Thursday, April 25, 2019

శ్రీ గురుసూక్తము



శ్రీ గురుగీత, అద్వయ తారకో పనిషత్, యోగశిఖోపనిషత్, గోపాలపూర్వతాపిన్యుపనిషత్, వివేకచూడామణి, మొదలైన గ్రంధములు , వాటిలో గురువులకు సంబంధిచిన స్తోత్రములు, శ్లోకములు. గురుపరంపర ఆశీర్వచనము ఈ "శ్రీ గురుసూక్తము".


"శ్రీ గురు సూక్తము"
((((((((((0))))))))))

ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయా క్లిష్టకారిణే||
 నమోవేదాంతవేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే||


ఓంనమోబ్రహ్మాదిభ్యో, బ్రహ్మవిద్యాసంప్రదాయకర్తృభ్యో||

 వంశఋషిభ్యో మహాద్భ్యో నమో గురుభ్యః||


ఓం నమో ప్రణవార్ధాయ, శుద్ధజ్ఞానైకమూర్తయే||

 నిర్మలాయ ప్రశాన్తాయ దక్షిణామూర్తయే నమః||


ఓం హయాస్యాద్య వతారైస్తు జ్ఞానసిద్ధా మునీశ్వరాః||
 కృతార్ధతాంగతాస్తాంవై నారాయణ ముపాస్మహే||

           
  ఓం వేదతత్త్వైర్మహావాక్యైర్వసిష్ఠాద్యామహార్షయః||

 చతుర్భిశ్చతురాసన్ తంవై పద్మభువం భజే||


ఓం బ్రహ్మర్షిర్బ్రహ్మ విద్వర్యో బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియః||

 తపస్వీ తత్త్వవిద్యస్తు తం వసిష్ఠం భజేన్వహం||


 ఓంయోగజ్ఞం యోగినావర్యం బ్రహ్మజ్ఞాన విభూషితం||

 శ్రీమద్వశిష్ఠ
తనయం శక్తిం వందే మహామునియే||


ఓం ధర్మజ్ఞంధార్మికం ధీరం ధర్మాత్మా నందయానిధిం||

 ధర్మశాస్త్ర ప్రవక్తారం పరాశర మునింభజే||


 ఓం కృష్ణ ద్వైపాయనం వ్యాసం సర్వలోకహితేరతం||

 వేదాబ్జభాస్కరం వందేశమాదినిలయం మునిం||


ఓం పరాశరపౌత్రం శ్రీవ్యాసపుత్రమకల్మషం||

 నిత్యవైరాగ్య సంపన్నం జీవన్ముక్తమ్ శుకంభజే||


 ఓం మాండూక్య కారికాకర్తా యోభాతి బ్రహ్మవిద్వరః||

 శ్రీగౌడపాదాచార్యం తం ప్రణమామి ముహుర్ముహుః||


ఓం యోగీశ్వరం వేదచూడం వేదాంతార్ధనిధిం||

మునిం గోవింద భగవత్పాదాచార్యవర్య ముపాస్మహే ||


ఓం హరలీలా వతారాయ శంకరాయపరౌజసే||

 కైవల్యకలనా కల్పతరవే గురవేనమః||


ఓం బ్రాహ్మణే మూర్తిమతే శృతానాం శుద్ధిహేతవే||
 నారాయణయతీన్ద్రాయ తస్మై గురవేనమః||   

              సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం||

 అస్మదాచార్య
పర్యంతం వందేగురు పరంపరాం||


ఓం సచ్చిదానంద రూపాయ శివాయపరమాత్మనే||

 నమో వేదాంత వేద్యాయ గురవేబుద్ధిసాక్షిణే||


 ఓం నిత్యానందైక కందాయ నిర్మలాయచిదాత్మనే||

 జ్ఞానోత్తమాయ
గురవే సాక్షిణే బ్రాహ్మణేనమః|| 


 గూఢావిద్యా జగన్మాయా దేహశ్చాజ్ఞాన సంభవః||

 విజ్ఞానం యత్ప్రసాదేన గురుశబ్దేనకథ్యతే||


 స్వదేశికస్వైవచ నామకీర్తనమ్ భవేదంతస్య శివస్యకీర్తనమ్||

 స్వదేశికస్వైవచ నామచింతనం భవేదంతస్య శివస్యచింతనం||


 కాశిక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం||

 గురుర్విశ్వేశ్వరః సాక్షాత్ తారకం బ్రహ్మనిశ్చయః||


 గురుసేవా గయాప్రోక్తా దేహసాక్షా దక్షయోవటః||

 తత్పాదం విష్ణుపాదంస్యాత్ తత్ర దత్తమచస్తతం||


 స్వాశ్రమంచ స్వజాతించ స్వకీర్తిమ్ పుష్ఠివర్ధనం||

 ఏతత్సర్వం పరిత్యజ్య గురురేవ సమాశ్రయేత్||


 గురువక్త్రే  స్థితావిద్యా గురుభక్త్యాచ లభ్యతే||

 త్రైలోక్యేస్ఫుటవక్తారో దేవర్షిపితృమానవాః||


 గుకారశ్చగుణాతీతో రూపాతీతోరుకారకః||

 గుణరూప విహీనత్వాత్ గురురిత్యభిధేయతే||


 గుకారః ప్రధమవర్ణో మాయాదిగుణ భాసకః||

రుకార్యోస్తి పరంబ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం||


              సర్వశృతి శిరోరత్న విరాజిత పదాంబుజం||

 వేదానార్ధ ప్రవక్తారం తస్మాత్ సంపూజయేత్ గురుమ్||


యస్య స్మరణమాత్రేణ జ్ఞానముత్పద్యతేస్వయం||

సః ఏవ సర్వ సమ్పత్తిః తస్మాత్ సంపూజయేత్ గురుమ్||

 సంసారవృక్షమారూఢాః పతన్తినరకార్ణవే||

 యస్తానుద్ధరతే సర్వాన్ తస్మై శ్రీగురవేనమః||


 ఏకఏవ పరోబంధుర్విషయే సముపస్థితే||

 గురుః సకలధర్మాత్మా తస్మై శ్రీగురవేనమః||


 భవారణ్య ప్రవిష్టస్య దిఙ్మోహభ్రాంత
చేతసః||

యేన సందర్శిత పంథాః తస్మై శ్రీగురవేనమః||



 తాపత్రయాగ్ని
తప్తానాం అశాంత ప్రాణినాం భువి||

 గురురేవ పరాగంగా తస్మై శ్రీగురవేనమః||


 శివేరుష్టే గురుత్రాతా గురౌరుష్టే నకశ్చినః||

 లబ్ద్వాకులగురుం సమ్యక్ గురుమేవ సమాశ్రయేత్||


 అత్రినేత్రశివః సాక్షాత్ ద్విబాహుశ్చహరిః||

స్మ్రుతః యో-చతుర్వదనో బ్రహ్మ శ్రీగురుః కధితప్రియే||


 నిత్యంబ్రహ్మ నిరాకారం నిర్గుణం బోధయేత్ పరమ్||

 భాసయన్ బ్రహ్మభావంచ దీపోదీపాన్తరం యథా||

           
గురోర్ ధ్యానే నైవనిత్యం దేహీబ్రహ్మమయో
భవేత్||

 స్థితశ్చ యత్రకుత్రాపి ముక్తాసౌనాత్రిసంశయః||

 జ్ఞానంవైరాగ్యమైశ్వర్యం యశఃశ్రీః సముదాహృతం||

 షడ్గుణైశ్వర్య యుక్తోహి భగవాన్ శ్రీగురుః ప్రియే||


గురుః శివో గురుః దేవో గురుర్బన్ధుః శరీరిణామ్||

 గురురాత్మా గురుర్జీవో గురోరన్యన్నవిద్యతే||


 యతః పరమకైవల్యం గురుమార్గేణ వైభవేత్||

గురుభక్తి రతిః
కార్యాః సర్వదా మోక్షకాంక్షిభిః||


 గురుర్దేవో గురుర్ధర్మో గురౌనిష్టా పరంతపః||

 గురోః పరతరం
నాస్తి త్రివారం కధయామితే||


         నమో నమస్తే గురవే మహాత్మనే విముక్తసఙ్గాయ సదుత్తమాయ||

 నిత్యాద్వయానంద రసస్వరూపిణే భూమ్నే సదా--పార దయామ్బుదామ్నే||


 శిష్యాణామ్ జ్ఞానదానాయ లీలయాదేహధారిణే||

 సదేహోసి విదేహాయ తస్మై శ్రీగురవేనమః||


 రాగద్వేషవినుర్ముక్తః కృపయాచ  సమన్విత||

 సమయానాంచ సర్వేషాం జ్ఞానసార పరిగ్రహీ||


 గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ సదాచ్యుతః||

 న గురోరధికం కశ్చిత్రిషులోకేషు విద్యతే||


 దివ్యజ్ఞానోపదేష్టారం దేశికం పరమేశ్వరం||

 పూజయాత్పరయా భక్త్యా తస్యజ్ఞాన ఫలంభవేత్||

   
  గురురేవపరబ్రహ్మ గురురేవపరాగతిః||

 గురురేవ పరావిద్యా గురురేవ పరాయణం||

 గురురేవ పరాకాష్ఠా గురురేవ పరంధనం||

 యస్మాత్తదుపదేష్టా సౌ తస్మాత్గురు తరోగురుః||


గురుభావపరంతీర్థం మన్యతీర్థం నిరర్థకం||

 సర్వతీర్థమయందేవి శ్రీగురోశ్చరణామ్బుజం||


సప్తసాగరపర్యంతం తీర్థస్నానఫలంతుయాత్||

గురుపాద పయోబంధోః సహస్రాంశేన తత్ఫలం||


శోషణం పాపపంకస్య దీపనమ్ జ్ఞాన తేజసః||

గురోఃపాదోదకం సమ్యక్ సంసారార్ణవ తారకం||

            "అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారకం||

 జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం గురు పాదోదకం పిబేత్"
 
                                      "ఇతి సంకలిత 'శ్రీ గురుసూక్తం' సమాప్తం"
                                                            "ఓం శాంతిః శాంతిః శాంతిః"


"శ్రీ గురుసూక్తం -- తాత్పర్యం"

    ఓం సచ్చిదానందరూపుడు, అక్లిష్టకారి, వేదాంతవేద్యుడు, బుద్ధిసాక్షి, జగద్గురువగు శ్రీకృష్ణునకు నమస్కారము. ప్రణవార్థ స్వరూపుడును, శుద్ధజ్ఞానైకమూర్తియు, నిర్మలుడును, ప్రశాన్తుడును నగు దక్షిణామూర్తికి నమస్కారము. ఎవని హయగీతాద్యవతారములచే మునీశ్వరులు జ్ఞానసిద్ధిని బడసి కృతార్థులైనారో అట్టి శ్రీమన్నారాయణుని మేముపాసించెదము. చతుర్వేదతత్త్వముల చేతను, మహా వాక్యముల చేతను వసిష్ఠాదిమహర్షులు ఎవనివలన విజ్ఞానచాతుర్యము బడసిరో అట్టి పద్మజుడగు బ్రహ్మదేవుని నేను భజించెదను. బ్రహ్మర్షియు, బ్రహ్మ విద్వరుడును, బ్రహ్మణ్యుడును, బ్రహ్మజ్ఞ ప్రియుడును నగు వసిష్ఠమహర్షిని నిరంతరమూ నేను ధ్యానించెదను. యోగజ్ఞుడును, యోగులలో నుత్తముడును బ్రహ్మజ్ఞానవిభూషితుడును, శ్రీవశిష్ఠమునీన్ద్రునికొమరుడునగు శ్రీశక్తి మహామునికి నమస్కారము.  ధర్మజ్ఞుడును, ధార్మికబుద్ధి కలవాడును, ధీరుడును, ధర్మాత్ముడును, దయానిధియు, ధర్మశాస్త్రముల లెస్సగా వచించు వాడునునగు పరాశరుని గొల్చెదను. శ్రీకృష్ణద్వైపాయనుడును, సర్వలోకహితమునుకూర్చి ఆనందించువాడును, వేదపద్మములకు సూర్యునివంటివాడు, శమాదులకు నిలయమైనవాడును, మునియునగు శ్రీవ్యాసమహర్షులకు నమస్క రించు చున్నాను. శ్రీపరాశరుని పౌత్రుడును, శ్రీవ్యాసమహర్షిపుత్రుడును, అకలుషుడును, నిత్యవైరాగ్యసంపన్నుడును, జీవన్ముక్తుడు ను నగు శ్రీశుకమహర్షిని భజించెదను. మాండూక్యకారికల రచించినవాడును, బ్రహ్మవిద్వరుడై భాసిల్లు వాడునునగు శ్రీగౌడపాదాచార్యుని మాటిమాటికిని మ్రొక్కెదను.యోగీశ్వరుడును, వేదవిభూషణుడును, వేదాంతార్థ నిలయుడును, మునీన్ద్రుడును, ఉత్తముడునగు శ్రీ గోవిందభగవత్పాదాచార్యుని ధ్యానించు చున్నాము. పరమేశ్వరుని లీలావతారుడును, మహాశక్తి యుతుడును, మోక్షమొసంగుట యందు కల్పవృక్షము వంటివాడునునగు శ్రీ శంకర భగవత్పాదాచార్య గురువులకు నమస్కారము. మూర్తీ భవించిన బ్రహ్మస్వరూపుడును, శాస్త్రములశుద్ధికి కారణ భూతుడును, యతీన్ద్రుడునునగు శ్రీనారాయణ గురువునకు నమస్కారము. శ్రీదక్షిణామూర్తులైన సదాశివునితో ప్రారంభమై, మధ్యమమున  శ్రీశంకరాచార్య  భగవత్పాదులతో కూడియుండి, మా సద్గురువులవరకు విస్తరించియున్న శ్రీగురు పరంపరకు నమస్కరించు చున్నాము. సచ్చిదానందస్వరూపుడును, శివుడును, పరమాత్మ రూపుడును, వేదాంత వేద్యుడును, బుద్ధిసాక్షియునగు గురుదేవునకు వందనము. నిత్యానందైక స్వరూపుడును, నిర్మలుడును, చిదాత్మ స్వరూపుడును, ఉత్తమజ్ఞానమూర్తియు సాక్షియు, బ్రహ్మ స్వరూపుడును నగు గురువునకు నమస్కారము. 


           జగత్తు గూఢమైన, అవిద్యాత్మకమైన మాయారూపము మరియు శరీరము అజ్ఞానము నుండి ఉత్పన్నమైనది. దీనికి సంబంధించిన జ్ఞానము ఎవరివలన కలుగునో వారిని 'గురు' అను శబ్దముతో వ్యవహరిస్తారు. గురుదేవుని నామకీర్తనమే అనంతస్వరూపుడైన శివభగవానుని కీర్తనము. గురుదేవుని యొక్క నామచిన్తనమే  అనంతస్వరూపుడైన శివభగవానుని యొక్క చింతనము. గురుదేవుని నివాస స్థలమే కాశిక్షేత్రము. గురుదేవుని పాదోదకమే పవిత్రగంగానది. శ్రీగురుదేవుడే విశ్వేశ్వరుడు. మనియు నిశ్చయముగా సాక్షాత్తు తారకబ్రహ్మ గురువే. గురుసేవయే పుణ్యక్షేత్రమైన గయ. గురుదేవుని శరీరమే కోరిన కోరికల నిచ్చే అక్షయవటవృక్షము. గురుపాదము విష్ణుభగవానుని శ్రీచరణము. అందు నిమగ్నమైన మనస్సుకూడా అదేస్థితిని పొందును. బ్రహ్మచర్యగృహస్థాది ఆశ్రమములు, జాతిని, కీర్తిని, పాలన, పోషణ, మొదలగువన్నియు విడచిపెట్టి శ్రీగురుదేవునే ఆశ్రయించ వలయును.


        శ్రీగురుదేవుని యందున్న విద్య గురుభక్తి వలననే లభించును. ఈమాట ముల్లోకములయందును దేవతలచే, ఋషులచే, మానవులచే స్పష్టముగా చెప్పబడుచున్నది. 'గు' కారమునకు గుణముల కతీతుడనియు, 'రు' కారమునకు రూపమున కతీతుడనియు, గుణ రూపములు రెండునూ లేనందున 'గురు' వనియు చెప్పబడుచున్నది. గురుశబ్దములో మొదటిదగు 'గు'కారమునకు

 మాయాది గుణములతో కూడియున్నదనియు, 'రు'కారమునకు మయాభ్రాంతిని తొలగించే పరబ్రహ్మమనియు భావము.

      సర్వశృతిరూపములైన శ్రేష్ఠరత్నములచే విలసిల్లు చరణకమలములు కలవాడును, వేదాంతముల యొక్క అర్థమును చెప్పేవాడు కనుక గురువును పూజింపవలయును. ఎవరిని స్మరించినంత మాత్రముననే తనంతతానుగా జ్ఞానము కలుగుతుందో అతడే సర్వసంపదల స్వరూపము. అందువలన గురుదేవుని బాగుగా పూజింపవలయును. సంసారమనే చెట్టునెక్కి, నరకమనే సముద్రములో పడుచున్నవారినందరినీ ఉద్ధరించునట్టి గురుదేవునకు నమస్కారము.  ఏదైనా విషమపరిస్థితి ఎదురై నప్పుడు గురువు ఒక్కరే పరమబంధువై మనలను కాపాడును. సర్వధర్మముల ఆత్మస్వరూపము గురుదేవుడే. అట్టి గురుదేవునికి నమస్కారము. ఇహలోకమనెడి అరణ్యములో ప్రవేశించి దిక్కు తెలియని చిత్తభ్రమ కలిగినస్థితిలో మనకు దారిచూపించునట్టి గురుదేవునకు నమస్కారము.  ఈభూమి పై తాపత్రయము అను మూడువిధములైన అగ్నులలో కాలుచూ, శాంతి లేని ప్రాణులకు ఉత్తమగంగ వంటి గురుదేవునకు నమస్కారము. ఒకవేళ శివుడు కోపించినచో గురువు రక్షిస్తాడు. గురువే కోపించిన ఇక ఎవ్వరూ రక్షింపలేరు. కావున మంచి గురువును పొంది చక్కగా ఆగురువునే ఆశ్రయింపుము. మూడుకన్నులు లేని సాక్షాత్తు శివుడు, రెండుచేతులు గల విష్ణువు, నాలుగుముఖములు లేని బ్రహ్మ దేవుడు శ్రీగురుదేవుడే అని తెలియవలెను. గురువు అనబడు వారు సదాబ్రహ్మలు, నిరాకారులు, నిర్గుణులు. వారు పరమును బోధించుదురు. బ్రహ్మభావముతో, ఒకదీపముతో వేరొకదీపము వెలిగించు నట్లుగా శిష్యులలో బ్రహ్మభావమును ప్రకటించుచుందురు.


       సదా గురుదేవుని ధ్యానించు జీవుడు బ్రహ్మమయుడు అగుచున్నాడు. అట్టివాడు ఎక్కడ ఉన్ననూ ముక్తుడే అనుటలో సందేహము లేదు. భగవత్స్వరూపుడగు గురుదేవుడు జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, యశము, సంపద, మధురవాణి అను ఆరుగుణములచే కూడి యుండును. శరీరధారులకు గురువే శివుడు. గురువే దేవుడు. గురువే బంధువు. గురువుయందు నిష్ఠతో నుండుటయే పరమ తపస్సు. గురువును మించినదేదియూ లేదు. దీనిని ముమ్మారు చెప్పుచున్నాను. సత్పురుషులలో నుత్తముడును, సర్వదా అంతములేని దయకు సముద్రుడును, సకల బంధములు త్రెంపి అసంగుడు, నిర్లిప్తుడు నైన వాడును, నిత్యుడును, అద్వయుడును, ఆనందరసస్వరూపియునైన వాడును, భూమి పైన పరబ్రహ్మస్వరూపుడైన వాడునునైన మీకు(గురువునకు) నమస్కారము. శిష్యులకు జ్ఞానమొసంగుటకు లీలగా దేహము ధరించిన వాడును, దేహముతో నున్ననూ, విదేహమగు పర బ్రహ్మములో నుండునట్టి గురుదేవునకు నమస్కారము. రాగద్వేషములు లేనివాడుగను, కారణము నుద్దేశించకనే దయాసాగరుండును, సమస్త శాస్త్రములలోని జ్ఞానసారమెరింగిన వాడునునై  శ్రీ గురు దేవుడుండును.
   
     
       గురువే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమును చేరు త్రోవ గురువే. ఆ చేరుటకు కావలిసిన జ్ఞానము గురువే.  ఆ చేరుట అనే ప్రక్రియ కూడా గురువే.  దానికి కావలసిన సాధనసంపత్తి కూడా గురువే.  చిట్ట చివరికి ఏదైనా మిగిలియుంటుం దంటే అది గురువే.  ఈ విధముగా ఉపదేశికులైన మీరు గురువులలో కెల్ల సద్గురువులు.  గురుభావమే శ్రేష్టమైన పుణ్యక్షేత్రము. ఇతర క్షేత్రములు నిరర్థకములు. శ్రీగురుదేవుని చరణామ్బుజములు సర్వతీర్థమయము. ఏడు సముద్రముల వరకూగల అన్ని పుణ్యతీర్థములందునూ స్నానము చేయుటవలన ఎట్టిఫలము కలుగుచున్నదో, అది గురుపాద జలము లోని ఒక్క బిందువులో వెయ్యవ భాగమునకుసమానము. శ్రీ గురుదేవుల యొక్క పదామృతము పాప పంకిలము తొలగించునది. జ్ఞానతేజమును పెంపొందింపజేయునది మరియు సంసార సాగరమును దాటించునట్టిది.


       అజ్ఞానమును పెకలించివేయునదియును, అనేక జన్మల కర్మను నివారించునదియు అగు గురుపాదోదకమును జ్ఞానవైరాగ్యములు సిద్ధించుట కొరకు పానము చేయవలెను.
                                      "శ్రీ గురుసూక్తము" అను సంకలనము సమాప్తము.

Tuesday, April 23, 2019

పంచపునీతాలు


1) వాక్ శుద్ధి
2) దేహ శుద్ధి
3) భాండ శుద్ధి
4) కర్మ శుద్ధి
5) మనశ్శుద్ధి

1) వాక్ శుద్ధి :

వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు .... కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు .... పగ , కసి , ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు .... మంచిగా , నెమ్మదిగా , ఆదరణతో పలకరించాలి .... అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి ....

2) దేహ శుద్ధి :

మన శరీరం దేవుని ఆలయం వంటిది .... దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , రెండు పూటలా స్నానం చెయ్యాలి .... చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు ....

3) భాండ శుద్ధి :

శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం .... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి .... స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది ....

4) కర్మ శుద్ధి :

అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు .... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు .... తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు ....

5) మనశ్శుద్ధి :

మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి .... మనస్సు చంచలమైనది .... ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది .... దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి .... దీని వల్ల దుఃఖం చేకూరుతుంది .... కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి ...

పతంజలి మహర్షి రచించిన అత్యద్భుత స్తోత్రం

9 శ్లోకాలు లో 108 శివనామాలు కలిగిన పతంజలి మహర్షి రచించిన అత్యద్భుత స్తోత్రం. ఇప్పటికీ చిదంబరంలోని నటరాజ స్వామికి ఈ నామాలతోటి అర్చన జరుగుతుంది.
ప్రతి రోజూ ప్రదోష సమయంలో చదువుకోవాల్సిన స్తోత్రం.


సదంచిత-ముదంచిత నికుంచిత పదం ఝలఝలం-చలిత మంజు కటకం |

పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జనన భంజన కరమ్ |

కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబ కవిడంబక గళమ్

చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ || ౧ ||
హరం త్రిపుర భంజన-మనంతకృతకంకణ-మఖండదయ-మంతరహితం

విరించిసురసంహతిపురంధర విచింతితపదం తరుణచంద్రమకుటమ్ |

పరం పద విఖండితయమం భసిత మండితతనుం మదనవంచన పరం

చిరంతనమముం ప్రణవసంచితనిధిం పర చిదంబర నటం హృది భజ || ౨ ||
అవంతమఖిలం జగదభంగ గుణతుంగమమతం ధృతవిధుం సురసరిత్-

తరంగ నికురుంబ ధృతి లంపట జటం శమనదంభసుహరం భవహరమ్ |

శివం దశదిగంతర విజృంభితకరం కరళసన్మృగశిశుం పశుపతిం

హరం శశిధనంజయపతంగనయనం పర చిదంబర నటం హృది భజ || ౩ ||
అనంతనవరత్నవిలసత్కటకకింకిణిఝలం ఝలఝలం ఝలరవం

ముకుందవిధి హస్తగతమద్దల లయధ్వనిధిమిద్ధిమిత నర్తన పదమ్ |

శకుంతరథ బర్హిరథ నందిముఖ భృంగిరిటిసంఘనికటం భయహరమ్

సనంద సనక ప్రముఖ వందిత పదం పర చిదంబర నటం హృది భజ || ౪ ||
అనంతమహసం త్రిదశవంద్య చరణం ముని హృదంతర వసంతమమలమ్

కబంధ వియదింద్వవని గంధవహ వహ్నిమఖ బంధురవిమంజు వపుషమ్ |

అనంతవిభవం త్రిజగదంతర మణిం త్రినయనం త్రిపుర ఖండన పరమ్

సనంద ముని వందిత పదం సకరుణం పర చిదంబర నటం హృది భజ || ౫ ||
అచింత్యమళివృంద రుచి బంధురగళం కురిత కుంద నికురుంబ ధవళమ్

ముకుంద సుర వృంద బల హంతృ కృత వందన లసంతమహికుండల ధరమ్ |

అకంపమనుకంపిత రతిం సుజన మంగళనిధిం గజహరం పశుపతిమ్

ధనంజయ నుతం ప్రణత రంజనపరం పర చిదంబర నటం హృది భజ || ౬ ||
పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖమముం

మృడం కనక పింగళ జటం సనక పంకజ రవిం సుమనసం హిమరుచిమ్ |

అసంఘమనసం జలధి జన్మకరలం కవలయంత మతులం గుణనిధిమ్

సనంద వరదం శమితమిందు వదనం పర చిదంబర నటం హృది భజ || ౭ ||
అజం క్షితిరథం భుజంగపుంగవగుణం కనక శృంగి ధనుషం కరలసత్

కురంగ పృథు టంక పరశుం రుచిర కుంకుమ రుచిం డమరుకం చ దధతం |

ముకుంద విశిఖం నమదవంధ్య ఫలదం నిగమ వృంద తురగం నిరుపమం

స చండికమముం ఝటితి సంహృతపురం పర చిదంబర నటం హృది భజ || ౮ ||
అనంగపరిపంథినమజం క్షితి ధురంధరమలం కరుణయంతమఖిలం

జ్వలంతమనలం దధతమంతకరిపుం సతతమింద్ర సురవందితపదమ్ |

ఉదంచదరవిందకుల బంధుశత బింబరుచి సంహతి సుగంధి వపుషం

పతంజలి నుతం ప్రణవ పంజర శుకం పర చిదంబర నటం హృది భజ || ౯ ||
ఇతి స్తవమముం భుజగపుంగవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః

సదః ప్రభుపద ద్వితయదర్శనపదం సులలితం చరణ శృంగ రహితమ్ |

సరః ప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరపదం

స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదమ్ || ౧౦ ||

Sunday, April 21, 2019

నవదుర్గలు

వైదిక సంప్రదాయంలో దేవి త్రిమూర్తులశక్తిగా చెప్పబడింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులుగా కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని శత్రునిర్మూలనానికీ, ఐశ్వర్య-సౌభాగ్య సంపదలకు మహాలక్ష్మి, విద్య విజ్ఞానానికి మహా సరస్వతి అధిష్టాన దేవతలుగా రూపొందారు
దుర్గ అమ్మవారు తన ప్రతిరూపాలుగా మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి ని సృష్టించారు. మరల మహాసరస్వతి ,మహాలక్ష్మి, మహాకాళి తిరిగి తమ ప్రతిరూపాలను సృష్టించుకొన్నారు.మొత్తంఈ రూపాలన్ని కల్సి నవదుర్గలుగా మన చేత పూజలు అందుకొంటున్నారు.

నవదుర్గలు : శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట,కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి,మహాగౌరి, సిద్దదాత్రి.

శైలపుత్రి :
శైలుడి {పర్వతరాజు} కుమార్తె. ఆమెకే సతీ భవాని, హిమవంతుడి (హిమాలయాలకు రాజు) కూతురు హిమవతి, పార్వతి అను పేర్లు కూడా ఉన్నాయి. నవదుర్గలలో మొదటి రూపం శైలపుత్రి. ఎడమ చేతిలో కమలము, కుడి చేతిలొ త్రిశూలధారణియై. ఎద్దుని వాహనంగా కలిగిఉంటారు అమ్మవారు.

బ్రహ్మచారిణి
కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలము కలిగిఉంటుంది. ఙ్ఞానం కలిగించే గొప్ప శక్తి కల దివ్య రూపం. తనను ఆరాధించే భక్తుల పైన ప్రేమ తో పాటు వారికి సిరి సంపదలను ప్రసాదిస్తుంది. మోక్షం పొందటానికి బ్రహ్మచారిణి ఆరాధన ప్రధానమైనది.

చంద్రఘంట :
తన సిరస్సు పై అర్ధచంద్రుడిని ఘంటాకారముగా కలిగి ఉండటం వలన ఈమెను చంద్రఘంట అంటారు. పది చేతులతో, పది రకాలైన ఆయుధములతో { జపమాల, ఘంట, బాణం, పద్మం, ఖడ్గం,కమండలం, త్రిశూలం, ధనస్సు, గద, కమలం }, మూడు నేత్రములతో అమ్మవారి రూపం కొలువు తీరి ఉంటుంది. సింవాహినియై తాను దైర్యసాహసాలకు ప్రతీకగా ఉంటుంది.

కూష్మాండ :
సంస్కృతం లో కూష్మాండం అంటే గుమ్మడికాయ అని అర్ధం. ఈ అమ్మవారికి నివేదించే కూరగాయలలో గుమ్మడికాయ ముఖ్యమైనది. అమ్మవారిని శాంతింపచేయడంలో పెట్టే నైవేద్యంలో కూష్మాండం ప్రధానమైనది అందుకే ఈ అమ్మను కూష్మాండదుర్గ అని అంటారు. కు = చిన్నదైన, ఉష్మ = ఉష్ణము, అండ = బ్రహ్మాండము. 8 చేతులతో అష్టభుజిగా ఉండి, కమండలము, ధనస్సు, బాణము, తామర, గడ, చక్రము, మట్టిముంత, 8వ చేతిలో జపమాల ధరించి ఉంటుంది.

స్కందమాత :
దేవ సేనాపతి ఐన సుబ్రహ్మణ్యస్వామి { కార్తికేయుని } తల్లి. ఈమె 4చేతులు, 3కన్నులు కలిగి, సుబ్రహ్మణ్యస్వామిని తన కుడి పైచేయి మీద కూర్చొపెట్టుకొని ఉంటుంది. మరొక చేతిలో కమలమును, ఎడమ చేయి వరములను ప్రసాదించే ముద్రలోను, 4వ చేతితో కమలమును పట్టుకొని ఉంటుంది. మంచి వర్చస్సుతో కూడిన ముఖము కలదై, పద్మాసనిగా కూడ అమ్మవారిని వర్ణిస్తారు.

కాత్యాయని:
కాత్యాయని సాక్షాత్తు గాయత్రీఅమ్మవారి స్వరూపం. ఈమె వింధ్యాచల నివాసిని.కాత్యాయని ఉపసన వలన భయాలు దూరమవుతాయి. తామరపువ్వు, ఖడ్గము, అభయ హస్తములతోటి అమ్మవారు కొలువై వుంటారు.

కాళరాత్రి :
రాత్రి చీకటిలా నల్లటి వర్ణంతో, జలపాతల వంటి కురులు కలిగి ఉంటుంది. ప్రకాశవంతమైన వెలుగు కల మాలతో, నిప్పులు గక్కె త్రినేత్రధారియై, గార్దభ వాహినిగా, చతుర్భుజి గా, కుడి వైపున ఒక చేయి వరప్రసాదినిగా, రెండవ చేయి అభయంగా, ఎడమవైపు పొడవుగా ఉండే పదునైన కత్తితో, మరో చేతిలో కొడవలితో దర్శనం ఇస్తుంది.

మహాగౌరి :
తెల్లటి ఆభరణాలతో, తెల్లటి శరీరఛాయ కలిగి, చతుర్భుజి, వృషభవాహినిగా ఉంటుంది. త్రిశూలము, ఢమరుకము, అభయము, వరప్రసాద హస్తములతో దర్శనం ఇస్తుంది.

సిద్ధదాత్రి :
మార్కండేయ పురానంలో అష్ట సిద్దుల గురించి వివరించారు. అవి అణిమా సిద్ధి, మహిమా, గరిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకమ్య, ఇషిత్వ, వషిత్వ సిద్దులు. ఈ అష్టసిద్దులను ప్రసాదించేది సిద్ధదాత్రి. దేవీభాగవత పురాణంలో చెప్పినట్లు, సిద్ధదాత్రి అనుగ్రహం వలనే పరమశివుడు సిద్ధులను సాధించాడు. ఆమె అనుగ్రహం వలనే అర్ధనారీశ్వర రూపం పొందాడు.

లలిత సహస్రనామం - ప్రతి పద అర్ధం

1- 10:

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః

1. ఓం శ్రీమాత శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్ని కుండసంభూత దేవకార్య సముద్యత

శ్రీమాత : శ్రీదేవి అను ప్రసిద్ధనామముగల జగన్మాత , సమస్త సృష్టికి మూలమైనది.
శ్రీ మహారాజ్ఞీ : మహారాణి, సమస్త లోకములను పరిపాలించుచున్నది.
శ్రీమత్ -సింహసనేశ్వరి : సింహాసనమును అధిష్టించి దుష్ట శిక్షణ చేయునది.

పై మూడు నామముల వలన లలిత దేవి సృష్టి , స్థితి, లయ కారిణి అని తెలియుచున్నది. చిదగ్ని కుండసంభూత : జ్గ్యానము అను అగ్ని కుండమున పుట్టినది.
దేవకార్య సముద్యతా : దేవతల పని చేయుటకు పూనుకొన్నది. ( దేవతల పని అనగా ఆధ్యాత్మిక సాధన)

2 ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత
రాగాస్వరుప పాశాడ్యా క్రోధా కారంకుశోజ్జ్వల

ఉద్యద్భాను సహస్రాభ : ఉదయించిన వేయి సూర్యుల వెలుగు కలిగినది.
చతుర్బాహు సమన్విత : నాలుగు బాహువులు కలిగినది.
రాగాస్వరుప పాశాడ్యా : అనురాగమే పాశముగా కలిగినది.
క్రోధాకారంకుశోజ్జ్వలా : క్రోదమును అంకుశంగా కలిగినది.

3. మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్ర సాయకా
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మండమండల

మనోరూపేక్షు కోదండ : మనసే విల్లుగా కలది పంచతన్మాత్ర సాయక : ముఖ, చంద్ర , అష్టమి , రస, గంధములు అను పంచ తన్మాత్రములను బానములుగా కలది. చంద్ర ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా : తన ఎర్రన్ని కాంతి చే బ్రహ్మాండమంతయు నింపి వేసినది.

4. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ
కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత

చంపకాశోక పున్నాగ : సంపెంగ, అశోక, పున్నాగమొదలగు పుష్పములు
సౌగంధిక : సువాసనగల
లసత్కచ : తలకట్టు
కురవింద మణి : కురవింద అను పేరు గల ఎర్రని మణులు
శ్రేణి : వరుస
కనత్ కోటీర మండితా : ప్రకాశం తో కూడిన కిరీటముధరించినది

5. అష్టమిచంద్ర విభ్రాజ దళికస్తల శోభిత
ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక

అష్టమీ చంద్ర : అష్టమి నాటి చంద్రుడు
విభ్రాజ : ప్రకాశించు
దళికస్థల : నుదిటి భాగం
శోబిత : ప్రకాశం కలిగినది
ముఖ చంద్ర : చంద్రుని ముఖమునందు
కళంకాభ : మచ్చ
మృగనాభి విశేషక : కస్తూరి తిలకం దిద్దిన అందమైనముఖము

6. వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లిక
వక్త్ర లక్ష్మి పరివాహ చలన్మీనాభ లోచన

వదనస్మర మాంగల్య : అందమైన కనుబొమ్మల తో కూడినముఖము
గృహ తోరణ : గృహమునకు అలంకరించిన మంగళతోరణము వలె
చిల్లికా : అందమైన ముఖము కలది
వక్త్ర లక్ష్మీ పరీవాహ : ముఖ సౌందర్యం అనే ప్రవాహమున
చలన్మీనాభలోచన : చేపల వంటి అందమైన కనులు కలది

7. నవచంపక పుష్పాభ నాసదండ విరాజిత
తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసుర

నవచంపక పుష్పాభ : క్రొత్త సంపెంగ మొగ్గలు
నాసదండ విరాజితా : అందమైన నాసిక కలది
తారా కాంతి : నక్షత్రాల వెలుగు
తిరస్కారి : మించిన
నాసాభరణ : ముక్కెర (నాసిక ఆభరణం)భాసుర :ఆభరణం కలిగినది

8.కదంబ మంజరీ క్లుప్త కర్ణపూరమనోహర
తాటంక యుగళీభూత తపనోడుప మండల
కదంబ మంజరీ క్లుప్త : కడిమిపూల గుత్తి చే అలకరించిన
కర్ణపూర మనోహర : అందమైన చెవులు కలది
తాటంక యుగళీభూత తపనోడుప మండల :సూర్యచంద్రులను చెవికమ్మలుగా కలిగినది

9. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ:
నవవిద్రుమ బింబశ్రి న్యక్కారి రదసన్నచ్చద

పద్మరాగశిలాదర్శ : పద్మరాగమణి (కెంపు) తో చేయబడినఅద్దములు
పరిభావి కపోలభూ : కెంపుల ప్రకాశం కంటే ఎక్కువప్రకాశం గల చెక్కిళ్ళు కలది
నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదా : క్రొత్త పగడమును మించిన అందమైన యెర్రని పెదవులు కలది.

10. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వల
కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర

శుద్ధవిద్యాంకురాకార : శ్రీవిద్య అనబడు షోడశీమంత్రములోని పదునారు బీజాక్షరాలు
ద్విజపంక్తి ద్వయోజ్వల : తెల్లని ప్రకాశవంతమైనపలువరుస కలది
కర్పూరవీటికామోద : కర్పూర తాంబూల సువాసనలు
సమాకర్షదిగంతరా : నలుదిక్కులను ఆకర్షించునది.

11 - 20:

11 నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపి
మందస్మిత ప్రభాపుర మజ్జత్కామేశ మానస

నిజసల్లాప మాధుర్య : తన పలుకుల మాధుర్యము చేత
వినిర్భర్త్సిత కచ్ఛపీ : సరస్వతీదేవి వీణా నాదమునుజయించునది
మందస్మిత : చిరునవ్వులు
ప్రభాపూర : కాంతి
మజ్జత్ : వశము చేసుకొను
కామేశ : కామేశ్వరుడు
మానసా : మనసును జయించునది.

12 అనాకలిత సాదృశ్య చుబుకశ్రి విరాజిత
కామేశ బద్ధమాంగాల్య సూత్ర శోభిత కంధర

అనాకలిత సాదృశ్య : పోల్చుటకు సాద్యముకాని
చుబుక శ్రీ విరాజితా : అందమైన గడ్డము (చుబుకము)కలది
కామేశ బద్ధ : కామేశ్వరుని చే
మాంగల్య సూత్ర : మంగళ సూత్రము
శోభిత : శోభిల్లుచున్న
కంధరా : కంట్టము కలది

13. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత
రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత

కనకాంగద కేయూర : బంగారు బుజ కీర్తులతోను(వంకీలతో) కమనీయ : చూడచక్కని
భుజాన్వితా : భుజములు కలది
రత్న గ్రైవేయ : రత్నములు పొదిగిన
చింతాక : చింతాకు పతకము
లోల ముక్తా ఫలాన్వితా : ముత్యాల జాలర్లు

14. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తని
నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి

కామేశ్వర ప్రేమ : కామేశ్వరుని ప్రేమ కు
రత్న మణి ప్రతిపనస్తనీ : రత్నములు, మణులతో
అలకరించబడిన చనుదోయి కలది
నాభ్యాలవాల : నాభి నుండి మొదలైన
రోమాళిలతా : నూగారు అనే లత (తీగ )
ఫలకుచద్వయి : ఫలములు వంటి చనుదోయి కలిగినది

15. లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ
స్తనభార దలన్మధ్య పట్టబంధవళిత్రయా

లక్ష్యరోమలతాధారతా : నూగారు (రోమాళి) ఉనికి వలన
సమున్నేయ మధ్యమా : పలుచని (సన్నని) నడుము కలది
స్తనభారదళన్మధ్య : స్తన భారము వలన
పట్టబంధవళిత్రయ : మూడు వరుసలు గల పట్ట ( నడుము పై భారము పడకుండా పట్టీ ధరించడం)

16. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కతీతటీ
రత్నకింకిణి కారమ్య రశనా దామ భూషిత

అరుణారుణ కౌసుంభ : ఎర్రని కౌసుంభ పూలు
వస్త్ర : వస్త్రముభాస్వత్ : ప్రకాసించుచున్న
కతీతటీ : కటి భాగం (తుంటి భాగం) కలిగినది.
రత్నకింకిణి కారమ్య : రత్నములతో, చిన్నచిన్న మువ్వలు కల
రసనాదామ భూషితా : వడ్డాణం తో అలకరించిన నడుము

17. కామేశజ్గ్యాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత

కామేశజ్గాత సౌభాగ్య : కామేశ్వరునికి మాత్రమే తెల్సిన
మార్దవోరు ద్వయాన్విత : మృదువైన ఊరువులు కలది
మాణిక్య : మణులు
మకుటాకార : కిరీటములను పోలిన
జానుద్వయ విరాజితా : మోకాళ్ళతో విరాజిల్లుతున్నది

18. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతునాభ జంఘిక
గూఢగుల్ఫా కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత

ఇంద్రగోప పరిక్షిప్త : ఇంద్రగోప (ఎర్రన్ని మణులు) పొదిగిన
స్మరతూనాభ జంఘికా : అమ్ముల పొదల వంటి పిక్కలు కలది
గూఢ గుల్ఫా : కనుపించని చీలమండలు కలది
కూర్మపృష్ట జయిష్ణు : తాబేలు వీపు ను గెలువజాలిన
ప్రపదాన్వితా : మీగాళ్ళు (పాదముల పై భాగము) కలది

19. నఖదీదితి సంచ్చన్న నమజ్జన తమోగుణా
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ

నఖదీధితి సంఛన్న : కాలి గోళ్ళ యొక్క కాంతి చే తొలగించబడిన
సమజ్జన తమోగునా: భక్తుల అజ్గ్యానాంధకారం
పరాకృత : ఓడిపోయిన
సరోరుహా : పద్మములు
పదద్వయ ప్రభాజాల : పాదముల యొక్క కాంతి

20. శింజాన మనిమంజీర మండితశ్రి పదాంబుజ
మరాళి మందగమనా మహాలావణ్య శేవధి:

శింజానమణి మంజీర : మ్రోగుచున్న అందెలు
మండిత శ్రీ పదాంబుజా : అందమైన పాదములు
మరాళి మందగమన : హంస నడక వంటి మందగమనము కల్గినది
మహా లావణ్య శేవధి: : అందమునకు పరమావధి

శివానుగ్రహం

నమక చమకాలను రుద్రాధ్యాయమంటారు.
సమస్త జ్ఞానానికీ మూలమైనవాడు శివుడు. ఆయనే దక్షిణామూర్తి. అమ్మవారితో కలిసి సాంబసదాశివుడు. పదకొండు రుద్రులుగా దేవతలను రక్షించే మహారుద్రుడు. భక్తకింకరుడైన శంకరుడు. దేవతలందరికీ ఆరాధ్యుడైన మహాదేవుడు.

శ్రీమహావిష్ణువు దశావతారాలు ధరిస్తే, పరమశివుడు నూట ఎనిమిది రుద్రావతార లీలల్ని ప్రదర్శించి లోకాలకు శుభాలను ప్రసాదించాడు. జీవుల కర్మదోషాలకు శిక్షలు విధించే నవగ్రహాలకు శివుడే అధిపతి. అందుకే గ్రహబాధల నుంచి రక్షణకు శివారాధన చెయ్యాలంటారు.

పూజ, అర్చన, ఆరాధనలు- వివిధ స్థాయులకు చెందినవి. శివుడికి సంబంధించి అర్చన, ఆరాధన అనే మాటలు ఉపయోగిస్తారు. రుద్రార్చనలో నమక చమక మంత్రాభిషేకం, బిల్వార్చనలు ఉంటాయి. ఆరాధనలో ‘యత్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం’ అనే సంపూర్ణ శరణాగతి ఉంటుంది. ప్రతి చర్యా ఆయన సేవే అనుకోవాలి.
శివశరణం లభించడమంటే రుద్ర కవచం మనకు దక్కినట్లే. త్రిశూలపాణి మనకు అండగా ఉన్నట్లే. అయితే, వీటిని పొందగల అర్హత మనం ఆర్జించుకోవాలి.

అలా ఆర్జించుకోవాలంటే, రుద్ర నమక మంత్రం ‘సౌమనసశ్చమే’ అంటే ఏమిటో మనకు అర్థం కావాలి. రుద్ర మంత్రాల ద్వారా మనం అనేక మహత్తరమైన ఆకాంక్షలను శివుడికి విన్నవించుకుంటాం. వాటిని మనకు అనుగ్రహించమని అర్థిస్తాం. అలాంటిదే ‘సౌమనసశ్చమే’. ‘మంచి మనసును నాకు ప్రసాదించు శివా!’ అనేది ఈ మంత్రార్థం.

మనిషి కష్టాలన్నీ మంచి మనసు లేకపోవటం వల్లనే కలుగుతున్నాయి. స్వార్థం, అసూయ, ద్వేషం లాంటి మహాపాషాణ విషాలు మన మనసులో తిష్ఠవేసుకుని ఉంటాయి. క్షీరసాగర మధన వేళ ఉద్భవించిన లోకభీకరమైన మహా వినాశనకారి అయిన హాలాహలాన్ని స్వీకరించిన పరమశివుడు మన మనసులోని పాషాణ విషాలను సైతం హరించివేయాలని మన ప్రార్థన, అభ్యర్థన. అవి తొలగిపోతే కానీ మనసు అమృతీకరణం చెందదు.
అమృతీకరణం చెందిన మనసు అందరి క్షేమాన్నీ కోరుతుంది. ఉదారంగా, సౌమ్యంగా, సర్వజన ప్రియంగా వ్యవహరిస్తుంది. అప్పుడిక శత్రువులంటూ ఉండరు. శత్రుబాధలు లేనప్పుడు అశాంతి ఉండదు. ఇదే ఆనంద రహస్యం.

భగవంతుడు మనపట్ల ఉదారంగా ఉండాలనుకుంటాం. కానీ మనం ఎవరి పట్లా ఉదారత చూపం. ఆర్తితో అలమటిస్తున్నవారి పట్ల ఉదాసీనంగా ఉంటాం. ఉదారంగా ఉండేందుకు మనస్కరించదు. ఎవరికైనా దానం చేసేటప్పుడు మన దగ్గర ఉన్న అతి చిన్న నాణేన్ని వెతికి వెతికి తీసి మరీ వేస్తాం. అలా ఉంటుంది లోభత్వం.

మూడు రకాల మనుషుల్ని మనం చూస్తుంటాం. శక్తి ఉన్నా పైసా కూడా దానం చెయ్యని పరమ పీనాసులు ఉంటారు. తమ శక్తికి లోబడి సాయం చేసే జాగ్రత్తపరులు కనిపిస్తారు. తమ శక్తికి మించి ఆదుకునే అమృత హృదయులూ ఉంటారు.
భగవంతుడు అలాంటి అమృత హృదయుల్ని అక్కున చేర్చుకుంటాడు. ఎందుకంటే, దయగలవారే దైవ సమానులు. దయామూర్తులే దైవ పరివార సభ్యులు. దీనులకు దైవపరివారమే బంధువులు.
జన్మతః భగవంతుడు అందరికీ మంచి మనసునే ఇస్తాడు. ప్రాపంచిక ప్రలోభాలతో మనసు కలుషితమైపోతుంది. నిత్యం పాత్రలను శుభ్రం చేసుకున్నట్లే మనసునూ శుభ్రం చేసుకోవాలి. అందుకు శివారాధన అత్యుత్తమం.
శివప్రీతికరమైన మాస శివరాత్రులు, సోమవారాలు, కార్తిక మాసంలో ప్రతి రోజును మనం శివారాధనలో సద్వినియోగం చేసుకుంటే, సౌమనస్కులుగా ఉండగలుగుతాం!

యుగానుసారం పాటించవలసిన ధర్మ శాస్త్రాలు

కృతయుగం – మనుస్మృతి
త్రేతాయుగంలో – గౌతమ స్మృతి
ద్వాపరంలో – శంఖు స్మృతి
కలియుగం – పరాశర స్మృతి

ఇవీ యుగానుసారం పాటించవలసిన ధర్మ శాస్త్రాలు ( ధర్మ స్మృతులు )

ఏరోజైతే భగవంతుని గురించిన ఙ్ఞానం తెలుసుకోవాలనే తపన మనలో మొదలైతే ఆ కృష్ణపరమాత్ముడు తప్పకుండా తగు ఏర్పాట్లు చేస్తాడు అది ఏవిధమైన ఏర్పాటైనా కావొచ్చు !! అందుకే అంటారు మనం భగవంతుని వైపు ఒక అడుగు ముందుకేస్తే ఆయన పదడుగులు వేయడానికి ఏమాత్రం సంకోచించడు పైగా ఎంతో ఆదుర్దగా వస్తాడు !! ఉదా: శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్షం

పరాశర స్మృతి

ధర్మశాస్త్రాలు(స్మృతులు) అన్ని యుగాలకి ఒకే స్మృతి నిర్దేశంచబడలేదు.!! ఆ వివరాలు పరాశర మహర్షి విరచిత “పరాశర స్మృతి” లో వివరించారు

సత్య (కృత) యుగం – మనుస్మృతి
త్రేతా యుగం – గౌతమ స్మృతి
ద్వాపర యుగం – శంఖ స్మృతి
కలియుగం – పరాశర స్మృతి
కావున కలియుగానికి అనుసరణీయమైన ధర్మ శాస్త్రం “పరాశర స్మృతి”

ఇంకా పరాశర స్మృతిలో ఏయే యుగంలో ధర్మాచరణ ఏయే విధంగా జరగాలో ఈ కింది విధంగా వివరించబడింది

“తపః పరం కృతయుగే
త్రేతాయాం ఙ్ఞానముచ్యతే
ద్వాపరే యఙ్ఞమిత్యుహ
దానమేకం కలౌ యుగే” అనగా

కృతయుగం – తపస్సు చేయడం
త్రేతాయుగం – ఆధ్యాత్మిక ఙ్ఞానాన్ని పొందడం
ద్వాపరయుగం – యఙ్ఞ, యాగాదులు చేయడం
కలియుగం – భగవత్సంబంధిత కార్యాలకై దాన దర్మాలు చేయడం

ఇంకా దానం కూడా ఏయే యుగాలలో ఏయే విధంగా చేసేవారో కూడా పరాశర స్మృతి వివరిస్తుంది

కృత యుగం – దాత
 దాన గ్రహీత అందుకు అర్హుడేనా అని విచారించి
త్రేతాయుగం – దాత దానగ్గహీతను అభ్యర్థించి
ద్వాపర యుగం – దాన గ్రహీత కోరినది దానం చేయడం
కలియుగం – ప్రత్యక్షంగా సహాయం చేయలేని పక్షంలో బదులుగా ద్రవ్య రూపకంగా

విష్ణు పురాణం

పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి బోధించిన పురాణమే “విష్ణు పురాణం”
వీరు సాక్షాత్తు వేద వ్యాసుల వారికి తండ్రి గారు మరియు శక్తి మహర్షి పుతృడు మరియు వసిష్ఠుల వారి పౌతృడు ( మనుమడు)

హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ
పై శ్లోకము కృష్ణయజుర్వేదాంతర్గత కలిసంతరణ ఉపనిషత్ లోనిది

సౌందర్యహరి లోని శ్రీ విద్యా రహస్యం...

శాక్తేయ సంప్రదాయంలో శ్రీవిద్య చాలా ముఖ్యమైనది. శ్రీవిద్య అంటే వివిధ రకాలుగా నిర్వచిస్తారు. త్రిపుర సుందరిని ప్రసన్నురాలిని చేసుకొనుటకు మూడు విధాలుగా ఆరాధనాదీక్షను ఆచరిస్తారు

(1) దేవీ ధ్యానము
(2) శ్రీచక్ర పూజ
(3) శాక్త సిద్ధాంత అధ్యయనము.

ఈ మూడింటినీ కలిపి శ్రీవిద్య అంటారు. వీటిలో శ్రీచక్రపూజ చాలా ముఖ్యంగా భావిస్తారు. దీనినే మరొక విధంగా లలితా సహస్రనామ స్తోత్రము పారాయణము, శ్రీచక్రార్చన, షోడశాక్షరీ మంత్రము అనుష్ఠానము కలిపి "శ్రీవిద్య" అని చెబుతారు. శ్రీవిద్యలో "వామాచారము", "సామ్యాచారము" అనే రెండు విధాలున్నాయి. సౌందర్య లహరిలో శ్రీచక్రం గురించి 11వ శ్లోకంలో చెప్పబడింది.

మిగిలిన అనేక శ్లోకాలలోఅనేక శ్రీవిద్యా రస్యాలున్నాయి అని చెబుతారు. ఉదాహరణకు "శివః శక్త్యా యుక్తో యది భవతి" అని ప్రాంభమయ్యే మొదటి శ్లోకంలోనే శ్రీవిద్యాసారమంతా నిక్షిప్తమయ్యి ఉన్నదని దర్శన సాహిత్య కర్తల అభిప్రాయము. కామేశ్వర సూరి ఈ శ్లోకాన్ని శ్రీవిద్యలోని 14 అంశాల పరంగా వ్యాఖ్యానించాడు.

 అవి
(1) వేదాంతము
(2) సాంఖ్యము
(3) శ్రీవిద్య యొక్క ముఖ్య దేవత
(4) సార్థకములైన శబ్దములు
(5) వాని అర్ధము
(6) శబ్దముల సృష్టి
(7) యంత్రము
(8) ప్రణవము
(9) మాతృక (సంస్కృతాక్షరమాల)
(10) కాది విద్య
(11) హాదివిద్య
(12) పంచాక్షరి
(13) దీక్షనిచ్చు గురువు
(14) చంద్రకళ . ఒక్కొక్క శ్లోకంలోను ఒక్కొక్క మంత్రం లేదా బీజాక్షరాలు నిక్షిప్తమై ఉన్నాయంటారు.

ఇంకా సౌందర్య లహరిలో అనేక మంత్రాలు నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయంటారు. ఒక్కో మంత్రానికి లేదా శ్లోకానికి ఒకోపారాయణాఫలం చెప్పబడింది. శాక్తేయులలో రెండు శాఖలవారున్నారు - కౌలాచారులు, సమయాచారులు. కౌలులు శ్రీచక్రం, ఇతర సంకేతాలలో శ్రీమాతను పూజిస్తారు మరియు బాహ్యపూజకు ప్రాధాన్యత ఇస్తారు. సమయాచారులు అంతఃపూజ ద్వారా మూలాధార చక్రంనుండి సహస్రదళకమలం వరకు కుండలినీశక్తిని జాగృతం చేయడాని దీక్ష సాగిస్తారు.

గురుసేవ - గురుశుశ్రూష 4 విధాలు

(1) స్థాన శుశ్రూష :- గురువు ఉన్న ఇంటిని, ఆశ్రమాన్ని, ప్రదేశాన్ని శుభ్రం చేయటం. ఆయన పరిసరాలను శుభ్రం చేయటం. ఆయన వాడే వస్తువులను శుభ్రం చేయటం - (అదీ తప్పనిసరి కర్తవ్యంగా గాక - తనకు అదృష్టవశాత్తు లభించిన అవకాశంగా భావించి)

(2) అంగ శుశ్రూష :- స్వయంగా ఆయన పాదాలొత్తి సేవచెయ్యటం. ఆయన యొక్క ఆరోగ్య విషయాలను స్వయంగా చూచుకుంటూ తగిన ఏర్పాట్లు చెయ్యటం. ఆయన అవసరాలను కనిపెట్టి ఉండటం.

(3) భావ శుశ్రూష :- ఆయన మనస్సులోని భావాలను తెలుసుకుంటూ అందుకనుగుణంగా నడుచుకోవటం. ఆయన కోరకుండానే ఆయన అవసరాలు తీర్చటం. ఆయనకు ఏ లోటూ కలగకుండా చూచుకోవటం.

(4) ఆత్మశుశ్రూష :- తన మాటలు - చేతలు గురువును నొప్పించకుండా ఆయన నడిచే మార్గంలోనే నడవటం. ఆధ్యాత్మిక చింతనతో ఆయనతో పోటీ పడటం. తన శరీరం - తన ధనసంపదలు - తన మనస్సు (తను, ధన, మనస్సులు) సర్వమూ గురువు కోసమేననే భావన బుద్ధిలో దృఢంగా ఉండాలి.
ఇలా గురువును సేవిస్తే గురువును ప్రసన్నం చేసుకోవటం, సన్నిహితం కావటం - గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటం జరుగుతుంది. ఈ విధమైన సంబంధం వల్లనే సత్ఫలితాలు కలుగుతాయి. ఆత్మతత్వం అవగతమవుతుంది. అందుకే వేదాంతం గురుశిష్య - సంబంధాన్ని గురించి ఇంతగా నొక్కి చెప్పటం. ఈ రోజుల్లో గురువు ఎక్కడో కూర్చొని ఫోనులో బోధ చేస్తాడు. లేదా TV లో చెబుతుంటే వింటున్నాం కదా! అని శిష్యులు భావిస్తుంటారు. వేదాంత సారాన్ని, గురువు యొక్క అనుభవాన్ని శిష్యుడు తెలుసుకోవాలంటే ఇలాంటి సులభమార్గాలు పనిచెయ్యవు. phone లో ఉపదేశాలు, post ద్వారా ప్రసాదాలు, ఉత్తరాల ద్వారా ఆశీస్సులు, TV తెర ద్వారా గురుబోధలు - ఇవేవీ మనను గమ్యం చేర్చలేవు.

గురువుకు అత్యంత సన్నిహితంగా వెళ్ళి ఆయనను సేవించి - పూజించి - ఆరాధించినప్పుడే సత్యం ఏమిటో అవగతమౌతుంది.

Saturday, April 13, 2019

రఘువంశ వర్ణన - జనక వంశ వర్ణన

శ్రీరామనవమి
"శ్రీ సీతారాముల కల్యాణోత్సవం" సందర్భంగా ఇరువురి వంశ వైభవాన్ని తెలుసుకుందాం రండి.

🙏రఘువంశ వర్ణన🙏
(దశరథ మహారాజు పూర్వీకులు)

చతుర్ముఖ బ్రహ్మ
మరీచి -->
కశ్యపుడు -->
సూర్యుడు -->
మనువు -->
ఇక్ష్వాకుడు -->
కుక్షి -->
వికుక్షి ->
భానుడు -->
అనరంయుడు -->
పృథుడు -->
త్రిశంకువు -->
దుందుమారుడు ->
మాంధాత -->
సుసంధి కి ఇద్ధరు ధృవసంధి, ప్రసేనజిత్‌
ధృవసంధి->
భరతుడు -->
అశితుడు -->
సగరుడు -->
అసమంజసుడు -->
అంశుమంతుడు -->
దిలీపుడు -->
భగీరతుడు -->
కకుత్సుడు -->
రఘువు -->
ప్రవృద్ధుడు -->
శంఖనుడు -->
సుదర్శనుడు -->
అగ్నివర్ణుడు -->
శీఘ్రకుడు -->
మరువు -->
ప్రశిశృకుడు -->
అంబరీశుడు -->
నహుశుడు -->
యయాతి -->
నాభాగుడు -->
అజుడు -->
దశరథుడు -->
రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుడు.

🙏జనక వంశ వర్ణన🙏

(జనక మహారాజు పూర్వీకులు)

నిమి చక్రవర్తి -->
మిథి -->
ఉదావసువు -->
నందివర్దనుడు -->
సుకేతువు -->
దేవరాతుడు -->
బృహధ్రతుడు కి ఇద్ధరు శూరుడు, మహావీరుడు.
మహావీరుడు -->
సుదృతి -->
దృష్టకేతువు -->
హర్యశృవుడు -->
మరుడు -->
ప్రతింధకుడు -->
కీర్తిరతుడు -->
దేవమీదుడు -->
విభుదుడు -->
మహీద్రకుడు -->
కీర్తిరాతుడు -->
మహారోముడు -->
స్వర్ణరోముడు -->
హ్రస్వరోముడు కి ఇద్దరు. జనకుడు, కుశద్వజుడు.
జనకుడు --> సీత, ఊర్మిళ
కుశద్వజుడు --> మాంఢవి, శృతకీర్తి

శ్రీరామనవమి "
శ్రీ  సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.

👏శ్రీరామ ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...
అజ మహారాజ వర్మణః పౌత్రాయ...
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.

👏సీతాదేవి ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...
జనక మహారాజ వర్మణః పుత్రీం...
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...

👉ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది.

🙏మా అత్మీయులైన మీకందరికీ...
శ్రీరామనవమి శుభాకాంక్షలు.

మీ ఆర్ యస్ శర్మ .దేవులపల్లి

రాముడి వంశ వృక్షము

బ్రహ్మ కొడుకు మరీచి

మరీచి కొడుకు కాశ్యపుడు.

కాశ్యపుడు కొడుకు సూర్యుడు.

సూర్యుడు కొడుకు మనువు.

మనువు కొడుకు ఇక్ష్వాకువు.

ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.

కుక్షి కొడుకు వికుక్షి.

వికుక్షి కొడుకు బాణుడు.

బాణుడు కొడుకు అనరణ్యుడు.

అనరణ్యుడు కొడుకు పృధువు.

పృధువు కొడుకు త్రిశంఖుడు.

త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు)

దుంధుమారుడు కొడుకు మాంధాత.

మాంధాత కొడుకు సుసంధి.

సుసంధి కొడుకు ధృవసంధి.

ధృవసంధి కొడుకు భరతుడు.

భరతుడు కొడుకు అశితుడు.

అశితుడు కొడుకు సగరుడు.

సగరుడు కొడుకు అసమంజసుడు.

అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.

అంశుమంతుడు కొడుకు దిలీపుడు.

దిలీపుడు కొడుకు భగీరధుడు.

భగీరధుడు కొడుకు కకుత్సుడు.

కకుత్సుడు కొడుకు రఘువు.

రఘువు కొడుకు ప్రవుర్ధుడు.

ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.

శంఖనుడు కొడుకు సుదర్శనుడు.

సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.

అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.

శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.

మరువు కొడుకు ప్రశిష్యకుడు.

ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.

అంబరీశుడు కొడుకు నహుషుడు.

నహుషుడు కొడుకు యయాతి.

యయాతి కొడుకు నాభాగుడు.

నాభాగుడు కొడుకు అజుడు.

అజుడు కొడుకు ధశరథుడు.

ధశరథుడు కొడుకు రాముడు.

ఇది రాముడి వంశ వృక్షమట ...

Thursday, April 11, 2019

నక్షత్రం - లక్షణాలు

బృహత్సంహిత ' లో ఏ నక్షత్రం వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు?

1.అశ్విని : చక్కని రూపం, దక్షత కలిగిన వారు, నీతివంతులు, ప్రియభాషనులు. 
2.భరణి : దృడ నిశ్చయులు , సుఖవంతులు, సత్యవ్రతులు, ఆరోగ్యవంతులు.
౩. కృత్తిక : ప్రక్యతులు, తేజస్సులు. 
4. రోహిణి : సత్యవంతులు, శుభ్రత, ప్రియంవద, స్దిరమతి , సురూప.
5. మృగశిర : చపలులు, ఉత్సాహవంతులు, చతురులు, భోగులు, భీకరులు. 
6.ఆరుద్ర : గర్వితులు, కృతఘ్నులు, అయిన వారిని ప్రేమించే వారు.
7. పునర్వసు : మంచి స్వభావం కలవారు, అల్ప సంతుష్టులు , రోగులు.
8.పుష్యమి : శాంతస్వభావం కలవారు. పండితులు, ధర్మ పరాయణులు. 
9. ఆశ్లేష : సర్వ భక్షకులు, కృతఘ్నులు,  అమాయకులు , సున్నితత్వం కలవారు.
10. మాఘ : భోగులు, ధనవంతులు, పిత్రు భక్తులు, మహొద్యమ కారులు. 
11. పూర్వఫల్గుణి :  ఎప్పుడు ప్రియ వచనములు పలుకు వారు. దాతలు, ద్యుతిమానులు, రాజసేవకులు. 
12. ఉత్తరఫల్గుణి : భోగులు, సుఖములు కలవారు, విద్య ప్రాప్తి కలవారు.
1౩. హస్త :  ఉత్సాహవంతులు , చోర స్వభావం కలిగి ఉంటారు.
14.చిత్త :  మీననేత్రులు. గడసరులు.
15.స్వాతి : కృపాళులు , ప్రియ వాక్కు కలవారు, ధర్మశ్రితులు .
16. విశాఖ   :  ఈర్ష బుద్ధి కలవారు. ద్యుతులు, మాన్యవచనులు.
17. అనురాధ : విదేశీ యానం కలవారు, ధర్మాత్ములు.
18. జ్యేష్ఠ : పలువురు మిత్రులు కలవారు, సంతృప్తి కలవారు, కోప స్వభావం కలవారు. 
19. మూల : లక్ష్మి పుత్రులు , సుఖపడువారు,  స్ధిర మనసు కలవారు.
20. పూర్వషాడ : సౌహర్ర్ధ  హృదయం కలవారు, ఇష్ట పూర్వకంగా పని చేయువారు, కళలను ఇష్టపడు వారు. 
21. ఉత్తరాషాడ : ధార్మికులు, బహు మిత్రులు కలవారు,  కృతజ్ఞత కలిగిన వారు . 
22. శ్రవణం : ఉదార స్వభావం కలవారు, ఖ్యాతి   పొందేడివారు , ధనవంతులు.
2౩. ధనిష్ట : దాతలు, ధన లబ్దము కలిగిన వారు, సంగిత ప్రియులు.
24. శతభిషం : సాహసికులు, కోప స్వభావం కలవారు, వ్యసన పరులు. 
25. పూర్వాభాద్ర : సంతోషమును తృప్తిగా అనుభవించలేని వారు,  ధనవంతులు, దాతలు.
26. ఉత్తరాభాద్ర : ఎక్కువ సంతానం కలవారు, ధార్మికులు, జితశత్రులు , వక్తలు.
27.రేవతి : శూరులు, శుచివంతులు, సుభగులు,  సంపూర్ణంగులు

నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం

శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యతా.,పరమేశ్వరుడికి అనుంగుభక్తుడు నందీశ్వరుడు.


అందుకనే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకొనే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి. అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండదీపారాధన మాత్రమే వాడతారు. మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు.

సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార(ఇతర)దేవతల దర్శనం చేసి పరమశివున్ని దర్శించుకుంటాము. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనం అని శాస్త్రములు చెబుతున్నాయి. 

పరమ శివుడు ఏ శివాలయంలో అయిన శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతలలాగ కరచరనాదులు(విగ్రహ రూపం) లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపంను మనస్సు వెంటనే గ్రహించగలదు కానీ, లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సు పై కేంద్రీకృతం చేయాలి. 

అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది శృంగము(కొమ్ముల)నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సు పై కేంద్రీకరింఛి దర్శనం చేసుకోవాలి. నంది యొక్క పృష్ట భాగంను నిమురుచూ, శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి. 


అంతే కాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది.

కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి.
గురు, శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు.

అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్యనుంచి శివదర్శనం చేసుకోవాల్సివుంటుంది.  శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్లాలి. దీన్నే శృంగదర్శనం అంటారు. 

రాశి చక్రంలోని మిథున రాశి గౌరీ శంకర స్వరూపం. వృషభరాశి నందిశ్వర రూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృభరాశి, మిథున రాశి కిందుగా, అస్తమించే సమయంలో మిథున రాశి, వృషభరాశి కిందుగాను ఉంటుంది. ఆ కారణం వలనే శివుడు వృషభవాహనుడు, వృషభద్వజుడు అయ్యాడు. వృషభం (నందీశ్వరుడు)యొక్క వృషభ బాగాన్ని స్పృషిస్తూ శివుని దర్శించటం వల్ల విధి విహితం. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివున్ని దర్శించిన వారికీ కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణలో ఉన్నది .

సప్త ఋషులు

కశ్యపోత్రి భరద్వాజాః విశ్వామిత్రోథ గౌతమః!
వశిష్టో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః స్మృతాః!!

భారతీయ పరంపరాగత పౌరాణిక కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉన్నాడు. ప్రాచీన రుషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ రుషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ రుషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు రుషులున్నారు.
ఎంతోమంది రుషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.

1.కశ్యపుడు,
2.అత్రి,
3.భరద్వాజుడు,
4.విశ్వామిత్రుడు,
5.గౌతముడు,
6.జమదగ్ని,
7.వసిష్ఠుడు... వీరు ఏడుగురు పూజనీయులు.

రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు.

1. సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి (మరీచి కళల పుత్రుడు). దక్షప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షలతాత్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.

2. సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.

3. భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.

4. విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.

5. తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు రుషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర రుషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.

6. జమదగ్ని రుషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు.

7. ఏడో రుషి వసిష్ఠుడు. ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.

సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు. ఏడు సముద్రాలు, ఏడు కుల పర్వతాలు, ఏడుగురు రుషులు, ఏడు ద్వీపాలు, ఏడు భువనాలు, ప్రాతఃకాల స్మరణతో శుభాలను కలగజేస్తాయంటారు.

Wednesday, April 10, 2019

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి. కుక్కే సుబ్రమణ్య

నాగదేవత నివసించే ప్రదేశం..

నాగదోష పరిహారంచేయించుకోవాలను 
కుంటున్నారా?!. మీ అనుకూలాన్ని బట్టి ఈ ఆలయాన్ని సందర్శించండి. మహిమాన్విత మైన శ్రీ కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహాన్నీ పొందండిక.

కుక్కే శ్రీ సుబ్రమణ్యేస్వామి వారి గుడి  నాగదోష పరిహారములకు చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ ప్రధానముగ సర్పహత్యదోషం, ఆశ్లేష బలి పూజ మరియు నాగ ప్రతిష్ట పూజలు చాలా నిష్టగ నిర్వహిస్తారు. ఇక్కడ గుడిలో నాగదోష పరిహారములు చేసుకుంటే వారికి జీవితంలో ఎటువంటి భాదలు లేకుండా మంచి సంతానం కలిగి సుఖసంతోశాలతో జీవిస్తారు అని పురాణ గాధలలో ఉంది.

కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని సుల్లియా అనే ఊళ్ళో కుక్కే సుబ్రమణ్య దేవాలయం వుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ నాగ దేవతగా ఆరాధించడం విశేషం. ఇది ఒక ప్రసిద్ధ యాత్రా స్థల౦ – ఇక్కడి క్షేత్ర గాధ కూడా  యాత్రికుల్ని ఇక్కడికి ఆకర్షిస్తుంది.
ఆలయ స్థలపురాణం

ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన దేశంలో ఎన్నో దేవాలయాలు వెలిశాయి. వాటిల్లో కొన్ని ఆలయాలను భక్తులు, రాజులు, వంశస్థులవారు దేవుడిపై భక్తిని చాటిచెప్పేందుకు నిర్మించగా.. మరికొన్ని దేవాలయాల్లో దేవతలు స్వయంభువులుగా వెలిశారు. అలా వెలిసిన దేవాలయాల్లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటి. కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కార్తికేయుడు) కి నిలయమైన ఈ క్షేత్రం ‘పరశురామ’ క్షేత్రాలలో ఒకటి.

ఈ ఆలయం ప్రాకృతిక సౌందర్యారాలు వెలువరించే కర్ణాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరుకు 100 కి.మీ.ల దూరంలో కుమార పర్వతశ్రేణుల మధ్య ధారా నది ఒడ్డున ఉన్న గ్రామం ’సుబ్రహ్మణ్యం’లో వుంది. పూర్వం ఈ గ్రామాన్ని ‘కుక్కే పట్నం’ అనే పిలిచేవారు. క్రమంగా ఇది ‘కుక్కె సుబ్రహ్మణ్య’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. సుబ్రహ్మణ్య ఆలయం గురించి ‘స్కాందపురాణం’లో సనత్‌కుమార సంహితలోని సహ్యాద్రికాండలోని తీర్ధక్షేత్రమహామణి పురాణంలో తెలుపబడింది.

స్థలపురాణం : పూర్వం తారకుడు, సూర్పర్మాసురా అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. తన ఆయుధాన్ని ఇక్కడి (కుక్కే సుబ్రహ్మణ్య గ్రామంలో) ధారానదిలో శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత ఈ కుమారధార పర్వతశ్రేణులలో గణపతి మున్నగు దేవతలతో కుమారస్వామి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇంద్రుడు తన కుమార్తెను వివాహం చేసుకొమ్మని కోరగా ఆయన అంగీకరిస్తాడు. ఆ తరువాత వాసుకి తపస్సుకు మెచ్చి వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో తనతో పాటు వెలియడానికి అంగీకరించడం వల్ల ఈ క్షేత్రం వెలసింది.

మరిన్ని వివరాలు :
సుబ్రహ్మణ్యస్వామి ముఖద్వారం తూర్పుముఖమై ఉన్నా, భక్తులు మాత్రం పృష్టభాగం నుండి ముందుకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. గర్భగుడికి, ఈమధ్య నిర్మించబడ్డ వసారాకు మధ్యన వెండితాపడాలతో అలంకరింపబడ్డ స్తంభం ఉంటుంది. వాసుకి విషపు బుసలనుండి రక్షింపపడడానికి ఈ స్తంభాన్ని నిర్మించారు అని ప్రతీతి. ఈ స్తంభాన్ని దాటిన తరువాత లోపటి మంటపం చేరుకోగానే గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టు సాక్షాత్కరిస్తాడు. పైభాగంలో సుబ్రహ్మణ్యస్వామి , మధ్యభాగంలో వాసుకి, కింద్రిభాగంలో ఆదిశేషు ఉంటారు.

ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ నలమూలల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేస్తారు. పూర్వం ‘ఆది శంకరాచార్యులు’ తన ధర్మ ప్రచార పర్యటనలో భాగంగా సుబ్రహ్మణ్యను దర్శించారు. ఆయన విరచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ‘నమస్తే సదా కుక్కుటేశోగ్ని కేతా స్స్మస్తాపరాధం విభోమే క్షమస్వ’ అని పేర్కొన్నారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు కలుగుతాయని కొందరి భక్తుల నమ్మకం.

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం
కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం  వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. మంగళూరు దగ్గరలోని  విమానాశ్రయం. గుడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ వుంది.  బెంగళూరు, మంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం వరకు చాలా ప్రభుత్వ బస్సు సేవలు అందుబాటులో వున్నాయి.

కుమారధారా నది మీద వున్న సుబ్రహ్మణ్య స్వామి వూళ్ళో వున్న సుబ్రహ్మణ్య దేవాలయం లేక కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం చూసి తీరవలసిన వాటి లో ఒకటి. ఈ గుడి చుట్టూ నదులు, పర్వతాలు, అడవులు. ముఖ్యంగా కుమార పర్వత౦ పరుచుకుని వుంటాయి.  ఈ గుడి శివుడి రెండో కుమారుడు, కార్తికేయుడు గా పిలవబడే సుబ్రహ్మణ్య స్వామికి, నాగ రాజు వాసుకి కి నిలయం.

సుబ్రహ్మణ్య దేవాలయంలో బయట లోపల వున్న హాళ్ళు గర్భాలయానికి దారి తీస్తాయి. ఒక ఎత్తైన వేదిక మీద సుబ్రహ్మణ్య స్వామి తో పాటు వాసుకి విగ్రహాలు వున్నాయి.  హిందూ పురాణాల ప్రకారం మరో నాగ రాజు ఆది శేషుడి విగ్రహం కూడా  గర్భాలయం లో చూడవచ్చు. గర్భాలయానికి, మండప ద్వారానికి మధ్య వెండి తో కప్పబడిన గరుడ స్థంభం వుంది. స్థానికుల ప్రకారం యాత్రికులను ఈ స్తంభంలో నివసించే వాసుకి నుంచి వచ్చే విషం నుంచి కాపాడడానికి ఈ స్తంభానికి తాపడం చేశారు.
సర్ప దోష శాంతికి చేసే ప్రక్రియలకు ఈ పవిత్ర దేవాలయం ప్రసిద్ది. ఈ గుడిలోని ప్రధాన పర్వ దినం తిపూయం నాడు అనేకమంది యాత్రికులు ఇక్కడికి వస్తారు. దీంతో పాటు ఆశ్లేష బలి పూజ, సర్ప సంస్కారం అనే మరో రెండు ప్రధానమైన సర్ప దోష పూజలు కూడా ఈ గుడిలో చేస్తారు.

ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ నలమూలల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేస్తారు. పూర్వం ‘ఆది శంకరాచార్యులు’ తన ధర్మ ప్రచార పర్యటనలో భాగంగా సుబ్రహ్మణ్యను దర్శించారు. ఆయన విరచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ‘నమస్తే సదా కుక్కుటేశోగ్ని కేతా స్స్మస్తాపరాధం విభోమే క్షమస్వ’ అని పేర్కొన్నారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు కలుగుతాయని కొందరి భక్తుల నమ్మకం.... దైవానుగ్రహప్రాప్తిరస్తు ,


సర్పదోషాలను నివారించే నాగ పూజ:

ప్రాచీనకాలం నుంచి కూడా నాగుపాములను నాగ దేవతలుగా పూజించే ఆచారం వుంది. కొన్ని ప్రాంతాలలో నాగుల చవితిని 'శ్రావణ శుద్ధ చవితి' రోజున ఆచరిస్తుండగా, మరికొన్ని ప్రాంతాలలో 'కార్తీక శుద్ధ చవితి' రోజున ఆచరిస్తుంటారు. నాగుల చవితి రోజున ఉపవాసం నియమం వుంది. నియమనిష్టలు .. భక్తి శ్రద్ధలు ఆశించిన ఫలితాలను అందిస్తాయనేది శాస్త్ర వచనం. సాధారణంగా దేవాలయాలలో నాగ ప్రతిమలు ఉంటాయి. మరికొన్ని దేవాలయాలలోను .. ఆలయ ప్రాంగణంలోను నాగుల పుట్టలు ఉంటాయి. దగ్గరలో నాగుల పుట్ట ఎక్కడ వున్నా వెళ్లి దర్శనం చేసుకోవాలి.

 నాగ ప్రతిమకు అభిషేకం చేయడం .. నాగుల పుట్టలో పాలు పోయడం చేయాలి. నైవేద్యంగా నువ్వుల పిండిని .. చలిమిడిని .. వడ పప్పును సమర్పించాలి. ఇక పూజా మందిరంలో నాగ ప్రతిమ వున్నవారు, పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరించాలి. నాగదేవతకి ఇష్టమైన జాజి .. సంపెంగ వంటి సువాసన గల పూలతో పూజించడం మరింత శ్రేష్టం. నాగ పూజ వలన సర్ప దోషాలతో పాటు .. సర్వ దోషాలు తొలగిపోతాయనీ, చర్మ సంబంధమైన వ్యాధులు నివారించబడతాయనేది మహర్షుల మాట.

గురుసేవ - గురుశుశ్రూష 4 విధాలు

(1) స్థాన శుశ్రూష :- గురువు ఉన్న ఇంటిని, ఆశ్రమాన్ని, ప్రదేశాన్ని శుభ్రం చేయటం. ఆయన పరిసరాలను శుభ్రం చేయటం. ఆయన వాడే వస్తువులను శుభ్రం చేయటం - (అదీ తప్పనిసరి కర్తవ్యంగా గాక - తనకు అదృష్టవశాత్తు లభించిన అవకాశంగా భావించి)

(2) అంగ శుశ్రూష :- స్వయంగా ఆయన పాదాలొత్తి సేవచెయ్యటం. ఆయన యొక్క ఆరోగ్య విషయాలను స్వయంగా చూచుకుంటూ తగిన ఏర్పాట్లు చెయ్యటం. ఆయన అవసరాలను కనిపెట్టి ఉండటం.

(3) భావ శుశ్రూష :- ఆయన మనస్సులోని భావాలను తెలుసుకుంటూ అందుకనుగుణంగా నడుచుకోవటం. ఆయన కోరకుండానే ఆయన అవసరాలు తీర్చటం. ఆయనకు ఏ లోటూ కలగకుండా చూచుకోవటం.

(4) ఆత్మశుశ్రూష :- తన మాటలు - చేతలు గురువును నొప్పించకుండా ఆయన నడిచే మార్గంలోనే నడవటం.

 ఆధ్యాత్మిక చింతనతో ఆయనతో పోటీ పడటం. తన శరీరం - తన ధనసంపదలు - తన మనస్సు (తను, ధన, మనస్సులు) సర్వమూ గురువు కోసమేననే భావన బుద్ధిలో దృఢంగా ఉండాలి.

ఇలా గురువును సేవిస్తే గురువును ప్రసన్నం చేసుకోవటం, సన్నిహితం కావటం - గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటం జరుగుతుంది. ఈ విధమైన సంబంధం వల్లనే సత్ఫలితాలు కలుగుతాయి. ఆత్మతత్వం అవగతమవుతుంది. అందుకే వేదాంతం గురుశిష్య - సంబంధాన్ని గురించి ఇంతగా నొక్కి చెప్పటం. ఈ రోజుల్లో గురువు ఎక్కడో కూర్చొని ఫోనులో బోధ చేస్తాడు. లేదా TV లో చెబుతుంటే వింటున్నాం కదా! అని శిష్యులు భావిస్తుంటారు. వేదాంత సారాన్ని, గురువు యొక్క అనుభవాన్ని శిష్యుడు తెలుసుకోవాలంటే ఇలాంటి సులభమార్గాలు పనిచెయ్యవు. phone లో ఉపదేశాలు, post ద్వారా ప్రసాదాలు, ఉత్తరాల ద్వారా ఆశీస్సులు, TV తెర ద్వారా గురుబోధలు - ఇవేవీ మనను గమ్యం చేర్చలేవు. గురువుకు అత్యంత సన్నిహితంగా వెళ్ళి ఆయనను సేవించి - పూజించి - ఆరాధించినప్పుడే సత్యం ఏమిటో అవగతమౌతుంది.

శ్రీ మంగళ చండికా స్తోత్రం

🕉 ఓం శ్రీమాత్రే నమః 🕉

కుజదోష నివారణకు ‘మంగళ చండీదేవి” ని పూజించాలి అని ‘బ్రహ్మవైవర్త పురాణం’ చెబుతోంది.

జాతకంలో కుజదోష నివారణకు?

కుజదోషం అనే మాట వినపడగానే ఎవరైనా సరే ఉలిక్కి పడుతుంటారు. అందుకు కారణం కుజ దోషం నుంచి బయటపడటం చాలా కష్టమనే విషయం ప్రచారంలో ఉండటమే.


పెళ్లి కావలసిన వారికి కుజదోషం వుందంటే ఇక ఆ తల్లిదండ్రులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కుజదోష నివారణకు గాను వారు వెళ్లని ప్రదేశం గానీ, చేయని ప్రయత్నంగాని వుండవు. అయితే కుజదోషం వలన కలిగే విపరీతాల నుంచి బయటపడాలంటే ‘మంగళచండీ దేవి’ ని పూజించాలని ‘బ్రహ్మవైవర్త పురాణం’చెబుతోంది.


ఏ కుజగ్రహ దోషం వలన అంతా నానాఅవస్థలు పడుతున్నారో … ఏ కుజుడి అనుగ్రహం కోసం అంతా నానాప్రయత్నాలు చేస్తున్నారో ఆ కుజుడు పూజించే అమ్మవారే ‘మంగళచండీ దేవి’.


కుజుడికి మంగళుడు అనే పేరు కూడా వుంది. మంగళవారం రోజున మంగళుడు పూజించిన కారణంగా ఆ తల్లి మంగళ చండీగా ప్రసిద్ధి చెందింది. మంగళుడి ఇష్టదైవాన్ని ఆరాధించడం వలన ఆయన కూడా తొందరగా అనుగ్రహిస్తాడు.


ఇక మంగళుడే కాదు … సాక్షాత్తు పరమశివుడు కూడా ఆమెను ఆరాధించాడు. మంగళవారం రోజున ఉపవాస దీక్ష చేపట్టి, మంగళ చండీని పూజించవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. సమస్త దోషాలు తొలగిపోయి, శుభాలు చేకూరతాయి.


కాబట్టి కుజదోషం వున్నవారు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన, సత్వరమే
సత్ఫలితాలను సాధించి సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు.


కుటుంబ క్షేమానికి మంగళచండీ స్తోత్రం

త్రిపురాసుర సంహారానికి ముందు తొలుత మంగళచండీని పూజించినవాడు శివుడు. ఆపై అంగారక గ్రహం, ముచ్చటైన మూడవ మంగళ పూజను మహేంద్రుడూ, నాలుగో పూజను దేవతలూ చేశారు. ఈ పూజ చేసిన వారికి శత్రుభీతిపోవటంతోపాటు కుటుంబమంతా మంగళకరంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు స్వయంగా శివునికి ఉపదేశించిన పూజ విధానం శ్రీ దేవి భాగవతంలో ఉంది.

మంగళ చండి స్తోత్రంను మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం కుజహోరలో దేవికి నేతితో దీపమెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతాయని పండితులు అంటున్నారు.

శత్రు పీడలు,ఋణభాదలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ,కోర్టు సమస్యలు,సంసారంలో గొడవలు,అనారోగ్య సమస్యలు,కోపం,అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజ గ్రహ దోషాలకు మంగళ చండీ స్తోత్ర పారాయణం ప్రతి మంగళవారం పఠించటం మంచిది.

శ్రీ మంగళ చండికా స్తోత్రం.

ధ్యానం :.

దేవి శోడష వర్మియామ్ సుస్త్ర యవ్వనామ్
బింబోక భీమ్ సుదతీమ్ సుద్దామ్ శరత్ పద్మ నిభాననామ్ శ్వేత సంపక వర్ణామ్ సునీ లోత్భల లోసనామ్
జగతాత్రీమ్ సదాత్రీమ్ చ సర్వేభ్యః సర్వ సంపదామ్. సంసార సాగరే కావే జ్యోతి రూపాం సదాభజే
దేవాస్య చ ద్యాన మిత్యవమ్ స్థవానమ్ సృయతామునే.


శ్రీ మహాదేవ ఉవాచ:-

రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే.
హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే.
మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే
సతాం మంగళతె దేవీం సర్వేషామ్ మంగళాలయే
పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే పూజ్యే
మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్ మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని
సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే.

Universal Breathing – Pranayama

Universal Breathing – Pranayama యోగ వలన ఆరోగ్యం మెరుగుపడినప్పటికి ప్రాణాయామ వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి...

Stressed? Balance your life and experience a relaxed meditative state to relieve your daily stresses and tensions. Pranayama’s simple and intuitive guide to deep breathing features a progressive course based on the principles of yoga, to help you find balance and stress relief.
Continue reading
 
   యోగా, ద్యానం !
.
యోగా, ద్యానం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చాలామంది
నమ్ముతారు.
యోగా మార్గంలోని (8) యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యహార,
ద్యాన, దారణ, సమాది ల లో ద్యానానికి అదిక ప్రాదాన్యత ఇస్తారు. దైవ భక్తి
ఉన్నవారైతే యోగాద్యానం తో ఏకంగా దేవుడినే దర్శించవచ్చని
ఆశపడుతారు.
"యోగా, ద్యానం ఆభగవంతున్ని భక్తున్ని దగ్గరకు చేస్తుందని
అనాధిగా వస్తున్న నమ్మకం".
అయితే ద్యానం వల్ల కలుగుతాయని నమ్మే ఉపయోగాలను పాయింట్స్
వారిగా చూద్దాం.
1.ద్యానం తో ఎన్నో మొండి జబ్బులు నయమవుతాయి.
2.ద్యానం మన ఆలోచనలు అలజడిని తగ్గిస్తుంది. తద్వార ఎంతో
మానసిక ప్రశాంతత మనశ్శాంతి పొందవచ్చు.
3.విధ్యార్థుల లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
4.యోగాలోని ఒక్కోఆసనంతో ఒక్కో జబ్బును నయం చేయవచ్చు.
యోగాద్యానంలోని ఒక్కోవెరైటీ (సిద్దసమాదియోగ, కుండళియోగ, పిరమిడ్ యోగ)
ఒక్కో ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుతూ, సిద్దులను పొందుతూ
జబ్బులను సైతం నయంచేయవచ్చు.

కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది.మూలాధారం లో దాగివున్న ఈ కుండలినీ శక్తినిసుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ. కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.

శక్తి రెండు రకాలుగా ఉంటుంది.

ఒకటి స్థితి శక్తి (Potential Energy),

రెండవది గతి శక్తి(Dynamic or Kinetic Energy).

 శరీరంలోని ప్రాణశక్తి గతి శక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది. యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయవచ్చు. కామ, క్రోధ,లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.

కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ముందు

దేహ శుద్ధి (purification of body),
నాడీ శుద్ధి (purification of nadis/nervous system),
మనో శుద్ధి (purification of mind),
బుద్ధి శుద్ధి (purification of intellect) జరగాలి.

నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని యోగ క్రియల ద్వారా జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వ ముఖంగా పయనించి, షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్నీ దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ స్థితినే అష్టాంగ యోగలోని అత్యున్నత దశ అయిన "సమాధి స్థితి"గా కూడా పేర్కొంటారు. ఈ స్థితిలో సాధకునికి ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్ని రకాల క్లేశాలూ తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతాడు.

చక్రాలు

వెన్నెముక లో ఉండే చక్రాలు

ప్రధాన వ్యాసం: సప్తచక్రాలు

షడ్చక్రాలు లేదా సప్తచక్రాలు మన శరీరంలోని వెన్నుపూస లోనున్న ప్రదేశాలు.

మూలాధార చక్రము (Mooladhara) : గుద స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. దీని బీజ మంత్రం లం. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు, వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.

స్వాధిష్ఠాన చక్రము (Swadhisthana) : లింగమూలమున గలదు. ఆరు దళములతో సిందూరవర్ణము గల జలతత్వ కమలము గలది. దీని బీజ మంత్రం వం.

మణిపూరక చక్రము (Manipura) : నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి, నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము. దీని బీజ మంత్రం రం.

అనాహత చక్రము (Anahatha) : హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం యం.

విశుద్ధి చక్రము (Vishuddha) : కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి, శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము. దీని బీజ మంత్రం హం.

ఆజ్ఞా చక్రము (Ajna) : భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము. దీని బీజ మంత్రం ఓం.

సహస్రార చక్రము (Sahasrara) : బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈ స్థానమునెరిగిన నరునకు పునర్జన్మలేదు.

దశావతారాల ఆవిర్భావం ఏమాసాలలో జరిగింది వారిజయంతి వివరాలు...

1 మత్స్యజయంతి ;-చైత్ర శుద్ధ పంచమి  అపరాహ్నంలో విష్ణువు మత్స్యావతారంగా అవతరించాడు.(ఎప్రియల్ 10 వస్తుంది)
2 కూర్మజయంతి ;-జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు ప్రదోషవేల కూర్మావతరం జరిగింది.(జూన్13 వస్తుంది)
3 వరాహ జయంతి;-చైత్ర శుద్ధ నవమి అపరాహ్నంలో అంటే మాధ్యాహ్నంకాలంలో జరిగింది.(ఎప్రియల్ 13 తేదీ)
4 నరసింహ జయంతి ;-వైశాఖ శుద్ధ త్రయోదశి ప్రదోష కాలంలో జరిగింది
5 వామన జయంతి;-భాద్రపద శుద్ధ ద్వాదశి మధ్యాహ్నంలో అభిజిత్ లగ్నంలో జరిగింది
6 పరుశురామ జయంతి;-వైశాఖ శుద్ధ తదియనాడు సాయంకాలం 6 నుండి 9 గంటల మధ్య జరిగింది
7 శ్రీరామ జయంతి ;- (శ్రీరామనవమి)శ్రీరాముడు పుట్టింది చైత్ర శుద్ధ నవమి మధ్యాహ్నాం 12 గంటలకు కర్కాటలగ్నంలో పునర్వసు నక్షత్రంలో 5 గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా జన్మిచాడు కావున శ్రీరామ నవమి ఎప్రియల్ 13 తేదీ ఆచరించాలి.
8బలరామ జయంతి;-భాద్రపద శుద్ధ తదియ నాడు మధ్యాహ్నం అవతారం జరిగింది
9 శ్రీకృష్ణ జయంతి ;-శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి మధురలో రోహిణి నక్షత్రం వృషభలగ్నంలో జరిగింది(19-7-3227 బి .సి)
10 బుద్ధజయంతి వైశాఖ శుద్ధ పూర్ణమి నాడు జరిగింది
11 కల్కిజయంతి;-వైశాఖ శుద్ధ తదియ ప్రదోష సమయంలో కల్కి అవతారము జరిగింది
ఆధార గ్రంధము సూర్య సిద్దాంతము.

Monday, April 8, 2019

తెలుగు సంవత్సరం పేరు మరియు సంవత్సర ఫలితము.

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

1 ప్రభవ
యజ్ఞములు విరివిగా జరుగుతాయి.

2 విభవ
జనులు సుఖముగా ఉంటారు.

3 శుక్ల
పంటలు సమృద్ధిగా పండుతాయి.

4 ప్రమోదూత
ప్రజలందరు ఆనందంగా ఉంటారు

5 ప్రజోత్పత్తి
అంతటా అభివృద్ధి కనిపిచును

6 అంగీరస
భోగములు కలిగి ఉంటారు

7 శ్రీముఖ
లోకమంతా సౌఖ్యముగా ఉంటుంది

8 భావ
ఉన్నత భావమును కలిగిస్తుంది

9 యువ
ఇంద్రుడు వర్షములు కురిపించుట వలన లోకమంతా సస్యశ్యామలముగా ఉంటుంది

10 ధాత
అన్ని ఔషధులు(మొక్క ధాన్యాలు)పండును

11 ఈశ్వర
అందరికీ క్షేమము ఆరోగ్యము కలిగించును

12 బహుధాన్య
దేశమంతా సుభిక్షముగా ఉంటుంది

13 ప్రమాది
14 విక్రమ
మధ్యమ వర్షపాతము ఉంటుంది
15 వృష
అంతటా వర్షములు కురుస్తాయి

16 చిత్రభాను
చిత్రవిచిత్ర అలంకారములను ఇస్తుంది

17 స్వభాను
క్షేమము ఆరోగ్యము ఇస్తుంది

18 తారణ
పంటలకు అనుకూలముగా వర్షములు కురుస్తాయి

19 పార్థివ
సస్యములు సంపదలు సమృద్ధి ఔతాయి

20 వ్యయ
అతివృష్ఠి కలుగుతుంది

21 సర్వజిత్తు
ప్రజలు సుఖించునట్లు వర్షాలు పడతాయి.

22 సర్వధారి సుభిక్షముగా ఉంటుంది.

23 విరోధి
మేఘాలను హరించి వర్షము పడకుండా చేద్తుంది

24 వికృతి భయంకరముగా ఉంటుంది

25 ఖర
పురుషులు వీరులౌతారు

26 నందన
ప్రజలు ఆనందముగా ఉంటారు

27 విజయ
శత్రువులను హరించును

28 జయ
శత్రువులు, రోగముల మీద విజయము కలుగుతుంది

29 మన్మథ జ్వరాఫ్హిబాఫ్హలు కలుగును

30 దుర్ముఖి
ప్రజలు దుష్కర్మలు చేస్తారు

31 హేవిలంబి  (లేదా) హేమలంబ సంపదలు కలుగును

32 విలంబి
సుభిక్షముగా ఉంటుంది

33 వికారి
శత్రువులకు కోపము కలిగించును

34 శార్వరి
అక్కడక్కడా పంటలు పండును

35 ప్లవ
సమృద్ధిగా జలం ప్రవహించును

36 శుభకృతు
ప్రజలు శుభముంగా ఉంటారు

37 శోభకృతు
ప్రజలు శుఖంగా ఉంటారు

38 క్రోధి
కోపస్వభావం పెరుగుతుంది

39 విశ్వావసు ధనసమృద్ధి కలుగుతుంది

40 పరాభవ
ప్రజలు ఒకరిని ఒకరు అవమానించుకుంటారు

41 ప్లవంగ
జలసమృద్ధి అధికంగా ఉంటుంది

42 కీలక
సస్య సమృద్ధి అధికంగా ఉంటుంది

43 సౌమ్య
ప్రజలకు శుభములు కలుగుతాయి

44 సాధారణ
ప్రజలకు సామన్య శుభములు కలుగుతాయి

45 విరోధికృతు
ప్రజలలో విరోధభావం పెరుగుతుంది

46 పరీధావి
ప్రజలలో భీతి అధికం ఔతుంది
47 ప్రమాదీచ
48 ఆనంద
ప్రజలు ఆనదంగా ఉంటారు

49 రాక్షస
ప్రజలులో క్రూర స్వభావం అధికమైరుంది
50 నల
51 పింగళ  (లేదా) పింగల
52 కాళయుక్తి  (లేదా) కాలయుక్తి
53 సిధ్ధార్థి
54 రౌద్రి
ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి
55 దుర్మతి
ప్రజలకు దుర్బుద్ధులు అధికమౌతాయి
56 దుందుభి
57 రుధిరోద్గారి రక్తధారలు ప్రవహిస్తాయి

58 రక్తాక్షి
ప్రజలకు కలుగుతాయి
59 క్రోధన
ప్రజలలో క్రోధం అధికమౌతుంది

60 అక్షయ
ప్రజలు సుభిక్షంగా ఉంటారు

హనుమ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి



👌 1.ఎవరిని / దేనిని ఆశ్రయించావు?

ధర్మం తెలిసిన బ్రాహ్మణుడు రావణుడు.
అపారమైన శివ భక్తుడు.అయినా పరకాంతల యందు..పరుల సొమ్ము నందు వాంఛను చంపుకోలేకపోయాడు.చివరకు రాముని ఒక్క బాణం తో పది తలలు కూలి మట్టిలో కలిసిపోయాడు. ధర్మ మూర్తి అయిన శ్రీ రాముని పాదాలను పట్టి ఆశ్రయించి….ఆయన బాట యందు నడిచిన “స్వామి హనుమ” చిరంజీవి గా మిగిలిపోయారు.చరిత్రలో నిలిచిపోయారు.

“జీవితం లో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దేన్ని పట్టుకోవాలో ….దేన్ని విడిచిపెట్టలో తెలియాలి.సరైన మార్గాన్ని తెలుసుకోవాలి.తెలియడం కాదు…పాటించే దమ్ము కూడా ఉండాలి.”

👌 2. మైత్రి యొక్క విలువ!

వంచన తో..బలం తో..భార్యను,భూమిని, బలగాన్ని తనవైపు తిప్పుకున్న వాలి కి మంత్రిగా
హనుమ ఒక్క నాటికి లేరు.
తన దారి తానూ చూసుకోలేదు.న్యాయం వైపు గా..సుగ్రీవుడి పక్షాన్నే నిలిచి…ఉన్నారు.

“జీవితం లో కస్టాలు సుఖాలు రెండూ పంచుకునే మంచి మిత్రులు దొరకడం చాలా కష్టం.నిజంగా అలాంటి వాళ్ళు దొరికినప్పుడు…వాళ్ళని ఎన్ని కాష్టాలొచ్చినా విడిచిపెట్టకండి.”

👌 3. అహం బ్రహ్మాస్మి-నేనే గొప్ప అని అనకు!
నాదేం లేదు…అనగలిగే గొప్ప స్వభావం కలిగి ఉండాలి!

లంకకు వెళ్ళే ముందు…హనుమ ఇలా అంటారు..!
నేను తలచుకుంటే నా శరీరాన్ని అమాంతం పెంచి వంగి ఒక్క చేత్తో అవతలి లంకా తీరాన్ని అందుకో గలను…అంత బలం ఉంది…
కాని నేను ఎలా వెళ్తానో తెలుసా?
“నా స్వామి రామ చంద్రమూర్తి యొక్క కుడిచేత్తో
తన భుజం వెనుకనున్న అక్షయ బాణ తూనీరం
లో నుండి తీసిన బాణాన్ని తన ఎడమ చేతిలోనున్న బంగారు వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెడితే ఆ బాణం ఎలా వెళుతుందో ” అలా దూసుకెళతాను…
అది నా శక్తి కాదు…!రాముడి చే విడవబడితే…
రాముడి శక్తి ఆ బాణం లో కెళ్ళి బాణం వెళుతుంది!అటువంటి రామ బాణం లా వెళతాను!”
-నేను…నా వల్ల ,నా బలం..ఇదంతా నేనె చేసాను.. అని హనుమ ఒక్క సారి కూడా అనలేదు!

👌 4. నీ మీద నమ్మకం ఉండేలా బ్రతుకు!
కొన్ని లక్షల వానర సేన!
నూరు యోజనముల సముద్రం!
జాంబవంతుడు సహా ఎందరో అతిరథ మహారథులు!
తలచుకుంటే కాని పని కాదు!కాని రాముడు నమ్మింది …అందరూ సూచించింది “హనుమనే”!

“నిన్ను నమ్మి పని అప్పగించి ….గుండెల పై చెయ్యేసుకుని హాయిగా నిద్రపోయేలా బ్రతుకు!”

👌 5. మోసం చేసేవాళ్ళు ఉంటారు.నువ్వు మోసపోకు…ఆగిపోకు..ముందుకు మరో అడుగేసి సాగిపో!
హనుమ సముద్రం దాటుతూ ఉండగా….ఒక అందమైన బంగారు పర్వతం…పైకి లేచింది!
“స్వామి…మీరు చాలా దూరం ప్రయాణం చేసి
అలసి ఉన్నట్టు కనబడుతున్నారు..!కాసేపు నా ఈ పర్వతం పై కూర్చుని….విస్రాంతి తీసుకుని,ఇక్కడ ఉన్న పళ్ళు కాయలు తిని
వెళ్ళండి “అని అంటుంది.
హనుమ…”సముద్రం లో బంగారు పర్వతమా?మాయ లా ఉంది?ఇది నాకు విఘ్నమని” ఆలోచించి…ఆ పర్వతాన్ని చేత్తో ప్రేమగా తాకి,లంకా నగరం వైపుగా వెళ్ళిపోయారు.

“చేసే పనిలో ….గమ్యాన్ని చేరుకోడం లో..ఎలాంటి అడ్డంకులున్నా ప్రయాణం ఆపకూడదని హనుమ
చేసుకున్న ప్రమాణం.”

👌 6. లక్ష్యం తప్ప మరేదీ కనబడకూడదు.
హనుమ,లంకలో సీతమ్మకోసం వెతుక్కుంటూ
రావణ అసురుని అంత: మందిరం లోనికి ప్రవేశించగా
కొన్ని వందల మంది స్త్రీలు వివస్త్రలు గా, సురా పానం చేసి…మత్తులో ఒకరిపై ఒకరు పడి అడ్డదిడ్డంగా…పడి ఉన్నారు… లెక్కలేనన్ని పళ్ళు…మధుర…పానియాలు నేలపై పది పారుతూ ఉన్నాయి.వారి ఒంటి మీద బంగారు నగలు…నేలంతా పడి ఉన్నాయి…
ఇవన్నీ చూస్తున్నా…..
హనుమ ఒక్కింత కూడా చలించలేదు…ఆతని మనసులో ఉన్నది ఒక్కటే!నా తల్లి సీతమ్మ ఎక్కడ ఉందొ?ఎన్ని కస్టాలు పడుతోందో అని…!
మురుగు కాలువ దాటినట్టు ఆ స్థలాన్ని దాటి
సీతమ్మ ను వెతుక్కుంటూ వెళ్లారూ హనుమ.

“లక్ష్యం సాధించడం లో గురి…
చేసే పని లో పట్టుదల…
పడే శ్రమలో తపన ఉంటె….మన చుట్టూ ఏమున్నా కనపడవు.”

👌 7. పెద్దరికాన్ని గౌరవించు
రావణుడు హనుమను బంధించి తీసుకు రమ్మన్నపుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించి
చివరగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు.
నిజానికి బ్రహ్మాస్త్రం హనుమను ఆపలేదు.
హనుమ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కట్టుబడ్డారు!
రావణ సభలో అంతే సులువు గా ఆ తాళ్లను విడిపించుకున్నారు.

“పెద్దలకి…నువ్విచ్చే గౌరవం నలుగురిలో నీ గౌరవాన్నే పెంచుతుంది”

–———–
హనుమ కథ లో…వెతుక్కుంటూ పొతే మన జీవితానికి కావలిసిన పాఠాలు ఎన్నో దొరుకుతాయి.ప్రతి ఊరి పొలిమేరల్లో గద పట్టుకుని నిలబడి….”ఏం భయం లేదు రా...నీకు తోడుగా నేనున్నానులే……పద “..అని తెలిపే ఆంజనేయ విగ్రహాలే...

ఒక్కొక్క దేవాలయానికీ ఒక్కొక్క ప్రత్యేకత వుంది

పూర్వ కాలంలో దేవాలయములు నిర్మించేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించినారు. ఒక్కొక్క దేవాలయానికీ ఒక్కొక్క ప్రత్యేకత వుంది.

ఉదాహరణకు కొన్ని :

1. ఉత్సవ విగ్రహం లేకుండా మూల విగ్రహమే మాడవీధులలోనికి వచ్చేది చిదంబరం నటరాజ స్వామి.

2. కుంభకోణంలో ఐరావతేశ్వర స్వామి కోవెల తారాశురం అనే గ్రామంలో వుంది. అక్కడ శిల్పకళా చాతుర్యం చాల అద్భుతంగా చెక్కబడి వుంది. ఒక స్తంభము నుంచి చూస్తే వాలి సుగ్రీవుల యుద్ధం మాత్రమె తెలుస్తుంది. కొంచెం దూరంలో ఇంకొక స్తంభములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడి వుంది.
ఇందులో గొప్ప ఏమిటి అంటే మొదటి స్థంభము దగ్గర నుండీ... అంటే వాలి, సుగ్రీవుడు యుద్ధం చేస్తున్నట్టు చెక్కబడిన స్తంభం దగ్గర నుంచీ చూస్తే శ్రీ రాముడు కనపడడు కాని రెండవ స్తంభము, అంటే శ్రీ రాముడు ధనుర్దారిగా వున్న స్తంభం దగ్గర నుంచి చూస్తే వాలి సుగ్రీవుల యుద్దము చాల బాగుగా తెలుస్తుంది.

3. ధర్మపురి (తమిళనాడు)
మల్లికార్జున స్వామి కోవెలలో తొమ్మిది స్తంభాల మంటపం లో రెండు స్థంభములు భూమిపై ఆనకుండా అంతరిక్షంలో వుంటాయి.

4. కరూర్ (కోయంబత్తూర్) సమీపం లోని కుళిత్తలై అనే వూరిలో కదంబవననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒక మంటపములో ప్రతిష్ఠ గావింపబడి వున్నాయి.

5. గరుడుడు నాలుగు కరములతో అందులో రెంటిలో శంఖ చక్రములతో దర్శనము ఇచ్చేది కుంభకోణం పక్కన వేల్లియంగుడి అనే గ్రామ కోవెలలో.

6. కుంభకోణంలో నాచ్చియార్ కోవిల్ అనే స్థలంలో విష్ణు గుడి వుంది.
అక్కడ గరుడ వాహనం రాతితో చేసినది. స్వామి సన్నిధిలో వున్నప్పుడు, ఆ గరుడ వాహనం బరువు, నలుగురు మోసే బరువు వుంటుంది క్రమంగా ఒక్కొక్క ప్రాకారం దాటి బయటికి తీసుకు వస్తుంటే, బరువు పెరుగుతూ, రాను రాను ఎనిమిది మంది ... పదహారు మంది... ముప్పైరెండు మంది ... బయట వీదిలోకి వచ్చేటప్పటికి అరువదినాలుగు మంది మోసేంత బరువు అయిపోతుంది. తిరిగి స్వామి గుడిలోనికి తీసుకువెళ్తున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది. ఇక బయట వీధికి వచ్చేటప్పటికి గరుడ విగ్రహమునకు చెమట పట్టడం ఇంకా విచిత్రం.

7. చెన్నై సమీపంలో శ్రీ పెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల కోవెల వుంది అక్కడ మూల స్థానంలో ఉన్నటువంటి విగ్రహం శిల కాదు ... పంచలోహ విగ్రహమూ కాదు కేవలం కుకుమపూవు, పచ్చ కర్పూరం మూలికలతో చేసినది.

8. తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథ స్వామి కోవెలలో స్థల వృక్షం ఒక మారేడు చెట్టు. మారేడు కాయలు ఎలా ఉంటాయో మనకి తెలుసు... కానీ ఆ చెట్టుకి కాచే కాయలు లింగాకారంలో ఉంటాయి.

9. కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుడి గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదు వర్ణములుగా మారుతూ వుంటుంది. అందుకే ఆ కోవేలని పంచ వర్నేస్వరుడి కోవెల అని పిలుస్తారు

10. విరుదునగర్ పక్కన చొక్కనాధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుడి కోవెలలో నందికి కొమ్ములు, చెవులు, వుండవు.

11. ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం వుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆంజనేయ విగ్రహం కనులు, భద్రాచల శ్రీ రామ సన్నిధిలో వున్న శ్రీ రాముడి పాదములు ఒకే ఎత్తులో వుండడం.

12. వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒక స్థంభములో అర్ధ చంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు, ఆరు నుండి పండ్రెండు వరకు అంకెలు చెక్కబడి వున్నాయి. పైన వుండే పల్లమునుడి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం.

13. చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సు నుంచి నడుము వరకు మానవ ఆకారంతోనూ... నడుము నుంచి పాదముల వరకు మత్స్య ఆకారంలో వుంటుంది

14. ధర్మపురి (తమిళనాడు) పక్కన పదుహారు అంటే పది మైళ్ళ దూరంలో అభీష్టవరద స్వామి అనే విష్ణు గుడిలో నవగ్రహములు స్త్రీ రూపముతో ఉంటాయి.

ఇలా మనకు తెలియని ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమ శాస్త్ర విధానంగా కట్టిన దేవాలయాలలో వున్నాయి.

శరీర భాగాలు, రుగ్మతలు

 జీవితంలో రుగ్మతలు రావడం సహజం. రాశులు , వాటి అధిపతులైన గ్రహాలు వీటికి కారణం అవుతాయి అని శాస్ర్త ప్రమాణం. రాశి యొక్క తత్వాలు మరియు గ్రహల కారకత్వాల ద్వారా రోగ నిర్ధారణకు చేసుకోడానికి జ్యోతిషం ఉపయుక్త మవుతుంది. ఏ శరెర భాగాలకు రుగ్మతలు వస్తాయో రాశులు తెలుపుతాయి. ఎటువంటి రుగ్మతలు వస్తాయో గ్రహాల ద్వారా తెలుసుకొందాము.

రాశులు - శరీర భాగాలు


  • మేషం - శిరస్సు ,ముఖం, మెదడు , ముఖంలోని ఎముకలు, మెదడు లోని నరాలు.
  • వృషభం - గొంతు, మెడ, వాటిలోని నరాలు,ఎముకలు.
  • మిధునం - భుజాలు, చేతులు, వాటిలోని ఎముకలు, నరాలు, శ్వాస కోశం .
  • కర్కాటకం- రొమ్ము ,జీర్ణాశయం.
  • సింహం - గుండె , వెన్నెముక
  • కన్య - ఉదరం, ఉదరకోశం,పొత్తికడుపు
  • తుల - కటి భాగం, నాభి, మూత్ర పిండాలు.
  • వృశ్చికం - జననేంద్రియాలు, మూత్రకోశం .
  • ధనుస్సు - తొడలు, పిరుదులు, రక్త నాళాలు.
  • మకరం - మోకాళ్ళు, కీళ్ళు.
  • కుంభం - పిక్కలు, కాళ్ళు, రక్త ప్రసరణం.
  • మీనం - పాదాలు, వేళ్ళు, శరీరంలోని ద్రవ పదార్దాలు.


ఈ రాశులలో మేష, సింహ, ధనుస్సులు అగ్నితత్వానికి, వృషభ, కన్య, మకరాలు భూతత్వానికి, మిధున , తుల, కుంభ రాశులు వాయు తత్వానికి , కర్కాటక, వృశ్చిక, మీన రాశులు జల తత్వానికి చెందినవి. కావున ఈ తత్వానికి సంబందించిన రుగ్మతలు కూడా వచ్చే అవకాశం ఉంది.వీటితో పాటు గ్రహాలు కూడా కొన్ని రుగ్మతలకు కారణం అవుతాయి . గ్రహాలు ఆ కలుగ చేసే రుగ్మతల వివరాలు ఈ క్రింద పొందు పరచినాము.

గ్రహాలు - రుగ్మతలు


  • సూర్యుడు - హృదయ , నేత్ర సంబంధ వ్యాదులు, రక్త ప్రసరణ ,వెన్నెముక సంబందిత వ్యాధులు, శరీరంలో శక్తి హీనత, పురుషులకు కుడి కన్ను ,మహిళలకు ఎడమకన్ను.
  • చంద్రుడు - ద్రవ సంబంధ మైన రుగ్మతలు, పైత్యం, దగ్గు, రొమ్ము, ఉదర వ్యాధులు, ఆస్తమా , పురుషులకు ఎడమ కన్ను, స్త్రీలకు కుడి కన్ను , మానసిక రుగ్మతలు.
  • బుధుడు - జీర్ణాశయం, నరాలు, ఊపిరితిత్తులు, మూగ, చేతులు,నాలుక, నోటికి సంబందించిన రుగ్మతలు, మూర్చ వంటి మానసిక వ్యాధులు.
  • శుక్రుడు - జననేంద్రియ రుగ్మతలు, గొంతు, మెడ, బుగ్గలు, చర్మ వ్యాధులు.
  • కుజుడు -  నుదురు, శిరస్సు, ముక్కు, కండరాలు, పురుష జననేంద్రియాలు, మొలలు, రక్త స్రావం, గాయాలు, ఉష్ణ వ్యాధులు, అగ్ని, విద్యుత్ ప్రమాదాలు.
  • గురువు - కాలేయం, మధుమేహం,రక్త నాళాలు, కుడిచెయ్యి, తొడలు, పిరుదులు.
  • శని - దంతాలు, ఎముకలు, మోకాళ్ళు, కీళ్ళ సంబంధిత నొప్పులు, చర్మ వ్యాధులు.
  • ఇంద్ర- రక్త ప్రసార నాళాలు, మెదడులోని నరాలు, వెన్నెముక భాగాలకు సంబంధించిన అంతు చిక్కని వ్యాధులు, ఆకస్మిక ప్రమాదాలు.
  • వరుణ- మానసిక రుగ్మతలు, మూర్చ, మతి బ్రమణం, అంటూ వ్యాధులు, కలుషిత ఆహారాలు, తాంత్రిక వ్యాధులు, దృష్టి మాంద్యం.
  • యమ - వంశ పారంపర్య  వ్యాధులు, జననేంద్రియ వ్యాధులు, ప్రమాదాలు


మన శరీర భాగాలలో ఏ భాగం ఏ వ్యాధికి  గురవుతుందో లగ్న, సూర్య , చంద్ర రాశులను, వాటి అధిపతులను బట్టి నిర్దారించు కోవచ్చు .లగ్న రాశి నుంచి గాని , సూర్య రాశి నుంచి గాని ,చంద్ర రాశి నుంచి గాని 6 ,8 ,12 స్థానాలు అనారోగ్య స్థానాలు అంటే ఆ రాశులు , ఆ రాశి అధిపతులు ,ఆ రాశిలో వున్నా గ్రహాలూ ,కారకత్వాలను తెలుసు కుంటే రోగ నిర్ధారణ సాధ్యమవుతుంది.

కర్ణ పిశాచి విద్య


“అశరీరాం వార్తాహారిణి, కర్ణ పిశాచి నమామ్యహం”!!

 పూర్వం కృష్ణా జిల్లాలో ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరిలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వారికి వ్యవసాయం చేసుకోవడానికి కొన్నిఎకరాల భూములుఉండేవి . ఆ బ్రాహ్మణుడు పాలేర్లని పెట్టుకుని వ్యవసాయం చేస్తుండే వాడు. ఎంతో కొంత వేద పఠనము, జ్యోతిష్యం, ఈ పంచాంగమంతా చూసేవాడు. వాళ్లకి తోచిన సలహాలేవో ఇస్తుండే వాడు. ఆ రోజుల్లో బ్రాహ్మణులకి ఎంతో కొంత వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఉండేవి. ఆ బ్రాహ్మణుడి దగ్గర ఒక పాలేరు పని చేస్తుండే వాడు. చాలా మంచి వాడు.

ఒక రోజు ఆ బ్రాహ్మణుడు పొలం పనులన్నీ చూసుకుని ఇంటికి వచ్చిఇంటి బయట ఉన్న ఒక కుక్కి మంచంలో పడుకుని విశ్రమిస్తున్నాడు. కాసేపటికి ఆ పాలేరు పొలం నుంచి వచ్చి అమ్మగారూ! అమ్మగారూ! పని చేసి చేసి పోలంనుంచి అలసిపోయి వచ్చాను. కాస్త మంచి తీర్థం ఇప్పించండి అలాగే మీరు చేసిన గారెలు రెండో మూడో నాకు పెట్టండి అని అడగటం జరిగింది. అప్పుడు ఆ అమ్మగారు వాడికి మంచినీళ్ళిచ్చి, అసలు గారేలేమిటీ? నేను చేయడం ఏమిటీ? ఏం మాట్లాడుతున్నావు నీవు? నేనెప్పుడు గారెలు చేసాను? అని అన్నారు. అమ్మగారూ! మీరు అబద్ధాలు చెప్పుతున్నారు . మీరు మొత్తం 22 గారెలు చేసారు. అందులో రెండు మీరు తిని రెండు మీ పిల్లవాడికి పెట్టారు. ఇంకా మీ దగ్గర 18 గారెలు ఉన్నాయి. 18 ఉన్నాయో లేదో అని కావాలంటే లెక్క చూసుకోండి. నేను నిజం చెప్పుతున్నానో లేదో చూసుకుని చెప్పండి అని  ఆ పాలేరు చెప్పటం విని ఆ బ్రాహ్మణుడు ఎంతో ఆశ్చర్య పోయాడు. ఇదేమిటీ వీడు ఇలా వచ్చి ఈవిడ గారెలు చేసింది అని అంటాడు. అసలు సంగతేమిటీ అని కుతూహలంగా జరుగుతున్నదంతా అతను గమనిస్తున్నాడు. అమ్మగారు కూడా తను  గారెలు చేసానని వీడికెలా తెలిసింది అని చాలా ఆశ్చర్య పోయారు. తాను చేసిన గారెలు లెక్క పెట్టేసరికి సరిగ్గా పాలేరు చెప్పినట్టే 18 ఉన్నాయి. అవునురా! నీవు చెప్పింది నిజమే. కాని నేను గారెలు చేసానని నీకెలా తెలిసింది? ఏమైనా మంత్రోపాసన చేస్తున్నావా?  సంగతేమిటీ ?అని అడిగారు. ఏం లేదమ్మగారూ! నేనేమంత్రం ఉపాసన చేయటంలేదు. రాగానే గారెల వాసన తగిలి గారెలు చేసారని , ఏదో నా నోటికి వచ్చిన సంఖ్య ఏదో నేను చెప్పాను.అంతేనండి అమ్మగారు ఇంకా ఏమి లేదు అని అన్నాడు. అదృష్టం బాగుండి ఆ సంఖ్య సరిగ్గా సరి పోయింది. మంత్రాలు నేనెందుకు చేస్తాను అని చెప్పి తప్పించుకున్నాడు.

ఆ పాలేరేదో దేవతని ఉపాసన చేస్తున్నాడని ఆ బ్రాహ్మణుడు గ్రహించాడు. అతనికి అదేదో తెలుసుకోవాలి అని కుతూహలం కలిగింది. దానితో ఆ పాలేరు వెంట పడి నానా విధాలుగా ప్రశ్నించాడు. ఏరా! నాకా మంత్రం చెప్తావా లేదా నేను కూడా ఉపాసన  చేస్తాను అని అంటే అయ్యగారూ! మంత్రమూ లేదు తంత్రమూ లేదు ఊరికే చెప్పాను అని అన్నాడు .లేదు! లేదు! నేను నమ్మను. నీవు ఏదో  ఒకటి ఖచ్చితంగా సాధన చేస్తున్నావు నాకు చెప్పాల్సిందే అని ఇరవై నాలుగు గంటలు అతని వెనక పడడం మొదలు పెట్టాడు. ఆ పాలేరుకి విసుగు పుట్టి చివరకి నేను ఒక కర్ణ పిశాచి అనే చిన్న దేవతను ఉపాసన చేసి నా అధీనంలో పెట్టుకున్నాను. నేనేమైనా ప్రశ్నలు అడిగితే ఆ పిశాచం నా చెవిలో జవాబులు చెప్తుంది. సరే! మీరు ఇంత ప్రాధేయ పడుతున్నారు కదా! ఆ దేవతని నేను అడుగుతాను. అయినా మీరు బ్రాహ్మణులు. మీకు ఈ చిన్న దేవత కర్ణ పిశాచి ఎందుకండీ? ఏం చెప్పినా కూడా మీరు వినటం లేదు కాబట్టి నేను కనుక్కుని చెప్తాను అని చెప్పి ఆ పాలేరు వెళ్లి పోయాడు.
             
ఆ మర్నాడు పాలేరు రాగానే ఆ బ్రాహ్మణుడు పరిగెత్తుకుని వచ్చి ఏం నాయనా! ఏమంటున్నది మీ దేవత? అనగా అయ్యా! నేను కర్ణ పిశాచాన్ని అడిగాను. అయితే ఆ కర్ణ పిశాచి ఇలా అన్నది, మీ దొర గారు పిచ్చి వాడు. అతను మనస్సు లోపలే  ప్రతి నిత్యం పగలనక  రాత్రనక  గాయత్రి మంత్రం జపిస్తూ ఉంటాడు కదా అటువంటి గాయత్రి మహా మంత్రం చదువుతున్న అతని దగ్గరకి నేనెలా రాగలను? నన్ను ఆయన ఎలా ఉపాసన చేస్తాడు? నా మంత్రాలు ఎలా చదువుతాడు? ఆయన దగ్గరకి నేను రాలేకుండా ఉన్నాను. ఆయనకి నేనెంతో దూరంలో ఉంటున్నాను. మరి ఎందుకు మీ పిచ్చి బ్రాహ్మణుడు అంత మంచి మంత్రంతో గాయత్రి మాతని ఉపాసన చేస్తూ నాలాంటి క్షుద్రదేవతని గురించి ఆలోచిస్తున్నాడు పిచ్చా వెర్రా అని ఆవిడ వారించింది. అలా కాదు కూడదు అని అనుకుంటే. నన్ను ఉపాసన చేయాలి అని అనుకుంటే మాత్రం కొన్ని పద్ధతులు పాటించాలి తప్పదు. ముందు వారింటిలో ఉన్న ఆ దేవుని పటాలు, విగ్రహాలు అన్నీ అవతల పారేయాలి. నేను గాయత్రి మంత్రం చదవనని ఆయన ప్రతిజ్ఞ చేయాలి. పొరబాటున కూడా గాయత్రి మంత్రం చదవకూడదు. అలా చేస్తానని కనక ఆయన ఒప్పుకుంటే అప్పుడే నేను అతని వశమవుతాను. అంత వరకు నేను అతని దగ్గరకి రాలేను. 

అతనికి కొన్ని గజాల దూరంలో కూడా నేను నిలబడ లేక పోతున్నాను. అంత శక్తివంతమైనది ఆ గాయత్రి మంత్రం అని నీవు వెళ్లి ఆ పిచ్చి బ్రాహ్మణుడికి చెప్పు అని ఆ కర్ణ పిశాచి చెప్పింది అని ఆ పాలేరు చెప్పాడు. అది విని ఆ బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్య పోయాడు. బాబోయ్! గాయత్రి మంత్రానికి ఇంత శక్తి ఉంటుందా? నాకేమీ తెలియదు. వీడు కర్ణ పిశాచిని చెవిలో పెట్టుకుని అన్నీ చెప్తుంటే ఆహా! ఓహో! అని ఏదో అనుకున్నాను. గాయత్రి మంత్రాన్ని చదువుతున్న నా దగ్గరకే ఈ కర్ణ పిశాచి రాలేక పోయినప్పుడు ఇటువంటి చిన్న చిన్న క్షుద్ర దేవతల ఉపాసన చేయటం నాకు తగదు అని లెంపలేసుకుని నాకు నీ కర్ణ పిశాచి మంత్రం అక్ఖర్లేదు. నేను హాయిగా నా గాయత్రి మంత్రాన్నే చేసుకుంటాను అని ఆ పాలేరుకి చెప్పటం జరిగింది. ఇది వాస్తవంగా జరిగిన కథ.

అసలు విషయానికి వస్తే........


 జ్యోతిషవిద్యలో అనేక విధానములున్నవి. గణిత, ఫలిత, పరిహారభాగాలను ఔపోశన పట్టి చెప్పేది ఒక విధానం. మంత్రప్రయోగం ద్వారా దేవతా వశీకరణం చేసుకొని గణితంతో సంబంధం లేకుండా చెప్పేది ఒక విధానం. ఈ మంత్రవిధానములో మహామంత్రములు,క్షుద్ర మంత్రములు కలవు. వీటిలో ఎక్కువమంది అభ్యాసం చేసేది కర్ణపిశాచినీ విద్య. తమిళ నాడు,కేరళ,ఒరిస్సా లలో ఈ విద్య ఉంది.

    కొండనాలుక కొంత కత్తిరించి తరువాత ఉపదేశం ఇస్తారు. జీవితాంతం కొన్ని నియమాలు పాటించాలి. 40 రోజులు నిష్టగా రాత్రిళ్ళు పిప్పలాదఋషి కృతమైన కర్ణపిశాచినీ మంత్రాన్ని లక్ష జపించాలి. తరువాత విభీతకి సమిధలతో హోమం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. ప్రతిరోజూ దేవతకు తాను తినేఆహారంలోంచి కొంత నైవేద్యం పెట్టాలి.అప్పుడు ఆ కర్ణపిశాచి చెవిలో అన్నీ విషయాలు చెబుతుంది. 

ఇటువంటి మంత్రవిద్యలు అనేక రకములు ఉన్నవి. స్వప్నేశ్వరి, స్వప్నవారాహి, వటయక్షిని, ఉన్మత్తభైరవం, ఉచ్చిష్టగణపతి ఇత్యాది.

    K.P System ఆద్యుడు ప్రొఫెసర్ కే.యస్. కృష్ణ మూర్తి గారు ఉచ్చిష్టగణపతి ఉపాసకుడు. జరగబోయే విషయాలు నిమిషాలు సెకండ్లతో సహా సరిగ్గా చెప్పగలిగేవాడు.ఈయన విమానంలో శ్రీలంకకు పోతున్నప్పుడు విమానం ఎన్ని గంటలకు శ్రీలంకకు చేరుతుందో చెప్పమని విమానంలో ప్రయాణం చేస్తున్నవారు అడిగారు. కృష్ణమూర్తిగారు ఒక టైము చెప్పాడు. వాళ్లు ఎగతాళి చేసి,విమానం సరియైన సమయానికే ప్రయాణం చేస్తోంది. మీరు చెప్పినది తప్పు అన్నారు. కాని కొద్దిసేపటికే ఏదో వాతావరణ కారణాలవల్ల ఆలస్యమై సరిగ్గా కృష్ణమూర్తిగారు చెప్పిన సమయానికి ఎయిర్ పోర్టులో దిగింది. ఇటువంటివి అనేకం ఆయన మంత్రసిద్ధి మరియు జ్యోతిషజ్ఞానం వల్ల చెప్ప గలిగాడు.

బీ.వీ.రామన్ గారు కూడా చిన్నప్పుడు కర్ణపిశాచినీ సాధన కొంతకాలం చేసినట్లు ఆయన జీవితకథలో రాసుకున్నారు. ఈసంగతి తెలిసి ఆయన తాతగారైన ప్రొఫెసర్ సూర్యనారాయణరావు గారు మందలించి  ఆ సాధనను ఆపించారు. మహామంత్రమైన గాయత్రిని నిత్యము జపించే వారికి ఇటువంటి క్షుద్రమంత్రముల అవసరం ఉండదు. అందువల్ల తర్వాత ఆయన గాయత్రిని మాత్రమె జపించేవారు. 

క్షుద్రమంత్రములు త్వరగా సిద్దిస్తాయి. కాని వాటివల్ల తరువాత హాని కలుగుతుంది. సాత్వికములైన మహా మంత్రములు త్వరగా సిద్దించవు. కాని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాయి. హాని కలిగించవు. స్వల్ప ప్రయోజనముల కోసం అటువంటి క్షుద్ర మంత్రముల జోలికి పోవటం మంచిది కాదు. కాని అట్టి విద్యలు ఉన్న మాట వాస్తవమే.

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...