Sunday, February 28, 2021

సూర్యుని ద్వాదశ రూపాలు


1. ఇంద్రుడు : 

స్వర్గాధిపతి అయి దుష్టశక్తులను సంహరించాడు. 


2. ధాత : 

ప్రజాపతియై భూతములను సృష్టించాడు. 


3. పర్జన్యుడు:

తన కిరణాలతో నీటిని ద్రవించి, తిరిగి మేఘరూపంలో వర్షించును.


4 త్వష్ట :

 ఓషదాలలో, వృక్షాలలో ఫలించే శక్తి. 


5. పూష : 

ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు. 


6. అర్యముడు :

దేవతారూపంలో వుంటాడు.


7. భగుడు :

 ప్రాణుల శరీరంలో వుండి, వారిని పోషిస్తాడు. 


8. వివస్వంతుడు :

ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్నం చేస్తాడు. 


9.విష్ణువు : 

శత్రువులను నాశనం చేస్తాడు. 


10.అంశుమంతుడు :

 గాలిలో నిలిచి, ప్రాణాల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు. 


11. వరుణుడు :

 జీవులు తాగే నీటిలో వుండి, వారిని రక్షిస్తాడు. 


12. మిత్రుడు :

 లోకాాలలో మేలుచేస్తూ... చైతన్యాన్ని కలిగిస్తాడు. 

Friday, February 26, 2021

Information about Lord Krishna

Not sure how much is correct below, but got this message about Shri Krishna as a historical event:

1) Krishna was born 5252 years  ago 

2) Date of Birth : 18 th July,3228 B.C

3) Month : Shravan

4) Day :  Ashtami

5) Nakshatra : Rohini

6) Day : Wednesday

7) Time : 00:00 A.M.

8) Shri Krishna lived 125 years, 08 months & 07 days.

9) Date of Death : 18th February 3102BC.

10) When Krishna was 89 years old ; the mega war (Kurukshetra) war took place. 

11) He died 36 years after the Kurukshetra war.

12) Kurukshetra War was started on Mrigashira Shukla Ekadashi,BC 3139. i.e "8th December 3139BC" and ended on "25th December, 3139BC".  

12) There was a Solar eclipse between "3p.m to 5p.m on 21st December, 3139BC" ; cause of Jayadrath's death.

13) Bhishma died on 2nd February,(First Ekadasi of the Uttarayana), in 3138 B.C.

14) Krishna  is worshipped as:

(a)Krishna Kanhaiyya : Mathura

(b) Jagannath:- In Odisha

(c) Vithoba:- In Maharashtra

(d) Srinath:  In Rajasthan

(e) Dwarakadheesh: In Gujarat

(f) Ranchhod: In Gujarat

(g) Krishna : Udipi, Karnataka

15) Bilological Father: Vasudeva

16) Biological Mother: Devaki

17) Adopted Father:- Nanda

18) Adopted Mother: Yashoda

19 Elder Brother: Balaram

20) Sister: Subhadra

21) Birth Place: Mathura

22) Wives: Rukmini, Satyabhama, Jambavati, Kalindi, Mitravinda, Nagnajiti, Bhadra, Lakshmana

23) Krishna is reported to have Killed only 4 people in his life time (what about pootana  etc in his childhood ?)

(i) Chanoora ; the Wrestler

(ii) Kamsa ; his maternal uncle

(iii) & (iv) Shishupaala and Dantavakra ; his cousins. 

24) Life was not fair to him at all. His mother was from Ugra clan, and Father from Yadava clan, inter-racial marriage. 

25) He was born dark skinned. He was not named at all throughout his life. The whole village of Gokul started calling him the black one ; Kanha. He was ridiculed and teased for being black, short and adopted too. His childhood was wrought with life threatening situations.

26) 'Drought' and "threat of wild wolves" made them shift from 'Gokul' to 'Vrindavan' at the age 9.

27) He stayed in Vrindavan till 14~16 years. He killed his own uncle at the age of  14~16 years at Mathura.He then released  his biological mother and father. 

28) He never returned to Vrindavan ever again.

29) He had to migrate to Dwaraka from Mathura due to threat of a Sindhu King ;  Kala Yaavana.

30) He defeated 'Jarasandha' with the help of 'Vainatheya' Tribes on Gomantaka hill (now Goa).

31) He rebuilt Dwaraka. 

32) He then left to Sandipani's Ashram in Ujjain to start his schooling at age 16~18. 

33) He had to fight the pirates from Afrika and rescue his teachers son ;  Punardatta;  who was kidnapped near Prabhasa ; a sea port in Gujarat. 

34) After his education, he came to know about his cousins fate of Vanvas. He came to their rescue in ''Wax house'' and later his cousins got married to Draupadi. His role was immense in this saga. 

35) Then, he helped his cousins  establish Indraprastha and their Kingdom.

36) He saved Draupadi from embarrassment.

37) He stood by his cousins during their exile.

38) He stood by them and made them win the Kurushetra war.

39) He saw his cherished city, Dwaraka washed away. 

40) He was killed by a hunter (Jara by name) in nearby forest. 

41) He never did any miracles. His life was not a successful one. There was not a single moment when he was at peace throughout his life. At every turn, he had challenges and even more bigger challenges. 

42) He faced everything and everyone with a sense of responsibility and yet remained unattached.

43)  He is the only person, who knew the past and probably future ; yet he lived at that present moment always.

He and his life is truly an example for every human being

Wednesday, February 24, 2021

సూర్యభగవానుడు శక్తి

సూర్యభగవానుడు ఒక్కడే అయినప్పటికీ కూడా పృథ్వికి ఆయన శక్తి అందుతున్న పద్ధతులు మాసానికి ఒకలా ఉంటాయి గనుక పన్నెండు మాసాలలో సూర్యుడిని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు:

1) చైత్రం - భగుడు, 

2) వైశాఖం – ధాత;  

3) జ్యేష్ఠం – ఇంద్ర; 

4) ఆషాఢము - సవిత; 

5) శ్రావణం – వివశ్వాన్; 

6) భాద్రపదం – అర్యమ; 

7) ఆశ్వయుజం – అర్చి;  

8) కార్తీకం – త్వష్ట;  

9) మార్గశిరం – మిత్ర; 

10) పుష్యం – విష్ణు; 

11) మాఘం – వరుణ; 

12) ఫాల్గుణం – పూష

శ్రీలక్ష్మిఅష్టోత్తర నామావళిః

1) ఓం జడాజడప్రకృతిస్థితరవ్యక్తావ్యక్తస్వరూపిణ్యై నమః 

2) ఓం అష్టసిద్ధిప్రదాయిన్యై నమః 

3) ఓం నవనిధినిలయాయై నమః 

4) ఓం శ్రీమహావిష్ణుహృదయసరోవరమధ్యగాయై నమః 

5) ఓం మన్మథజనన్యై నమః 

6) ఓం సర్వాలంకారభూషితాయై నమః

7) ఓం ఆదిలక్ష్మ్యై నమః 

8) ఓం ఆదిమధ్యాంతరహితాయై నమః 

9) ఓం చారుమతీసేవితపదాంబుజాయై నమః 

10) ఓం కోలాసురసంహారిణ్యై నమః 

11) ఓం కరవీరపురనివాసిన్యై నమః 

12) ఓం హరిద్రాకుంకుమచర్చితాంగ్యై నమః 

13) ఓం సప్తమధాతురూపిణ్యై నమః 

14) ఓం క్షీరసాగరనిలయాయై నమః 

15) ఓం హరివల్లభాయై నమః 

16) ఓం సరోజాత్మికాయై నమః 

17) ఓం శ్వేతాంబరధరాయై నమః  

18) ఓం సిద్ధగంధర్వయక్షవిద్యాధరకిన్నరపూజితాయై నమః 

19) ఓం శుభమంగళపరంపరాప్రదాయిన్యై నమః 

20) ఓం హేమాబ్జవల్ల్యై నమః 

21) ఓం వేదవల్ల్యై నమః 

22) ఓం ఆనందవల్ల్యై నమః 

23) ఓం స్వాహాస్వధాస్వరూపిణ్యై నమః 

24) ఓం కనకకలశహస్తాయై నమః 

25) ఓం సింహవాహిన్యై నమః 

26) ఓం విష్ణువామాంకసంస్థితాయై నమః 

27) ఓం అపాంగవీక్షణాయై నమః 

28) ఓం దారిద్ర్యదుఃఖభంజనాయై నమః 

29) ఓం ప్రణవవాచ్యస్వరూపిణ్యై నమః 

30) ఓం సద్గతిప్రదాయకాయై నమః 

31) ఓం మహేంద్రాదిదేవగణపూజితాయై నమః 

32) ఓం సర్వలక్షణసంపన్నాయై నమః 

33) ఓం తాపత్రయనివారిణ్యై నమః 

34) ఓం శ్వేతదీపనివాసిన్యై నమః 

35) ఓం హిరణ్మయ్యై నమః 

36) ఓం రత్నగర్భాయై నమః 

37) ఓం చంద్రసహోదర్యై నమః 

38) ఓం గృహలక్ష్మీస్వరూపిణ్యై నమః 

39) ఓం వాగ్జాడ్యమలాపహారిణ్యై నమః 

40) ఓం సచ్చిదానందస్వరూపిణ్యై నమః 

41) ఓం సహస్రదళపద్మస్థాయై నమః 

42) ఓం కారుణ్యకల్పలతికాయై నమః 

43) ఓం వరలక్ష్మీవ్రతఫలదాయిన్యై నమః

44) ఓం సాలగ్రామమయ్యై నమః 

45) ఓం వ్యాసవాల్మీకిపూజితాయై నమః 

46) ఓం అఖిలాండకోటిబ్రహ్మాండనాయికాయై నమః 

47) ఓం సకలాభరణవిలాసిన్యై నమః 

48) ఓం నిత్యానపాయిన్యై నమః 

49) ఓం ద్వంద్వాతీతవిమలమానసాయై నమః  

50) ఓం పరాపశ్యంతిమధ్యమావైఖరీస్వరూపిణ్యై నమః 

51) ఓం జననమరణచక్రవినిర్ముక్తాయై నమః 

52) ఓం పుష్పయాగప్రియాయై నమః 

53) ఓం పరమంత్రయంత్రతంత్రభంజిన్యై నమః 

54) ఓం సకలవిద్యాప్రదాత్ర్యై నమః 

55) ఓం లోకపావన్యై నమః 

56) ఓం పుత్రపౌత్రాభివృద్ధికారిణ్యై నమః 

57) ఓం ధనధాన్యవృద్ధికర్యై నమః 

58) ఓం శరీరారోగ్యరక్షాకర్యై నమః 

59) ఓం సత్యశౌచాదిసద్గుణనిలయాయై నమః 

60) ఓం ఆచార్యరూపిణ్యై నమః 

61) ఓం ఖడ్గధరాయై నమః 

62) ఓం ధర్మాధర్మవిచక్షణాయై నమః 

63) ఓం జ్ఞానముద్రాయై నమః 

64) ఓం శబ్దాత్మికాయై నమః 

65) ఓం ప్రద్యుమ్నజనన్యై నమః 

66) ఓం కమలాలయాయై నమః

67) ఓం అనిందితాయై నమః 

68) ఓం విజయపరంపరాప్రదాయిన్యై నమః 

69) ఓం రాగమోహవివర్జితాయై నమః 

70) ఓం వైకుంఠపురవాసిన్యై నమః 

71) ఓం బీజస్వరూపిణ్యై నమః 

72) ఓం పద్మవనాంతస్థాయై నమః 

73) ఓం గోపృష్ఠనిలయాయై నమః 

74) ఓం బిల్వవృక్షస్వరూపిణ్యై నమః 

75) ఓం సద్బుద్ధిప్రదాయిన్యై నమః  

76) ఓం పద్మసంభవాయై నమః 

77) ఓం గోసంపదప్రదాయిన్యై నమః 

78) ఓం భవభయభంజనాయై నమః 

79) ఓం భృత్యసంపత్ప్రదాయిన్యై నమః 

80) ఓం దాంపత్యసౌఖ్యప్రదాయిన్యై నమః 

81) ఓం స్నేహబాంధవసంవర్ధిన్యై నమః 

82) ఓం కుశాగ్రబుద్ధిప్రదాయిన్యై నమః 

83) ఓం యోగిహృత్కమలవాసిన్యై నమః 

84) ఓం యోగధ్యాననిష్ఠాపరాయై నమః 

85) ఓం శ్రీపతిపాదకమలసేవితాయై నమః 

86) ఓం సకలదిక్పాలకపూజితాయై నమః 

87) ఓం కార్యసిద్ధికర్యై నమః 

88) ఓం మాదీఫలహస్తాయై నమః 

89) ఓం కంబుకంఠ్యై నమః 

90) ఓం ఆగతశరణాగతవత్సలాయై నమః  

91) ఓం సకలలోకసంచారిణ్యై నమః 

92) ఓం గంభీరమృదుభాషిణ్యై నమః 

93) ఓం నిగమాగమజ్ఞానప్రదాయిన్యై నమః 

94) ఓం భక్తజనపోషిణ్యై నమః 

95) ఓం నీలచికురాయై నమః 

96) ఓం అజ్ఞానాంధకారహారిణ్యై నమః 

97) ఓం సంగీతరసాస్వాదిన్యై నమః  

98) ఓం త్ర్యంబకసహోదర్యై నమః 

99) ఓం కమలేక్షణాయై నమః 

100)ఓం గోలోకవాసిన్యై నమః 

101) ఓం రాసేశ్వర్యై నమః 

102) ఓం ఉత్ఫుల్లముఖాంబుజాయై నమః 

103) ఓం అపరమితబలోత్సాహప్రదాయిన్యై నమః 

104) ఓం పాటలపారిజాతచంపకకేతకీపుష్పాలంకృతాయై నమః 

105) ఓం గురుగుహవందితాయై నమః 

106) ఓం గుహ్యాతిగుహ్యతత్త్వాత్మికాయై నమః 

107) ఓం గజాభిషేకాసక్తాయై నమః 

108) ఓం మాయాతీతస్వరూపిణ్యై నమః 

      సర్వం శ్రీలక్ష్మిదివ్యచరణారవిందార్పణమస్తు

Tuesday, February 23, 2021

పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలు

వివాహం ఆలస్యం కావడం ఒకటే కాదు. జాతకాదుల్లో దోషాలు కనపడినప్పుడు ఆ దోషాలు వైవాహిక జీవన ఆనందానికి కూడా లోపం అవుతాయి. వాటిని ముందుగానే గమనించి తగిన నివారణ చర్యలు చిన్నప్పటి నుంచే చేసుకోవడం మంచిది.

వివాహమనేది జీవితంలో అతిముఖ్యమైన ఘట్టం. ఆధ్యాత్మిక శాస్త్రాలనుసరించి అది ఒక సంస్కారం. వ్యక్తిని సంస్కరించడానికి ఉపకరించే ఈ ప్రక్రియ ఆనందప్రదంగానూ, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేదిగాను ఉండాలి.

లగ్నంలో తాను, సప్తమంలో సామాజిక సంబంధాలు ఉంటాయి. చంద్రుడు మనఃకారకుడు కావడం వలన చంద్రుడు ఉన్న స్థానాన్ని పరిశీలించడం జరుగుతుంది. రవి ఆత్మశక్తికి లగ్నం శరీర శక్తికి ప్రాధాన్యం వహించడం వలన ఆ రెండింటిని కూడా పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తుంది. కళత్రకారకుడైన శుక్రగ్రహ స్థితి పరిశీలించడం ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఇక ఏ శుభకార్యానికైనా గురుబలం కావాలి కాబట్టి గురుదృష్టి వీక్షణం గమనించాలి. వివాహ విషయంలో ప్రధానంగా కుజ, శని, రాహు గ్రహ స్థానాలను పరిశీలించాలి. వాటితో పాటుగా జాతకంలో ద్వితీయస్థానం కుటుంబస్థానం, సప్తమం- కళత్రస్థానం, వ్యయస్థానం, పంచమస్థానాలను, గ్రహదృష్టులు గ్రహ యుతులు గమనించాలి. అష్టమం సౌభాగ్యస్థానం, సప్తమం భర్తృస్థానం చూడాలి.

ఆలస్య వివాహాలు సూత్రాలు :

*******

1. లగ్నాధిపతి మరియు సప్తమాధిపతి కలిసి లేదా విడివిడిగా 6,8,12 స్థానాల్లో ఉంటే ఆలస్య వివాహం.

2. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నా, అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నా, అష్టమాధిపతి సప్తమంలో ఉన్నా వివాహం ఆలస్యం.

3. సప్తమాధిపతి రాహు, కేతు నక్షత్రాల్లో ఉన్నా వివాహం ఆలస్యం.

4. సహజ సప్తమమైన తులలో నైసర్గిక పాప గ్రహాలుంటే దానికి అనుబంధ రాశులైన కన్య, వృశ్చికాలలో పాప గ్రహాలుంటే వైవాహిక జీవితంలో లోపం.

5. లగ్నం నుండి లేదా చంద్రుడి నుండి సప్తమస్థానాన్ని బలమైన పాప గ్రహాలు చూస్తున్న వివాహం జరుగదు, లేదా ఆలస్యమౌతుంది.

6. శుక్రుడు ఉన్న రాశ్యాధిపతి నీచలో ఉన్నా లేదా 6,8,12 స్థానాల్లో ఉన్నా ఆలస్య వివాహం.

7. శుక్రుడి నుండి సప్తమంలో కుజ, శనులు ఉంటే లేదా కుజ, శనులు పరస్పరం ఎదురెదురుగా ఉంటే ఆలస్య వివాహం.

8. శుక్ర, చంద్ర, గురు, రవి గ్రహాలు నీచలో ఉంటే వివాహం ఆలస్యమౌతుంది.

9 పాపకర్తరీ మధ్యలో గ్రహాలుంటే దోషం, ఆలస్య వివాహం.

10. రవి, శనులు కలిసి సప్తమ స్థానంలో ఉంటే వివాహం ఆలస్యం.

వివాహం ఆలస్యం కావడం ఒకటే కాదు. జాతకాదుల్లో దోషాలు కనపడినప్పుడు ఆ దోషాలు వైవాహిక జీవన ఆనందానికి కూడా లోపం అవుతాయి. వాటిని ముందుగానే గమనించి తగిన నివారణ చర్యలు చిన్నప్పటి నుంచే చేసుకోవడం మంచిది. శ్లోక పఠనాలు, పారాయణదులతో పాటు, దానం చేయడం అత్యావశ్యకం. వివాహం కావడానికి, వైవాహిక జీవితం ఆనందంగా ఉండడానికి వివాహితులకు కాని అవసరమైన వారికి కాని అలంకరణ వస్తువులు దానం చేయడం, నిమ్మకాయ పులిహోర  పంచడం, డ్రైఫ్రూట్స్‌ పంచడం లాంటివి ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ఈ నివారణ చర్యలు చేపట్టి సరియైన సమయంలో వివాహం జరిగి ఆనందప్రద జీవితానికి ప్రయత్నం చేయవచ్చు.

Monday, February 22, 2021

కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు.... కృష్ణ భగవానుని సమాధానం

ఒకసారి ధర్మరాజు లేని సమయంలో  మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.


శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు.


అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగికృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.


భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.


నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు.


ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు.


నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు.  


ఆయన చెప్పనారంభించాడు.


కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు.


కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు.


కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తారు.


కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడ లేరు.


ఉద్ధవ గీత శ్రీమద్భాగవతం...

జన్మనక్షత్రమున చేయదగిన కార్యములు

జన్మ నక్షత్రమున అన్న ప్రాశనము, అక్షరాభ్యాసము, చౌళము, ఉపనయనము, నిషేకము, వ్యవసాయము, భుసంపాదన, మొదలగునవి శుభము. స్త్రీకి జన్మనక్షత్రమున వివాహము చేయుట మంచిది.

పురుషులకు జన్మ నక్షత్రమున ఉపనయనము మంచిది. వారశూలలు -- శని సోమ వారములు తూర్పునకు, దక్షణమునకు గురువారము, పడమరకు ఆది శుక్రవారము ఉత్తరమునకు బుధ మంగళవారములు వారశూలలు. ఆ వారములలో ఆదిక్కునకు ప్రయాణము చేయరాదు.

తిధి శూలలు:

తూర్పునకు- పాడ్యమి, నవమి, తిదులలోను,

ఉత్తరమునకు, విదియ, దశమి యందును,

ఆగ్నేయమునకు, తదియ ఏకాదశి యందును, 

నైరుతి దిక్కునకు చవితి ద్వాదశి తిదులయండును,

దక్షినమునకు పంచమి త్రయోదశి యందును,

పడమరకు, షష్టి, చతుర్దశి యందును,

వాయువ్యమునకు, సప్తమి, పున్నమి యందును,

ఈశాన్యమునకు, అష్టమీ, అమావాస్యలయందును, ప్రయాణము చేయరాదు.

యాత్రా ( ప్రయాణ ) విషయములు:

పాడ్యమి యందు కార్య నాశనము, విదియ ధన లాభము, తదియ యందు శుభము, చవితి యందు సంకటము , పంచమి నాడు, శుభము, షష్టి కలహము, సప్తమి ధనలాభము, అష్టమి కార్యనాశనము, నవమి విచారము, దశమి శుభము, ఏకాదశి కార్యజయము, ద్వాదశి కార్యనాశనము, త్రయోదశి శుభము, చతుర్దశి మరణము, పున్నమి అమావాస్యలలో కార్యనాశనము జుగును. ఈవిషయములు గమనించి ప్రయాణము చేయవలెను. 

Sunday, February 21, 2021

అయ్యప్ప దీక్షా నియమాలు

1. యోగ్యుడైన ఆధ్యాత్మిక గురువు పాదపద్మములను ఆశ్రయించి దీక్షను పుచ్చుకొన వలెను.


2. గురుస్వామి ద్వారా "స్వామియే శరణం అయ్యప్ప" అనే తారకమంత్ర ఉపదేశమును పొంది

భగవంతుని ఎట్లు పూజించవలెనో , ఎట్లు భగవత్సేవ చేయవలెనో నేర్చుకోవలెను.


3. గురువు చెప్పిన విధి విధానాలను , గురువు ఆదేశాలను శ్రద్ధగా పాటించవలెను. గురు

స్వామి ఆజ్ఞను అతిక్రమించకూడదు.


4. ఉదయం , సాయంకాలముల యందు విధిగా పూజ చేయవలెను.


5. భగవంతుని అర్చించిన తరువాత ప్రసాదంగా పూజాపుష్పమును శిరముపై

నుంచుకొనవలెను.


6. పూజ ముగిసిన తరువాత అవకాశం ఉన్నంత వరకు తప్పనిసరిగా దేవాలయాలకు

వెళ్ళవలెను.


7. తెల్లవారుజామున , సాయంకాలము లందు (రెండు పూటలా) చన్నీటితో తలస్నానం

చేయవలెను.


8. నేలపై చాపవేసుకుని నిద్రించవలెను. (తలగడను ఉపయోగించ గూడదు)


9. బ్రహ్మచర్యమును ఆచరించవలెను.


10. పూజా విధానాన్ని సక్రమముగా పాటించే విధంగా దినసరి కార్యక్రమ ప్రణాళికను

ఏర్పరచుకొనవలెను.


11. అసత్య మాడరాదు.


12. నుదుటను విభూతి , చందన , కుంకుమలు ధరించవలెను.


13. గురుస్వామిగారి పర్యవేక్షణలో ఆ కాలానికి చెందిన సద్ గురుస్వాముల అడుగుజాడలలో

నడుచుకోవలెను.


14. భగవంతుని సన్నిధిలో “పడి" వెలిగించునపుడు ఇతరులకు బాధ కలిగించని రీతిలో

నాట్యమాడవలెను.


15. ప్రత్యేక పూజలు ముగిసిన పిదప గురుస్వాములకు ఒకరి తరువాత ఒకరుగా క్రమపద్ధతిలో

సాష్టాంగ నమస్కారము చేయవలెను.


16. ప్రత్యేక పూజ నిర్వహించిన భక్తునకు మిగిలిన స్వాములు సున్నితంగా పాదాభివందనం

చేయవలెను.


17. పూజ చేసిన స్వామి కూడా ఇతర స్వాముల పాదాలకు సున్నితంగా , భక్తిగా

నమస్కరించవలెను.


18. స్వామికి సంబంధించిన ఊరేగింపు ఉత్సవాలలో విధిగా పాల్గొని , కనీసం కొంత దూరమైన

నడువవలెను.


19. దేవుని ఊరేగింపు ముగిసిన పిదప అందుకు సంబంధించిన ఆదాయ , వ్యయములను

"స్వామి" సమక్షంలో నివేదించవలెను. ఇదంతా గురుస్వామిగారి ఆజ్ఞమేరకు జరగవలెను.


20. దేవాలయములలోను , ఇంటిలోను వివిధ విశేషపూజలలోను బృందగానములు

చేయవలెను.


21. అయ్యప్ప మాల యందు ఉండే అయ్యప్ప డాలరునకు హారతిని ఇచ్చేటపుడు ఎడమచేతితో

మాలను పట్టుకుని కుడిచేతితో హారతిని చూపించాలి (హారతి మంటల్లో మాలను ,

రూపును త్రిప్పకూడదు.)


22. స్వచ్ఛమైన , శుభ్రత కలిగిన అభిషేక ద్రవ్యములు దొరికినపుడే స్వామికి అభిషేకములు

(చేయించవలెను) చేయవలెను. అభిషేక ద్రవ్యాలు మంచివి కాకపోతే ఆలయంలోని

విగ్రహం పాడైపోతుంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అభిషేకానికి మంచి ద్రవ్యాన్ని

సమకూర్చుకోవలెను.


23. అభిషేక , “ప్రసాదములను" స్వీకరించవలెను.


24. ప్రత్యేక పూజలయందును , స్వామిని అలంకరించుట యందును , అర్చనలలోను మరియు

చేసే ప్రతీ మంచి పనిలోను ఏకాగ్రత , కలిగియుండవలెను.


25. భగవంతునికి చేసేసేవ , భగవద్ భక్తులకు చేసే సేవ ఒక్కటే అని భావించి వినయంతో సేవ చేయవలెను.


26. "స్వామియే శరణం అయ్యప్ప" అనే భగవన్నామమును స్మరిస్తూనే యుండవలెను.


27. తనకు ఆర్థికంగా ఎంత శక్తిగలదో అందుకు తగినట్లుగానే భగవంతుని అర్చించవలెను.


28. ఏదైన ఆహారమునకు సంబంధించిన దానిని భగవంతుని స్మరించి తరువాత తినడంగాని ,

భగవంతునకు సమర్పించి ఆ తరువాత తినడం గాని చేయవలెను.


29. భగవంతునికి ఇష్టమైన కార్యాలను చేయునపుడు భయపడ కూడదు.


30. భగవంతునకు సంబంధించిన ప్రత్యేక సేవా కార్యక్రమాలలో విధిగా పాల్గొనవలెను.


31. మంచి పనులు ఏవి చేస్తున్నా , భగవంతుని తలుస్తూనే చేయవలెను.


32. భోజనమునకు ముందు , భోజనానంతరమును కాళ్లు , చేతులు కడుగుకొనవలెను.


33. హితమైన “సాత్విక ఆహారాన్ని" మితంగా భుజించవలెను.


34. అయ్యప్ప దీక్ష ద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించవలెను.


35. మనకు ఇష్టమైన పనినైనా పరిత్యజించి , స్వామి యొక్క సేవలో పాల్గొనుటకు సంసిద్ధుడగు

చుండవలెను.


36. దీక్షకు అవసరమైనంత వరకే భౌతిక జగత్తు నుండి స్వీకరించవలెను.


37. మర్రి , మారేడు మొదలగు వృక్షములకు నమస్కరించవలెను.


38. అవసరమైనంత వరకే నిత్య జీవన కార్యక్రమాలను ఆచరించవలెను.


39. దుఃఖము కలిగినపుడు క్రుంగిపోవుట గాని , సుఖము కలిగినపుడు పొంగిపోవుట గాని. చేయకూడదు.


40. వివిధ హోమ , యజ్ఞముల ద్వారా వ్యాపించిన పొగను శ్రద్ధతో పీల్చవలెను.


41. పురాణ కాలక్షేపాలలో పాల్గొనవలెను.


42. భగవానుని అనుగ్రహము కొరకు సదా ప్రార్థించవలెను.


43. భక్తి భావము కలిగియుండి భక్తి గ్రంథాలను చదువుచుండవలెను.


44. ఇష్టముతో దేవునికి సేవ చేయవలెను.


45. దేవుని కీర్తించునపుడు , నామములు ఉచ్ఛరించునపుడు తప్పులు రాకుండా జాగ్రత్త

పడవలెను.


46. స్వామికి సంబంధించిన వివిధ శ్లోకాల , నామముల యందు అర్థాలను తెలుసుకోవలెను.


47. తన కంటే పరిణితి పొందిన భక్తులతో సాంగత్యము చేయవలెను.


48. భక్తి లేనివాని సాంగత్యమును , పరుషముగా మాట్లాడువాని సాంగత్యమును , క్రోధము

కలిగిన వాని సాంగత్యమును పరిత్యజించవలెను.


49. కామ , క్రోధాదులను అదుపులోయుంచుకొనవలెను.


50. ఆలయాలలోను , పూజా మందిరాల వద్దను మంచి నడవడి కలిగి యుండవలెను.


51. ప్రశాంత జీవితమును గడుపవలెను.


52. అన్య దేవతలను దూషించకూడదు.


53. అనవసరంగా ఏ ప్రాణికిని కష్టం కలిగించకూడదు.


54. పూజా ప్రతిమలను చిత్ర పటములను (పూజా సమయంలోను , పూజ తరువాత) శుభ్రంగా

ఉంచుకొనవలెను.


55. పువ్వులు , పత్రి ఒడిలో వేసుకోని పూజించరాదు.


56. తడి వస్త్రములతో పూజకు ఉపక్రమించకూడదు.


57. పూజ చేస్తున్నప్పుడు కటిక నేలపై కూర్చుండరాదు.


58. భోజనానంతరం భోజనం చేసిన ప్రదేశమునందు చేతులు కడుగరాదు (చేతులు కడిగే

చోటికి వెళ్ళి చేతులు కడగాలి)


59. తాంబూలమును స్వీకరించవచ్చునే గాని , తాంబూలమును నమిలి మ్రింగరాదు.


60. శవమును చూడకూడదు అట్లు చూచినచో మరల తలస్నానం చేసి విభూతి , చందన ,

కుంకుమాదులు ధరించి దీపం వెలిగించి భగవంతునికి నమస్కరించవలెను.


61. అశౌచము కలిగిన (మైల కలిగిన) వారి ఇండ్లకు వెళ్ళకూడదు.


62. స్త్రీలను కనీసం తాకనైన తాకకూడదు. ప్రాణాపాయ స్థితిలో తప్ప


63. స్వామికి ఇష్టమైన రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహించుట లేక ప్రత్యేకపూజలలో భక్తిగా

పాల్గొనుట చేయవలెను.

64. పుణ్యక్షేత్రములను దర్శించవలెను.


ఈ 64 భక్తి అంగములు సరియైన రీతిలో ఆచరిస్తే మనలోని వాచిక , కాయక , మానసిక కర్మలన్నీ  సంస్కరించబడి , దశేంద్రియ సిద్ధి కలిగి ( జ్ఞానేంద్రియ , కర్మేంద్రియాలను దశేంద్రియాలంటారు) మన హృదయంలో భగవంతుణ్ణి దర్శించగలుగుతాం. ఏకాగ్రతతో స్వామిని పూజించేటప్పుడు , భక్తిగా పాడేటప్పుడు భగవంతునిలో తాదాత్యం చెందే భాగ్యం కలుగుతుంది.

అప్పుడు వర్ణించలేనంత ఆనందం కలుగుతుంది. ఆ సమయంలో ఆనందంతో మన కళ్ళవెంట  ఆనంద భాష్పాలు వస్తాయి.  రోమాంచం కలుగుతుంది. కొద్దిక్షణాలు మనకళ్ళకు దివ్యకాంతి  గోచరిస్తుంది. గగుర్పాటు కలుగుతుంది. మన హృదయంలో ఏదో చెప్పలేని దివ్యమైన భక్తి  అనుభూతి కలుగుతుంది. మనం అర్చించే చిత్రపటంలోని అయ్యప్పస్వామివారి నేత్రాలలో జ్యోతి  కనిపిస్తుంది. ఇంతకంటే గొప్ప అనుభవంగాని , అనుభూతిగాని జీవితంలో మరొకటి ఉంటుందా !  ఇంతకంటే భాగ్యం , ఐశ్వర్యం మరొకటి ఉంటుందా ? ఇట్టి అనుభూతిని 41 రోజుల దీక్షాకాలంలో ఒక్కరోజైనా పొందగలగడమే అదృష్టం. అట్టి అనుభూతి కలగాలని ప్రయత్నించ కూడదు.  ఏదో  విశేషభక్తి కలిగియుంటే భగవానుడే అట్టి అనుగ్రహాన్ని మనకు కలిగిస్తాడు. అంతటి భాగ్యాన్ని  భక్తులందరూ పొందాలి. అందుకే త్యాగరాజ స్వామివారు “నిధి చాలా సుఖమా రాముని సన్నిధి   చాలా సుఖమా" అని గానం చేస్తూ రాముని సన్నిధే అసలైన పెన్నిధి అనే సందేశాన్ని మనకు అందజేసారు. గురువుల అనుగ్రహంతో మనమూ ఆ పెన్నిధిని పొందుదాం.


Friday, February 19, 2021

సూర్య మండల స్త్రోత్రం

నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే

 సహస్రశాఖాన్విత సంభవాత్మనే |

 సహస్రయోగోద్భవ భావభాగినే

 సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ ||


 యన్మండలం దీప్తికరం విశాలం |

 రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |

 దారిద్ర్య దుఃఖక్షయకారణం చ |

 పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౨ ||


 యన్మండలం దేవగణైః సుపూజితం |

 విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |

 తం దేవదేవం ప్రణమామి సూర్యం |

 పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ ||


 యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం |

 త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |

 సమస్త తేజోమయ దివ్యరూపం |

 పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౪ ||


 యన్మండలం గూఢమతి ప్రబోధం |

 ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |

 యత్సర్వ పాపక్షయకారణం చ |

 పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౫ ||


 యన్మండలం వ్యాధివినాశదక్షం |

 యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |

 ప్రకాశితం యేన చ భూర్భువః స్వః |

 పునాతు …


శ్రీమహాలక్ష్మి_కవచం

అస్య శ్రీమహాలక్ష్మీకవచమంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ చందః

మహాలక్ష్మీ దేవతా మహాలక్ష్మీ ప్రీత్యర్థం జపే వినియోగః |


ఇన్ద్ర ఉవాచ । సమస్తకవచానాం తు తేజస్వి కవచోత్తమం |

ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గీష్పతే || 1 ||


మహాలక్ష్మ్యాస్తు కవచం ప్రవక్ష్యామి సమాసతః |

చతుర్దశసు లోకేషు రహస్యం బ్రహ్మణోదితం || 2 ||


శిరో మే విష్ణుపత్నీ చ లలాటమమృతోద్భవా |

చక్షుషీ సువిశాలాక్షీ శ్రవణే సాగరామ్బుజా || 3 ||


ఘ్రాణం పాతు వరారోహా జిహ్వామామ్నాయరూపిణీ |

ముఖం పాతు మహాలక్ష్మీః కణ్ఠం వైకుంఠ వాసినీ || 4 ||


స్కందౌ మే జానకీ పాతు భుజౌ భార్గవనందినీ |

బాహూ ద్వౌ ద్రవిణీ పాతు కరౌ హరివరాఙ్గనా || 5 ||


వక్షః పాతు చ శ్రీదేవీ హృదయం హరిసున్దరీ |

కుక్షిం చ వైష్ణవీ పాతు నాభిం భువనమాతృకా || 6 ||


కటిం చ పాతు వారాహీ సక్థినీ దేవదేవతా |

ఊరూ నారాయణీ పాతు జానునీ చంద్రసోదరీ || 7 ||


ఇన్దిరా పాతు జంఘే మే పాదౌ భక్తనమస్కృతా |

నఖాన్ తేజస్వినీ పాతు సర్వాఙ్గం కరూణామయీ || 8 ||


బ్రహ్మణా లోకరక్షార్థం నిర్మితం కవచం శ్రియః |

యే పఠన్తి మహాత్మానస్తే చ ధన్యా జగత్త్రయే || 9 ||


కవచేనావృతాఙ్గనాం జనానాం జయదా సదా |

మాతేవ సర్వసుఖదా భవ త్వమమరేశ్వరీ || 10 ||


భూయః సిద్ధిమవాప్నోతి పూర్వోక్తం బ్రహ్మణా స్వయం |

లక్ష్మీర్హరిప్రియా పద్మా ఏతన్నామత్రయం స్మరన్ || 11 ||


నామత్రయమిదం జప్త్వా స యాతి పరమాం శ్రియం |

యః పఠేత్స చ ధర్మాత్మా సర్వాన్కామానవాప్నుయాత్

  || 12 ||


ఇతి శ్రీ మహాలక్ష్మీ కవచం సంపూర్ణం

మంచి మాటలు

ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి !


ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు 


దేవుడికోసం తీర్ధాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడోలేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె'లోనేవున్నాడు._ 


సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు.


కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు... గుర్తుంచుకో ..


జ్ఞానం.. ఆలోచించి మాట్లాడుతుంది. అజ్ఞానం.. మాట జారాక ఆలోచిస్తుంది. అమాంతం అజ్ఞానం పోయి జ్ఞానంరాదు.


కొబ్బరిచెట్టు పెరిగేకొద్దీ పాతమట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగేకొద్దీ తనపర భేదాలు తొలగిపోతాయి.


పుండు మానితే పొలుసు అదేపోతుంది. పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది ! జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభంలేదు !


సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి.


నీపై నమ్మకం నీకుబలం. నీపై అపనమ్మకం అవతలివారికి బలం !నీబలం ఎవరికీ తెలియకపోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !


మరణం అంత మధురమైనదా ? ఒక్కసారి దాన్ని కలిసినవారు వదిలిపెట్టలేరు ?ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం ! ప్రాణంపోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది !


 నీ పరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. వాటిని ఆరోగ్యంగా వుంచుకో.


వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు ?


నిజాయితీపరులు సింహంలాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !


పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !


ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నావాళ్ళనుకుంటూ) బతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బతుకు.


వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో, అసలు జన్మవుందో లేదో తెలీదు._


నువ్వు 'నావాళ్ళు నావాళ్ళు' అనుకుంటుంటే వాళ్ళు తర్వాత 'వాళ్ళవాళ్ళకోసమే' బతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !


అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈమాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. తెలుసుకోటంలోనే వుంది కిటుకంతా.. అందుకే ఈ జీవితమంతా !_


మరణం దగ్గరపడితేనే మహాసత్యాలు బోధపడ్తాయ్._ 

Thursday, February 18, 2021

మహాతేజం రథసప్తమి : అంటే ఏమిటి , ఎందుకు ?

రథసప్తమి అంటే సూర్య భగవానుని పూజించే పండుగ

మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు.

సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.

1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'

2. వైశాఖంలో అర్యముడు

3. జ్యేష్ఠంలో మిత్రుడు ,

4. ఆషాఢంలో వరుణుడు

5. శ్రావణంలో ఇంద్రుడు

6. భాద్రపదంలో వివస్వంతుడు

7. ఆశ్వయుజంలో త్వష్ట

8. కార్తీకంలో విష్ణువు

9. మార్గశీర్షంలో అంశుమంతుడు

10. పుష్యంలో భగుడు

11. మాఘంలో పూషుడు

12. ఫాల్గుణంలో పర్జన్యుడు

ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు

భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కథనం ప్రకారం

బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రని తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని 'యుగ సహస్ర యోజన పరభాను' అని తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసాలో చెబుతారు.

దీన్ని లెక్క కడితే 'యుగం...12000 ఏళ్లు , సహస్రం 1000 , యోజనం 8 మైళ్లు , మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే

ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.

ఆ ఏడు గుర్రాల పేర్లు

1. గాయత్రి

2. త్రిష్టుప్పు

3. అనుష్టుప్పు

4. జగతి

5. పంక్తి

6. బృహతి

7. ఉష్ణిక్కు

వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.

రామ , రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని 'ఆదిత్య హృదయం' ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది.

ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక , మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు

సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు , రాత్రికి ప్రతీక అని , చక్రాలకున్న ఆరు ఆకులు ఋతువులకు , ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది

 అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.

ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు , ఐశ్వర్యం , ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి

ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి , రోగము , శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి

ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు , రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక , ఏడు జన్మల్లో చేసిన పాపములను , ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః !

అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే !!

యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు !

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ !!

ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్ !

మనో వాక్కాయజం యచ్ఛ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః !!

ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే !

సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ !!

పూజా విధానం:-

చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి , ఒక్కొక్క దళం చొప్పున రవి , భాను , వివస్వత , భాస్కర , సవిత , అర్క , సహస్రకిరణ , సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం , ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది

ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు , జిల్లేడు , రేగు  పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది

జిల్లేడు , రేగు , దూర్వాలు , అక్షతలు , చందనాలు కలిపిన నీటితోగాని , పాలతో గాని , రాగిపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది

మనం చేసే పూజలు , వ్రతాలు అన్నీ పుణ్యసంపాదన కొరకే. శివ కేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది.

ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే !

ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్  ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు. ఈ మహా పర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని , ఐశ్వర్యాన్ని పొందుదాం

చదుకొవలిసిన స్తోత్రాలు

ఆదిత్యహృదయం , సూర్య స్తోత్రం , నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణ చేయడం సకల శ్రేయోదాయకమని గురు వాక్యం.

మాఘ శుద్ధ షష్ఠి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో ఉన్న నది లేదా చెరువు దగ్గర స్నానం చేయాలి. ఈ రోజు అంటే మాఘ శుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిథిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానం చేయాలి

సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యునికి నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు , ఇబ్బందులు తొలగుతాయని శాస్త్రవచనం.

1. ఈ జన్మలో చేసిన

2. గత జన్మలో చేసిన

3. మనస్సుతో

4. మాటతో

5. శరీరంతో

6. తెలిసీ

7. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉన్నది.

ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశం లో నక్షత్ర కూటమి రథం ఆకారం లో ఉంటుంది.

రోగ నివారణ / సంతాన ప్రాప్తి కోసం - రథ సప్తమి వ్రత విధానం

స్నానానంతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాలి. అష్టదళ పద్మం ముగ్గు (బియ్యం పిండి తో) వేసి అందులో సూర్య నామాలు చెప్తూ 7 రంగులు నింపాలి . అష్ట దళ పద్మ మధ్య లో శివ పార్వతులను పెట్టి, పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దానిమీద సూర్యుడు రథాన్ని (7 గుర్రాలు) నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు

చేయించి కుంకుమాదులు, దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల పువ్వులు సూర్యుని ప్రతిమపై ఉంచి సూర్యుడికి పూజ చేయాలి.

*సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికి సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు , గోత్రనామాలు చెప్పుకొని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు దానం ఇవ్వాలి . తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సర కాలం నియమంగా , నిష్ఠగా ఉండాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా శక్తి , ఆసక్తి కలిగిన వారు చేసినచో వారికి సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుందిl

ఆదిత్యుని అనుగ్రహం

 ప్ర: ఆదిత్యుని అనుగ్రహం పొందడానికి తేలికైన మార్గాలు తెలియజేయగలరు.

జ: ఆదిత్యుని అనుగ్రహం పొందడానికి శాస్త్రాలు చాలా మార్గాలు చెప్పాయి. తేలికైన మార్గాలతోనే సూర్యానుగ్రహం పొందవచ్చు. 

ప్రతీరోజు సూర్యోదయాత్ పూర్వమే స్నానాదులు పూర్తిచేసుకుని సూర్యునికి నమస్కారం చేసుకోవడం ప్రతీవారి విధి. సూర్యానుగ్రహం పొందాలనుకునే వారు ముఖ్యంగా ఈ విధిని ఆచరించాలి. సూర్యానుగ్రహం పొందడానికి శాస్త్రాలు చాలా మార్గాలు చెప్పాయి. బ్రహ్మ పురాణంలో చెప్పిన కొన్ని మార్గాలు -

● మాఘశుద్ధ షష్టి లేదా సప్తమి నాడైనా ఏక భుక్తంతో వ్రతనియమాలను పాటిస్తూ సూర్యుని పూజించినవారు అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందుతారు.

● సప్తమినాడు ఉపవాస నియమంతో భాస్కరుని పూజించినవారు పరమోత్కృష్ట గతులను పొందుతారు.

● శుక్లసప్తమినాడు ఉపవాసం చేసి తెల్లని రంగు ద్రవ్యాలతో సూర్యుని పూజించినవారు సకలపాపములనుండి విడివడినవారై సూర్యలోకాన్ని చేరుకుంటారు. 

● శుక్లసప్తమి ఆదివారం కలిసివస్తే దానికి విజయాసప్తమి అని పేరు. ఆ రోజు చేసిన స్నాన, దాన, తప, హోమ, ఉపవాసాదులు మహాపాతకాలను సైతం నశింపజేస్తాయి. 

● చిత్రభానుని అనేకరంగుల సువాసన కలిగిన పువ్వులతో ఉపవాసము చేస్తూ పూజించినవారు అభీష్టసిద్ధులు నెరవేర్చుకోగలరు. 

● ఒక నియమంగా నేతితో లేదా నువ్వులనూనెతో దీపాన్ని వెలిగించి ఆదిత్యుని పూజించినవారికి కంటికి సంబంధించిన అనారోగ్యం కలగదు. 

● ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్యునికి దీపాన్ని సమర్పించినవారు జ్ఞానదీపంతో ప్రకాశిస్తారు.

● ఎర్రచందనంతో కలిపిన ఎర్రటి పుష్పాలతో సూర్యోదయ సమయంలో అర్ఘ్యాన్ని సమర్పించేవారు ఏడాదిలోగా సూర్యానుగ్రహ సిద్ధిని పొందగలరు. 

●పాయసములు, అప్పములు, పండ్లు, కందమూలములు, నేతితో చేసిన వంటకాలు సూర్యునికి అర్పించినవారు అన్ని కోరికలను సాఫల్యం చేసుకోగలరు. 

● సూర్యునికై ధ్వజం, ఛత్రం, చామరాలు, జెండాలు శ్రద్ధగా సమర్పించేవారు ఉత్తమగతులను పొందగలరు.

● సూర్యునికై నేతితో తర్పణాలు ఇస్తే సర్వసిద్ధులు కలుగుతాయి. పాలతో తర్పణాలు చేస్తే మానసికతాపములనుండి విముక్తులవుతారు. పెరుగుతో తర్పణాలు ఆచరిస్తే తలచిన పనులు నెరవేరుతాయి.

● ఆదిత్యునికై భక్తిగా ఏ ఏ ద్రవ్యాలను సమర్పిస్తారో అవన్నీ అసంఖ్యాక పదార్థాలుగా తిరిగి వారికి లభిస్తాయి.

● నియమాచారాలకు భావశుద్ధి కూడా చాలా ప్రధానం. భావశుద్ధితో చేసిన అర్చనాదులకు సరైన ఫలం లభిస్తుంది. 

● తల భూమిని తాకే విధంగా సూర్యునికై నమస్కారం చేసేవారి సకలపాపాలు ఆ క్షణంలోనే నశిస్తాయనడంలో సందేహం లేదు.

● భక్తిప్రపత్తులతో సూర్యునికి (ఆత్మ)ప్రదక్షిణ చేసేవారు సప్తద్వీపములతో కూడిన భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలాన్ని పొందుతారు.

7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన "గురువు."



1వ ప్రశ్న: ప్రపంచంలో ఏది పదునైనది?

జ: చాలా మంది కత్తి అని చెప్పారు. 

గురువు: కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.


2వ ప్రశ్న: మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ?

జ: చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ

గురువు: మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం.

ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము,

ఆ కాలంలోకి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము.


3వ ప్రశ్న: ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది?

జ: చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి ఇలా ఎన్నో అంటారు.

గురువు: ప్రపంచంలో పెద్దది మన పాపమే.


4వ ప్రశ్న: ప్రపంచంలో కఠినంగా,బరువుగా ఉండేది ఏది ?

జ: చాలామంది,వజ్రము ఇనుము,ఏనుగు అని చెప్పారు.

గురువు: కఠినమైనది అనేది "మాట ఇవ్వడం"

మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం.


5వ ప్రశ్న: ప్రపంచంలో తేలికైనది ఏది?

జ: దూది,గాలి,ఆకులు అని చెప్పారు 

గురువు: ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం.


6వ ప్రశ్న: మనకు దగ్గరగా వున్నది ఏది?

జ: తల్లి తండ్రులు, స్నేహితులు,బంధువులు అని చెప్పారు. 

గురువు: మనకు దగ్గరగా ఉండేది మన చావు.

అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం.

అది పుట్టుకతోనే మనవెంట వచ్చింది.


7వ ప్రశ్న: ప్రపంచంలో సులువైనది ఏది ?

జ:తినడం ,పడుకోవడం, తాగడం,తిరగడం 

గురువు: ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం, ఇంతకంటే సులువు ఏదీ లేదు.

Wednesday, February 17, 2021

ద్వైతం - అద్వైతం - విశిష్టాద్వైతం

 1  ద్వైతం అంటే ఏమిటి ?

2. అద్వైతం అంటే ఏమిటి ?

3  విశిష్టాద్వైతం అంటే ఏమిటి ?

.

1. (..ద్వైతం  )


నీవు దైవం ; నేను జీవున్ని ..... నీవు గురువు , నేను శిష్యుణ్ణీ అన్నది ద్వైతం .

మధ్వాచార్యులు ప్రవచించిన మతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది.


సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ.... కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.

.

2    (  అద్వైతం  )

.

నీవు -నేను ఒక్కటే అన్నది అద్వైతం .

.

అద్వైతం అనగా భాషాపరంగా అర్థం "ద్వైతం"కానిది, జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక. ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. శంకరుడు బోధించిన తత్వం "అద్వైతం" - అనగా రెండు కానిది. ఆత్మ, బ్రహ్మము (పరమాత్మ) ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం.

.

3   (  విశిష్టాద్వైతం )

.

నీవు  దేవుడు

నేను  జీవి

ప్రకృతి

పంచభూతాలు 

అన్నవి వేర్వేరు అయినా ఒకదానిలో ఒకటి మిలితమై అంతటా వ్యాపించి ఉంటాయి .

విశిష్టాద్వైతం అనేది 11వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించిన

వేదాంత దర్శనము.


జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు - మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది. 'చిత్' అనబడే జీవునితోను, 'అచిత్' అనబడే ప్రకృతితోను కూడియే ఈశ్వరుడుండును. శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉండును. ఆజ్ఞానవశమున జీవుల సంసారబంధమున చిక్కుకొందురు. భగవదనుగ్రహమువలన, సద్గురుకృప వలన, భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము మోక్షము పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.

శాంతి మంత్రాలు

 శాంతి మంత్రాలన్నీ కూడా చివర్లో ఓం శాంతి ... శాంతి ... శాంతిః అని ముగుస్తాయి . 

ఏదో ఒక సందర్భంలో వేద పండితులు ఈ శాంతి మంత్రాల్ని పఠించడం మనందరం వినే ఉంటాం. మనుషులకు మూడు రకాల ఉపద్రవాలనుండీ ప్రమాదం ముంచుకొస్తుంది

మొదటి "శాంతి" పదం శారీరిక , మానసికపరంగా సంభవించే ఉపద్రవం ( అనారోగ్యం ) నుంచీ ఉపశమనం పొందడానికి . దీన్ని  "ఆధ్యాత్మికం" అంటారు .

రెండవ "శాంతి" పదం ఇతర జీవరాశులనుండీ , మనుష్యులు నుండీ ఏవిధమైన ఆపదలు / ముప్పు సంభవించకుండా సురక్షితంగా ఉండటానికి . దీన్ని  " ఆధిభౌతికము " అంటారు .

మూడవ " శాంతి " పదం ప్రకృతి పరంగా సంభవించే ( భూకంపాలు / అగ్నిప్రమాదాలు / వరదలు / తుఫాన్లు మొదలగునవి ) ఉపద్రవాలు వలన ఏవిధమైన ఆపదలు / ముప్పు కలగకుండా ఉండటానికి . దీన్ని " ఆధిదైవికము " అంటారు.

ఈ మూడు ఉపద్రవాలనుండీ రక్షించమని వేడుకుంటూ  

" శాంతి " మంత్రం చివర్లో " శాంతి " పదాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తారు

Tuesday, February 16, 2021

షోడశ సంస్కారాలు

సంస్కారములు హిందూ సాంప్రదాయములో ఆగమ సంబంధమయిన క్రియలు. ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుపబడతాయి. స్త్రీ, పురుష సమాగమము మొదలుకొని, జననము, మరణము, తదనంతరము ఆత్మ పరలోక శాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును.






సంస్కారములు మొత్తము పదహారు. వీటినే షోడశ సంస్కారములు అని కూడా వ్యవహరించెదరు. ఈ పదహారు సంస్కారములను తిరిగి రెండు విభాగములగా క్రింద విభజించారు. అవి...

1) జనన పూర్వ సంస్కారములు (పుట్టుకకు ముందు)

2) జననానంతర సంస్కారములు (పుట్టిన తరువాత).

మొదటి మూడు సంస్కారములు జనన పూర్వ సంస్కారములు, ఆపై పదమూడు సంస్కారములు జననానంతర సంస్కారములు.











వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో జరిపే సంస్కారాలు...

1) గర్భాదానం

2) పుంసవనం

3) సీమంతం

4) జాతకర్మ

5) నామకరణం

6) నిష్క్రమణ

7) అన్నప్రాశన

8) చూడాకరణ

9) కర్ణవేధ

10) అక్షరాభ్యాసం

11) ఉపనయనం

12) వేదారంభం

13) కేశాంత

14) సమావర్తన

15) వివాహం

16) అంత్యేష్టి...

Thursday, February 11, 2021

రాశికొక జ్యోతిర్లింగం

మేషరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం రామేశ్వరం. మేషరాశి కుజునికి స్వగృహం. చరరాశి వారికి పదకొండవ రాశ్యాధిపతి శని బాధకుడు. గ్రహపీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర, సుత్రామ పర్ణీ జరరాషి యోగే, నిబధ్య సెతుం విశిఖైర సంఖ్యె శ్రీరామ చంద్రేన సమర్పితం త, రామేశ్వరాఖ్యం నియతం నమామి అనె శ్లోకం రోజూ చదువుకొవాలి. శ్రీరామచంద్రుడు శని బాధానివారణార్థం రామేశ్వర లింగాన్ని స్థాపించాడని ప్రతీతి.

వృషభరాశి వారి పూజాలింగం సోమనాథ జ్యోతిర్లింగం. ఈ రాశి శుక్రునికి స్వగృహం, చంద్రునికి ఉచ్ఛ రాశి. సోమనాథ జ్యోతిర్లింగం శ్రీకృష్ణుడు స్థాపించిన మహాలింగం. ఈ రాశివారు శనిదోష శాంతికి సోమనాథ దేవాలయ దర్శనం, సౌరాష్ట్ర దేశే విదేశేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం, భక్తి ప్రాదానాయ క్రుపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకధ్యానం చేయడం శుభప్రదం. ఈ రాశివారు జన్మ నక్షత్రంలో సోమనాథంలో రుద్రాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు పొందగలరు.

మిధునరాశి వారి జ్యోతిర్లింగం నాగేశ్వర లింగం. ఈ రాశి బుధునికి స్వగృహం. గ్రహదోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, రోజూ యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భోగై, సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పఠించడం, ఈ రాశిలో శని సంచారకాలంలో కైలాసయంత్రప్రస్తార మహాలింగార్చన జరిపిస్తే విశేష ఫలితాలు ఉంటాయి.

కర్కాటకరాశి వారికి ఓంకారేశ్వరలింగం పూజనీయ జ్యోతిర్లింగం. ఈ రాశి చంద్రునికి స్వగృహం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, రోజూ కావేరికా నర్మదాయో పవిత్రే, సమాగమే సజ్జన తారణాయ, సడైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే అనే శ్లోకం పఠించడం, జన్మనక్షత్రం ఉన్న రోజు ఓంకార బీజాక్షరం జపించడం శుభకరం.

సింహరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘృష్ణేశ్వర  జ్యోతిర్లిగం దర్శనం, ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతం చ జగద్వ రేణ్యం, వందే మహాదారాతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని నిత్యం పఠించడం ద్వారా సర్వదోషాల నుండి విముక్తులు కావచ్చు.

కన్యారాశి వారికి శ్రీశైల జ్యోతిర్లింగం పూజాలింగం. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరు అన్నిరకాల బాధల నుండి ఉపశమనం పొందడానికి శ్రీశైల మల్లికార్జున దర్శనం, భ్రమరాంబకు కుంకుమ జన్మనక్షత్రం రోజున చండీ హోమం చేసుకోవాలి. శ్రీశైల శృంగే విభుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం, తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.

తులారాశి వారికి పూజాలింగం మహాకాళేశ్వర లింగం. ఈ రాశికి శుక్రుడు అధిపతి. మహాకాళేశ్వర దర్శనం, శుక్రవారపు సూర్యోదయ సమయంలో ఆవన్తికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం, అకాల మ్రుత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని గ్రహదోషాల నుండి, బాధల నుండి విముక్తి పొందవచ్చు.

వృశ్చికరాశి వారికి వైద్యనాథేశ్వర లింగం పూజాలింగం. ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్రచికిత్సలకి కారణభూతమైన రాశి. వైద్యనాథేశ్వరుని దర్శించడం, పూజించడం, మంగళవారం పూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే, సాదావసంతం గిరిజాసమేతం, నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాదం తమహం నమామి అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.

విశ్వేశ్వరలింగం ధనూరాశివారి పూజాలింగం. ఈ రాశి వారికి గురుడు అధిపతి, సానందవనే వసంతం. ఆనందకందం హతపాపబృందం వారణాసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, కాశీ క్షేత్ర దర్శనం, గురువారం రోజున, శనగల దానం ద్వారా శని, గురూ గ్రహదోషాల నుండి విముక్తి పొందవచ్చు.

భీమశంకర లింగం మకరం వారి పూజాలింగం. ఈ రాశి అధిపతి శని. ఇది గురునికి నీచ, కుజునికి ఉచ్ఛ, తెలిసో, తెలియకో చేసిన దోషాల నుంచి విముక్తికిగాను భీమశంకర దర్శనం, యం ఢాకినీ శాకినికాసమాజైః నిషేమ్యమాణం పిశితశనైశ్చ, సదైవ భీమాదిపద ప్రసిద్ధం, తం శంకరం భూతహితం నమామి అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, శనివారం నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం ఈవాడం, అవిటివారికి ముసలివారికి వస్త్ర దానం చేయడం మంచిది.

కుంభరాశి వారికి కేదారేశ్వర లింగం శేయోలింగం. ఈ రాశికి శని అధిపతి. గ్రహపీడలు, శత్రుబాధలు, ఇతర దోషాల విముక్తికిగాను ఈ రాశివారు కేదారేశ్వర దర్శనం. నిత్యం మహాద్రి పార్శ్వేచ మునీంద్రైః సురాసురై ర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేక మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయాలి.శనివారం రుద్రాభిషేకం చేస్తే మంచిది.

త్ర్యంబకేశ్వర లింగం మీనరాశి వారి జ్యోతిర్లింగం. ఈ రాశి అధిపతి గురుడు. త్ర్యంబకేశరుడు ఎప్పుడూ నీటి మద్యలో ఉంటాడు. త్ర్యంబకేశ్వర దర్శనం, స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచుకోవడం, నిత్యం సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే, యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తం త్ర్యంబక మీశ మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయటం సకల శుభాలను కలిగిస్తుంది.

సేకరణ

Wednesday, February 10, 2021

విష్ణు సహస్రనామం ఎవరూ రాసుకోలేదు .. మనకెలా అందింది ?

 భీష్మపితామహ విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు, ధర్మరాజుతో సహా. కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?

అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తినీ అక్కడున్న వారినందిరినీ వుద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది" అని అడిగారు. 

ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?"

ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"  

స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"

మళ్ళీ నిశబ్దం.

స్వామివారు చెప్పడం మొదలుపెట్ట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, అందరూ కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని యుదిష్టురుడిగాడు. 

"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.  

శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.  

"అదేలా" అని అందరూ అడిగారు. 

శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. 

శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస మహర్షి వ్రాసిపెట్టాడు. 

ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.

జయ జయ శంకర !  హర హర శంకర !! గురుభ్యో నమ:

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...