Thursday, August 18, 2022

హనుమాన్ చాలీసా మహత్యం…!

ఉత్తరభారతదేశంలో క్రీ||శ||16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయభాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన ‘రామచరితమానస్’ సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు.

తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ బాదుషాకు తరచుగా పిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.

ఇదిఇలావుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడు అయిన గృహస్టు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యేష్టి జరగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకోన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరచి ‘దీర్ఘసుమంగళీభవః’ అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్నా శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ ‘తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు!’ అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.

ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభాక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలంతా ఢిల్లీకి

వెళ్ళి బాదుషాకు స్వయముగా వవరించి తగిన చర్య తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.

పాదుషా: తులసీదాస్ జీ! మీరు రామనామం అన్నింటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట!

తులసీదాస్: అవును ప్రభూ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?

పాదుషా: అలాగా! రామానామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు, నిజమేనా?

తులసీదాస్: అవును ప్రభూ! రామనామానికి మించినదేమి లేదు.

పాదుషా: సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.

తులసీదాస్: క్షమించండి ప్రభూ! ప్రతి జీవి జనన మనరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుతుతాయి. మానవమాత్రులు మార్చలేరు.

పాదుషా: తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సుభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి!

తులసీదాస్: క్షమించండి! నేను చెప్పేది నిజం!

పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, ‘తులసీ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!’ అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్ధించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంటే! ఇక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హాటాత్ సంఘటనతో అదరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.

ఆ స్త్రోతంతో ప్రసన్నుడైన హనుమంతుడు ‘తులసీ! నీ స్త్రోత్రంతో మాకు చాల ఆనందమైంది. ఏమీకావాలో కోరుకో!’ అన్నాడు. అందుకు తులసీదాస్ ‘తండ్రీ! నా కేమి కావాలి! నేను చేసిన నీ స్త్రోత్రం లోక క్షేమం కొఱకు ఉపయోగపడితే చాలు, నా జన్మ చరితార్థమవుతుంది. నా ఈ స్త్రోతంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ! అని కోరుకున్నాడు.

ఆమాటలతో మరింతప్రీతిచెందిన హనుమంతుడు ‘తులసీ! ఈస్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమేం వహిస్తాము’ అని వాగ్దానం చేశారు. అప్పట్నుండి ఇప్పటివరకు ‘హనుమాన్ చాలీసా’ కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.

అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక ‘హనుమాన్ చాలీసా’. దాదాపు 500 ఏళ్ల తరువాత కూడా ప్రతి ఇంతా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది.

కేశవ నామాలు-గణిత భూమిక

విష్ణుమూర్తికి 24 పేర్లున్నాయి. వాటిని కేశవ నామాలంటారని మనకు తెలుసు. ఇవి 24మాత్రమే ఎందుకు ఉన్నాయి?వీటికి కాలచక్రానికి, గణితానికి ఏమైనా సంబంధం వున్నదా?

ఈ *24 కు గణిత పరమైన భూమిక ఏమిటి?

విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటాం. అంటే నాలుగు చేతులు గలవాడని కదా. ఈ నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మాలను ధరించి మనకు దర్శనమిస్తాడు.

నిశితంగా పరిశీలిస్తే, ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలలో వచ్చే మార్పుల వల్ల ఖచ్చితంగా 24 వేరువేరు రూపాలు విష్ణువునకు ఏర్పడతాయి. ఈ 24 రూపాలనే కేశవనామాలంటారు.

1. కేశవ నామాలలో మొదటి నామం ‘కేశవ’.

కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో ‘పద్మము, శంఖము’ ధరించి ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో ‘గద, చక్రం’ధరించి ఉంటాడు.

2. విష్ణువు యొక్క మరొక నామము ‘మాధవ’.

ఈ రూపంలో కుడి వైపు రెండు చేతులతో ‘గద, చక్రం’ ధరించి, ఎడమవైపు ఉన్న రెండు చేతులతో ‘పద్మము, శంఖము’ ధరించి ఉంటాడు.

3. ‘మధుసూధన’ రూపంలో… 

కుడివైపు చేతులతో ‘చక్రం, శంఖము’ మరియు ఎడమవైపు చేతులతో ‘గద, పద్మము’ ధరించి ఉంటాడు.

ఈవిధంగా ప్రతి పదిహేను రోజులకు (పక్షానికొకసారి) - ’పౌర్ణమికి, అమావాస్య కు’ తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు శ్రీ మహా విష్ణువు.

ఈ మార్పులు లేదా అమరికలను మనం గణిత శాస్త్ర పరిభాషలో ప్రస్తారాలు(permutations) అంటాం.

అనగా 4 వస్తువులను 4 (4 factorial) విధాలుగా అమర్చవచ్చు.

 4! = 4×3×2×1=24.

శంఖాన్ని 'శ' తోను,

చక్రాన్ని 'చ' తోను,

గదను 'గ' తోను,

పద్మాన్ని ' ప'తోను సూచిస్తే,


ఆ 24 అమరికలు క్రింది విధంగా వుంటాయి.


1) శచగప 2) శచపగ

3) శపచగ 4) శపగచ

5)శగచప 6)శగపచ

7)చపగశ 8)చపశగ

9)చగపశ 10)చగశప

11)చశగప 12)చశపగ

13)గపశచ 14)గపచశ

15)గచశప 16)గచపశ

17)గశపచ 18)గశచప

19)పచగశ 20)పతశగ

21)పశగచ 22)పశచగ

23)పగశచ 24)పగచశ.

[పైవన్నీ ఒక క్రమంలో ఉన్నట్లు పరిశీలించి ఉంటారు.] 

ఈ 24 నామాలు పెద్దలందరికీ తెలిసినా‌...మరోసారి క్రింద ఉదహరిస్తున్నాను.


కేశవ, నారాయణ

మాధవ, గోవింద

విష్ణు, మధుసూధన

త్రివిక్రమ, వామన

శ్రీధర, హృషీకేశ

పద్మనాభ, దామోదర

సంకర్షణ, వాసుదేవ

అనిరుధ్ధ, ప్రద్యుమ్న,

పురుషోత్తమ,vఅధోక్షజ

నారసింహ, అచ్యుత

జనార్ధన, ఉపేంద్ర

హరి, శ్రీకృష్ణ.


ఈ నాలుగు ఆయుధాలను అన్ని విధాలుగాను మార్చుకోవటానికి '24 పక్షాలు' అంటే ‘12 నెలలు’      అనగా ‘ఒక సంవత్సరం’పడుతుంది.

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...