Wednesday, November 30, 2022

ద్వాదశ జ్యోతిర్లింగాలు - 12 రాశులు

మన రాశికి సరిపడిన జ్యోతిర్లింగమేదో తెలుసా?


మేషం       -   రామేశ్వరం    -  తమిళనాడు

వృషభం    -   సోమనాథ్     -  గుజరాత్

మిధునం   -   నాగేశ్వరం     -  గుజరాత్

కర్కాటకం -   ఓంకారేశ్వరం -  మధ్యప్రదేశ్

సింహం     -   వైద్యనాథ్      -  jharkhand

కన్య         -   శ్రీశైలం           -  ఆంధ్ర ప్రదేశ్

తుల        -   మహాళేశ్వరం -  మధ్యప్రదేశ్

వృశ్చికం   -   ఘృష్ణేశ్వరం   -  మహారాష్ట్ర

ధనుస్సు   -  విశ్వేశ్వరం     -  కాశి

మకరం     -  భీమశంకరం   - మహారాష్ట్ర

కుంభం     -  కేదారేశ్వరం    - ఉత్తరాఖండ్

మీనం       - త్రయంబకేశ్వరం - మహారాష్ట


రాశికొక #జ్యోతిర్లింగం

#మేషరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం #రామేశ్వరం. మేషరాశి కుజునికి స్వగృహం. చరరాశి వారికి పదకొండవ రాశ్యాధిపతి శని బాధకుడు. గ్రహపీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర, సుత్రామ పర్ణీ జరరాషి యోగే, నిబధ్య సెతుం విశిఖైర సంఖ్యె శ్రీరామ చంద్రేన సమర్పితం త, రామేశ్వరాఖ్యం నియతం నమామి అనె శ్లోకం రోజూ చదువుకొవాలి. శ్రీరామచంద్రుడు శని బాధానివారణార్థం రామేశ్వర లింగాన్ని స్థాపించాడని ప్రతీతి.


#వృషభరాశి వారి పూజాలింగం #సోమనాథ జ్యోతిర్లింగం. ఈ రాశి శుక్రునికి స్వగృహం, చంద్రునికి ఉచ్ఛ రాశి. సోమనాథ జ్యోతిర్లింగం శ్రీకృష్ణుడు స్థాపించిన మహాలింగం. ఈ రాశివారు శనిదోష శాంతికి సోమనాథ దేవాలయ దర్శనం, సౌరాష్ట్ర దేశే విదేశేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం, భక్తి ప్రాదానాయ క్రుపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకధ్యానం చేయడం శుభప్రదం. ఈ రాశివారు జన్మ నక్షత్రంలో సోమనాథంలో రుద్రాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు పొందగలరు.


#మిధునరాశి వారి జ్యోతిర్లింగం #నాగేశ్వర లింగం. ఈ రాశి బుధునికి స్వగృహం. గ్రహదోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, రోజూ యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భోగై, సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పఠించడం, ఈ రాశిలో శని సంచారకాలంలో కైలాసయంత్రప్రస్తార మహాలింగార్చన జరిపిస్తే విశేష ఫలితాలు ఉంటాయి.


#కర్కాటక రాశి వారికి #ఓంకారేశ్వరలింగం పూజనీయ జ్యోతిర్లింగం. ఈ రాశి చంద్రునికి స్వగృహం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, రోజూ కావేరికా నర్మదాయో పవిత్రే, సమాగమే సజ్జన తారణాయ, సడైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే అనే శ్లోకం పఠించడం, జన్మనక్షత్రం ఉన్న రోజు ఓంకార బీజాక్షరం జపించడం శుభకరం.


#సింహరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం శ్రీ #ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘృష్ణేశ్వర జ్యోతిర్లిగం దర్శనం, ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతం చ జగద్వ రేణ్యం, వందే మహాదారాతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని నిత్యం పఠించడం ద్వారా సర్వదోషాల నుండి విముక్తులు కావచ్చు.


#కన్యారాశి వారికి #శ్రీశైల జ్యోతిర్లింగం పూజాలింగం. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరు అన్నిరకాల బాధల నుండి ఉపశమనం పొందడానికి శ్రీశైల మల్లికార్జున దర్శనం, భ్రమరాంబకు కుంకుమ జన్మనక్షత్రం రోజున చండీ హోమం చేసుకోవాలి. శ్రీశైల శృంగే విభుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం, తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.


#తులారాశి వారికి పూజాలింగం #మహాకాళేశ్వర లింగం. ఈ రాశికి శుక్రుడు అధిపతి. మహాకాళేశ్వర దర్శనం, శుక్రవారపు సూర్యోదయ సమయంలో ఆవన్తికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం, అకాల మ్రుత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని గ్రహదోషాల నుండి, బాధల నుండి విముక్తి పొందవచ్చు.


#వృశ్చికరాశి వారికి #వైద్యనాథేశ్వర లింగం పూజాలింగం. ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్రచికిత్సలకి కారణభూతమైన రాశి. వైద్యనాథేశ్వరుని దర్శించడం, పూజించడం, మంగళవారం పూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే, సాదావసంతం గిరిజాసమేతం, నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాదం తమహం నమామి అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.


#విశ్వేశ్వరలింగం #ధనూరాశివారి పూజాలింగం. ఈ రాశి వారికి గురుడు అధిపతి, సానందవనే వసంతం. ఆనందకందం హతపాపబృందం వారణాసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, కాశీ క్షేత్ర దర్శనం, గురువారం రోజున, శనగల దానం ద్వారా శని, గురూ గ్రహదోషాల నుండి విముక్తి పొందవచ్చు.


#భీమశంకర లింగం #మకరం వారి పూజాలింగం. ఈ రాశి అధిపతి శని. ఇది గురునికి నీచ, కుజునికి ఉచ్ఛ, తెలిసో, తెలియకో చేసిన దోషాల నుంచి విముక్తికిగాను భీమశంకర దర్శనం, యం ఢాకినీ శాకినికాసమాజైః నిషేమ్యమాణం పిశితశనైశ్చ, సదైవ భీమాదిపద ప్రసిద్ధం, తం శంకరం భూతహితం నమామి అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, శనివారం నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం ఈవాడం, అవిటివారికి ముసలివారికి వస్త్ర దానం చేయడం మంచిది.


#కుంభరాశి వారికి #కేదారేశ్వర లింగం శేయోలింగం. ఈ రాశికి శని అధిపతి. గ్రహపీడలు, శత్రుబాధలు, ఇతర దోషాల విముక్తికిగాను ఈ రాశివారు కేదారేశ్వర దర్శనం. నిత్యం మహాద్రి పార్శ్వేచ మునీంద్రైః సురాసురై ర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేక మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయాలి.శనివారం రుద్రాభిషేకం చేస్తే మంచిది.


#త్ర్యంబకేశ్వర లింగం #మీనరాశి వారి జ్యోతిర్లింగం. ఈ రాశి అధిపతి గురుడు. త్ర్యంబకేశరుడు ఎప్పుడూ నీటి మద్యలో ఉంటాడు. త్ర్యంబకేశ్వర దర్శనం, స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచుకోవడం, నిత్యం సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే, యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తం త్ర్యంబక మీశ మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయటం సకల శుభాలను కలిగిస్తుంది.




Sri vedajanani welfare trust - 7989112316

Srikantarushi ashramam

Pande haveli

9063833844

9491574080

Kasi yatra bhavan

Laksha guru Bagh road

7499123456

7526055510

Challa lakshman sastry. Sonapura

0542 2275107

Sri kashi gayatri

Ashramam

9918774933

8919123647

Jangam math

7084321008

Maa bhagavati guest house

Viswanath galli

9794113358

7084870123

Venkatesh hotel

Near temple

9451571025

Goudiya mission

Sonapura

945046283

9451526854

Monday, November 28, 2022

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆరు దివ్య క్షేత్రాలు

 

శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రహ్మణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. తండ్రికే జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాలతో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే అనేక ఆలయాలు అధికంగా ఉండడం విశేషం.

ఆంద్రప్రదేశ్ లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగానే తమిళనాడులో సుబ్రమణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి. ఆరుముఖల స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రమణ్యేశ్వరుని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రమణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునే వారు ఈ ఆరు క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది.

క్రింద చెప్పబడిన ప్రతీ క్షేత్రం గురించి సవివరంగా ఇది వరకే పోస్ట్ చేసాము గమనించగలరు. ఇప్పుడు కేవలం ఆ ఆరు క్షేత్రాలనూ భక్తితో తలచుకుంటున్నాము

తిరుచందూర్

సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రమణ్యేశ్వరుని దేవాలయం తిరుచందూర్ లో ఉంది. సరన్ అనే రాక్షస రాజును సంహరించేందుకోసం స్వామివారు ఈ తిరుచందూర్ లో కొలువై నిలిచారట. తిరుచందూర్ లోని సుబ్రహ్మణ్యస్వామివారి విగ్రహం కూర్చుని ఉన్నట్టు ఉండడం ఆశ్చర్యకరం.


స్వామిమలై

స్వామి మలై అని పిలిచే ఈ క్షేత్రంకు అత్యంత విశిష్టత ఉంది. తన తండ్రి అయిన పరమశివునికి సుబ్రమణ్యస్వామి జ్ఞానోపదేశము చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలైని పేర్కొంటారు.


పళని

ఆంద్రప్రదేశ్ లోని తిరుమల క్షేత్రానికి ఎంతటి ప్రసిద్ధి వుందో తమిళనాడులో పళవి క్షేత్రానికి అంతటి ప్రసిద్ధి ఉంది. తిరుమల తరహాలోనే పళవిలోనూ నిత్యం భక్తులు కిటకిటలాడుతుంటారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.


తిరుత్తణి

తిరుపతి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రంలోనూ విశేషమైన దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తన భార్యల్లో ఒకరైన వల్లిని సుబ్రమణ్యస్వామి తిరుత్తణిలోనే పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి.


పరిముదిర్ చోళై

దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన ఈ క్షేత్రం కూడా సుబ్రమణ్యస్వామి దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. పైన పేర్కొన్న క్షేత్రాలే కాకుండా తమిళనాడులోని చాలా ప్రదేశాల్లో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.


తిరువరన్ కున్రమ్

తమిళనాడులో ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారు కొలువైన మధురైకు సమీపంలోనే ఈ తిరుపరన్ కున్రమ్ క్షేత్రం కూడా కొలువై ఉంది. తన ఇద్దరూ భార్యలలో ఒకరైన దేవసేనను సుబ్రమణ్యస్వామి వివాహం చేసుకున్న ప్రదేశమే తిరుపరన్ కున్రమ్.

కాశి ఆలయ చరిత్ర

- కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం. 

- కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.

- క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం

- క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన

- క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం

- క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన  గుజరాతి వర్తకులు

- క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి

- క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్

- క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం

- క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు

- శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి

- క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు

- క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం

- క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం

- క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు

- క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్

- కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం

- ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు

- కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం

- 184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన. 

- 12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.

- కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.

- మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.

- కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.

- విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.

- ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.

- ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.

- 2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి యుగపురుషుడు హిందువులందరికీ ఆరాధ్య మైనవాడు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.


Tuesday, October 18, 2022

శ్రీ గాయత్రీ మాత మహాత్యం

 ఓం ఓం ఓం హరిః ఓం హరిః ఓం హరిః ఓం ఓం ఓం.

శ్రీ రామ రామ రామ, శ్రీ రామ రామ రామ, శ్రీ రామ రామ రామ.

గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపఈ రుద్రుడు ఉంటారని తెలుస్తోంది.

అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింపబడుతుంది. గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. శ్రీ ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగువేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది.

నవరాత్రులలో ఈ రోజు అమ్మవారిని ఉపాసన చేసి, అల్లపు గారె నివేదన చెయ్యాలి. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి. గాయత్రి స్తోత్రాలను పారాయణ చెయ్యాలి.

వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.


ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యమ్

భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.

త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.

బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.

గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.


ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.

భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).

భువః = చిత్ స్వరూపుడు (జ్ఞాన రూపుడు).

స్వః = ఆనంద స్వరూపుడు (దుఃఖరహితుడు).

తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు.

సవితుః = ఈ సృష్టి కర్త.

వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.

భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).

దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.

ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)

యః = ఆ పరమేశ్వరుడు.

నః ద్యః = మా బుద్ధులను.

ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక

గాయత్రీ మంత్రంలో యిరువది నాలుగు అక్షరములతో పాటు యిరువది నాలుగు దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా నుండును.ఈ యిరువది నాలుగు గాయత్రీ మూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అనిపేరు.

ఈ ఇవరై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేసస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.




Wednesday, October 12, 2022

శ్రీ ప్రత్యంగిరా దేవి


శ్రీ ప్రత్యంగిరా దేవి రావణుని వంశ కుల దైవం.

ప్రత్యంగిరా దేవి కాళీ దేవి యొక్క ఉగ్ర రూపం. శరభ మరియు గండభేరుండ అవతారల మధ్య భీకర యుద్ధం 18 రోజుల పాటు కొనసాగింది. వారి యుద్ధం కారణంగా మూడు లోకాలలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. అప్పుడు మాత ఆదిశక్తి, విశ్వ క్షేమమే ధ్యేయంగా, సింహం వంటి ముఖం ఉన్న భీకర అవతారాన్ని ధరించింది. ఇందులో శివుని శరభ అవతారం, విష్ణువు యొక్క రెండు అవతారాలు (నరసింహ మరియు గండభేరుండ) శక్తులు ఉన్నాయి. ఈ రూపం చాలా విస్తృతమైనది, అతని ముందు విశ్వం చాలా సూక్ష్మంగా ఉంది. ప్రత్యంగిర యొక్క ఉగ్ర రూపాన్ని ధరించి, తల్లి ఆదిశక్తి శరభ మరియు గండభేరుండ అవతారం వద్దకు వెళ్లి పెద్దగా చప్పుడు చేసింది. వారిద్దరూ యుద్ధాన్ని ఆపి, వారి అసలు అవతారలకు తిరిగి వచ్చారు. ఆ విధంగా మాత ఆదిశక్తి శివుడు మరియు విష్ణువు మధ్య జరుగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికింది. ఆమె రావణుడి వంశ దేవత కూడా. అక్కడ అమ్మవారిని నికుంబలా అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో మాతా ప్రత్యంగిర గురించి చాలా తక్కువగా తెలుసు. దక్షిణాదిలో ప్రత్యంగిరాను ఎక్కువగా పూజిస్తారు. అక్కడ చాలా దేవత ఆలయాలు ఉన్నాయి. ప్రత్యంగిర అనే పదం రెండు పదాల కలయిక. ఏ రకమైన దాడి / తంత్రం / చేతబడిని తిప్పికొట్టడం అంటే, తల్లి ప్రత్యంగిరాను పూజించడం ద్వారా, ఎలాంటి ప్రతికూల శక్తి ప్రభావం, చేతబడి మొదలైనవి తొలగించబడతాయి.

Monday, October 3, 2022

నవదుర్గలు -- ఆధ్యాత్మిక విశిష్టతలు

1. శైలపుత్రి:-  ఆధ్యాత్మిక సాధన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును అని తెలియజేసేదే  ''శైలపుత్రి''.

2.  బ్రహ్మచారిణి:-  నిరంతరం బ్రహ్మ తత్వంతో (శూన్యంతో),  మూలాత్మతో అనుసంధానం అయి ఉండమని తెలియజేసేదే "బ్రహ్మచారిణి" తత్వం.

3. చంద్రఘంట:-  ఎవరైతే మనస్సు నియంత్రణ కలిగి ఉంటారో వారికి  'త్రినేత్ర దృష్టి' ప్రాప్తిస్తుంది అని తెలియచేసే తత్వమే  "చంద్రఘంట".

4. కూష్మాండ:-  విశ్వంలోని అన్ని చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే మార్గాన్ని అందించే తత్వమే  "కూష్మాండ".

5. స్కంద మాత:-  సాధకులు తమలోని అరిషడ్వర్గాలను జయించాలి అని తెలియచేసే తత్వమే "స్కందమాత".

6. కాత్యాయని:-  తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో త్రిగుణాలకు (సత్వ, రజో, తమో గుణాలకు) అతీతంగా సాధన చేయాలి అని తెలియజేసేదే  "కాత్యాయని".

7. కాళరాత్రి:-  ప్రతి అంతం... ఒక నవ ఆరంభానికి సంకేతం అని తెలియజేసేదే  "కాళరాత్రి".

8. మహాగౌరీ:- మన ఆత్మ సాధన (ధ్యానం) మహా పాపాలను కూడా హరిస్తుంది అని తెలియజేసేదే  "మహాగౌరీ".

9. సిద్దిధాత్రి:-  ఆధ్యాత్మికత సర్వసిద్ధులను కలుగచేయును అని తెలియజేసే తత్వమే  "సిద్ధిధాత్రి".

Thursday, September 22, 2022

కొన్ని గోత్రాలు మరియు వాటి ప్రవరలు

1. భరద్వాజ : ఆంగీరస, భార్హస్పత్స్య, భరద్వాజ త్రయా ఋషేయ ప్రవరాణ్విత భారద్వజాస గోత్రస్య 

2. వాథూలస : భార్గవ, వైతాహవ్య, శావేదస త్రయా ఋషేయ ప్రవరాణ్విత వాథూలస గోత్రస్య

3. శ్రీవస్త లేక శ్రీవత్స : భార్గవ, చ్యవన, ఆప్నవాన, ఆర్వ, జామదఘ్నేయ పంచా ఋషేయ ప్రవరాణ్విత శ్రీవత్సస గోత్రస్య

4. శ్యాలంకాయన : విశ్వామిత్ర, ఆఘమర్షన, దేవరత త్రయా ఋషేయ ప్రవరాణ్విత శ్యాలంకాయనస గొత్రస్య

5. షతమర్షన: ఆంగిరస, ఫౌరుకుత్స, త్రాసతస్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత షతమర్షనస గోత్రస్య

6. ఆత్రేయ: ఆత్రేయ, ఆర్చనాస, శ్యావాస్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆత్రేయ గోత్రస్య

7. కౌషిక: విశ్వామిత్ర, ఆఘమర్షన, కౌసిక త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌషిక గొత్రస్య

8. ఖలబొధన/ఖలభవస (రెండు రకాలు)

    1. ఖలబొధన: విశ్వామిత్ర, ఆగమర్షన, ఖలబొధన త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఖలబొధన గోత్రస్య

    2. ఖలభవస: విశ్వామిత్ర, ఆగమర్షన, ఖలభవస త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఖలభవస గొత్రస్య

9. విశ్వామిత్ర: విశ్వామిత్ర, దేవరత, ఔతల త్రయా ఋషేయ ప్రవరాణ్విత  విశ్వామిత్ర గోత్రస్య 

10. కౌండిన్య: వాసిష్త, మైత్రావరుణ, ఖౌందిన్యస త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌండిన్యస గోత్రస్య

11. హరితస: ఆంగిరస, అంబరిష, యువనశ్వ, త్రయా ఋషేయ ప్రవరాణ్విత హరితస గోత్రస్య

12. గౌతమస : ఆంగిరస, ఆయస్య, ఆఔశిద్యస, కాక్షివత, వమదెవ, గ్రిహదుగ్ద, గౌతమస – సప్తా ఋషేయ ప్రవరాణ్విత గౌతమస గోత్రస్య


13.ఔద్గల్య (మూడు రకాలు)

1. ఆంగిరస, భర్మ్యశ్వ, ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య

2. తర్క్ష్య, భార్మ్యశ్వ, మౌద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య

3. ఆంగిరస, ఢవ్య, ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య


14. శందిల్య (మూడు రకాలు)

1. కాశ్యప, అవత్సార, దైవల త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

2. కాశ్యప, ఆవత్సార, శాందిల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

3. కాశ్యప, దైవల, ఆసిత త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య


15. నైత్రువకాశ్యప: కాశ్యప, ఆవత్సర, నైత్రువ త్రయా ఋషేయ ప్రవరాణ్విత నైత్రువకాశ్యపస గోత్రస్య 

16. కౌత్స: ఆంగిరస, మాంధత్ర, కౌత్స త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌత్సస గోత్రస్య


17. కన్వ (రెండు రకాలు)

1. ఆంగిరస, ఆజమీద, కన్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కన్వస గోత్రస్య

2. ఆంగిరస, కౌర, కన్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కన్వస గోత్రస్య


18. పరాసర: వాశిష్త, శాక్త్య, పరాసర త్రయా ఋషేయ ప్రవరాణ్విత పరాసరస గోత్రస్య

19. అగస్త్య: అగస్త్య, తర్ధచ్యుత, శౌమవహ త్రయా ఋషేయ ప్రవరాణ్విత అగస్త్యస గోత్రస్య


20. ఘర్గి (రెండు రకాలు)

1. ఆంగిరస, బర్హస్పత్య, భారద్వజ, ఉపాధ్యయ త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగిరసస గోత్రస్య

2. ఆంగిరస, శైన్య, గార్గ్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగిరసస గోత్రస్య


21. బాదరాయణ: ఆంగిరస, ఫార్షదశ్వ, ఋతితర త్రయా ఋషేయ ప్రవరాణ్విత బాదరాయణ గోత్రస్య


22. కశ్యప (మూడు రకాలు)

1. కాశ్యప, ఆవత్సార, దైవల త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

2. కాశ్యప, ఆవత్సార, నైదృవ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

3. కాశ్యప, ఆవత్సార, నైదృవ, రేభ, రైభ , శాందిల, శాందిల్య సప్తా ఋషేయ ప్రవరాణ్విత కాశ్య్పస గోత్రస్య


23. సుంక్రితి లేదా  శాంక్రిత్య గోథ్ర (రెండు విధాలు)

1. ఆంగిరస, కౌరవిధ, శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య

2. శధ్య ,కౌరవిధ, శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య


24. ఆంగీరస : ఆంగీరస, ఫురుకుత్స్య, ఠ్రాసదస్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగీరస గోత్రస్య

25. గౌతం/గౌతమస  : అంగీరస, ఆయస్య, గౌతమస త్రయా ఋషేయ ప్రవరాణ్విత గౌతమస గోత్రస్య

26. అగ్నివైవశ్వత: ఆంగీరస, భార్హస్పత్స్య, భారద్వాజ, శ్రుక్వ, ఆగ్నివైవశ్వత పంచాఋషేయ ప్రవరాణ్విత అగిన్వైవశ్వత గోత్రస్య

27. శాంఖ్యాయన: విశ్వామిత్ర, ఆఘమర్షన, దేవవ్రథ శాంఖ్యాయన త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాంఖ్యాయన గోత్రస్య

28. విశ్వామిత్ర: శ్రౌమిత, ఖామకయన, దేవతరస, దేవరత,పంచా ఋషేయ ప్రవరాణ్విత విశ్వామిత్ర 

29. కపి: ఆంగీరస, అమాహైయ, ఔరుక్షయ, త్రయా ఋషేయ ప్రవరాణ్విత కపిస గోత్రస్య.


Thursday, August 18, 2022

హనుమాన్ చాలీసా మహత్యం…!

ఉత్తరభారతదేశంలో క్రీ||శ||16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయభాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన ‘రామచరితమానస్’ సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు.

తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ బాదుషాకు తరచుగా పిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.

ఇదిఇలావుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడు అయిన గృహస్టు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యేష్టి జరగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకోన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరచి ‘దీర్ఘసుమంగళీభవః’ అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్నా శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ ‘తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు!’ అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.

ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభాక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలంతా ఢిల్లీకి

వెళ్ళి బాదుషాకు స్వయముగా వవరించి తగిన చర్య తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.

పాదుషా: తులసీదాస్ జీ! మీరు రామనామం అన్నింటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట!

తులసీదాస్: అవును ప్రభూ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?

పాదుషా: అలాగా! రామానామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు, నిజమేనా?

తులసీదాస్: అవును ప్రభూ! రామనామానికి మించినదేమి లేదు.

పాదుషా: సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.

తులసీదాస్: క్షమించండి ప్రభూ! ప్రతి జీవి జనన మనరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుతుతాయి. మానవమాత్రులు మార్చలేరు.

పాదుషా: తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సుభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి!

తులసీదాస్: క్షమించండి! నేను చెప్పేది నిజం!

పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, ‘తులసీ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!’ అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్ధించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంటే! ఇక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హాటాత్ సంఘటనతో అదరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.

ఆ స్త్రోతంతో ప్రసన్నుడైన హనుమంతుడు ‘తులసీ! నీ స్త్రోత్రంతో మాకు చాల ఆనందమైంది. ఏమీకావాలో కోరుకో!’ అన్నాడు. అందుకు తులసీదాస్ ‘తండ్రీ! నా కేమి కావాలి! నేను చేసిన నీ స్త్రోత్రం లోక క్షేమం కొఱకు ఉపయోగపడితే చాలు, నా జన్మ చరితార్థమవుతుంది. నా ఈ స్త్రోతంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ! అని కోరుకున్నాడు.

ఆమాటలతో మరింతప్రీతిచెందిన హనుమంతుడు ‘తులసీ! ఈస్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమేం వహిస్తాము’ అని వాగ్దానం చేశారు. అప్పట్నుండి ఇప్పటివరకు ‘హనుమాన్ చాలీసా’ కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.

అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక ‘హనుమాన్ చాలీసా’. దాదాపు 500 ఏళ్ల తరువాత కూడా ప్రతి ఇంతా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది.

కేశవ నామాలు-గణిత భూమిక

విష్ణుమూర్తికి 24 పేర్లున్నాయి. వాటిని కేశవ నామాలంటారని మనకు తెలుసు. ఇవి 24మాత్రమే ఎందుకు ఉన్నాయి?వీటికి కాలచక్రానికి, గణితానికి ఏమైనా సంబంధం వున్నదా?

ఈ *24 కు గణిత పరమైన భూమిక ఏమిటి?

విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటాం. అంటే నాలుగు చేతులు గలవాడని కదా. ఈ నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మాలను ధరించి మనకు దర్శనమిస్తాడు.

నిశితంగా పరిశీలిస్తే, ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలలో వచ్చే మార్పుల వల్ల ఖచ్చితంగా 24 వేరువేరు రూపాలు విష్ణువునకు ఏర్పడతాయి. ఈ 24 రూపాలనే కేశవనామాలంటారు.

1. కేశవ నామాలలో మొదటి నామం ‘కేశవ’.

కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో ‘పద్మము, శంఖము’ ధరించి ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో ‘గద, చక్రం’ధరించి ఉంటాడు.

2. విష్ణువు యొక్క మరొక నామము ‘మాధవ’.

ఈ రూపంలో కుడి వైపు రెండు చేతులతో ‘గద, చక్రం’ ధరించి, ఎడమవైపు ఉన్న రెండు చేతులతో ‘పద్మము, శంఖము’ ధరించి ఉంటాడు.

3. ‘మధుసూధన’ రూపంలో… 

కుడివైపు చేతులతో ‘చక్రం, శంఖము’ మరియు ఎడమవైపు చేతులతో ‘గద, పద్మము’ ధరించి ఉంటాడు.

ఈవిధంగా ప్రతి పదిహేను రోజులకు (పక్షానికొకసారి) - ’పౌర్ణమికి, అమావాస్య కు’ తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు శ్రీ మహా విష్ణువు.

ఈ మార్పులు లేదా అమరికలను మనం గణిత శాస్త్ర పరిభాషలో ప్రస్తారాలు(permutations) అంటాం.

అనగా 4 వస్తువులను 4 (4 factorial) విధాలుగా అమర్చవచ్చు.

 4! = 4×3×2×1=24.

శంఖాన్ని 'శ' తోను,

చక్రాన్ని 'చ' తోను,

గదను 'గ' తోను,

పద్మాన్ని ' ప'తోను సూచిస్తే,


ఆ 24 అమరికలు క్రింది విధంగా వుంటాయి.


1) శచగప 2) శచపగ

3) శపచగ 4) శపగచ

5)శగచప 6)శగపచ

7)చపగశ 8)చపశగ

9)చగపశ 10)చగశప

11)చశగప 12)చశపగ

13)గపశచ 14)గపచశ

15)గచశప 16)గచపశ

17)గశపచ 18)గశచప

19)పచగశ 20)పతశగ

21)పశగచ 22)పశచగ

23)పగశచ 24)పగచశ.

[పైవన్నీ ఒక క్రమంలో ఉన్నట్లు పరిశీలించి ఉంటారు.] 

ఈ 24 నామాలు పెద్దలందరికీ తెలిసినా‌...మరోసారి క్రింద ఉదహరిస్తున్నాను.


కేశవ, నారాయణ

మాధవ, గోవింద

విష్ణు, మధుసూధన

త్రివిక్రమ, వామన

శ్రీధర, హృషీకేశ

పద్మనాభ, దామోదర

సంకర్షణ, వాసుదేవ

అనిరుధ్ధ, ప్రద్యుమ్న,

పురుషోత్తమ,vఅధోక్షజ

నారసింహ, అచ్యుత

జనార్ధన, ఉపేంద్ర

హరి, శ్రీకృష్ణ.


ఈ నాలుగు ఆయుధాలను అన్ని విధాలుగాను మార్చుకోవటానికి '24 పక్షాలు' అంటే ‘12 నెలలు’      అనగా ‘ఒక సంవత్సరం’పడుతుంది.

Thursday, July 28, 2022

జయమునిచ్చు మంత్రం

 ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించి స్వామికి ఒక్క కొబ్బరి కాయ పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి ఒక్క సారిగా మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది!!  మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లల కు పానకం వడపప్పు పంచండి చాలు ఉప్పొంగిపోతారు మారుతి! 

ఇది సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్య నూ లక్ష్మణుడు ని సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం ఇది!!


జయత్యతి బలో రామః 

లక్ష్మణస్య మహా బలః !

రాజా జయతి సుగ్రీవో 

రాఘవేణాభి పాలితః !!


దాసోహం కౌసలేంద్రస్య 

రామస్యా క్లిష్ఠ కర్మణః !

హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజః !!


నరావణ సహస్రం మే 

యుధ్ధే ప్రతిబలం భవేత్ !

శిలాభిస్తు ప్రహారతః

పాదపైశ్చ సహస్రశః !!


అర్ధయిత్వాం పురీం లంకాం 

మభివాద్యచ మైథిలీం !

సమృధ్ధార్థ్యో గమిష్యామి 

మిషతాం సర్వ రక్షసాం !!


అర్థం : మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు.

శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుధ్ధ రంగమున రంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశన మొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను.

ఇది పఠించిన వారికి జయం తధ్యం

జయ శ్రీ రామ ..శుభమ్ భూయాత్


Sunday, July 24, 2022

ఏ నక్షత్రానికి ఏ గణపతి స్వరూప ఆరాధన చేయాలి

 1. అశ్విని  -- ద్వి ముఖ గణపతి ‌

2. భరణి -- సిద్ద గణపతి.

3. కృత్తిక - ఉఛ్ఛిష్ఠ  గణపతి .

4. రోహిణి - విఘ్న గణపతి ‌

5. మృగశిర - క్షిప్ర గణపతి.

6. ఆరుద్ర - హేరంబ గణపతి .

7. పునర్వసు - లక్ష్మి గణపతి. 

8. పుష్యమి - మహ గణపతి. 

9. ఆశ్లేష - విజయ గణపతి. 

10. మఖ - నృత్య గణపతి. 

11. పుబ్బ - ఊర్ధ్వ గణపతి. 

12 ఉత్తర - ఏకాక్షర గణపతి. 

13. హస్త - వరద గణపతి .

14. చిత్త -  త్య్రక్షర గణపతి. 

15. స్వాతి - క్షిప్రసాద గణపతి. 

16. విశాఖ - హరిద్ర గణపతి. 

17.అనూరాధ - ఏకదంత గణపతి. 

18. జ్యేష్ఠ - సృష్టి గణపతి .

19 మూల ఉద్దాన గణపతి. 

20.పూర్వషాఢ- ఋణ విమోచన గణపతి. 

21.  ఉత్తరాషాఢ - ధుండి గణపతి. 

22. శ్రవణం - ద్వి ముఖ గణపతి. 

23. ధనిష్ట - త్రిముఖ గణపతి. 

24. శతభిషం - సింహ గణపతి. 

25. పూర్వాభాద్ర - యోగ గణపతి. 

26. ఉత్తరాభాద్ర - దుర్గా గణపతి. 

27. రేవతి - సంకట హర గణపతి.           

పై గణపతి ఆరాధన వలన మన పూర్వ జన్మ కర్మల నుండి బయట పడి భగవంతుని అనుగ్రహం పోందుతాము. అలాగే మన ఆత్మ ద్వాదశ జ్యోతిర్లింగాలు కు ముడి పడి వుంది. పై గణపతులు మరియి,నక్షత్రాలు యెక్క అనుబంధం అర్దం చేసుకుంటేనే ద్వాదశ భావాల అర్థం

Friday, July 15, 2022

తెలుగు భాష

 Telugu rani andaru chadivinchukovali.ఒక తమిళ వ్యక్తి రాసిన వ్యాసాన్ని యధాతధంగా.....

నా మాతృ భాష తమిళ భాష. దాని అర్థం ఇతర భాషల ను గురించి తెలియదని కాదు. తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.

తెలుగు మాతృ భాష గా ఎవరికి వున్నదో, తెలుగు భాష ను ఎవరు ప్రేమిస్తున్నారొ, తెలుగు గురించి ఎవరు తెలుసుకుందాము అనుకుంటున్నారో వారి కోసం కొన్ని విషయాలు.

1. తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి  వుంది.

2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది. మొదటి లిపిగ కొరియన్ భాష.

3. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు వుత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలన భాష ల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.

4. శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.

5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.

6.  ఇటాలియన్ భాష లాగానే   తెలుగు భాష లో కూడా  పదాలు హల్లు శబ్దం తో అంతమౌతాయని 16 వ శతాబ్దంలో ఇటలీ కి  చెందిన  నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే  తెలుగు భాషను " ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్". అని అంటారు .

7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు. ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానం ను పొందింది.

8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. హిందూ పురాణాల ప్రకారం  త్రిలింగక్షేత్రాలు నైజం ప్రాంతం లోని కాళేశ్వరం, రాయలసీమ లోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరమ్ ల మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.

9. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాష లో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దం తో పూర్తి అవుతుంది.

10. తెలుగు భాష లో వున్న అన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోన లేవు.

11. తెలుగు భాష ను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.

12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.

13. 200 సం. ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతే.

14. రామాయణ మహభారతాలు లో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాష సాహిత్యం లో కూడా లేదు.

కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన వోకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.

15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగలో వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి తెలుగు ను  తన సామ్రాజ్యం లో అధికార భాష గా చేసాడు.

16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. 

తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకత ను అందిస్తుంది ఆనడం లో ఏమాత్రం సందేహం లేదు.

పై విషయాలు అన్నీ వొక తమిళ వ్యక్తి  ఆంగ్లం లో  తెలియజేసిన విషయాల ను అనువదించారు. కానీ ఇది నిజం. ఇంత గొప్ప మన భాషను మన భవి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరం పై వుంది. తెలుగు భాష ను చంపేసే తరం గా మనం వుండకూడదని నా భావన. 

ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యం, ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో గానీ మనం మాత్రం ఆంగ్ల భాష లో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆపదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇకనుంచి అయినా తెలుగు భాష పై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగు లో మాట్లాడుదాం. 

 ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాష ను బలిచేయనవసరం లేదు. 

తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం. 

అష్టభైరవులు - రూపాలు - మహిమలు

మనుషులుగా ఈ భూమ్మీద జన్మించి కష్టాలు, దుఃఖాలు అనుభవిస్తున్న జీవులు తమ దుఖాలను నివృత్తి చేసుకోవడం కోసం భైరవుడిని సేవించాలి. 

సతీదేవి శరీరత్యాగం చేసిన కారణంతో శివుడు దుఖాన్ని తట్టుకోలేక భైరవ రూపాన్ని ఆశ్రయించాడు.  కనుక భైరవుడిని సేవిస్తే శివున్ని సేవించినట్లే. 

"నేను భైరవ రూపంలో లోకానికి సుఖం చేకూర్చూతాను." అని సదాశివుడి వాక్యం. 

అసితాంగో రురుశ్చండహ్ క్రోధశ్చోన్మత్త భైరవ కపాలీ భీషణశ్చైవ సంహారశ్చాష్టభైరవాహ్!

*కాలభైరువుడికి ఎనిమిది రూపాలు ఉన్నాయి . 1.అసితాంగ భైరవుడు 

2.రురు భైరవుడు.

3. చండ భైరవుడు.

4.క్రోధ భైరవుడు.

5.ఉన్మత్త భైరవుడు.

6.కపాల భైరవుడు.

7. భీషణ భైరవుడు.

8.సంహార భైరవుడు.

ఈ ప్రతి ఒక్క రూపానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.

 

*1. అసితాంగ భైరవుడు : 

 ఈయన నల్లని/బంగారు శరీరఛాయలో, శాంతి రూపంలో , దిగంబర శరీరంతో , మూడూ కళ్ళతో, బ్రహ్మీ శక్తితో కూడి నాలుగు చేతులతో ఉంటాడు. అక్షమాల, ఖడ్గం, కమండలం, పానపాత్ర నాలుగు చేతులలో ధరిస్తాడు. ఈయన హంసవాహనుడు. వరాలనిస్తాడు భూషణాధికారి.

సరస్వతి ఉపాసకులు అసితాంగ భైరవుని అర్చించి సిద్ధి పొందాలి. 

ఆ తరువాతే సరస్వతీ ఉపాసన సిద్ధిస్తుంది. 

ఈయన బ్రహ్మ స్వరూపుడు. మహా సరస్వతికి క్షేత్రపాలకుడు . ఈయన తూర్పు దిశకు అధిపతి. 


*2. రురు భైరవుడు :  

ఈయన స్వచ్చమైన స్పటికంలాగ తెల్లని శరీర ఛాయతో, మూడు కళ్లతో, నాలుగు చేతులతో, దిగంబర శరీరంతో, చిరునవ్వుతో  మహేశ్వరి శక్తి తో కూడిన కుమారరూపంతో వృషభ వాహనుడిగా ఉంటాడు.

నాలుగు చేతుల్లో కత్తి, టంకము, పాత్రను, లేడిని ధరించి ఉంటాడు. శ్యామల, ప్రత్యంగిర,  దశమహావిద్యలు మొదలగు ఉపాసకులు ముందు ఈయనని ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతోనే అమ్మవారి ఉపాసనలు సిద్ధిస్తాయి. ఈయన రుద్ర స్వరూపుడు.  రుద్రాణికి క్షేత్రపాలకుడు  ఈయన ఆగ్నేయ దిశకు అధిపతి.

 

*3 . చండ భైరవుడు : 

 ఈయన తెల్లని శరీర ఛాయతో, మూడు కళ్ళతో, నాలుగు చేతులతో, దిగంబరంగా, కౌమారి శక్తితో, శాంత కుమార రూపంలో నెమలి వాహనంతో ఉంటాడు. సుబ్రమణ్య ఉపాసకులు, కన్యకాపరమేశ్వరి ఉపాసకులు ముందుగా ఈయన ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతోనే ఈ ఉపాసనలు సిద్దిస్తాయి. ఈయన సుబ్రమణ్య స్వరూపుడు. సర్పదోషాలు ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు ఈయన్ని ఉపాసించాలి. ఈయన దక్షిణ దిశకు అధిపతి. 

 

*4. క్రోధ భైరవుడు:  

 ఈయన నీలి శరీర ఛాయతో, మూడు కళ్ళతో, నాలుగు చేతులతో, దిగంబర శరీరంతో,  వైష్ణవి శక్తితో కూడిన శాంత రూపంతో గరుడ వాహనారూడుడై ఉంటాడు. నాలుగు చేతుల్లో గద, చక్రం, పానపాత్ర, శంఖం ధరించి ఉంటాడు. వైష్ణవ ఉపాసకులు అంటే గరుడ, హనుమ, సుదర్శన, నారసింహ, వరాహ, కృష్ణ ఉపాసకులు ముందుగా ఈయన ఉపాసన చేయాలి. ఈయన విష్ణు స్వరూపుడు. నైరుతి దిశకు అధిపతి. 

 

*5. ఉన్మత్త భైరవుడు: 

 ఉన్మత్త భైరవస్వామి బంగారం లాగ పచ్చని శరీర ఛాయతో, మూడు కండ్లతో, నాలుగు చేతులతో, దిగంబరుడిగా, వారాహి శక్తితో కూడిన శాంత రూపంలో, అశ్వరూడుడై ఉంటాడు. నాలుగు చేతుల్లో రోకలి, కత్తి, కపాలము, వేటకత్తి ధరించి ఉంటాడు. వారాహి, కుబేర ఉపాసకులు ఈయన్ని ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతోనే ఈ ఉపాసనలు సిద్ధిస్తాయి. ఈయన వారాహి స్వరూపుడు . పశ్చిమ దిక్కుకి అధిపతి . 


*6 . కపాల భైరవుడు :  ఈయన ఎర్రని దేహకాంతితో , మూడు కళ్ళతో , నాలుగు చేతులు , దిగంబర శరీరంతో , ఇంద్రాణీ శక్తితో కూడిన శాంతమైన బలరూపంతో గజవాహనుడై ఉంటాడు . నాలుగు చేతుల్లో వజ్రం , ఖడ్గం , పానపాత్ర , పాశం ధరించి ఉంటాడు . భౌతిక సుఖ సంపదలు కావాల్సిన వారు ఈయన ఉపాసన చేయాలి . ఈ ఉపాసనతో ఈ లోకంలోనూ , స్వర్గలోకంలోను సుఖాలు సిద్ధిస్తాయి . ఈయన దేవరాజు ఇంద్ర స్వరూపుడు . స్వర్గ క్షేత్రపాలకుడు . ఈయన వాయువ్య దిశకు అధిపతి. 


*7. భీషణ భైరవుడు:  ఈయన ఎర్రని శరీర ఛాయతో , మూడు కళ్ళతో , నాలుగు చేతులతో , దిగంబర శరీరంతో , చాముండా శక్తితో , శాంత బాలరూపంతో , సింహ వాహనారూడుడై ఉంటాడు . నాలుగు చేతుల్లో శూలం , ఖడ్గం , కపాలము , ముద్గరం ధరించి ఉంటాడు . చండి , చాముండా ఉపాసకులు ఈయన్ని ఉపాసన చేయాలి . ఈయన అనుగ్రహంతో చండీ సప్తసతి సిద్ధిస్తుంది . ఈయన చాముండాకు క్షేత్ర పాలకుడు . ఈయన ఉత్తర దిశకు అధిపతి . 


*8 . సంహార భైరవుడు :  సంహార భైరవుడు మూడు కళ్లు , పది చేతులు కలవాడై , నాగ యజ్ఞోపవీతం ధరించి , దిగంబరంగా , బాల రూపంతో , కోరలు గల భయంకర వదనంతో , కుక్క వాహనంగా గలవాడై ఉంటాడు . చేతుల్లో శూలం , చక్రం , గద , ఖడ్గం , అంకుశం , పాత్ర , శంఖం , డమరుకం , వేటకత్తి , పాశం ధరించి ఉంటాడు . తాంత్రికులు కాపాలికులు, యామలులు, ముందుగా ఈయన్ని ఉపాసించాలి . ఈయన దయవల్లే తాంత్రిక షట్కర్మలు సిద్ధిసిద్ధించి ఫలవంతమౌతాయి. ఈయన సర్వశక్తి స్వరూపుడు . తంత్ర క్షేత్రపాలకుడు . ఈయన ఈశాన్య దిశకు అధిపతి. 


"దిగంబరాయ విద్మహే కాశీక్షేత్రపాలాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్"🙏


 లోకా సమస్తా సుఖినోభవంతు.

Wednesday, July 13, 2022

మృత సమయము నందు ఆశౌచ సమయ నిర్ణయ చక్రము



వ్యాసపూర్ణిమ , గురుపౌర్ణమి - విశిష్టత

మనందరిలోనూ పవిత్రమయిన హృదయం ఉంది.    కాని చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతోనూ , దుర్గుణాలతోను నిండిపోవడం వల్ల

దానిని గుర్తించలేక పోతున్నాము. మన అజ్ఞానం ఎంతంటే? దీపం వెలిగించ మన్నప్పుడు నీటికీ , నూనెకు తేడా తెలియనట్టు వంటి చీకటి స్థితిలో ఉన్నాము. మరి ఈ చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలించు కోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం.


గురువు అంటే :-

గురువు అంటే బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపమే గురువు. గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని , రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని  గురువు అంటే అజ్ఞానాన్ని నశింప చేయువారు అని అర్ధము. గు శబ్దమంధకారస్యరుతన్నిరోధకః అని పెద్దల వచనం!  గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకు రావడం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడూ సంసారయాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం.

ఆ గురువు సాన్నిధ్యంలో కామ క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలు అనే దుర్గుణాలను , అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది. అప్పుడు ఆ పవిత్ర మైన హృదయంలో జ్ఞానమనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది. 

విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఒకప్పుడు గురుకులాలుండేవి. వాటిలో చేరిని విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ , పితృదేవోభవ , ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే. 

"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" 

దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు , జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి , గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు. 

"గురువునూ , గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే , గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్త కబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.

గురు పూర్ణిమ విశిష్టత 

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ !

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ !!

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే !

నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః !!

ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మ తిథి అయిన గురు పూర్ణిమ గా మనం జరుపుకుంటాం. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి , ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.

గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.

సనాతన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.

లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిఅయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది. మామూలు రోజులలో కన్నా ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువు నుండి వెలువడే ఆశీర్వచనాలు వేయి రెట్లు ఎక్కువగా పొంద వచ్చట.. అందుకే ఈ రోజు గురుపూజోత్సవం లో పాల్గొని గురువు కరుణా కటాక్షములను పొందవచ్చు.. 

గురు అనే పదంలో ’గు’ అనే అక్షరం అంధకారాన్ని ’రు’ అనే అక్షరం వెలుగును సూచిస్తాయి.. 

ఙ్ఞానశక్తి సమారూఢః తత్త్వమాలావిభూషితః |

భుక్తిముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురవే నమః ||

శిష్యునిలో అజ్ఞానాంధకారాలను తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు.. కాబట్టి... గురువుకే ప్రథమ స్థానమునిచ్చారు.. మాతా , పిత , గురువులలో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించినది ఇందుకే...

అలానే ఈ రోజు తప్పకుండా ఈ శ్లోకం స్మరించుకోవాలి..

నమోస్తుతే వ్యాస విశాల బుద్దే పుల్లార విందాయత పత్రనేత్ర |

వినత్వయా భారత తైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమాయః ప్రదీపః ||

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |

తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః ||

(’గురువును మించిన తత్వం తపస్సు జ్ఞానం వేరొకటి లేవు’)

గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా , చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని , బ్రహ్మదేవుడిని , వసిష్ఠులవారిని , శక్తిమునిని , పరాశరుడిని , వ్యాసులవారిని , శుకమహామునిని , గౌడపాదులవారిని , గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. 


వ్యాస పూర్ణిమ గురుపూర్ణిమ

నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతీ ద్వాపరయుగం లోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో , త్రేతాయుగంలో 3 పాదాలతో , ద్వాపరయుగంలో2 పాదాలతో , ఈ కలియుగంలో 1 వ పాదంతో , నడుస్తుంది.

వసిష్ఠమహామునికి మునిమనుమడు , శక్తి మహామునికి మనుమడు , పరాశరమునికి పుత్రుడు , శుకమర్షికి జనకుడైనట్టియు , నిర్మలుడైనట్టి , తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు 

నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు. 

వ్యాసమహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. ప్రతి ద్వాపర యుగములోను ఒక సారి వ్యాసుడు ఉద్భవిస్తాడు. ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్వత మన్వంతరంలో ని 28 వ యుగంలోని వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు కాలంలో.

ఇంతవరకు వ్యాసపీఠాన్నధిరోహించిన వ్యాసులు పేర్లు

1. స్వాయంభువ 

2. ప్రజాపతి

3. ఉశన 

4. బృహశ్పతి 

5. సవిత 

6. మృత్యువు 

7. ఇంద్ర 

8. వశిష్ఠ 

9. సారస్వత 

10. త్రిధామ 

11. త్రివృష 

12. భరద్వాజ 

13. అంతరిక్షక 

14. ధర్ముడు 

15. త్రయారుణ 

16. ధనుంజయుడు 

17. కృతంజయుడు 

18. సంజయ 

19. భరద్వాజ 

20 గౌతమ 

21. ఉత్తముడు 

22. వాజశ్రవ 

23. సోమశుష్మాయణ 

24. ఋక్షుడు 

25 శక్తి 

26. పరాశరుడు 

27. జాతూకర్ణి 

ప్రస్తుతం 28 వ వేదవ్యాసుని పేరు కృష్ణద్వైపాయనుడు....


ఆయన జన్మించిన తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ గా జరుపుకుంటాం. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది.

28 వ వేద వ్యాసుల వారి జయంతి. ఇతడు పరాశర మహర్షికి , మత్స్య గంధికి (సత్యవతి) కి కృష్ణ వర్ణం (నల్లని రంగు) తో ఒక ద్వీపంలో జన్మించారు కనుక కృష్ణద్వైపాయనుడు అని పిలవబడ్డాడు. పుట్టీ పుట్టగానే చేతిలో కమండలం , దండము చేతబట్టి  తపస్సు చేసుకోవటానికి వెళ్తానని తల్లి మత్ష్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్ళిన తపోధనుడు కృష్ణద్వైపాయనుడు.

వ్యాస మహర్షి నాలుగు వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం సోమకాసురుడు వేదాలను సముద్రంలో దాచేస్తే..  శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు. అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగం అయిపోగా.. వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడు. వేదరాశి ని నిత్య కర్మలలో క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి ఋక్-యజుర్-సామ-అధర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడైనాడు. ఆతర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా ... వేదసారాన్నంతా చేర్చి పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంధస్తం చేసాడు.  అంతేకాక భాగవతాన్ని , అష్టాదశ పురాణాలను మనకు ప్రసాదించాడు. సాక్షాతు శ్రీ మహా విష్ణువు అవతారంగా భావించే వ్యాస భగవానుని గానూ ఆదిగురువుగానూ భావిస్తారు.

విష్ణు సహస్రనామ పీఠిక లో కూడా.....

"వ్యాసాయ విష్ణు రూపాయ - వ్యాస రూపాయ విష్ణవే

నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమోనమ: !!

అని వ్యాసునికి విష్ణువుకు  అభేదం చెప్ప బడింది , వేదవ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలని విభజించి  పైలుడను శిష్యునకు ఋక్సంహితను , వైశంపాయనునకు యజుస్సంహితను , జైమినికి సామసంహితను , సుమంతునకు అధర్వణ సంహితను భోధించి వానిని లోకములో  వ్యాప్తి చేయండని ఆదేశించాడు.  వ్యాసుడు వేదాలని విభజించటమే కాకుండా అష్టా దశ పురాణాల్ని , ఉపపురాణాలను రచించాడు. బ్రహ్మసూత్రాల్ని వివరించాడు , భారత , భాగవతాలని రచించాడు. తాను గ్రంథస్థం చేసిన పురాణేతిహాసములను సూతునకు తెలియజేసి ప్రచారం చేయమని చెప్పాడు. 

వ్యాస భగవానుని అనుగ్రహం వలన జ్ఞానం విస్తరించి విశ్వవ్యాప్తం అయ్యింది. సూత మహాముని ప్రథాన ప్రచారకుడై విషయములు బహుళ ప్రచారం చేసాడు. 

స్మృతి కర్తలలో వ్యాసులవారు ఒకరు.  రెండధ్యాయముల ఈ గ్రంథానికి లఘు వ్యాస స్మృతి అని పేరు. ఇందులో మానవులకు ఉపయోగ పడే ఆచార విషయములు ఉన్నాయి. ఇదే వ్యాస సంహిత గా విఖ్యాతి పొందింది.

వ్యాస మహర్షి సుపుత్రుని కోసం తపస్సు చేసి శివుని నుంచి వరాన్ని పొందాడు. ఆయనకు ఘృతాచి  అనే అప్సరస వలన బ్రహ్మ జ్ఞాని ఐన శుకుడు జన్మించాడు. 

వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే , పౌత్రమకల్మషమ్ |

పరాశరాత్మజమ్ వందే శుక తాతం తపోనిధిమ్ ||

తాత్పర్యం:- వశిష్టుని మునిమనుమడైన కల్మష రహితుడైన శక్తికి మనుమడైన పరాశరుని కుమారుడైన , శుకమహర్షి తండ్రి అయిన ఓ వ్యాస మహర్షి నీకు వందనము. 

వ్యాసో నారాయణో హరిః " అన్నారు. వ్యాస భగవానులు సప్త చిరంజీవులలో ఒకరు.

మహాభారత రచనకు తనమనసులో ఒక ప్రణాళికను తయారుచేసుకొన్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే..... అంత వేగంగా వ్రాసే వారు ఎవరు ఉన్నారూ అని విచారంలో ఉండగా..... బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి , అతని ఎదుట ప్రత్యక్షమయ్యి "వ్యాసా ! నీ కావ్యరచనకి, తగినవాడైన గణపతిని స్మరించు." అని తెలిపి అద్రుశ్యమయ్యాడు. అంతట వ్యాసుడు గణేశుని ప్రార్థించగా.... గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. నేను మనసులోనే రచించిన భారతాన్ని నేను చెబుతూ ఉంటే నీవు  వ్రాయాలి అని కోరాడు వ్యాసుడు. సరే అని ఒక షరతు పెట్టాడు గణేశుడు.  నేను వ్రాసే ఘంటం ఆగకుండా నీవు చెప్పాలి. నా ఘంటం ఆగిన యెడల నేను వ్రాయను అని అన్నాడు. దానికి వ్యాసుడు అంగీకరించి నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకొని నీవు వ్రాయాలి అని అన్నాడు.... ఈ నియమానికి అంగీకరించాడు గణపతి. ఇలా వేద ధర్మాలను ప్రతిపాదిస్తూ వేదవ్యాసుడు చెబుతూ ఉంటే , నాలుగు వేదాల సారమైన పంచమవేదం అని మనం చెప్పుకొనే మహాభారతం అవతరించింది.

ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్టుని , అంబాలికకు పాండు రాజుని , అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు. పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే ! దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలుపొందాడు. కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా మూడు సంశ్ర…మించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేసాడు వ్యాసుడు. ఆ జయమే మహా భారతమైంది. 

కలియుగంలో మానవులు అల్పబుద్ధులు , అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా.... అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు. అర్థం చేసుకోలేరు.

వేదమంటే అసలు ఎవరూ తయారుచేసింది కాదు. స్వయం భగవానుని ముఖతః వేలువడినదే వేదము. అందుకే అతనిని "వేదపురుషుడు" అని అంటారు. వేదములో విషయాలు ఉన్నాయి. వేదములో లేనివి--- మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏక రూపంలో ఉంటాయి. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని, భగవానుడే ప్రతీ ద్వాపరయుగంలోనీ వ్యాసుడుగా అవతరించి , వేదాలను విభజిస్తాడు మందబుద్దుల కోసం వేదాధ్యాయానికి , అవకాశం లేనివారికోసం వేదంలోని విశేషాలను , ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు.  

ప్రాచీన గాథలు , గత కల్పాలలో జరిగిన చరిత్రలు , సృష్టికి పూర్వం అనేక సృష్టులలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమయినాయి. ఎవరు వాటిని అర్ధం చేసుకోవాలన్నా , ఇతరులకి చెప్పాలన్నా అంతరార్ధాలతో బోధించాలన్న వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు , చదవలేదు. అందుకే వ్యాసపూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం ! వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు.


పూజా విధానం (వ్యాస పూజ , గురు పూజా విధానం)

కొత్త అంగవస్త్రం మీద (భూమి మీద పరచి) బియ్యం పోస్తారు. ఆ బియ్యంపైన నిమ్మ కాయలు ఉంచు తారు. శంకరులు , అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపు తారుట. బియ్యం , కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం , నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభ కోణంలో , శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు.

ఎంతో మంది ఋషులున్నా వ్యాసుని పేరిటే ఎందుకు జరుగుతుంది అంటే , ఈ పూజలో ప్రత్యేక పూజలు పొందే ఆది శంకరులు వ్యాసుని అవతారమని అంటారు. సన్యాసులంతా ఆది శంకరుని తమ గురువుగా ఎంచుకుంటారు. అయితే ఈ రోజున సన్యాసులంతా వ్యాసుని రూపంలో వున్న తమ గురువుని కొలుస్తున్నారన్న మాట! వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణులోకం పొందుతారుట. వ్యాసుడు సకల కళా నిధి , సకల శాస్త్రవేత్త , శస్త్ర చికిత్సవేది , మేధానిధి , వైద్యవరుడు , ఆత్మవిద్యానిధి , వైద్య విద్యానిధి. ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి.

వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి:

శో: శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం

సూత్ర భాష్యవృతా వందే భగవంతౌ పునః పునః

అని పఠిస్తే బ్రహ్మత్వసిద్ధి కలుగును!


గురు సందేశము :-

వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది.

సర్వభూతముల యందు దయకలిగియుండుట , సత్యమార్గములో నడుచుట , శాంతగుణాన్ని కలిగియుండుట  ఈ మూడు గుణాలని అందరూ అలవరచుకోవాలి అని వ్యాసులవారు తెలియచేసారు.

మనందరికీ దేవరుణము , ఋషిరుణము , పితృఋణము   అని మూడు ఋణాలు ఉంటాయి. వీటితోపాటు వేదవ్యాసుడు మనుష్య ఋణము కూడా ఉంటుందని తెలియచెప్పాడు. సర్వప్రాణుల యందు దయతో ఉండటం , ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య ఋణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు.

ఇంతటి ఆది గురువుని పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తరవాత తరాలకి అందించుట మన ధర్మం.

మన పిల్లలకు ఇతిహాస , పురాణాల పట్ల , ప్రాచీన సంస్కృతీసాంప్రదాయాల పట్ల , అభిరుచి కలిగించుట మన కర్తవ్యం. వీటిలో కొన్నయినా సాధించగలిగితే వ్యాసులవారి ఋణం కొంతయినా మనం తీర్చుకున్నట్లు అవుతుంది. ఆ వ్యాసభగవానుని కృపకు మనము పాత్రులము కాగలము అని ఆశిద్దాం. అందుకే గురుపూజను చేసుకుందాం. సాటి గురువులో భగవంతుని దర్శిద్దాం.


వ్యాస భగవానుడు చారిత్రిక పురుషుడే !!

(వేదవ్యాసుడి చారిత్రికతను నిరూపించే  పరిశోధనాత్మక వ్యాసం - రచన: వినుకొండ మురళీమోహన్, శ్రీసుశీల )

వ్యాసమహర్షి చారిత్రిక పురుషుడు, చిరంజీవి అని చరిత్రలు నిరూపిస్తున్నాయి.

మన పురాణములలో 

మార్కండేయుడు, 

అశ్వత్థామ, 

బలి చక్రవర్తి, 

వేదవ్యాసుడు, 

హనుమంతుడు, 

విభీషణుడు, 

కృపాచార్యుడు, మరియు

పరశురాముడు 

వీరు ఎనిమిది మందిని చిరంజీవులుగా చెప్తారు. 


వేదవ్యాసుడు చారిత్రిక పురుషుడు, చిరంజీవి అని చెప్పడానికి ఆదిశంకరాచార్యుని చరిత్రలో పేర్కొన్న ఒక సంఘటనను ఇక్కడ ఉదహరిస్తున్నాము. 

ఆదిశంకరాచార్యుడు  పదహారేళ్ళవయసులో కాశీక్షేత్రములో ఉన్నప్పుడు, ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆదిశంకరాచార్యుని వద్దకు వచ్చి, వేదవ్యాసుడు రచించిన బ్రహ్మసూత్రముల గురించి శంకరాచార్యుడు రచించిన భాష్యముపై వాదన మొదలుపెట్టాడు. శంకరాచార్యుడు ఆ వృద్ధబ్రాహ్మణుడు వాదించుచున్న తీరును, అతని మేధస్సును చూసి ఆశ్చర్యపోయాడు. వారము రోజులపాటు వారి వాదనలు కొనసాగాయి. శంకరునికి వాదిస్తున్నవారు బ్రహ్మసూత్రకర్త వేదవ్యాసుడే అని అర్థమై, అతని ముందు మోకరిల్లాడు. వ్యాసుడు శంకరునితో “నీ భాష్యమును నేను పూర్తిగా అంగీకరించుచున్నాను, నీవు మరొక పదహారు సంవత్సరములు జీవించి అద్వైత సిద్ధాంతమును వ్యాప్తి చెయ్యి” అని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు. 

ఆదిశంకరుడు 2500 బి.సి.ఇలో జీవించినట్లు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి మహాస్వామి శాస్త్రీయ పరిశోధనలు చేయించి నిర్థారించారు. 

(ఆధారము: శృంగేరి శారదాపీఠంవారు ప్రచురించిన ‘శంకర దిగ్విజయము’ రెండవభాగము)

వేదవ్యాసుడే మధ్వాచార్యుని గురువు  

12వ శతాబ్దమునకు చెందిన మధ్వాచార్యుడు (1231ఏ.డి) సాక్షాత్తు వేదవ్యాసుని వద్దే సకలశాస్త్రములను అభ్యసించాడని మధ్వాచార్యుని చరిత్ర చెప్తోంది.

(ఆధారము: శ్రీమాన్ మధ్వాచార్య చరిత్ర, 8వ అధ్యాయము)

పై చారిత్రిక ఆధారాలను బట్టి వేదవ్యాసుడు చారిత్రిక పురుషుడు, చిరంజీవి అని నిర్ధారణ అవుతోంది. బదరికావనములో ఆయన నేటికీ సూక్ష్మరూపములో ఉన్నారని పెద్దలు చెపుతారు. 


ఆంధ్రరాష్ట్రములతో వ్యాసుని అనుబంధము - చారిత్రిక సత్యము!!!

వ్యాసుడు సుమారు ఏడువేల సంవత్సరముల క్రితం గోదావరీ తీరాన ఉన్న ‘దక్ష ఆరామము’ అంటే నేటి ‘ద్రాక్షారామము’ క్షేత్రములో ఉన్న శ్రీభీమేశ్వరుని సేవించి, గోదావరినది తీరాన ఉన్న భీమమండలమంతా సంచరించి ‘భీమఖండము’ అను పురాణమును మనకు అందించారు. వ్యాసుడు రచించిన ‘స్కాందపురాణము’లోని ‘గోదావరిఖండము’ (భీమేశ్వర పురాణము) లో ఈ వివరములన్నీ ఉన్నాయి. 

దక్షారామము శివుని భార్య సతీదేవి యొక్క పుట్టినిల్లు. దక్షుడు యజ్ఞమును చేసిన ప్రదేశమది. తనతండ్రి దక్షుడు, తనభర్తను అవమానించినందుకు, సతీదేవి తనశరీరమును చిదగ్నియందు దహింప చేసుకున్న ప్రదేశము దక్షారామము. కాశీ విశ్వేశ్వరుని శాపమునకు గురైన వ్యాసుని, పార్వతీ దేవి కనికరించి  అనుగ్రహిస్తుంది. దాక్షారామములోని దక్షవాటికలోనున్న భీమేశ్వరుని శరణువేడి, అక్కడ అతనిని సేవించమని చెప్తుంది. 

ఆ విధముగా వ్యాసుడు కాశీ నుండి బయలుదేరి, పూరీ జగన్నాథ క్షేత్రము, శ్రీకూర్మములోని కూర్మనాథుని క్షేత్రము, సింహాచలములోని వరాహలక్ష్మీనరసింహ క్షేత్రము, పిఠాపురములోని కుక్కుటేశ్వరుని,  పురుహూతికను (శక్తిపీఠము), కాకినాడ ప్రాంతములోనున్న సామర్లకోట, సర్పవరము, సంపర మొదలైన క్షేత్రములను దర్శించి దక్షవాటికకు వచ్చి అగస్త్యుని కలసి, భీమేశ్వరుని, మాణిక్యాంబను (శక్తిపీఠము) సేవిస్తూ, కొన్ని సంవత్సరములు అక్కడ నివసించాడు. భీమఖండ రచనతోపాటు శ్రీ భీమేశ్వరస్త్రోత్రము మొదలైన స్త్రోత్రములను రచించాడు. 

వ్యాసుడు భీమ ఖండములో ప్రస్తావించిన ఆలయములు, ప్రాంతములు నేటికీ గుర్తుపట్టగలిగే స్థితిలోనే ఉన్నవి కనుక, ఇది చారిత్రిక సత్యము.


వేదవ్యాసుడు స్థాపించిన సరస్వతీ క్షేత్రము, ‘వ్యాసపురి’ (బాసర)

వేదవ్యాసుడు వేదములను విభజించి, బ్రహ్మసూత్రములను రచించి, మహాభారత భాగవతాది గ్రంథములను రచించిన తరువాత, స్త్రీ పురుషులను సన్మార్గములో పెట్టుటకు ధర్మ శాస్త్రము, రాజనీతి, అర్థశాస్త్రము ఇలా ఎన్నో గ్రంథములను రచించిననూ, మనశ్శాంతి  లభించకపోవుటచే, శిష్యులతో కలసి తీర్ధయాత్రలు చేయుచూ, దండకారణ్యములో గౌతమీనదీతీరమునకు వచ్చి, స్నాన  సంధ్యాదులను పూర్తిచేసుకుని ధ్యాన నిమగ్నులైన సందర్భములో అతడి యోగదృష్టికి, ఆ ప్రదేశములో శ్రీశారదాదేవి అవ్యక్తరూపములో ఉన్నట్టు గోచరించినది. ఆ దేవిని పూజించి, భక్తకోటి కొఱకు, నిరాకార తత్త్వమును విడచి, సాకారరూపమును ధరించమని ప్రార్థించగా, ఆవిడ అనుగ్రహించారు. ఆ దేవియే శ్రీమహాసరస్వతి, శ్రీమహాలక్ష్మి, శ్రీమహాకాళి అను తన మూడురూపములతో వ్యక్తమయ్యారు. 

వ్యాసుడు శ్రీసరస్వతీదేవిని అధిదేవతగాను, శ్రీమహాలక్ష్మి, శ్రీమహాకాళి దేవతలను ప్రత్యధిదేవతలుగాను స్థాపించారు. వ్యాసుడు స్థాపించిన క్షేత్రము కనుక, ఈ పవిత్ర క్షేత్రమునకు ‘వ్యాసపురి’ అన్న పేరు వచ్చినది. కాలక్రమములో ఈక్షేత్రము ‘బాసర’గా ప్రసిద్ధి చెందినది. 

భారతదేశములో శ్రీసరస్వతీ క్షేత్రములు రెండే ఉన్నాయి. ఒకటి కాశ్మీర్లోను, మరొకటి ఆదిలాబాద్ మండలం బాసరలోను (వ్యాసపురి). 

(ఆధారము: బాసరక్షేత్ర స్థలపురాణము)

భారత జీవనమునకు, సంస్కృతికి, ఆధ్యాత్మిక భావములకు సమన్వయ పూర్వకముగా చక్కని రూపకల్పన చేసి, అపారమైన వాఙ్మయమును  అందించి, అజరామరమైన ప్రతిష్టను అందుకున్నవాడు వేదవ్యాసుడు. 

మానవజాతికి తత్త్వ-హిత-పురుషార్థములను వ్యవస్థితముగా అందించుచున్న వ్యాస సాహితి యను సనాతన జ్యోతి సూర్యచంద్రులు, నక్షత్రములు ఉన్నంత కాలము వెలుగుతూనే ఉంటుంది.

To be remembered - Gurus from the past-present !



 

Guru Purnima - Who is a Teacher ?

TEACHER is a generic word we have imported from the British. In this short thread, let me explain u the word TEACHER

U will realize how rich Sanatan Dharma & its mother language Sanskrit is & why we have a rotten education system

Sanskrit words for "teacher" is based on their unique abilities & these are 6 phases or called it an evolution of a Teacher

1. The teacher who gives you Information is called ADHYAPAK

2. The one who imparts knowledge along with Information is called  UPADHYAYA

3. The one who Imparts skill is called ACHARYA 

4. The one who is able to give deep insight into a subject is called PANDIT

5. The one who has a visionary view on a subject and teaches you to think in that manner is called  DHRISHTA

6. The one who is able to awaken the wisdom in you, leading you from darkness to light is called GURU

These are 6 Unique abilities of a TEACHER, the word we use in general term

If u read Gita, the life journey is from Karm Yog to Gyan Yog

Which means that teaching journey of a Teacher is from ADHYAPAK to GURU and a student Journey is to learn under ADHYAPAK to GURU

This is wholistic Sanatan Education which we lost in race to Degree

Friday, July 8, 2022

జోగులాంబా దేవాలయం



 లంబస్తనీం వికృతాక్షీం

ఘోరరూపాం మహాబలాం

ప్రేతాసన సమారూడాం

జోగులాంబాం నమామ్యహమ్'


పెద్ద పాలిండ్లు కలిగి, వికృతమైన కన్నులతో, ఘోరమైన రూపంతో, మహాబలశాలియై, శవంమీద కూర్చొని ఉన్న జోగులాంబను ధ్యానిస్తున్నాను)

ఆలంపురం జోగులాంబ ధ్యానశ్లోకం ఇది.


జోగులాంబా దేవాలయం

 ఈ ఆలయం ఏడో శతాబ్దం నాటిది. అంటే తంత్రయుగానికి చెందినది. ఇక్కడ అమ్మవారి అసలు విగ్రహం భయంకరంగా ఉంటుంది. జోగులాంబ అంటే యోగుల అమ్మ అని అర్ధం. అంటే జగన్మాత అన్నమాట. ఇది జమదగ్ని మహర్షి, రేణుకాదేవులు నివసించిన ప్రదేశం అని ఒక స్థలపురాణం చెబుతున్నది. శివుని కోసం బ్రహ్మ తపస్సు చేసిన ప్రదేశం అని ఇంకో పురాణం అంటుంది. ఈ కధలు నిజమైనా కాకపోయినా, దాదాపు పన్నెండు వందల ఏళ్ళ క్రితమే ఇది ప్రసిద్ధి చెందిన తాంత్రికక్షేత్రం అన్నది వాస్తవం. 


బెంగాల్ ప్రాంతంలో ఎనిమిదో శతాబ్దంలో పుట్టిన తంత్రం అక్కణ్ణించి హిందూమతంలోనూ, బౌద్ధంలోనూ ప్రవేశించింది. శైవ, శాక్త, వైష్ణవ సాంప్రదాయాలలో అది వేళ్ళూనుకున్నప్పటికీ, శైవం లోనూ, శాక్తమ్ లోనూ బాగా నిలదొక్కుకున్నది. వజ్రయానంగా టిబెటన్ బౌద్ధంలో ప్రవేశించింది. మహాయానాన్ని ప్రభావితం చేసింది. కాలక్రమేణా అసలు తంత్రం కనుమరుగై, పనులు కావడం కోసం పూజలు చేసే క్షుద్రతంత్రం అక్కడక్కడా మిగిలి పోయింది.  ఆ ఆలయాలన్నీ తమతమ రూపురేఖలు మార్చుకుని, వైదిక సాంప్రదాయం ప్రకారం మార్చబడి, ప్రాంతీయంగా ఉన్న అమ్మతల్లుల పూజలతో కలసిపోయి, నేడు ఈ రూపంలో మనకు కనిపిస్తున్నాయి. ముస్లిం దండయాత్రలలో ఈ ఆలయం పూర్తిగా నేలమట్టం చెయ్యబడింది. ఆ తర్వాత కొన్ని వందల ఏళ్లకు దీనిని మళ్ళీ కట్టారు. ఇప్పుడు ఆలయం ఉన్న స్థలం అసలైన స్థలం కాదు.


జోగులాంబ అమ్మవారి జుట్టులో బల్లి, గుడ్లగూబ, తేలు ఉంటాయి. ధ్యానశ్లోకం ప్రకారం ఆమె మూర్తి చాలా భయంకరం. కాళీమాతకు ఒక రూపం ఈమె. శ్మశానకాళిక అని ఈమెను అనుకోవచ్చు. పిచ్చిలోకులు ఈమెను గృహదోషాలు పోగొట్టే దేవతగా ఆరాధిస్తున్నారు. కానీ, మార్మిక సంకేతాలతో కూడిన ఈమె రూపం అత్యంత ఉన్నతమైన పరిపూర్ణ యోగసిద్ధిని కలిగించే దేవతారూపం అన్న సంగతి తాంత్రికయోగులు మాత్రమే గ్రహించగలరు. లోకులకు భయాన్ని కలిగించే తల్లి రూపం, వారికి అత్యంత ప్రేమను పుట్టిస్తుంది.


'లంబస్తని' అనేది జీవులకు పాలిచ్చి పోషించాలనే అత్యంత ప్రేమకు, మెత్తని హృదయానికి సంకేతపదం. 'వికృతాక్షి' అంటే, ఇంద్రియలోలత పైన అమితమైన కోపానికి, జాగృతమైన మూడవకంటికి సూచన. విరూపాక్ష అనే పదమూ, వికృతాక్షి అనే పదమూ సమానార్థకాలే. వికసించిన ఆజ్ఞాచక్రానికి ఇవి సూచికలు. 'ఘోరరూపా' అంటే, ప్రపంచపు డొల్ల కట్టుబాట్లను లెక్కచెయ్యని విశృంఖలత్వమూ, ఆత్మచైతన్యమూ అని అర్ధాలు. 'మహాబలా' అనేది అమితమైన వీర్యశక్తికి, ప్రాణశక్తికి సూచిక. 'ప్రేతాసన సమారూడా' అనేపదం సమాధిస్థితిలో జాగృతమై, జడత్వాన్ని అధిరోహించిన దివ్యచైతన్యశక్తికి మార్మిక సూచన. ఈ మార్మికకోణాలలో దర్శిస్తే ఆమె భయంకరరూపం అత్యంత సౌమ్యంగా, ప్రేమమయంగా కనిపిస్తుంది.  


దేహమే ఆత్మకు గృహం. గృహదోషాలంటే మనం ఉండే ఇంటిదోషాలు కావు. జన్మజన్మాన్తరాలలో దేహాన్ని పట్టుకుని ఉన్న సంస్కార దోషాలు. వాటిని పోగొట్టడం అంటే, సంస్కార నాశనం చేసి కర్మపరంపర అనబడే పొలిమేరను దాటించడం. ఎల్లలను దాటిస్తుంది గనుక ఎల్లమ్మ అయింది. కుండలినీ శక్తికి ఈమె ప్రతిరూపం. పొలిమేరలు దాటించే దేవతను, పొలిమేరల లోపల ఉండే సుఖాల కోసం పూజిస్తున్నారు పిచ్చి లోకులు !


ఛిన్నమస్త, రేణుక, భైరవి, ఎల్లమ్మ - ఇవన్నీ ఈమె పేర్లు. తెలంగాణా ప్రాంతానికి ఈమె అధిష్టానదేవతగా అనేక వేల ఏళ్ళనుంచి కొలువై ఉంది. శ్రీవత్సగోత్రం వారికి ఈమె కులదేవత అవుతుంది. వారిలో ఆమె రక్తమే ప్రవహిస్తున్నది. సరియైన సిద్ధుల వద్ద గ్రహించి ఈమె ఉపాసన గావిస్తే, మహత్తరమైన యోగసిద్ధిని అచిరకాలంలో కలిగించి, మానవజీవితపు పొలిమేరలు దాటిస్తుంది.


అమ్మా నీ కరుణా కటాక్షముల కోసం  ఎదురు చూస్తున్నా తల్లీ 

........(సంగ్రహణ frm telugu yogi)

Monday, July 4, 2022

భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్

విధానం


ఈ శ్లోకమ్ రాత్రి 10 నుండి 2 గ మధ్యలో చేస్తే ఈ తల్లి తీర్చని సమస్య అంటూ ఉండదు..ముఖ్యంగా తగాదాలు, అనుకోకుండా వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, శత్రు భయం, అనారోగ్య సమస్యలు ఇలా ఏదైనా ఈమె అనుగ్రహము తో పరిష్కరించబదుతుంది. అయితే ఈ తల్లి అనుగ్రహము కోసం ఈమెను రాత్రి పూట ఎక్కువగా ఆరాధించాలి. ఎవరు పఠించినా వారికి తీవ్రంగా ఉన్న కష్టాన్ని తొలగిస్తుంది..అకాల మృత్యువాత పడకుండా రక్షిస్తుంది.

ఇక్కడ ఇచ్చిన ఈ దత్త మంత్రం ముందుగా మూడు సార్లు జపం చేసి దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేసి తర్వాత వారాహి మాత స్త్రోత్రం 3 సార్లు కానీ 16 సార్లు కానీ పారాయనఁ జపం చేయాలి..

దత్తాత్రేయ సర్వ బాధ నివారణ మంత్రం

"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ||

సర్వ భాధా ప్రశమనం  కురు శాంతిం ప్రయచ్ఛమే||"


భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్

అథ ధ్యానమ్ ।


వన్దే వారాహవక్త్రాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషాం

హారాగ్రైవేయతుఙ్గస్తనభరనమితాం పీతకౌశేయవస్త్రామ్ ।

దేవీం దక్షోర్ధ్వహస్తే ముసలమథపరం లాఙ్గలం వా కపాలం

వామాభ్యాం ధారయన్తీం కువలయకలికాం శ్యామలాం సుప్రసన్నామ్ ॥


నమోఽస్తు దేవి వారాహి జయైఙ్కారస్వరూపిణి ।

జయ వారాహి విశ్వేశి ముఖ్యవారాహి తే నమః ॥ ౧॥


వారాహముఖి వన్దే త్వాం అన్ధే అన్ధిని తే నమః ।

సర్వదుర్ష్టప్రదుష్టానాం వాక్స్తమ్భనకరే నమః ॥ ౨॥


నమః స్తమ్భిని స్తమ్భే త్వాం జృమ్భే జృమ్భిణి తే నమః ।

రున్ధే రున్ధిని వన్దే త్వాం నమో దేవేశి మోహిని ॥ ౩॥


స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః ।

బాహ్వోః స్తమ్భకరీం వన్దే జిహ్వాస్తమ్భనకారిణీమ్ ॥ ౪॥


స్తమ్భనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనమ్ ।

శీఘ్రం వశ్యం చ కురు మే యాఽగ్నౌ వాగాత్మికా స్థితా ॥ ౫॥


ఠచతుష్టయరూపే త్వాం శరణం సర్వదా భజే ।

హుమాత్మికే ఫడ్రూపేణ జయ ఆద్యాననే శివే ॥ ౬॥


దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరి ।

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః ॥ ౭


ఇతి భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్


లోకా సమస్తా సుఖినో భవంతు


ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి

శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి

ఐం గ్లౌం నమో వరాహవదనాయై నమః 

ఐం గ్లౌం నమో వారాహ్యై నమః ।

ఐం గ్లౌం వరరూపిణ్యై నమః ।

ఐం గ్లౌం క్రోడాననాయై నమః ।

ఐం గ్లౌం కోలముఖ్యై నమః ।

ఐం గ్లౌం జగదమ్బాయై నమః ।

ఐం గ్లౌం తరుణ్యై నమః ।

ఐం గ్లౌం విశ్వేశ్వర్యై నమః ।

ఐం గ్లౌం శఙ్ఖిన్యై నమః ।

ఐం గ్లౌం చక్రిణ్యై నమః ॥ 10 ॥


ఐం గ్లౌం ఖడ్గశూలగదాహస్తాయై నమః ।

ఐం గ్లౌం ముసలధారిణ్యై నమః ।

ఐం గ్లౌం హలసకాది సమాయుక్తాయై నమః ।

ఐం గ్లౌం భక్తానామభయప్రదాయై నమః 

ఐం గ్లౌం ఇష్టార్థదాయిన్యై నమః ।

ఐం గ్లౌం ఘోరాయై నమః ।

ఐం గ్లౌం మహాఘోరాయై నమః ।

ఐం గ్లౌం మహామాయాయై నమః ।

ఐం గ్లౌం వార్తాల్యై నమః ।

ఐం గ్లౌం జగదీశ్వర్యై నమః ॥ 20 ॥


ఐం గ్లౌం అణ్డే అణ్డిన్యై నమః ।

ఐం గ్లౌం రుణ్డే రుణ్డిన్యై నమః ।

ఐం గ్లౌం జమ్భే జమ్భిన్యై నమః ।

ఐం గ్లౌం మోహే మోహిన్యై నమః ।

ఐం గ్లౌం స్తమ్భే స్తమ్భిన్యై నమః ।

ఐం గ్లౌం దేవేశ్యై నమః ।

ఐం గ్లౌం శత్రునాశిన్యై నమః ।

ఐం గ్లౌం అష్టభుజాయై నమః ।

ఐం గ్లౌం చతుర్హస్తాయై నమః ।

ఐం గ్లౌం ఉన్నతభైరవాఙ్గస్థాయై నమః ॥ 30 ॥


ఐం గ్లౌం కపిలాలోచనాయై నమః ।

ఐం గ్లౌం పఞ్చమ్యై నమః ।

ఐం గ్లౌం లోకేశ్యై నమః ।

ఐం గ్లౌం నీలమణిప్రభాయై నమః ।

ఐం గ్లౌం అఞ్జనాద్రిప్రతీకాశాయై నమః ।

ఐం గ్లౌం సింహారుద్రాయై నమః ।

ఐం గ్లౌం త్రిలోచనాయై నమః ।

ఐం గ్లౌం శ్యామలాయై నమః ।

ఐం గ్లౌం పరమాయై నమః ।

ఐం గ్లౌం ఈశాన్యై నమః ॥ 40 ॥


ఐం గ్లౌం నీల్యై నమః ।

ఐం గ్లౌం ఇన్దీవరసన్నిభాయై నమః ।

ఐం గ్లౌం కణస్థానసమోపేతాయై నమః ।

ఐం గ్లౌం కపిలాయై నమః ।

ఐం గ్లౌం కలాత్మికాయై నమః ।

ఐం గ్లౌం అమ్బికాయై నమః ।

ఐం గ్లౌం జగద్ధారిణ్యై నమః ।

ఐం గ్లౌం భక్తోపద్రవనాశిన్యై నమః ।

ఐం గ్లౌం సగుణాయై నమః ।

ఐం గ్లౌం నిష్కలాయై నమః ॥ 50 ॥


ఐం గ్లౌం విద్యాయై నమః ।

ఐం గ్లౌం నిత్యాయై నమః ।

ఐం గ్లౌం విశ్వవశఙ్కర్యై నమః ।

ఐం గ్లౌం మహారూపాయై నమః ।

ఐం గ్లౌం మహేశ్వర్యై నమః ।

ఐం గ్లౌం మహేన్ద్రితాయై నమః ।

ఐం గ్లౌం విశ్వవ్యాపిన్యై నమః ।

ఐం గ్లౌం దేవ్యై నమః ।

ఐం గ్లౌం పశూనామభయకారిణ్యై నమః 

ఐం గ్లౌం కాలికాయై నమః ॥ 60 ॥


ఐం గ్లౌం భయదాయై నమః ।

ఐం గ్లౌం బలిమాంసమహాప్రియాయై నమః ।

ఐం గ్లౌం జయభైరవ్యై నమః ।

ఐం గ్లౌం కృష్ణాఙ్గాయై నమః ।

ఐం గ్లౌం పరమేశ్వరవల్లభాయై నమః ।

ఐం గ్లౌం నుదాయై నమః ।

ఐం గ్లౌం స్తుత్యై నమః ।

ఐం గ్లౌం సురేశాన్యై నమః ।

ఐం గ్లౌం బ్రహ్మాదివరదాయై నమః ।

ఐం గ్లౌం స్వరూపిణ్యై నమః ॥ 70 ॥


ఐం గ్లౌం సురానామభయప్రదాయై నమః 

ఐం గ్లౌం వరాహదేహసమ్భూతాయై నమః ।

ఐం గ్లౌం శ్రోణివారాలసే నమః ।

ఐం గ్లౌం క్రోధిన్యై నమః ।

ఐం గ్లౌం నీలాస్యాయై నమః ।

ఐం గ్లౌం శుభదాయై నమః ।

ఐం గ్లౌం శుభవారిణ్యై నమః ।

ఐం గ్లౌం శత్రూణాం వాక్స్తమ్భనకారిణ్యై నమః ।

ఐం గ్లౌం కటిస్తమ్భనకారిణ్యై నమః ।

ఐం గ్లౌం మతిస్తమ్భనకారిణ్యై నమః ॥ 80 ॥


ఐం గ్లౌం సాక్షీస్తమ్భనకారిణ్యై నమః ।

ఐం గ్లౌం మూకస్తమ్భిన్యై నమః ।

ఐం గ్లౌం జిహ్వాస్తమ్భిన్యై నమః ।

ఐం గ్లౌం దుష్టానాం నిగ్రహకారిణ్యై నమః 

ఐం గ్లౌం శిష్టానుగ్రహకారిణ్యై నమః ।

ఐం గ్లౌం సర్వశత్రుక్షయకరాయై నమః ।

ఐం గ్లౌం శత్రుసాదనకారిణ్యై నమః ।

ఐం గ్లౌం శత్రువిద్వేషణకారిణ్యై నమః ।

ఐం గ్లౌం భైరవీప్రియాయై నమః ।

ఐం గ్లౌం మన్త్రాత్మికాయై నమః ॥ 90 ॥


ఐం గ్లౌం యన్త్రరూపాయై నమః ।

ఐం గ్లౌం తన్త్రరూపిణ్యై నమః ।

ఐం గ్లౌం పీఠాత్మికాయై నమః ।

ఐం గ్లౌం దేవదేవ్యై నమః ।

ఐం గ్లౌం శ్రేయస్కారిణ్యై నమః ।

ఐం గ్లౌం చిన్తితార్థప్రదాయిన్యై నమః ।

ఐం గ్లౌం భక్తాలక్ష్మీవినాశిన్యై నమః ।

ఐం గ్లౌం సమ్పత్ప్రదాయై నమః ।

ఐం గ్లౌం సౌఖ్యకారిణ్యై నమః ।

ఐం గ్లౌం బాహువారాహ్యై నమః ॥ 100॥


ఐం గ్లౌం స్వప్నవారాహ్యై నమః ।

ఐం గ్లౌం భగవత్యై నమో నమః ।

ఐం గ్లౌం ఈశ్వర్యై నమః ।

ఐం గ్లౌం సర్వారాధ్యాయై నమః ।

ఐం గ్లౌం సర్వమయాయై నమః ।

ఐం గ్లౌం సర్వలోకాత్మికాయై నమః ।

ఐం గ్లౌం మహిషనాశినాయై నమః ।

ఐం గ్లౌం బృహద్వారాహ్యై నమః॥108 ॥


ఇతి శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం..

శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం

అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః |

అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా |

శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం |

సర్వ సంకట హరణ జపే వినియోగః ||


పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |

తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా || 1 ||


వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా |

అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే || 2 ||


నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః |

సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః || 3 ||


ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం ||

Monday, April 11, 2022

అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి కొన్ని వివరాలు

1. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారు అక్కడికి చేరుకోవడంతో నే గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది ' 

రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం ఈ ప్రదర్శన పూర్తి అవుతుంది అని భావించకండి .

మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టిన కచ్చితంగా అక్కడ ఒక వినాయకుని గుడి అయినా ఉంటుంది .

అక్కడ స్వామికి నమస్కరించి మొదలుపెట్టవచ్చు '


2. గిరిప్రదక్షిణ అనేది కచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి " కుడివైపున కరుణగిరి కి దగ్గరలో ఉండే కుడి మార్గం లో  సూక్ష్మరూపంలో యోగులు ' సిద్ధులు ' దేవతలు ప్రదక్షిణలు చేస్తారట . అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు .


3. ఆరుణాచలం వెళ్లే ప్రతి వారు కచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి .

ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్ లు ఖచ్చితంగా ఇస్తారు .


4 . దర్శనానికి గిరిప్రదక్షిణ కి వెళ్లేటప్పుడు రెండు చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి . ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు .


5. ఎముకలు అరిగి పోయిన వారు యమ లింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం అని చెబుతారు .


6. నైఋతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు కచ్చితంగా  అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది '

ఏ మంత్రము లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు .


7. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు గాని ' మధ్యలో గాని ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు " భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు . ఖాళీ కడుపుతో చేసే గిరిప్రదక్షణ వేగవంతంగా ఉంటుంది .


8. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరిప్రదక్షణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది .

నా స్వానుభవం .


9. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది '

మాక్సిమం కూర్చోకుండా నిలబడి గానీ ' తప్పనిసరి పరిస్థితుల్లో  బెంచీపై పడుకోండి " కూర్చోవడం అన్న చాలా ఇబ్బందులు ఉంటాయి .


10 . కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకొని  దర్శనానికి వెళ్లే వారు ' అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి . అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామాలు చదివి విభూతి ప్రసాదంగా ఇస్తారు .

లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు.


11. ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత 

ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది .

కచ్చితంగా దర్శనం చేసుకోండి .


12. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్దపెద్ద పిల్లర్లతో అతి పెద్ద మండపం ఉంటుంది '

ఆ మండపంపై కి వెళ్లి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది .

రమణ మహర్షి వారు  అక్కడే తపస్సు చేసారు .


13.రాజ గోపురానికి కుడివైపున అనుకొని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది . అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు బృందావనం .


14 ' ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్లి రావాలని శాస్త్రం ' అది ఇది మహా భక్తురాలైన అమ్మాణి అమ్మన్‌ అని ఆవిడ కట్టించిన గోపురం .


15. రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం ఉంటుంది .తప్పకుండా దర్శనం చేసుకోండి .


16 ' అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది దాని క్రింద రాతితో చెక్కిన అతి పెద్ద త్రిశూలం ఉంటుంది .

అద్భుతః


17. అమ్మవారి ఆలయంలో కూడా పది రూపాయల దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు .


18 ' అగ్ని లింగానికి ' రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది . చాలా పెద్ద విగ్రహం ' అత్యంత శక్తివంతమైన విగ్రహం '

అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు .

ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి . రూపాయలకు శెనగల దండ అమ్ముతారు . మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే శెనగల దండలను స్వామివారికి సమర్పించండి . అది స్వామి వారి మీద వేస్తారు .


19. శివసన్నిధి రోడ్ లో కొంచెం ముందుకు వెళ్లి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది ' 

చాలా చాలా బాగుంటుంది . ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది .

రమణ మహర్షి వారి ఆశ్రమంలో కి వలె ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి .

ఇక్కడ

ఉదయం టిఫిన్ ' మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు .

విదేశీయులు కూడా సామాన్యులతో పాటు లైన్ లో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు .

ఒకసారి అక్కడి ప్రసాదం స్వీకరించండి 


20 . ఈ రామ్ సూరత్ బాబా ఆశ్రమం లోనే అవధూత శ్రీ తోప్పి అమ్మాల్ వారు వుంటారు.

దర్శనం చేసుకొని తరించండి 🙏


ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏

(సేకరణ)

Thursday, March 31, 2022

తెలుగు సంవత్సరాలు 60 - పేర్లు ఎలా వచ్చాయ

 శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భముగా


తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు కానీ వాటికి ఆ

పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం కొందరికే తెలుసు.


 అయితే వాటి

వెనుక ఓ కథ ఉంది. నారదమహాముని ఓసారి విష్ణు మాయలో చిక్కుకుని పెళ్లి చేసుకొని   60 మంది

ఆడపిల్లలకు తండ్రి అవుతాడు.  తరువాత కటిక దరిద్రము చేత 

ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ

బిడ్డలు  60 మంది ఇక మీదట 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా

ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.


తెలుగు సంవత్సరాలు, ఆయనములు, ఋతువులు, మాసములు, తిధులు నిర్ణయించబడ్డాయి.


మన తెలుగు సంవత్సరాల పేర్లు :

1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5.

ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ,

10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14.

విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18.

తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి,

23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ,

28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి,

32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36.

శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40.

పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ,

45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49.

రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి,

54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి,

58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.


సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అది

ఆయనమవుతుంది...


.ఆయనములు 2:

అవి...ఉత్తరాయణము :

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటకరాశిలో

ప్రవేశించువరకు గల కాలము 6నెలలు. అవి చైత్రం, వైశాఖం,

జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంతబాగము, పుష్యం, మాఘ,

ఫాల్గుణ మాసములలో ఉండును.


దక్షిణాయణం :

కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకరరాశిలో

ప్రవేశించు వరకు గల కాలము 6నెలలు. అవి ఆషాడ, శ్రావణ,

భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత

భాగము.


సంవత్సరాన్ని ఆరు భాగాలుగా విభజిస్తే అది ఋతువు

అవుతుంది.  ఋతువులు ఆరు...

వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిరఋతువు.


సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే అది మాసం

అవుతుంది...అందుకే

మాసములు 12 :

చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం శ్రావణ, భాద్రపదం,

ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం,

ఫాల్గుణం


 (2మాసములు ఒక ఋతువు)


పక్షములు 2 :

ప్రతి మాసమును కూడా రెండు పక్షాలుగా విభజించారు.. 


అవి

శుక్ల పక్షం

పౌర్ణమి పదిహేను రోజులకు గుర్తు...

పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం


కృష్ణపక్షం(కృష్ణ అంటే నలుపు అని అర్థం)ఇది పాడ్యమి నుండి

అమావాస్య పదిహేను రోజులకు గుర్తు.


ఒక్కో పక్షపు పదిహేను రోజులకు పదిహేను తిథులు

ఉంటాయి.. 


అవి

పాడ్యమి, విదియ తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి,

అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి,

పౌర్ణమి, అమావాస్య.


ఇక ఒక పక్షానికి రెండు వారములు.. ఒక వారమునకు ఏడు

రోజులు...


ఒక రోజుకు ఎనిమిది ఝాములు... ఒక ఝాముకు మూడు

గంటలు.. ఒక గంటకు అరవై నిమిషములు.. ఇలా ప్రతి

నిమిషమునకు వచ్చే నక్షత్రం తో సహా మన పంచాంగం చాలా

నిర్దిష్టంగా నిఖ్ఖచ్చితంగా ఉంటుంది.. 


ఎంత ఖచ్చితత్వమంటే

భారత యుద్ధం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని

కూడానమోదు చేయగలిగినంత...


 అందుకే మన హిందూ

సాంప్రదాయాలు గొప్పవయ్యాయి..


ఇప్పుడు మనం పాటించే అర్థం పర్థం లేని జనవరి ఒకటి

క్రొత్త సంవత్సరం కాదు. 


మనకు అసలైన నూతన

సంవత్సరం.. ఉగాదే..


 ఇప్పటినుండే వాతావరణంలో మార్పు

మొదలవుతుంది...


కొత్త పంచాగం మొదలవుతుంది..


అంటే సృష్టి

మొదలవుతుంది..


 అందుకే ఇది యుగ ఆది అయింది.. అదే

ఉగాది అయింది..


 ఇంకా వివరంగా చెప్పాలంటే శిశిర ఋతువులో రాలి

పోయిన ఆకుల స్థానంలో క్రొత్త చిగుళ్ళు ప్రారంభమయి.. 


అంటే క్రొత్త సృష్టి ప్రారంభమవుతుంది... అందుకే ఇది ప్రతి ఒక్కరిలో

నూతనత్వానికి నాంది పలకే నిత్య నూతన ఆశలతో క్రొత్త

సంవత్సరం ప్రారంభమవ్వాలని.. అందరికీ నూతనసంవత్సర

శుభాకాంక్షలు.!!


వారములు 7 : ఇలా కూడా పిలుస్తారు.

ఆదివారం - భానువాసరే

సోమవారం - ఇందువాసరే

మంగళవారం - భౌమ్యవాసరే

బుధవారం - సౌమ్యవాసరే

గురువారం - గురువాసరే

శుక్రవారం - భృగువాసరే

శనివారం - స్థిరవాసరే / మందవాసర


మన సాంప్రదాయం చాలా గోప్పవి

మనం వజ్రాన్ని వదలి పాశ్చాత్య రంగురాళ్ళకై ప్రాకులాడుతున్నాము.


ఇప్పటికైనా  మనము మన సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలను కాపాడుకుందాం.

మీ

వాసు

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం

జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం |

సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ||


జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే |

భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧ ||


జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ |

దిగంబరదయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తుతే || ౨ ||


కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ |

వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౩ ||


హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత |

పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౪ ||


యజ్ఞభోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ |

యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౫ ||


ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే దేవః సదాశివః |

మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౬ ||


భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |

జితేంద్రియజితజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౭ ||


దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ |

సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౮ ||


జంబుద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే |

జయమానసతాం దేవ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౯ ||


భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే |

నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౦ ||


బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |

ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౧ ||


అవధూతసదానందపరబ్రహ్మస్వరూపిణే |

విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౨ ||


సత్యరూపసదాచారసత్యధర్మపరాయణ |

సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౩ ||


శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర |

యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౪ ||


క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ |

దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౫ ||


దత్త విద్యాఢ్యలక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే |

గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౬ ||


శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ |

సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౭ ||


ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ |

దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ || ౧౮ ||

Wednesday, March 23, 2022

Are Shivlinga Radioactive?

Yes it is 100 % true!!


Pick up India's Radio Activity Map, you will be surprised! Apart from the nuclear reactor of the government of India, the highest radiation is found in the places of all Jyotirlingas.


▪️ Shivling is nothing but nuclear reactors, that's why they are offered water so that they may remain calm.


▪️ All the favorite substances of Mahadev such as Bilv Patra, Aakamad, Dhatura, Gudhal etc. are all nuclear energy soaking.


▪️ Because the water on Shivlinga also becomes reactive, that is why the drainage tube is not crossed.


▪️ The design of Bhabha Atomic Reactor is also like Shivling. [1]


▪️ Water offered on Shivling takes the form of medicine together with the flowing water of the river.


▪️ That's why our ancestors used to say to us that if Mahadev Shivshankar gets angry, then the holocaust will come.


▪️ Notice how deep science is hidden behind our traditions.


▪️ The culture of which we have been born, is eternal. Science has been dressed as the core of traditions so that it becomes a trend and we Indians should always live a scientific life.


▪️ You will be surprised to know that there are such important Shiva temples in India which are built in the same straight line from Kedarnath to Rameshwaram. Wonder what kind of science and technology our ancestors had that we didn't even understand till today? Kedarnath of Uttarakhand, Kaleshwaram of Telangana, Kalhasti of Andhra Pradesh, Ekambareshwar of Tamil Nadu, Chidambaram and finally Rameshwaram temples are built in a geographical straight line of 79°E 41'54 ′′ Longitude.


▪️ All these temples represent gender expression in the 5 elements of nature, which we call Panchabhut in common language. Panchbhut means earth, water, fire, air and space. Based on these five elements, these five Shivlingas have been installed.


Water is represented in Thiruvanaikwal temple,

The fire is represented in Thiruvannamalai,

The wind is represented in Kalahasti,

Earth is represented in Kanchipuram and at the end

Space or sky is represented in Chidambaram temple!


These five temples depict the amazing gathering of Vastu-Science-Vedas.


▪️ Geographically also featured in these temples. These five temples were built according to Yoga Science, and are placed in a certain geographical alignment with each other. There must be some science behind this that will affect the human body.


▪️ These temples were built about five thousand years ago when there was no satellite technology available to measure the latitude and longitude of those places. Then how so accurately five temples were installed? Only God knows the answer.


▪️ The distance between Kedarnath and Rameshwaram is 2383 km. But all these temples are almost in the same parallel line. After all, thousands of years ago, using which technique these temples were built in parallel line, this is still a mystery.


The twinkling lamp at Srikalhasti temple shows that it is air ......

The water spring in the interior plateau of the Thiruvanikka temple shows that it is a water .......

Huge lamp on Annamalai hill shows that he is a fire .....

Kanchipuram's sand self - ..... shows that it is earth gender and

From the formless state of Chidambaram, the formlessness of God means the sky element is known.


▪️ Now it's not surprising that the five genders representing the five elements of the universe have been installed centuries ago in the same line. We should be proud of the knowledge and intelligence of our ancestors that they had science and technology that even modern science couldn't distinguish. It is believed that not only these five temples but there will be many temples in this line which fall in a straight line from Kedarnath to Rameshwaram. This line is also known as ′′ Shiva Shakti Aksha Rekha Perhaps all these temples have been constructed keeping Kailash in mind, which falls in 81.3119° E!? Only Lord Shiva knows.


It is amazing. See the relationship between Shiva Jyotirlingas with ′′ Mahakal ′′


The distance between the remaining Jyotirlingas from Ujjain is also interesting -


▪️ Ujjain to Somnath-777 km


▪️ Ujjain to Omkareshwar-111 km


▪️ Bhimashankar from Ujjain-666 km


▪️ Ujjain to Kashi Vishwanath-999 km


▪️ Ujjain to Mallikarjuna-999 km


▪️ Ujjain to Kedarnath-888 km


▪️ Ujjain to Trimbakeshwar-555 km


▪️ Ujjain to Baijnath-999 km


▪️ Ujjain to Rameshwaram-1999 km


▪️ Ujjain to Ghrishneshwar-555 km


In Hindu religion nothing was done without reason.


Ujjain is considered the center of the earth, which has been considered for thousands of years in Sanatan Dharma. Hence, man-made instruments have been made for calculating sun and astrology calculations in Ujjain about 2050 years ago.


And when the fictional line (cancer) on earth was formed by the English scientist about 100 years ago, the middle part of it turned out to be Ujjain. Even today, scientists come to Ujjain for information about sun and space.

Tuesday, March 22, 2022

హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. జన్మం మీద కాదు

(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 


1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.


2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.


3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..


4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.


5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 


6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.


7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. 


వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 


8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.


9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.


ఇంకా ..


1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.


2.  ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)


3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.


ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు


1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.


2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..


3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 


4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.


5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.


6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)


7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది  ( విష్ణుపురాణం 4.1.13). 


8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).


9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).


10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.


తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టాన్ని వారికి అందించటంలో సహాయపడండి

ఇదే మన సనాతన ధర్మం యెుక్క గోప్పతనం

Monday, March 21, 2022

ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము

 1. మత్స్యపురాణం

 2. కూర్మపురాణం

 3. వామన పురాణం

 4. వరాహ పురాణం

 5. గరుడ పురాణం

 6. వాయు పురాణం

 7. నారద పురాణం

 8. స్కాంద పురాణం

 9. విష్ణుపురాణం

 10. భాగవత పురాణం

 11.అగ్నిపురాణం

 12. బ్రహ్మపురాణం

 13. పద్మపురాణం

 14. మార్కండేయ పురాణం

 15. బ్రహ్మవైవర్త పురాణం

 16.లింగపురాణం

 17.బ్రహ్మాండ పురాణం 

 18. భవిష్యపురాణం

ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.

మత్స్యపురాణం 

మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.

కూర్మపురాణం 

కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.

వామన పురాణం 

పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, ఋతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.

వరాహపురాణం 

వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.

గరుడ పురాణం 

గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.

వాయుపురాణం 

వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.

అగ్నిపురాణం 

అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.

స్కందపురాణం

కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.

లింగపురాణం 

లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.

నారద పురాణం 

బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.

పద్మపురాణం 

ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.

విష్ణుపురాణం 

పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.

మార్కండేయ పురాణం 

శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.

బ్రహ్మపురాణం 

బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.

భాగవత పురాణం 

విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.

బ్రహ్మాండ పురాణం 

బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.

భవిష్యపురాణం 

సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.

బ్రహ్మావైపర్తపురాణము

ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, *రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి

Friday, March 18, 2022

రుద్రాభిషేకం గురించి వివరణ

శివ.. శివ అంటే చాలు మంగళం, శుభం, సర్వకార్యజయం, సర్వపాపహరం అని వేదార్థాలు. మహాదేవున్ని శివుడని పరమశివుడని పలు పేర్లతో పిలుస్తారు... 

పండితుడు నుంచి పామరుడు వరకు, మహా చక్రవర్తి నుంచి కటిక పేదవాడి వరకు మనఃపూర్వకంగా ఒక్కసారి శివ అంటే చాలు కోరిన కోర్కిలు తీర్చే భోళాశంకరుడు ఆయన. 

శివున్ని అభిషేక ప్రియుడు అంటారు...

శివునికి నిత్యం అభిషేకం చేస్తే చాలు అన్ని ఉన్నట్లే. శివలింగం చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. 

దేశం శాంతిగా ఉంటుందని వేదోక్తి, అయితే శివుడికి అభిషేకాలు చేస్తుంటాం.. 

అయితే అభిషేకాలు ఎన్నిరకాలు ఏ విధంగా శివాభిషేకాలు చేస్తారో తెలుసుకుందాం…!!


శివాభిషేకాలు మంత్రపూర్వకంగా అంటే రుద్రభిషేకాలుగా వర్ణిస్తారు, అదేవిధంగా చేసే ద్రవ్యాలను బట్టి అభిషేకాలకు పేర్లు ఉన్నాయి. 

కానీ శాస్త్రం ప్రకారం రుద్రాభిషేకాలు రకాలనే పరిగణనలోకి తీసుకుంటాం...

పదార్థాలు మన కామ్యాలు అంటే కోరికలు తీరడానికి ఆయా పదర్థాలతో, పుష్పాలతో చేస్తాం...


రుద్రాభిషేకాలు 8 విధములు అవి..


రుద్రం అంటే నమకాలు -11, చమకాలు-11 అనువాకాలుగా (సింపుల్‌గా చెప్పాలంటే 11 స్టాన్జాలు అని ఇంగ్లిష్ మీడియం వారికి) సాధారణంగా రుద్రాభిషేకం అంటే 11 నమకాలను, 11/1 చమకాన్ని చెప్పితే ఒక అభిషేకంగా ఇంట్లో నిత్యం చేసుకునేవారు చేసే పద్ధతి...


ఇక అసలు అభిషేక సంప్రదాయ పరిశీలిస్తే…

1. వారాభిషేకం- నమకం 11 అనువాకాలను చెప్పి చమకంలో ఒక్కొక్క అనువాకం చొప్పున చెప్పవలెను. 

ఆ విధంగా నమకం 11 సార్లు (11X11) చెప్పిన, చమకం 11 అనువాకాలకు పూర్తగును. (నమకం 11సార్లు, చమకం 1 సారి) దీన్ని వారాభిషేకం అంటారు...


2. ఆవృత్తి – నమకం 121 సార్లు, చమకం 11 సార్లు చెప్పితే ఆవృత్తి అంటారు...


3. రుద్రం- నమకం 121 సార్లు, చమకం – 11 సార్లు


4. ఏకాదశ రుద్రం- నమకం 14,641 సార్లు, చమకం-1331 సార్లు..


5. శతరుద్రం- నమకం 1,61,051 సార్లు,చమకం 14,641 సార్లు,


6. లఘురుద్రం- నమకం 17,71,561 సార్లు, చమకం- 1,61,051 సార్లు,


7. మహారుద్రం- నమకం 1,94,87,171 సార్లు, చమకం- 17,71,561 సార్లు,


8. అతిరుద్రం - నమకం 21,43,58,881 సార్లు, చమకం -1,94,87,171 సార్లు,

ఇలా 8 రకాలుగా రుద్రాభిషేకాలను చేస్తారు...


పైనవి మీకుతెలుస్తుంటే మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. 

లేదంటే తెలుసుకొని ఇతరులకు తెలియజేయండి

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...