడ్డాయి.  ఆ 10 మంది ప్రాచేతసులలో 7వ (పదవ) వాడు వాల్మీకి మహర్షి.


ప్రాచేతసుడు క్షత్రియవంశములో జన్మించాడు , నారదుల ఉపదేశముతోనూ , తండ్రి , తాతల , ముత్తాతల  సుకృతము , శ్రీహరిపై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిని మహర్షిగా రూపొందింపచేశాయి. వాల్మీకిమహర్షి యొక్క నిజకథ ఇది. ఈ విషయములను కప్పిపుచ్చి అనేక కథలు తరతరాలుగా ప్రాచుర్యము పొందాయి. వాల్మీకి మహర్షి గురించి ఎవ్వరూ పరిశోధనలు గావించక పోవడముతో కట్టుకథలు ఇంత వరకు ప్రాచుర్యములో ఉన్నాయి. రాముడు అనే పాత్రను లోకానికి  ఆదర్శపురుషుడిగా చూపించాలని ఆదికవి తపనే గాని ఆపాత్రకు గుణగణాలు రూపొందిచటమే తన ధృష్టి తప్ప తన గురించి తానెవరో అనే గొప్పలు చెప్పాలనే ఆలోచన తన రచనల్లో కనిపించదు. వాస్తవాన్ని కూడా చెప్పక పోవడముతో ఎవరికి తోచినది వారు ఊహాగానాలు చేశారు. మహానుభావులు ఎప్పుడూ ఇతరుల గురించి , వారి బాగుగురించి ఆలోచిస్తారే తప్ప వారి గురించి వారు తపించరు.


మహర్షివాల్మీకి ఎప్పుడూ, ఎక్కడా తాను తన జీవితచరిత్రను వెలి బుచ్చక పోవటముతో కొందరు వాల్మీకి పేరు రత్నాకరుడని ఆయన పూర్వాశ్రమములో దొంగ , దారి దోపిడీదారుడని వ్రాశారు. మరి కొందరు ఆయన బ్రాహ్మణుడని , పేరు అగ్నిశర్మ అని  దొంగల ముటాలో పెరిగి దొంగ అయినాడని వ్రాశారు. ఈ కట్టు కథలకు ఎక్కడా ఆధారాలు  లేవు (ఇలపావులూరి  పాండురంగారావు , ఆచార్య సహదేవ , జస్టిస్ భల్లా). భగవధ్గీతలో కూడా అనేక మార్పులు , చేర్పులు జరిగాయని , మూల గీతలో లేని అనేక శ్లోకములు చేర్చబడ్డాయని డాక్టర్ రాధాకృష్ణన్ , రుడాల్ఫ్ ఓటో అభిప్రాయ బడ్డారు. (దర్శనములు - మతములు - విజ్ఞాన సర్వస్వము , నాలుగవ సంపుటము - ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి)  వాల్మీకిమహర్షి గురించి కొందరు ఓర్వలేక , అసూయతో లేదా దొంగ కూడా తపస్సు చేసి మహర్షి కావచ్చు అనేందుకు ఉదాహరణగా చూపేందుకో  అల్లిన కట్టు కథలు.


భారతీయ సాహిత్య నిర్మాతలు - వాల్మీకి అనే ఆంగ్లపుస్తకములో ఇలపావులూరి పాండురంగారావు గారు ఈ క్రింది విధముగా వాల్మీకిమహర్షి పై వ్యాఖ్యానించారు.


“వాల్మీకి తన జీవితారంభ దశలో కిరాతుడని , సప్తరుషులచే  ఋషిగా పరివర్తన పొందగలిగాడని  ప్రచారములో ఉన్న కథ వినడానికి ఉత్కంఠ భరితముగా ఉండవచ్చుగాని దానికి తగిన చారిత్రాత్మక ఆధారాలు లేవు. జీవితాన్ని గూర్చి సంపూర్ణ అవగాహన గలిగి , శాస్త్రీయ ధృక్పథముతో రసజ్ఞ సౌందర్యాన్ని కవితామయముగా  మేళవించిన వ్యక్తిని గూర్చి అలా చెప్పడము భావ్యము కాదు. వాల్మీకి కిరాతుడు అనే కథ బహుళ ప్రచారములో ఉన్నందున ఆ ధృక్పథము తోనే చూస్తున్నారు.”  


వాల్మీకి , కిరాతుడు , రత్నాకరుడు , అగ్నిశర్మ పేర్ల కథనాలు , 


విమర్శలు


“ కిరాతుడు ” అనే  పదానికి అర్థము తురాయి అనగా నెమలి పింఛము లేదా అటువంటి ఆకారములో ఉన్న పువ్వులు , ఆకులను , పక్షుల ఈకలను తల ముందు భాగములో కట్టుకొని , తలపాగవలె ధరించి ఉన్నవాడు.    ”కి” అనగా కలిగి అని , రాతుడు అనగా తురాయివాడు అని అర్థము. అంతే గాని ఈనాడు వాడుకలో ఉన్నట్లుగా కిరాతుడు అంటే కసాయివాడు లేదా కోడి , జింక , గొర్రె , బర్రె , మేక , తదితర సాధు జీవుల తలను నిష్కర్షగా నరికేవాడు అని కాదు. ఆదిమానవకాలములో అడవులలో వేటకై వెళ్ళేప్పుడు ఇతర మాంసాహార జంతువుల బారి పడకుండా ఉండేందుకో , సరదాగా ఉంటుందనో , అలంకారానికో తురాయిని కట్టుకునే వారు. కిరాతుడు అంటే హింసాత్ముడు అనే అర్థము స్ఫురిస్తే ఈరోజులలో జీవాలను (కోళ్ళు , చేపలు , రొయ్యలు , గొర్రెలు , మేకలు) పెంచి , పోషించి మార్కెట్లో అమ్మకము చేసేవారు , కొనేవారు , తినేవారు అందరూ కిరాతులే.


వాల్మీకి శబ్దము చీమలపుట్ట అనే అర్థానికి , కఠోర ధ్యానానికి , నిశ్చల తపోముద్రకు ప్రతీక. అట్టి తపోః ఫలితమే వాల్మీకి మహాకవి. వాల్మీకిని మహోన్నతముగా ఆరాధించే కాళిదాసు మేఘసందేశములోని శ్లోకభాగములో ఇలా ప్రస్తుతించాడు. (ఇలపావులూరి పాండురంగారావు)


“వాల్మీకాగ్రాత్ ప్రభవతి  ధనః ఖండమా ఖండాలస్య”  

అర్థము:  సుదూరములో కనిపిస్తున్న ఆ పుట్టను చూడండి ! అందులో నుండి ఇంధ్రధనస్సు ప్రభవించింది. దీనికి భాష్యము చెబుతూ ఇలపావులూరి పాండు రంగారావు అంటారు - ఇంధ్రధనస్సు అనే ఉపమానము వాల్మీకి కవితాత్మకు , ప్రబంధౌచిత్యానికి ప్రతీక. వాల్మీకి రామాయణములోని 7 కాండలు ఇంధ్రధనస్సులోని సప్తవర్ణాలను గుర్తుకు తెస్తాయి.  కిరాతులు క్షత్రియులే , వీరిలో ఉపనయనాది కర్మలు లోపించాయి అంటాడు మనువు (మనుస్మృతి).        


కిరాతుడు (ఋషి)గా పరివర్తన చెండాడని చెప్పడము నిజము కావచ్చు. అంతేగాని ఆయన గురించి మరొక్క మాట దురాలోచనే. తపస్సు ఆయన ప్రధానసద్గుణము , నిరంతరాధ్యయనము , సత్ప్రవర్తనల ఫలితమే మహాఋషిగా ఆవిర్భవింపచేశాయి. వాల్మీకి పేరు కలిగిన వారు నలుగురైదుగురు ఉన్నారని కొందరు విజ్ఞుల (వ్యాసుడు అనిపేరు కలిగిన వారు కూడా 10 మంది ఉన్నారని) అభిప్రాయము. వారిలో రత్నాకరుడు , అగ్నిశర్మ కూడా ఉండి ఉండవచ్చును.  వీరు మహర్షి , ఆదికవి వాల్మీకి ఉత్ద్బోధనలకు ప్రేరితులై తమ పేర్లను వాల్మీకిగా మార్చుకొని ప్రాచుర్యము లోనికి వచ్చి ఉంటారు. ఆకతాయి రచయతలు ఎవరో వారిని మహర్షిని ఒక్కరే అని పొరబడి ఉండవచ్చును.ఈ విషయము నిజమే అని నమ్మటానికి పంజాబ్ , హరియానా విశ్వవిద్యాలయము వారు ఆచార్య , డాక్టరు సహదేవ ఆధ్వర్యములో 3 సంవత్సరముల పాటు నిర్వహించిన పరిశోధనలు సహకరిస్తున్నాయి (మహర్షి వాల్మీకి వాస్ నెవర్ ఏ డేకోయిట్ నార్ ఏ రోడ్ సైడ్ రాబర్ - జస్టిస్ భల్లా , ద టైమ్స్ ఆఫ్ ఇండియా , ఇంగ్లీష్ డైలీ , 2010 మే 22) పంజాబ్ , హరియానా హైకోర్ట్ ఆదేశాల మేరకు పంజాబ్ , హరియానా , విశ్వవిధ్యాలయము వారు పరిశోధనలు గావించారు. డాక్టరు సహదేవ , చైర్ పర్సన్ గా , వాల్మీకి చైర్ అనే విభాగమును , ఏర్పాటు చేసి ఈ పరిశోధనలు , అధ్యాపకులచే నిర్వహింప బడ్డాయి). క్రీ.పూ. నుండి  అందుబాటులో ఉన్న వేదములు , శిలాశాసనాలు , ఉపనిషత్తులు , పురాణములు , ఇతిహాసములు , చరిత్రలు క్షుణ్ణముగా పరిశీలించగా మహర్షివాల్మీకిని ఎక్కడా , ఎప్పుడూ దొంగగా , దారి దోపిడీ దారుడిగా వ్రాయబడి లేదు. ఈ పరిశోధన ఫలితాల ఆధారముగా జడ్జిమెంట్‌ను జస్టిస్ భల్లా ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ ప్రకారము వాల్మీకి మహర్షిని ఎవ్వరూ దొంగ , దారి దోపిడీదారుడు అనకూడదు. ఆవిధముగా మాట్లాడకూడదు , నాటికలు , టి.వి.సీరియల్స్ , సినిమాలు తీయరాదు , వాల్మీకి మహర్షిని దొంగ , దారి దోపిడీదారుడు అని బోయలను , వాల్మీకులను కించపరిచే విధముగా మాట్లాడితే నేరము , వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చును. మహర్షి వాల్మీకి గురించి కొన్ని పురాణములలో ( ఆధ్యాత్మికరామాయణము , స్కాంధపురాణము , తదితర) వ్రాయ బడినట్లుగా చెబుతున్న వాటికి  వాస్తవాలకు పొంతన లేదని అవి మూలపురాణములో లేవని ఆ తరువాత చేర్చబడిన అవిశ్వాస కథలని ఇతిహాసికులు , చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.


వాల్మీకిమహర్షిని ఆదికవి , ఋక్షకుడు , భార్గవుడు , కవికోకిల , వాక్యావిశారదుడు , మహాజ్ఞాని , భగవాన్ అని కూడా పిలుస్తారు. వాల్మీకిమహర్షి “ఓం  ఐం హ్రీం  క్లీo శ్రీo” అనే బీజాక్షరాలు సరస్వతీ , లక్ష్మి , మాయ కటాక్షాన్ని కలుగచేసే మంత్రాలను లోకానికి పరిచయము చేశారు. (దేవిభాగవతము, వేదవ్యాసవిరచితము, తెలుగు అనువాదము)    


వాల్మీకిమహర్షి జీవించిన కాలముపై అనేక పరిశోధనలు జరిగాయి. వాల్మీకి రామాయణము క్రీ.పూ. 1000 వ సంవత్సర ప్రారంభములో రచింపబడి వుంటుందని , వాల్మీకిపై విశేషపరిశోధనలు గావించిన జి.ఎస్. ఆల్టేకర్ (1895-1987) నిర్దారించారు (ఇలపావులూరి పాండురంగారావు). క్రీ.పూ. 100 సంవత్సరములకు చెందిన బుద్ధచరిత్ర రచయత అశ్వఘోషుడు వాల్మీకి ఆదికావ్యాన్ని గూర్చి ప్రశంశిస్తూ ఇలా వ్రాశాడు.


”వాల్మీకి రాదే చ ససర్జపద్యం జగ్రంధన్నచ్యవనో మహర్షి” - ఈ శ్లోకం వాల్మీకి క్రీస్తు శకానికి ముందువాడని ధ్రువ  పరుస్తోంది


బుద్ధునికి పూర్వము అంటే క్రీ.పూ. 800 సం.ల నాటి వారు వాల్మీకి అని డా.హెచ్. జాకోబి అభిప్రాయము. పై విషయాలు పరిశోధన చేసి వ్రాసినది ఆచార్య చిప్పగిరి జ్ఞానేశ్వర్.


మహర్షి వాల్మీకి తనకు తాను  పేరు , తండ్రి పేరు చెప్పినది ఒక సందర్భంలో నే అదే వాస్తవం మిగిలిన పేర్లు , కథలు అబద్ధాలు అనువాదాల ద్వారా వ్రాసి ప్రచురించిన వాల్మీకి జన్మ వృత్తాంతములకు ఆధారాలు లేవు. (ఆచార్య మంజు లాసహదేవ , వాల్మీకి ఛైర్ పోర్షన్ , పంజాబ్ అండ్ హర్యానా విశ్వ విద్యాలయం.)


వాల్మీకి మహర్షి వద్ద శిష్యరికము గావించిన భరద్వాజుడు , లవుడు , కుశుడు మహర్షిని భగవాన్ అని సంబోధించేవారు. బ్రహ్మ సమానుడని , బ్రహ్మ రామాయణమును వ్రాయటానికి తానే వాల్మీకి మహర్షిగా అవుతరించాడని నమ్మేవారున్నారు. ”విప్రో వాల్మీకిస్సు  మహాశయా” అని బ్రహ్మ సరస్వతి దేవితో చెప్పాడని , అందువలన వాల్మీకిమహర్షి విప్రుడు అని పురాణ వ్యాఖ్యాతలు చెబుతున్నారు. స్వగుణధర్మముతో బోయవాడిగా   పుట్టినవాడు ఆదికవిగా , మహర్షిగా , బ్రాహ్మణుడిగా  గుర్తించ బడ్డారని ఆయన గణకీర్తిని కొనియాడారు.


ఆదికవి వాల్మీకి ఆ రోజులలోనే “అక్షరలక్ష” అనే  ఈనాటి “ఎన్ సైక్లోపెడియా బ్రిటానికా” వంటి విజ్ఞాన  సర్వస్వము , సర్వశాస్త్ర సంగ్రహమును వెలువరించారు. (పెదబాలశిక్ష - గాజుల సత్యనారాయణ) ఈపుస్తకములో  భూగర్భశాస్త్రము , రసాయనశాస్త్రము , గణితశాస్త్రము , రేఖాగణితము , బీజ గణితము , త్రికోణమితి , 325 రకాల గణిత ప్రక్రియలు , గాలి , ఉష్ణము , విద్యుత్ , జలయంత్ర శాస్త్రము , ఖనిజాలు తదితర అనేక అంశాలు వివరించబడి ఉన్నాయి. యోగవాశిష్టము అనే యోగా , ధ్యానముల గురించిన సంపూర్ణ విషయములు గల మరో పుస్తకము మహర్షి వాల్మీకి వ్రాశారు. ఈ పుస్తకము రామాయణములోని అంతర్భాగమే. రాముడు పది - పన్నెండు సంవత్సరాల వయసులో మానసిక అశాంతికి లోనై , మానసిక ధౌర్భల్యమునకు గురి అయినప్పుడు  వశిస్టుడి ద్వారాయోగా , ధ్యానములను శ్రీరాముడికి బోధించారు వ్రాసింది.  వాల్మీకిమహర్షి , పలికింది , బోధించింది వశిస్టుడు , అందు వలన “యోగవాశిష్టము” అనే పేరు వచ్చింది. ఆదిత్య హృదయము అనెడి సూర్యస్తుతిని వ్రాసినవారు వాల్మీకి మహర్షియే. కౌసల్యా సుప్రజా రామ అనెడి సుప్రభాతమును వ్రాసిన వారు  వాల్మీకియే. మహర్షివాల్మీకి  “వాల్మీకి మతము” అనే దానిని నెలకొల్పారు. తొమ్మిది లక్షణాలతో జీవితమును సంస్కరించుకోవాలని , ఈ తొమ్మిది గుణములు కలిగిన వారిని , పాటిస్తున్నవారిని  వాల్మీకి మతస్తులుగా గుర్తించారు. ఆటవిక జీవితములో వ్యవసాయము తెలియదు.  అడవులలో దొరికిన ఆకులు ,  అల ములు , దుంపలు , కాయలు , పండ్లు , సాధుజీవుల (కుందేలు , కోడి , పంది , గొర్రె ,   మేకలువంటివి)ను పట్టి , అవి పట్టుబడక పోతే వాటితో పోరాడి స్వంతము చేసుకోవటమే అలవాటు. తమ  వద్ద లేని ఇతరుల వద్ద ఉన్న వాటిని లాగుకోవటము, ఇవ్వకపోతే వారితో పొరాడి , చంపి అయినా సరే తమ స్వంతము చేసుకోవటము ఆటవికతనము , ఈ పోరాటము జరిపే , ధైర్యసాహసాలు గల వారినే “క్షత్రియులు” అని అంటారని భీష్ముడు మహాభారతములో క్షత్రియత్వము గురించి  వివరణ ఇచ్చాడు.  ఈ ఆటవికతనమును పారద్రోలి సంస్క రించటానికే వాల్మీకి తొమ్మిది లక్షణాలతో జీవనమును సాగించాలని బోధించారు. ఆటవికులలో సంస్కారమును కలుగ చేయటానికే వాల్మీకిమతము ప్రారంభించబడింది. క్రీ.పూ. 600 సంవత్సరములోనే ఆటవికులు సంస్కరించబడటము మొదలైంది అని చెప్పటానికి వాల్మీకి వ్రాసిన మొదటి శ్లోకమే గొప్ప ఉదాహరణ. ఆటవిక భాష సంస్కృతముగా రూపొందింది వాల్మీకి వలననే. ”మా నిషాద” అనే పదముతో మొదలైన శ్లోకములోని మొదటి వ్యక్తి నిషాదుడే , అతనూ బోయవాడే. అజ్ఞానముతో బోయవాడు చేసిన ఆడ పక్షిని చంపటము అనే ప్రక్రియ వాల్మీకిమహర్షిలో బోయలను , ఆటవికులను సంస్కరించాలనే ఆలోచనను కలిగింప చేసి ఒక ఆదర్శ మానవుడిని  నాయకుడిగా చూపించాలని “రామాయణము” వ్రాసేలా చేశాయి.


క్రౌంచ పక్షి జంటలో ఒకటి చనిపోవుట   రామాయణ కర్తగా వాల్మీకి


వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు 7 కాండాలుగా (ఉత్తరకాండ సహా)విభజించబడి ఉన్నాయి. రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి. ఇది మహాభారత కావ్యంలో దాదాపుగా పావు వంతు భాగం. ప్రసిద్ధ ఆంగ్ల రచన ఇలియాడ్కు ఇది నాలుగు రెట్లు పెద్దది. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. రామాయణంలో తెలుపబడిన విషయాలననుసరించి కనీసం లక్ష సంవత్సరాల ప్రాచీనమవవచ్చని భారత దార్శనికుల నమ్మకం. ఇతర ఇతిహాసాల్లాగానే రామాయణం కూడా ఎన్నో మార్పులకు , కలుపుగోరులకు , తీసివేతలకు గురి అయింది.


వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు , సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ - కుశలను కన్నట్టూ , వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది.


తొలి శ్లోకం


వాల్మీకి తపస్సంపన్నత తరువాత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా. భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు. చూసి పరవశానికి గురి అవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు:


మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥

యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥


ఓ కిరాతుడా ! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.

ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి. ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం సాంతం రాసేవరకూ సాగింది.


వాల్మీకి వలస


అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారతదేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం (నల్లమల అడవులు) గూండా దక్షిణ భారతదేశం , ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ , అడవి ఆకులు , దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ , తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ

Thursday, September 21, 2023

వినాయకుడూ - విష్ణువూ ఒకరేనా!

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ I 

ప్రసన్నవదనం ధ్యాయేత్ 

సర్వవిఘ్నోపశాంతయే ॥

ఇది అందఱమూ అన్ని సందర్భాలలోనూ ప్రార్థనా శ్లోకంగా చదువుతాం.

ఈ శ్లోకం 


1. వినాయకునికి సంబంధించి,

* శుక్ల + అంబరధరమ్ = తెల్లని వస్త్రాలని ధరించినవాడు, 

* శశివర్ణం = చంద్రునిలా తెల్లనైన శరీరం కలవాడు, 

* చతుర్భుజమ్ = నాలుగు చేతులతో ఉండేవాడు, 

* ప్రసన్న వదనమ్ = అనుగ్రహ దృష్టితో చూచే ముఖం కలవాడు, 

* విష్ణుమ్ = సర్వవ్యాపి అయినవాడు, 

* సర్వ విఘ్న + ఉపశాంతయే = అన్ని విఘ్నాలనుంచీ బయటపడేసి, శాంతి పొందించేవాడు,

అయిన "వినాయకు"ని 

* ధ్యాయేత్ = ధ్యానిస్తున్నాను. 

      అని అర్థం.


 2. విష్ణువుకి  సంబంధింది కాదుకదా! 

 ఈ శ్లోకంలో "చతుర్భుజమ్", "విష్ణుమ్" అనే మాటతో ఇది విష్ణువుకి సంబంధించింది అంటారు. కానీ,

* తెల్లవస్త్రాలు ధరించి అని ఉంటే, మరి విష్ణువు పసుపుబట్టలు ధరించే "పీతాంబర ధారి" కదా!

* చంద్రునిలా తెల్లని రంగుగలవాడు అని ఉంటే, మరి విష్ణువు "నీలమేఘశ్యాముడు" కదా!

* విఘ్నాలు తొలగించేవాడు అని ఉంటే, మరి "సృష్టి స్థితి లయా"లలో స్థితికి సంబంధించి , విష్ణువు "పుట్టిన వాడిని పోషించడం వరకే బాధ్యతగా కలవాడు" కదా! , ---------- ఇలా అంటూ,

ఈ శ్లోకం విష్ణువుకు వర్తించదు అంటారు.

మరి విష్ణువుకు ఎలా అన్వయిస్తాము?


2. విష్ణువునకు సంబంధించి అన్వయం 

* శుక్ల + అంబరధరమ్ 

- తెల్లనైన ఆకాశాన్ని(అంబర) ధరించేవాడు.

 ( విష్ణువునకు,

నాభిర్వియత్ - ఆకాశం బొడ్డు

 ఆ బొడ్డులోనుంచీ సృష్టికర్త "బ్రహ్మ" వచ్చాడు. 


ఆకాశాద్వాయుః - వాయోరగ్నిః - అగ్నేరాపః - అబ్భ్యః పృథివీ - పృథివ్యా ఓషధయః - ఓషధీభ్యోన్నమ్ - అన్నాత్పురుషః - స ఏవా పురుషో అన్నరసమయః -

ఆ ఆకాశం నుండీ వాయువూ - వాయువు నుండీ అగ్నీ - అగ్ని నుండీ నీరూ - నీటి నుండీ భూమీ - భూమి నుండీ ఓషధులూ - ఓషధుల నుండీ అన్నమూ - అన్నము నుండీ ప్రాణులూ కలుగుతాయి)

* విష్ణుమ్ 

    — అంతటా వ్యాపించినవాడు

 (విశ్వం వ్యాప్నోతీతి విష్ణుః )

* శశివర్ణమ్ 

  "శశము" అంటే కుందేలు.

కుందేలు ఒక అడుగువేసి, మళ్ళీ గంతువేసి, మళ్ళీ దూకుతూ నడుస్తుంది.

 అలాగే 'కాలం' కూడా రోజు - పక్షం - నెల - సంవత్సరం అని కొలవబడుతూ, సంవత్సరాన్ని ప్రమాణంగా కొలవబడుతూంటుంది.

విష్ణువు 'కాలాన్ని' అధీనంలో ఉంచుకున్నవాడూ, 'కాల స్వరూపుడు'గా "శశివర్ణమ్"

* చతుర్భుజమ్ 

    నాలుగు చేతులలో 

శంఖ - చక్ర - గద - పద్మాలు కలవాడు.

గద - అహంకారాన్ని అణుస్తుంది.

పద్మం - చిత్తాన్ని వికసింపచేస్తూ, విశ్లేషింపజేస్తుంది.

చక్రం - సంశయాత్మకమైన మనస్సులో సంశయనివృత్తి చేస్తుంది.

శంఖం - నిర్ణయాత్మకమైన బుద్ధిని ప్రామాణికమైన జ్ఞానంతో సరియైన నిర్ణయాన్నిస్తుంది.

 

శంఖ - చక్ర - గద - పద్మాలు నాలుగు చేతులలో  మారుతూ 24 రకాలుగా( Factorial 4 = 4x3x2x1 = 24) కనబడే మూర్తులే

కేశవ - నారాయణ - మాధవ - గోవింద - విష్ణు - మధుసూదన - త్రివిక్రమ - వామన - శ్రీధర - హృషీకేశ - పద్మనాభ - దామోదర - సంకర్షణ - వాసుదేవ - ప్రద్యుమ్న - అనిరుద్ధ - పురుషోత్తమ - అధోక్షజ - నారసింహ -అచ్యుత - జనార్దన - ఉపేంద్ర - హరయ  - శ్రీకృష్ణ.

   "మనో బుద్ధి చిత్త అహంకారాల"నే నాలుగు భాగాలుగా ఉండే "అంతఃకరణ" శుద్ధి అనుగ్రహించే స్వామి "విష్ణువు". 


* ప్రసన్న వదనం

భృగు మహర్షి వచ్చి కాలుతో తన్నినా వదనంలో మార్పులేదు.

 (చేయవలసిన పనిని హావభావాలు కనబడనీయక నిశ్శబ్దంగా చేస్తాడు)

* సర్వవిఘ్నాలు పారద్రోలి శాంతి కల్గించే "స్థితి కారకుడై"న "విష్ణుమూర్తి"ని 

* ధ్యాయేత్ 

- ధ్యానిస్తాను. 


పార్వతీపరమేశ్వరులకు దేవతలు విఘ్నం కల్గించడంవల్ల సంతానం కలుగలేదు. 

 ఆదిదంపతుల ప్రార్థనతో విష్ణువే పుత్రుడుగా జన్మిస్తాడు.    

శని దృష్టివలన ఆతని శిరస్సు ఖండింపబడితే, గజశిరస్సు అమర్చారు. గజాననుడు సాక్షాత్తూ విష్ణువు  అవతారమే 

 - బ్రహ్మ వైవర్త పురాణం 


వినాయకుడూ విష్ణువూ ఒకరే కాబట్టి స్వామిని  "లక్ష్మీ గణపతి"  విగ్రహ రూపంలో ఆరాధిస్తాం.

Wednesday, August 30, 2023

శ్రీహయగ్రీవ జయంతి

జ్ఞానానంద మయం దేవం నిర్మల స్పటికాకృతిమ్ 

ఆధారం సర్వ విద్యానామ్ హాయగ్రీవం ఉపాస్మహే 


సింహే శ్రవణ సంజాతం విద్యా నామాధిమం గురుం

జ్ఞానానంద ప్రధాతారం హాయగ్రీవం ఉపాస్మహే


సర్వవిద్యా స్వరూపాయ లక్ష్మీ సంశ్లిష్ఠ వక్షసే

మధుపాసన లక్ష్యాయ హయగ్రీవాయ మంగళం


శ్రీమతే రామానుజాయ నమ:

శ్రీ సుబ్రహ్మణ్య ద్వాదశ నామ స్తోత్రం

 ప్రథమం షణ్ముఖంచ  

ద్వితీయం గజాననానుజం

త్రుతీయం వల్లీవల్లభంచ 

చతుర్ధం క్రౌంచభేదకం

పంచమం దేవసేనానీంశ్ఛ 

షష్ఠం తారకభంజనం

సప్తమం ద్వైమాతురంచ 

అష్టమం జ్ఞానబోధకం

నవమం భక్తవరదంచ 

దశమం మోక్షదాయకం

ఏకాదశం శక్తిహస్తంచ 

ద్వాదశం అగ్నితేజసం

Tuesday, August 22, 2023

మజ్జిగ

ఈనాడు దాదాపు నూటికి 90% మంది ప్రజలు తమ ఆహారంలో మజ్జిగను పూర్తిగా మానేశారు. రెండు పూటలా పెరుగును మాత్రమే వాడుతున్నారు.

పెరుగు ఆయుక్షీణం. రాత్రి సమయంలో అసలు తినకూడదు.

మజ్జిగ  5 రకాలు

1. మధితము:
పెరుగులో నీరు కలపకుండా చిలికి చేసిన మజ్జిగ చిక్కగా ఉంటుంది. ఈ మజ్జిగను ఆహారంలో తీసుకుంటే నీరసం, ఉదర రోగాలు, పైత్యము, వాతము, రుచి తెలియక పోవడం, నీళ్ళ విరోచనాలు మొదలైనవి పోయి శరీరానికి బలం కలుగుతుంది.

2. మిళితము:
పెరుగు ఒక వంతులో నీళ్లు మూడు వంతులు పోసి చిలికి తయారు చేసిన మజ్జిగ అరుచిని, అతిసార విరోచనాన్ని, రక్తంలో చేరిన వాతాన్ని ఇంకా అనేక రోగాలను పోగొడుతుంది.

3. గోళము:
ఒక వంతు పెరుగు, ఒకటిన్నర వంతు నీళ్లు కలిపి తయారు చేసిన మజ్జిగ శరీరానికి మంచి కాంతి వస్తుంది. కంటికి మేలు చేస్తుంది. ఉదరములో మందాగ్ని, విష దోషాలు, కఫము, ఆమరోగములను పోగొడుతుంది.

4. షాడభము:
ఒక వంతు పెరుగు, అయిదు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసిన మజ్జిగ శ్లేష్మరోగాలను, రక్తమూల వ్యాధిని
పోగొడుతుంది. ఈ మజ్జిగ తేలికగా ఉండి ఉదరములో జఠరాగ్నిని పెంచి శరీరానికి కాంతినిస్తుంది.

5. కాలశేయము:
ఒకవంతు పెరుగు, రెండు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసిన ఈ మజ్జిగ బంక విరోచనాలు, విషములను, ఉబ్బులను, మంటను, వాతమును, మూలవ్యాధిని పోగొట్టి శరీరం త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది. పడిన ముడతలను కూడా తీసి వేస్తుంది.

మజ్జిగ ఆహారంలో తీసుకోవటం అన్ని కాలాలలో, అన్ని వయసుల వారికి మంచిది

Tuesday, August 8, 2023

యక్ష_ప్రశ్నలు....

ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు.... వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు..:


1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)


2. సూర్యుని చుట్టూ తిరుగు వారెవరు? (దేవతలు)


3. సూర్యుని అస్తమింప చేయునది ఏది? (ధర్మం)


4. సూర్యుడు దేని ఆధారంగా నిలచి యున్నాడు? (సత్యం)


5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)


6. దేని వలన మహత్తును పొందును? (తపస్సు)


7. మానవునికి సహాయపడునది ఏది? (ధైర్యం)


8. మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)


9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? (అధ్యయనము వలన)


10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సు వలన సాధు భావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధు భావము సంభవించును.)


11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయము వలన)


12. జీవన్మృతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)


13. భూమికంటె భారమైనది ఏది? (జనని)


14. ఆకాశం కంటే పొడవైనది ఏది? (తండ్రి)


15. గాలి కంటె వేగమైనది ఏది? (మనస్సు)


16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)


17. తృణం కంటే దట్టమైనది ఏది? (చింత)


18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)


19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్య చే)


20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ఞం చేయుట వలన)


21. జన్మించియు ప్రాణం లేనిది (గుడ్డు)


22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? (రాయి)


23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడం వలన)


24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)


25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)


26. బాటసారికి, రోగికి, గృహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)


27. ధర్మానికి ఆధారమేది? (దయ, దాక్షిణ్యం)


28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)


29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)


30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)


31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)


32. మనిషికి ఆత్మ ఎవరు? ( కుమారుడు)


33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)


34. మనిషి దేని వల్ల సంతసించును? (దానం)


35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)


36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)


37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)


38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)


39. ఎవరితో సంధి శిథిలమవదు? (సజ్జనులతో)


40. ఎల్లప్పుడూ తృప్తిగా పడి యుండునదేది? (యాగ కర్మ)


41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)


42. అన్నోదకాలు వేని యందు ఉద్భవిస్తాయి? (భూమి, ఆకాశము లందు)


43. లోకాన్ని కప్పి వున్నది ఏది? (అజ్ఞానం)


44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)


45. మనిషి దేనిని విడచి సర్వజన ఆదరణీయుడు, శోక రహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో)


46. తపస్సు అంటే ఏమిటి? ( తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం)


47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)


48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)


49. సర్వ ధనియ అనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)


50. జ్ఞానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించగలగడం)


51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)


52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)


53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)


54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ఞానం కలిగి ఉండటం)


55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)


56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)


57. దానం అంటే ఏమిటి? ( సమస్త ప్రాణుల్ని రక్షించడం)


58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)


59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు)


60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)


61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ఞానం)


62. డంభం అంటే ఏమిటి? (తన గొప్ప తానే చెప్పుకోవటం)


63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)


64. నరకం అనుభవించే వారెవరు? (ఆశ పెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు)


65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)


66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)


67. ఆలోచించి పని చేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు)


68. ఎక్కువ మంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)


69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)


70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)


71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ, అప్రియమూ, సుఖమూ, దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)


72. స్ధితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందూ, కలిమి లేములందూ, సుఖ దు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్ధి కలవాడుగా ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు)

సర్వేజనాసుఖినోభవంతు

కాశి ఆలయ చరిత్ర

 👉 కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం. 

👉 కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.

👉 క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం

👉 క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన

👉 క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం

👉 క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన  గుజరాతి వర్తకులు

👉 క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి

👉 క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్

👉 క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం

👉 క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు

👉 శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి

👉 క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు

👉 క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం

👉 క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం

👉 క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు

👉 క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్

👉 కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం

👉 ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు

👉 కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం

👉 184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన. 

👉 12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.

👉 కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.

👉 మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.

👉 కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.

👉 విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.

👉 ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.

👉 ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.

👉 2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి యుగపురుషుడు హిందువులందరికీ ఆరాధ్య మైనవాడు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.

Thursday, July 6, 2023

ఆషాఢమాసం - ప్రత్యేకత


నేరేడుపండు - మాంసాహారం - అంతరార్థం    


    ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. 

    సంవత్సరంలో ప్రతీవారూ ఏనుగు తల పరిమాణమంత మాంసాన్ని ఆహారంగా  తీసుకుంటారనీ, దానికి నేరేడు విరుగుడనీ పేర్కొంటారు. 

    దీనిలో ఉండే అంతరార్థాన్ని పరిశీలించాలి. 


శాకాహారులూ మాంసాహారులేనా? 


    మొక్కలకు ప్రాణముంటుందని జగదీశ్ చంద్రబోసు అనే శాస్త్రవేత్త కనుగొన్నట్లు మనం పాఠ్యాంశాలలో చదువుకున్నాం. 

    కానీ, సంస్కృతంలో "ఓషధి" అంటే "ఫలమునిచ్చి మరణించునది" అని  అర్థం. 

    వరిధాన్యంవంటివి మనం ఆహారంగా తీసుకుంటాము కదా! 

    మొక్క మనకి ఆహారమిస్తూ,అది ప్రాణాన్ని కోల్పోతుంది. అదియే మాంసాహారము. 

    ఆ విధంగా, ప్రతి ఒక్కళ్ళూ తినే ఆహారం, సంవత్సరంలో ఏనుగు శిరస్సంత ప్రమాణమే కదా! 


హింస - ప్రాయిశ్చిత్తము 


     మనం తెలిసి కూడా ఐదు హింసలకి పాల్పడతాం. వాటిని పంచ సూనములు అంటారు. వాటికి ప్రాయశ్చిత్తంగా పంచయజ్ఞాలు చేయాలి. 

     మన జీవనానికై ఆ హింసలు చేయక తప్పదు. 

    అందులో మొదటిది "ధాన్యాన్ని ఉత్పత్తి చేసేడప్పుడు జరిగే ప్రాణిహింస".  

     అందులో భాగమే ధాన్యాహార స్వీకరణ. 

    దానికి ప్రాయశ్చిత్తం "బ్రహ్మయజ్ఞం". 

    అంటే వేదాధ్యయనం చేయడం - చేయించడం. 


    ఆషాఢ మాసంలో వేదవ్యాసుని జయంతి వస్తుంది కాబట్టి, 

    వేదాలని న్యాసమొనరించి, ఈ రూపంలో అందించిన ఆయనను స్మరించి,  

     వేదాలని కాపాడుకోవడం మన విధి. 

    

ప్రకృతిలో మార్పు - సహజ చికిత్స 


    దేహంనుండీ శ్వేదరూపంలో బయటకు వెళ్ళే నీరు, 

    ఆషాఢంలో ఎండతగ్గి,    

    మూత్రంరూపంలో అధికంగా విడుదల అవుతుంది. 

    వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 

    అతిమూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరగించి అరిగించే శక్తి దానికి ఉందనీ జీవశాస్త్రంలో విద్యార్థులు చదువుతారు. 


గమనించవలసిన విషయాలు 


1. వాతావరణంలోని మార్పుకు దేహం సరి అయ్యే విధంగా, ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడు ఔషధంలా ఉపయోగించడమూ, 

2. బ్రహ్మయజ్ఞం ఆవశ్యకత  గుర్తించి, మన అపూర్వ జ్ఞానరాశియైన వేదాలని కాపాడుకోవడాన్ని బేరీజు వేసుకునే విధంగానూ పెద్దలు మనకిచ్చిన వరం. 


ఆచరణ 


    కాబట్టి మన పెద్దలు ఆషాఢ మాసం సందర్భంగా మనకందిచ్చిన ఆరోగ్య సూత్రాన్ని పాటించి,  ఆరోగ్యాన్ని పొందుతూ, 

    తద్వారా, దాని వెనక ఏర్పరచిన సాంకేతిక కారణాన్ని తెలుసుకొని, 

     శాస్త్రీయ వైదిక విజ్ఞానాన్ని కాపాడుకొందాం. తరువాత తరాలకి అందిద్దాం.  


ప్రవర యొక్క అర్ధం

చతుస్సాగర పర్యంతం

(మానవ పరిభ్రమణానికి నలువైపులా కల మహాసముద్రాల అంచుల వరకూ)... 

గో బ్రాహ్మణేభ్య శుభం భవతు(సర్వాబీష్ట ప్రదాయిణి అగు..గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ)....

×××××××. ఋషేయ ప్రవరాన్విత..

(మా వంశమునకూ..మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ..

త్యాగే నైకే అమృతత్త్వ మానశుః......

అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడనై..

×××××× గోత్రః

(మా గోత్రమునకూ..)


ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ.....

(మా శాఖకూ..అందలి శాస్త్ర మర్మంబులకు..)


శ్రీ * శర్మ నామధేయస్య

( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో..వేదాధ్యయనాది వైదిక క్రతువులతో..

1. స్నానము

2. సంధ్య

3. జపము

4. హోమము

5. స్వాధ్యాయము

6. దేవ పూజ

7. ఆతిధ్యము

8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ..త్రివిధాగ్నులు...

1.కామాగ్ని

2.క్రోధాగ్ని

3.క్షుద్రాగ్ని..

అనే త్రివిధాగ్నులను అదుపులో(సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై..పేరుకు ముందు శ్రీ అనబడే..ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన..

శ్రీ * *శర్మా అనబడే సుశ్రోత్రియుడనైన నేను..జన్మప్రధాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు..యావత్ ప్రపంచానికే మార్గదర్శకమైన వేదధర్మము ముందు.. నిరాకార నిర్గుణ అవ్యాజ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు..

అహంభో అభివాదయే..

( కేవలం నేనూ అన్నదిలేక.. సర్వం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ భాగ్యమేయన్న అహంకారభావ రహితుడనై.. నిగర్వినై..త్రికరణ శుద్ధిగా (మనసా,వాచా,కర్మణా) సాష్టాంగ పూర్వక (మానవశరీరంలోని అత్యంత ప్రాధాన్యమైన ఎనిమిది శరీరాంగములనూ శరణాగత హృదయంచే నేలపై వాల్చి సమర్పిస్తున్న)దండ ప్రణామమిదే..అన్న పరిపూర్ణమైన ఆత్మపూర్వక వేదపూర్వక హృదయపూర్వక నమస్కార భావమే.. సశాస్త్రీయమైన ఈ ప్రవరలోని..అర్ధం అంతరార్ధం పరమార్ధం కూడా..

Wednesday, July 5, 2023

తిథులు దేవతలు

ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతి గా వుండటం జరుగుతుంది. అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు..వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి.*

తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురించి.....

పాడ్యమి..

అధిదేవత – అగ్ని. 

వ్రత ఫలం – సత్ఫల ప్రాప్తి.


విదియ :-

అధిదేవత – అశ్విని దేవతలు. 

వ్రత ఫలం – ఆరోగ్య వృద్ది.


తదియ :- 

అధిదేవత – గౌరీ దేవి. 

వ్రత ఫలం – సుమంగళీ అనుగ్రహం.


చవితి:- 

అధిదేవత – వినాయకుడు. 

వ్రత ఫలం – కష్టములు తొలగిపోవుట.


పంచమి:- 

అధిదేవత – నాగ దేవత. 

వ్రత ఫలం – వివాహము, వంశ వృద్ది.


షష్టి :- 

అధిదేవత – సుబ్రహ్మణ్య స్వామి. 

వ్రత ఫలం – పుత్ర ప్రాప్తి.


సప్తమి:- 

అధిదేవత – సూర్య భగవానుడు. 

వ్రత ఫలం – ఆయురారోగ్య వృద్ది.


అష్టమి:- 

అధిదేవత – అష్టమాత్రుకలు. 

వ్రత ఫలం – దుర్గతి నాశనము.


నవమి:- 

అధిదేవత – దుర్గాదేవి. 

వ్రత ఫలం – సంపద ప్రాప్తిస్తుంది.


దశమి:- 

అధిదేవత – ఇంద్రాది దశ దిక్పాలకులు. 

వ్రత ఫలం – పాపాలు నశిస్తాయి.


ఏకాదశి:- 

అధిదేవత – కుబేరుడు. 

వ్రత ఫలం – ఐశ్వర్యము ప్రాప్తించును.


ద్వాదశి:- 

అధిదేవత – విష్ణువు. 

వ్రత ఫలం – పుణ్య ఫల ప్రాప్తించును.


త్రయోదశి:- 

అధిదేవత – ధర్ముడు. 

వ్రత ఫలం – మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.


చతుర్దశి:- 

అధిదేవత – రుద్ర. 

వ్రత ఫలం – మృత్యుంజయము, శుభప్రదం.


అమావాస్య:- 

అధిదేవతలు – పితృదేవతలు. 

వ్రత ఫలం – సంతాన సౌఖ్యం.


పౌర్ణమి:- 

అధిదేవత – చంద్రుడు. 

వ్రత ఫలం – ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.

Thursday, April 27, 2023

Adi Shankara Bhagavadpada Acharyara

25-Apr-203 is Srimad JagadGuru Adi Shankara Bhagavadpada Acharyara Jayanthi.

1200+ years back a Great Divine Chaithanya Atma, an avathar of Lord Shankara took birth for resurrection of Vedic Civilization to re-establish, propagate & spread the teachings of Sanathana Dharma.

A list of all the works by Shri JagadGuru Adi Shankaracharyaru is given below. Even today many scholars wonder how was it possible for Acharya to write so much in a very short lifespan of 32 years. It depicts that he was an avathar, the greatest scholar and a divine personality on a mission to teach & establish the philosophy of Advaita. Though the majority of his works concentrate on Advaita, he equally pitches on bhakti since he believed that bhakti was a very essential step for Chitta Shuddhi without which Self-realisation was not possible. Hence he composed verses and hymns in praise of every lord, the majority of which were concentrated on Vishnu, Shiva, and Shakthi. He wanted the people to worship the lord in any form of their wish, the results of which must finally purify their mind and make it fit for self-realisation. From his life history, it is evident that he was blessed by Lord Narasimha, Goddess Sri Sharadha parameshwari, and Lord Vishvanatha. Hence one can find a true Vaishnava, Shaiva and Shaakta in him. The most highlighting factor is the baashya for Hastamalakeeyam written by Shri Shankaracharya since rarely a Guru has written baashya for the work of his own disciple.

Below is the list of works by Srimad JagadGuru Adi Shankaracharyaru.

BHASHYA GRANTHAS
Brahma Sutras
Isavasya Upanishad
Kena Upanishad
Katha Upanishad
Prasna Upanishad
Mundaka Upanishad
Mandukya Upanishad
Mandukya Karika
Aitareya Upanishad
Taittiriya Upanishad
Chandogya Upanishad
Brihadaranyaka Upanishad
Sree Nrisimha Taapaneeya Upanishad
Bhagavad Gita
Vishnu Sahasranama
Sanat Sujatheeyam
Lalita Trishati
Hastamalakeeyam

PRAKARANA GRANTHAS
Vivekachudamani
Aparokshanubhuti
Upadesasahasri
Vaakya Vritti
Swatma Nirupanam
Atma bodha
Sarva Vedanta Sara Samgraha
Prabodha Sudhakaram
Swaatma Prakasika
Advaita Anubhuti
Brahma anuchintanam
Prashnouttara Ratnamaalika
Sadachara anusandhanam
Yaga Taravali
Anatmasree Vigarhanam
Swaroopa anusandhanam
Pancheekaranam
Tattwa bodha
Prouda anubhooti
Brahma Jnanavali
Laghu Vakyavritti
Bhaja Govindam
Prapancha Saaram

HYMNS AND MEDITATION VERSES
Sri Ganesa Pancharatnam
Ganesa Bhujangam
Subrahmanya Bhujangam
Siva Bhujangam
Devi Bhujangam
Bhavani Bhujangam
Sree Rama Bhujangam
Vishnu Bhujangam
Sarada Bhujangam
Sivananda Lahari
Soundarya Lahari
Ananda Lahari
Sivapaadaadi kesaanta varnana
Siva kesaadi padaanta varnana
Sree Vishnu-paadaadi-kesanta
Uma maheswara Stotram
Tripurasundari Vedapada Stotram
Tripurasundari Manasapooja
Tripurasundari Ashtakam
Devi shashti upachara-pooja
Mantra matruka Pushpamaala
Kanakadhara Stotram
Annapoorna Stotram
Ardhanareshwara Stotram
Bhramanaamba Ashtakam
Meenakshi Stotram
Meenakshi Pancharatnam
Gouri Dasakam
Navaratna Malika
Kalyana Vrishtistavam
Lalitha Pancharatnam
Maaya Panchakam
Suvarna Mala Stuti
Dasa Sloki
Veda Sara Siva StotramHara
Siva Panchaakshara Stotram
Sivaaparadha Kshamapana
Dakshinamoorthy Ashtakam
Dakshinamoorthy Varnamala
Mrutyunjaya Manasa Pooja Stotram
Siva Namavali Ashtakam
Kaala Bhairava Ashtakam
Shatpadee Stotram
Siva Panchakshara Nakshatra Mala
Dwadasa Ling Stotram
Kasi Panchakam
Hanumat Pancharatnam
Lakshmi-Nrisimha Pancharatnam
Lakshmi-Nrisimha Karunarasa Stotram
Panduranga Ashtakam
Achyuta Ashtakam
Sree Krishna Ashtakam
Hari Stuti
Govinda Ashtakam
Bhagavat Manasa Pooja
Praata Smarana Stotram
Jagannatha Ashtakam
Guruvashtakam
Narmada Ashtakam
Yamuna Ashtakam
Ganga Ashtakam
Manikarnika Ashtakam
Nirguna Manasa Pooja
Eka Sloki
Yati Panchakam
Jeevan Mukta Ananda Lahari
Dhanya Ashtakam
Upadesa (Sadhna) Panchakam
Sata Sloki
Maneesha Panchakam
Advaita Pancharatnam
Nirvana Shatakam
Devyapara-dha kshamapa stotra

Srimad JagadGuru Adi Shankara Bhagavadpada Acharyaya namaha
Om Gurave Namaha

Tuesday, March 14, 2023

గోవు మరియు గేదె పాలల్లోని ఆంతర్యం

🐃 గేదె కు బురద అంటే చాలా ఇష్టం. 

🐂 గోవు తన పేడ లో కూడా తను కూర్చోదు. గోవుకు స్వచ్ఛత అంటే చాలా ఇష్టం.

***

🐃 గేదెను 2kms దూరం తీసుకు వెళ్లి వదిలేస్తే.. ఇంటికి తిరిగి రాలేదు. దానికి జ్ఞ్యాపక శక్తి జీరో.

🐂 ఆవు ను 5kms దూరం తీసుకు వెళ్లి వదిలేసినా, ఇంటి దారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుంది.

గోవు పాలల్లో స్మరణ శక్తి ఉంటుంది.

***

🐃 పది గేదెలను కట్టి, వాటి పిల్లలను విడిచిపెడితే ఒక్క పిల్ల కూడా దాని తల్లిని గుర్తించలేదు.

🐂 గాని ఆవు దూడ అలా కాదు, తన తల్లి కొన్ని వందల ఆవుల మధ్య లో ఉన్నా గుర్తించగలదు.

***

🐃 పాలను తీసేటప్పుడు గేదె తన పాలను మొత్తం ఇచ్చేస్తుంది. 

🐂 గోవు తన పిల్ల కోసం పొదుగు లో కొంచం పాలను దాచిపెడుతుంది. అది పిల్ల త్రాగేటప్పుడు మాత్రమే వదులుతుంది. నాటు ఆవు పాలల్లో వాత్సల్య గుణం ఉంటుంది

***

🐃 గేదె ఎండ లేదా వేడిమి ని తట్టుకోలేదు.

🐂 ఆవు మే- జూన్ ఎండలను సైతం తట్టుకోగలదు.

***

🐃 గేదె పాలు భారీ గా ఉండి తొందరగా అరగవు. దాని వల్ల చలాకి తనం ఉండదు. పాలను తీసే సమయం లో దూడను యజమాని దానిని లేపుతాడు.

🐂 ఆవు దూడ తాడు ఇప్పడం చాలా కష్టం గా ఉంటుంది. పాలు తీసాక కూడ దూడను మనం కంట్రోల్ చేయలేము.

***

ఆవు వీపు పైన ఉండే "సూర్య కేతు నాడి" ఎండ లో ఉన్నప్పుడు జాగృతమై ఆవు లో బంగారు లవణాలు తయ్యారవుతాయి. ఈ నాడి సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు మరియు విశ్వం నుండి "కాస్మిక్ ఎనర్జీ" ని గ్రహించుకుంటుంది. అందుకే ఆవు పాలకు రోగాలను హరించే శక్తి వస్తుంది. ఈ విశ్వం లో ఏ జీవికి ఇటువంటి శక్తి లేదు.

***

నిజానికి ఆవు పాలు వేడి చేయవు, చలువ చేస్తాయి. గేదె పాలు భారీ గా ఉండడం వల్ల, జీర్సీ పాలు వేడి చెయ్యడం వల్ల మనకి షుగర్ వస్తుంది. అలాగే షుగర్ ఉంటే తగ్గదు.

***

మనం అన్నింటిలోనూ ఫ్యాట్ కంటెంట్ చూస్తాము. రిఫైన్డ్ ఆయిల్ వల్ల మనకి కోలేస్ట్రోల్ తయ్యారవ్వదు అని టీవీ లో చూపిస్తే ఆ ఆయిల్ నే వాడతాము. ఫ్యాట్ తక్కువ ఉన్న పాలను వదిలి గేదె పాలల్లో ఎంత ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటే అంత ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ ఇంటికి తెచ్చుకుంటాము.

***

🐃 గేదె పాలల్లో మూడో నాలుగో ఉండే పోషక తత్త్వాలు మనం పొయ్యి మీద పెట్టి కొంచం వేడి చెయ్యగానే ఆవిరైపోతాయి. 

🐂 ఆవు పాలు ఎంత వేడి చేసి మరిగించి- మరిగించి కోవా లా చేసినా అందులో ఉండే పోషక తత్త్వాలు నశించవు.

తేనెలొలికే తెలుగు భాష

 అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఌా ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:

ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.

క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం

చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం

ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం

త థ ద ధ న……నాలుక కొస భాగం

ప ఫ బ భ మ……..పెదవులకు

య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా

ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.

సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది మన భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.

తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి.

మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేరు. తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చూడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.

తెలుగులో మాట్లాడండి. .

తెలుగులో వ్రాయండి. . .

తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..

తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం ఆస్వాదించండి . . .

Thursday, March 9, 2023

గాయత్రీ మంత్రం విశిష్టత

అతి శక్తివంతమైన శ్రీ గాయత్రీ మహమంత్రంలోని బీజాక్షరాల మహిమ అపారం.
అనన్యం,సర్వసిద్ధిప్రదం.

1. త - అజ్ఞానాన్ని పోగొట్టునది
2. త్స - ఉపపాతకములను నివారించునది
3. వి - మహాపాతములను నివారించునది
4. తు - దుష్టగ్రహ దోషాలను నివారించునది.
5. ర్వ - భ్రూణహత్యా దోషాలను నివృత్తి చేయునది
6. రే - తెలియక చేసిన పాపాలను పోగొట్టునది
7. ణి - తినకూడని వాటిని తిన్న దోషాన్ని పరిహరించునది.
8. యం - బ్రహ్మహత్యా పాతకాన్ని నశింపచేయునది

9. భ - పురుష హత్యా పాతకాన్ని పోగొట్టునది.
10. ర్గో - గోహత్యా దోషాన్ని నివృత్తి చేయునది.
11.  దే - స్త్రీహత్యా పాతకాన్ని పోగొట్టునది
12. వ - గురు హత్యాపాపాన్ని నివారించును.
13,. స్య - మానసిక దోషాలను నివారించును
14. ధీ - మాతృ, పితృ వధా పాతకాన్ని పరిహరించును.
15. మ - పూర్వ జన్మార్జిత పాపాల నుండి రక్షించును
16. హి - అనేక పాప సమూహాలను నశింపచేయును

17. ధి - ప్రాణి వధ చేసిన పాపం నుండి కాపాడును
18. యోః - సర్వపాపాలను నివృత్తి చేయును.
19. యో - సర్వపాపాలను నివృత్తి చేయును
20. నః - ఈశ్వరప్రాప్తి నిచ్చును
21. ప్ర - విష్ణులోక ప్రాప్తి
22. చో - రుద్రలోక ప్రాప్తి
23. ద - బ్రహ్మలోక ప్రాప్తి
24. యాత్ - పరబ్రహ్మైక్య సిద్ధి ప్రసాదించును.

గాయత్రీ కవచంలో ఉన్న రూపాలు తానే అయిన దేవి ఇలా వర్ణించబడింది.

గాయత్రి - తూర్పు దిక్కును
సావిత్రి - దక్షిణ దిక్కును
సంధ్యాదేవి - పడమర దిక్కును
సరస్వతి - ఉత్తర దిక్కును
పార్వతి - ఆగ్నేయాన్ని
జలశాయని - నైరుతిని
పవమాన విలాసిని - వాయువ్య దిక్కును
రుద్రాణి - ఈశాన్య దిక్కును రక్షీంచుగాక

తత్ - పాదాలను
సవితుః - జంఘలను
వరేణ్యం - కటిని
భర్గః - నాభిని
దేవస్య - హృదయాన్ని
ధీమహి - చెక్కిళ్ళను
ధియః - నేత్రాలను
యః - లలాటంను
నః - శిరస్సును
ప్రచోదయాత్ - శిఖా భాగాన్ని రక్షించుగాక.

ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతిభాగం శ్రీ గాయత్రీ మాత రక్షణ కవచంలో భద్రంగా ఉంటాయి.

తత్ - శిరస్సు
సకారం - ఫాలం
వి - నేత్రాలు
తు - కపోలాలు
వ - నాసాపుటాలు
రే - ముఖం
ణి - పైపెదవి
యం - కింది పెదవి

భ - మద్య భాగం
ర్గో - చుబుకం
దే - కంఠం
వ - భుజాలు
స్య - కుడి చేయి
ధీ - ఎడమ చేయి
మ - హృదయం
హి - ఉదరం

ధి - నాభి
యో - కటి
యో - మర్మప్రదేశం
నః - తొడలు
ప్ర - జానువులు
చో - జంఘం
ద - గుల్ఫం
యా - పాదాలు
త్ - సర్వ అంగాలు

ఈ విధంగా మన దేహంలోని సర్వ అంగాలను పరిరక్షించమని ఆ తల్లిని వేడుకుందాం.

Friday, February 24, 2023

యజ్ఞోపవీత మహిమ

వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’.

దీనినే తెలుగులో ‘జంధ్యం ’ అంటాం. ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు.

ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ,   కొందరు ఆచారం మీద మక్కువతోనూ, కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం, మరికొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు.

యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.

సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్*

తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్’

బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.

యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’ అనే మంత్రం చెబుతోంది.

యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం.

ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ

వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ

ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ

తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా

పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః

సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ

సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః’

మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువులో అగ్నిదేవుడు, మూడవ తంతువులో నాగదేవత, నాలుగవ తంతువులో సోమదేవుత, ఐదవ తంతువులో పితృదేవతలు, ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులో వాయుదేవుడు, ఎనిమిదవ తంతువులో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం.

‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అది తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది.

తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్

కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’


ఈ శ్లోకంలో తాత్పర్యం ఇది:

తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం.

యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది.

’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ*

*తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్’

నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం.

గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం.

యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది.


పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్

తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్

ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్

*యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’


అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.

బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.

యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు.

అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి.

యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని తంతువులు మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి.

మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం రుద్రం...ఓం నమశ్శివాయ

శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది.

రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. ఇది వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చేది మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వలన దీనిని చమకం అంటారు.

నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ |

నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||

నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతి దినం ఎవరు చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం  ప్రాప్తిస్తుంది.

నమకం విశిష్టత :

నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయుధాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.

అనువాకం – 1:

తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.

అనువాకం – 2 :

ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.

అనువాకం – 3:

ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారణకు కూడా చదువుతారు.

అనువాకం – 4:

ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:

అనువాకం – 5:

ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా – సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.

అనువాకం – 6:

ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.

ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు.

అనువాకం – 7:

నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.

అనువాకం – 8:

ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.

అనువాకం –9:

ఈ అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ శక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.

అనువాకం – 10:

ఈ అనువాకంలో మరలా రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, పినాకధారియైన, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.

అనువాకం – 11:

ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. 

ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్థ దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.


చమకం విశిష్టత:

నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు

అంతులేని ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే..    

ఓం శ్రీ రుద్రాయ నమః

Monday, February 20, 2023

బిల్వ చెట్టు వృత్తాంతం, బిల్వాష్టకం - విశిష్టత

శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే, ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది. శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు.

శివపూజకు సంబంధించినంత వరకు 

  • వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.
  • వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.
  • వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.
  • వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.
  • వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.
  • వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.
  • వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.
  • వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.
  • వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.
  • వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.
  • వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. 


శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమంగలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు. ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.

పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.

ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు. రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి. నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి. ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.

సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి. మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం. లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని ఉపయోగించవచ్చు.

ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు. అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది. అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.

ఇప్పటివరకు మనం ఏయే పూలతో శివుని పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. అయితే మన మనసులోని కోరికననుసరించి కూడ శివునికి పువ్వులను సమర్పించవచ్చు. ఉదాహరణకు ధనం కావాలను కున్నవారు శివుని గన్నేరుపూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్తపూలతో, సుఖశాంతుల కోసం నల్లకలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్లతామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్రతామరలతో, నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట. గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి. సంతానం కావాలనుకునేవారు శివుని మొల్లపువ్వులతో పూజించాలి. దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మిపూలతో వశీకరణం, కడిమిపూలతో శత్రుజయం కలుగుతుంది. బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. శివుని మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది.

ఇక, శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి.

మొగిలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసెన, సాల, మంకెన పువ్వులు శివార్చనకు పనికిరావు. బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు. వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు.

దశసౌగంధికం పుష్పం నిర్గంధియది భామిని

శాతసాహస్రి కామాలా అనంతం లింగపూజసే

పదిసుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయిన వైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్రమాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది

అందరం భక్తితో " అరుణాచల శివ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎంత స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ పరమాత్మ 

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

Tuesday, February 14, 2023

ముత్తయిదువ లక్షణాలు

మొత్తం అయిదు అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువ అంటారు.అవి..


1) కాళ్ళకి పట్టీలు, మెట్టెలు

2) చేతులకి గాజులు

3) మెడలో మంగళసూత్రం

4) తలలో పువ్వులు..చివరగా

5) నొసటన అంటే కనుబొమ్మల మధ్య సింధూరం కానీ కుంకుమ కానీ..


1.మొదటగా కాళ్ళకు పట్టిలు మెట్టెలు ఎందుకో చూద్దాం:

కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ 

మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి 

టిబియా లేదా టైబియా అని పిలవబడుతుంది ..


ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత 

రెండు రకాలైనటువంటి బ్రాంచెస్ గా విడిపోతుంది..

ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే 

మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి 

అక్కడ అంతమవుతుంది.


అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో 

టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈనాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న

గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది. 


అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు 

ఇంకా కాలి మెట్టెలు ఇవన్నీ కూడా 

ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి 

తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి. 


ఫలితంగా వారిలో గర్భాశయ మరియు 

మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది.

గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల 

బిడ్డను మోయడానికి సుఖప్రసవానికి కూడా 

సులువుగా ఉంటుంది. 


అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా 

మూత్రం మొత్తం బయటికి వెళ్లిపోతుంది. 

దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే 

tibia nerve అని గూగుల్లో వెతికితే 

మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.


2.ఇంకా రెండవ అలంకార లక్షణం గాజులు.

గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా 

బంగారం గాజులు మాత్రమే 

ఈరోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంతమాత్రం కాదు..


మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ నెర్వ అనే నరం నేరుగా గుండె యొక్క నరాల తోటి అంటే 

గుండె స్పందన కి సంబంధించిన నరాల తోటి 

సంబంధాన్ని కలిగి ఉంటుంది 

వైద్యులు నాడీ స్పందన కూడా దీని తోటే 

గమనిస్తూ ఉంటారు. 


ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి 

బ్లడ్ ప్రెజర్ అంటే రక్త పోటుని అదుపులో ఉంచుతుంది అంటే దీనికి మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.

అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వొచ్చింది.


అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి,

గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా 

వారికి రక్తపోటు అవి రావా అని.

పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు 

లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల ఒకరకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండడంవల్ల వారిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండేది 

దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది 

అందువల్ల వారికి గాజులు అవసరం అనేది 

లేకుండా పోయింది.


అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు 

సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా 

రాగితో చేసినటువంటి కడియం ధరించమని 

చెప్పడం జరిగింది.

ఈ లోహాలతో చేసినవి శరీరానికి వేడిని గ్రహించి 

చల్లగా ఉంచుతాయి. 


అందునా పొలం పనులు , కాయకష్టం చేసే వాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో 

వీళ్ళకి కేవలం కడియాలలా ధృఢంగా ఉన్నవాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది.


ఈనరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి 

అంటే గూగుల్లో Radial nerve అని వెతికితే 

మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది


3.మూడవది మెడలో మంగళసూత్రం

దీని చివరున్న  బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడివల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. 

అయితే మళ్ళా మీకు ఒక అనుమానం రావచ్చు 

మరి మగవాళ్ళ సంగతి ఏమిటి అని మగవాళ్ళు 

రొమ్ము క్యాన్సర్ కి సహజంగానే నిరోధక వ్యవస్థను 

కలిగి ఉంటారు కాబట్టి మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువ 

ఒకరకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు.


ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేదిఉపయోగపడుతుంది.

ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల 

చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.

క్యాన్సర్ కి ట్రీట్మెంట్గా బంగారం ఉపయోగపడుతుందని ఈమధ్యనే తెలిపిన పరిశోధన కూడా గమనించవచ్చు.


4.ఇక నాల్గవది తలలో పూవులు

వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనసు 

ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన 

పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.

కలయక సమయంలో కూడా ఇవి ఇద్దరి మధ్య 

ఆకర్షణకు తోడ్పడుతాయి.


5.ఇక అయిదవది..చివరిది.. నొసటన సింధూరం

పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమ రాయి నూరుకొని దానికి రేడియం పౌడర్ కలిపి 

రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునే వారు.

ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే 

ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞాచక్రం పై 

ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం, ప్రశాంతంగా ఉండడం జరిగేది.


ఇవే కాకుండా సైనస్ కు రాకుండా ముక్కపుల్లను, చెవిపోట్లు దరికి చేరకుండా చెవి పోగులనూ ధరించేవారు!


అవే పద్ధతులు నేటికీ పాటించడం ద్వారా 

కొన్ని రకాల వ్యాధులకు సహజంగా నిరోధాన్ని 

డెవలప్ చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో 

చక్కగా జీవనం కొనసాగించు కోవచ్చు..!!


(సేకరణ)

Monday, January 30, 2023

శివ పంచాక్షరీ విశిష్టత

శివపంచాక్షరీ మంత్రంలోని ఐదు బీజాక్షరాలు 'న-మ-శి-వా-య' లో నుండి పంచభూతాలు, వాటి నుండి సమస్త జగత్తు పుట్టిందని పురాణాలలో తెలియజేయడమైంది.

దిశ పేరు మండలం బీజాక్షరం నిర్వహణ....

శివుని ఊర్ధ్వముఖం ఈశానం ఆకాశమండలం య మోక్షం

శివుని పూర్వముఖం తత్పురుష వాయుమండలం న విరక్తి

శివుని దక్షిణముఖం అఘోర అగ్నిమండలం మ సంహారం

శివుని ఉత్తరముఖం వామదేవ ఉడక మండలం వా పాలన

శివుని పశ్చిమ ముఖం సద్యోజాత భూమండలం శి సృష్టి

ఓంకారవదనే దేవీ 'వ, 'య' కార భుజద్వయీ 'శి' కార దేహమధ్యాచ 'న', 'య' కార పదద్వయీ పంచాక్షరీ మంత్రానికి ముఖం వంటిది. 'వ'కార, 'య' కారాలు బాహువులు, 'శి' కారం నడుము అయితే 'న', 'మ' కారాలు పాదయుగ్మములు.

 

నమశ్శంభవే చ మయోభవేచ నమశ్శంకరాయ చ 

 మయస్కరాయ చ నమశ్శివాయ చ శివ తరాయచ 

 అంటూ నమకంలో శంభు - శంకర - శివ అంటూ మూడు దివ్యనామాలాతో, ఆ పరాత్పరుని కీర్తించాయి.

 శివ శబ్దానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. 'శుభం, క్షేమం, శ్రేయం, మంగళం' అని కొన్ని అర్థాలు మరియు 'జాగ్రత్, స్వప్న, సుషుప్తి' అవస్థలకు అతీతమైన ధ్యానావస్థలో గోచరించే తురీయతట్ట్వమే శివుడు. అదే శివతత్త్వం.

అన్నింటినీ ప్రకాశవంతం చేసే మూల చైతన్యమే శివుడు. వశి - శివ సమస్తాన్నీ తన వశంలో ఉంచుకున్న వాడే సర్వేశ్వరుడు, 

అతడే ఇచ్చా -జ్ఞాన-క్రియా శక్తులతో కూడిన పరమేశ్వరుడు, సర్వజగత్కారుడు, 

ఆ తత్త్వమే ఆయన పంచముఖాలలో గోచరిస్తూ ఉంటుంది.


Friday, January 27, 2023

శ్రీవిష్ణుసహస్రనామస్తోత్ర పారాయణము శ్రేయస్కరము

అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను 108 మార్లు జపించవలెను. పిల్లల క్షేమార్ఠము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:


1. విద్యాభివృద్ధికి:

(14)

సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||


2. ఉదర రోగ నివృత్తికి:

(16)

భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |

అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||


3. ఉత్సాహమునకు:

(18)

వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |

అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||


4. మేధాసంపత్తికి:

(19)

మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |

అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||


5. కంటి చూపునకు:

(24)

అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |

సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్

 ||


 6. కోరికలిరేడుటకు:

(27)

అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |

సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||


7. వివాహ ప్రాప్తికి:

(32)

భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |

కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||


8. అభివృద్ధికి:

(42)

వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |

పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||


9. మరణ భీతి తొలగుటకు:

(44)

వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |

హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||


10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:

(46)

విస్తారః స్థావర స్స్టాణుః ప్రమాణం బీజ మవ్యయం |

అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||


 11. జ్ఞానాభివ్రుద్ధికి:

(48)

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |

సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||

12. క్షేమభివ్రుధ్ధికి:

(64)

అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |

శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||


13. నిరంతర దైవ చింతనకు:

(65)

శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |

శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||

14. దుఃఖ నివారణకు:

(67)

ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |

భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||


15. జన్మ రాహిత్యమునకు:

(75)

సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |

శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||


 16. శత్రువుల జయించుటకు:

(88)

సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !

న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః ||


17. భయ నాశనమునకు:

(89)

సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |

అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||


18. మంగళ ప్రాప్తికి:

(96)

సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |

స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||


19. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు:

(97 & 98)

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |

శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||


20. దుస్వప్న నాసనమునకు:

(99)

ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |

వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||


21. పాపక్షయమునకు:

(106)

ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |

దేవకీ నందన స్స్రష్తా క్షితీశః పాపనాసనః ||


శ్రీరస్తు --- శుభమస్తు --- విజయోస్తు

దశ మహావిద్యలు - ఫలితాలు

 దశ మహావిద్యలు - ఫలితాలు


1వ మహా విద్య

కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ కాళికా దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.


2 వ మహావిద్య

దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ తార దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.


3 వ మహావిద్య

అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ షోడశ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.


*4వ మహావిద్య

దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ భువనేశ్వరి దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమి తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.


5వ మహావిద్య

దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి, ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్ణిమ తిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పరాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.


6వ మహావిద్య

దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ వజ్రవైరోచని దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.


7వ మహావిద్య

దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి  జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.


8వ మహా విద్య

దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ భగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ భగళాముఖీ దేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.


9వ మహావిద్య

దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవికి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.


10వ మహావిద్య

పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈ లక్ష్మి దేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక అంటే లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది....


ఈ దశమహావిద్యా సాధనలు చేయాలంటే గురుముఖ సాధన అవసరం.

శ్రీమాత్రే నమః

Wednesday, January 11, 2023

కాకి - కాలజ్ఞాని

 ®️'కాకి - కాలజ్ఞాని' అంటారు ఎందుకో కాస్త పరిశోధనాత్మకంగా మననం చేసుకుందాం


®️వేకువ జామునే '(బ్రహ్మ ముహూర్తంలో)' మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి.


'®️కావు కావు' అంటూ నీ బంధాలు సిరి సంపదలు ఏవీ నీవి కావు అని  అందరికీ గుర్తు చేస్తూ 'బోధిస్తూ'  అందరినీ తట్టి లేపేది కాకి.


®️ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న 'అన్ని కాకులకు' సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి  ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి.


®️శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి 'సంఘటితంగా పోరాటం' చేపట్టేవి కాకులు.


®️ఆడ కాకి - మగ కాకి కలవడం కూడా 'పరుల కంట' పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం.


®️ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేసి స్నానమాచరించి గూటికిచేరే మంచి ఆచరణ కాకులదే.


®️సూర్యాస్తమయం సమయానికి గూటికిచేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే.


®️అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా.


®️కాకులు లేని ప్రదేశం లేదు ఈ భువిపై. కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే. అందుకే  'కాకులు దూరని కారడవి' అంటారు.


®️కాకులు అరుస్తోంటే  ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తోంది అనేవారు పెద్దలు.


®️అంతేకాదు పకృతి వైపరీత్యాలు వచ్చే ముందు (భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు) కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి.


®️సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక  స్నానమాచరించి బయట ఎగురుతాయి.  అందుకే కాకి కాలజ్ఞాని అంటారు.


®️దానధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు.


®️భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు.


®️మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తు పెట్టుకునే సాక్షీభూతంగా ఉండే పక్షి కాకి.


®️ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకై కలకాలం జీవించడం శాస్త్రం లో కూడా విశదీకరించారు.!


®️కూజలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి తరువాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకి....!!


®️సెల్ టవర్ రేడియేషన్ వల్ల అంతరించిపోతున్న ఈ కాకి గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ  కాకి బావ కధలు బిడ్డలకు చెప్పండి అని  తల్లి తండ్రులను పెద్దలను కోరుతూ...!!


®️భారతీయుల సనాతన ధర్మం - విశిష్టత , ఆవశ్యకత నేటి జనం ఆచరించాల్సినవే.  సంఘజీవనం.., సేవాతత్పరత.., మంచి స్నేహభావాలతో., ఈర్ష్య ద్వేషాలు లేకుండా., కలసి మెలసి అన్యోన్యంగా., అసమానతలకు అతీతమైన ప్రేమానురాగాలతో., నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాము.

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...