Friday, December 30, 2016

రమణ మహర్షి

➖➖➖➖👋🏻➖➖➖➖➖➖➖👋🏻➖➖➖➖
మహా మౌని, ఆద్యాత్మకం.! రమణీయం..!!
నేడే భగవాన్ రమణ మహర్షి జయంతి   - 30-Dec-2016
➖➖➖➖➖🙏🏻➖➖➖➖➖➖➖➖➖🙏🏻➖➖➖➖➖
🔸భగవంతుణ్ణి నీ అంతర్నేత్రంలో దర్శించడానికి నిన్ను నీవు తెలుసుకునే ఎరుకకు సరళమైన ఆధ్యాత్మికమార్గం మౌనమే అని తనజీవితం ద్వారా మనకు చూపించిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి.

🔸మౌనంలో విశ్రమించు, మనస్సు మూలాల్ని అన్వేషించు, ‘నేను’అనే భావం ఎక్కడినుంచి వస్తుందో చింతన చేస్తూ పరిశీలిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది. అదే మౌన తపస్సు అంటారు మహర్షి. నిశ్శబ్దాన్ని ఆశ్రయంగా చేసుకుని చేసే మౌన సాధన వల్లే ఈశ్వర సాక్షాత్కారమవుతుంది అని ఉపదేశించేవారు అరుణాచల రమణులు.

🔸తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో  1879 డిసెంబర్ 30న వెంకటరామన్‌గా జన్మించిన రమణ మహర్షికి పదహారు సం"లున్నప్పుడు అంతు తెలియని జబ్బు చేసింది. మరణం అంచుల దాకా వెళ్లి, భగవత్ కృపతో బతికి బయటపడ్డారు. ఆ సమయంలో తన మనసులో కలిగిన ప్రేరణతో ఇల్లు వదిలి ఎన్నో దివ్యస్థలాలకు నెలవైన అరుణాచల పర్వతాన్ని చేరారు. అక్కడి కొండ గుహలలో ధ్యానం చేసుకుంటూ, మౌనస్వామిగా పేరు పొందారు.

🔸విరూపాక్ష గుహలో ధ్యాన మగ్నుడై ఉన్న ఈ బాలయోగిని 'కావ్యకంఠ గణపతి ముని' సందర్శించుకుని, తనను చిరకాలంగా పట్టి పీడిస్తున్న ఎన్నో సందేహాలను తీర్చుకుని, ఆయనకు రమణ మహర్షిగా నామకరణం చేశారు. అప్పటినుంచి దేహాన్ని చాలించే వరకు రమణ మహర్షి ఆ ప్రదేశాన్ని వీడి ఎక్కడకూ వెళ్లలేదు.

🔸అరుణాచలంలో అడుగిడినప్పటినుంచి చాలాకాలం వరకు మౌనంలోనే ఉన్నారు మహర్షి. భక్తులు అడిగిన ఆధ్యాత్మిక సంబంధమైన ప్రశ్నలకు సమాధానాలు రాసి చూపుతూ ఉండేవారు. కొన్నాళ్ల తర్వాత జిజ్ఞాసువులైన భక్తులపట్ల ఆదరంతో పెదవి విప్పి పరిమితంగా మాట్లాడేవారు. అవి భక్తుల సందేహాలను తీర్చేవి, వారి బాధలను రూపుమాపేవి. అలా  మౌనోపదేశం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, చిత్తశాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్యజ్యోతి స్వరూపులు భగవాన్ రమణులు.

🔸 రమణుల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సమకా లీన భారతీయులకు తెలియజేసినవారిలో ముఖ్యులు కావ్యకంఠ గణపతి ముని కాగా పాశ్చాత్యులకు పరిచయం చేసిన వారిలో ప్రధానమైనవాడు పాల్ బ్రింటన్. రమణ మహర్షి దీర్ఘమౌనంలోని అంతరార్థాన్ని గ్రహించిన బ్రింటన్, అనంతర కాలంలో ఆయనకు శిష్యుడై, అమూల్యమైన తన పుస్తకాల ద్వారా భగవాన్ జ్ఞానసంపదను ప్రపంచానికి చేరువ చేశారు.

🔸అద్వైత వేదాంతమే తన తత్వంగా నిరూపించుకున్న రమణ మహర్షి జంతువు లు, పక్షులు, సమస్త జీవులలోనూ ఈశ్వరుణ్ణి సందర్శించారు.  ఆయనే అనేక మంది భక్తులకు ఆరాధ్యదైవం గా దర్శనమిచ్చారు. ఆయన అలా అగుపించింది కేవలం హిందూమతంలోని వారికే కాదు, బౌద్ధులకు బుద్ధ భగవానుడిగా, క్రైస్తవులకు జీసస్‌గా, ముస్లిములకు మహమ్మద్ ప్రవక్తగా కూడా దర్శనమిచ్చినట్లు అనేకమంది చెప్పుకున్నారు. తన ఆశ్రమంలో యథేచ్ఛగా సంచరించే అనేకమైన ఆవులను, కోతులను, లేళ్లను, శునకాలను కూడా ఆయన అది, ఇది అనేవారు కాదు. అతడు, ఆమె అనే సంబోధించేవారు. పక్షపాతం చూపడాన్ని, ఆహార పదార్థాలను వృథా చేయడాన్ని ఆయన చాలా తీవ్రంగా పరిగణించేవారు.

🔸‘‘గురువు మౌనంలో ప్రతిష్థితుడైతే, సాధకుని మనస్సు దానంతట అదే విశుద్ధిని పొందు తుంది’’ అని చెప్పిన రమణులు అరుణాచలంలో అడుగిడినప్పటినుండి సిద్ధిని పొందేవరకు మౌనం అనే విలువైన సాధన ద్వారానే అమూల్యమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపదను మనకందించారు.1950, ఏప్రిల్ 14న తనువు చాలించేవరకు ఆయన కొన్ని వేల మందికి తన ఉపదేశాల ద్వారా ఉపశమనం కలిగించారు. కొన్ని వందలమంది పై చెరగని ముద్ర వేశారు. కొన్ని తరాల వారిపై బలంగా ప్రభావం చూపారు. ఇప్పటికీ కూడా అనేకులు రమణ మహర్షి నిజంగా భగవానులే అని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని ఆయన ఎప్పుడూ వమ్ము చేయలేదు, చేయరు కూడా! ఎందుకంటే వారి నమ్మకమే ఎంతో రమణీయమైనది మరి!
 〰〰〰〰〰〰
రమణ వాణి....👋🏻
〰〰〰〰〰〰
🍥మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలోని కొన్ని నీటిబిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్ర మంతా మురికిగా ఉందనుకోవడం అవివేకం.

🍥మానవత్వాన్ని వదులుకోకుం డా కడదాకా కొనసాగించడం వివేకవంతుని లక్షణం.

🍥భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతదూరంలో ఉంటాడు.

🍥సావధానంగా వినటం, సంయమనంతో సమాధానమివ్వటం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవటం, ప్రశాంతంగా జీవించటం అందరికీ అవసరం.

🍥నీ సహజస్థితి ఆనందమే. దానిని కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. అయితే అది బయట ఎక్కడో ఉందనుకోవడ మే తప్పు. అది నీలోనే ఉంది. అది గ్రహించడమే జ్ఞానవంతుల లక్షణం.

🍥భగవంతుని అనుగ్రహం ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. దానిని పొందడానికి అవసరమై నవే ప్రయత్నం, సాధన.

🍥మన జీవితంలో అనివార్య మైన, నిశ్చయమైన ఏకైక ఘటన మృత్యువు. దానిని గుర్తించి, చనిపోయేవరకు సకల జీవుల పట్ల సంయమనంతో, విచక్షణ తో మెలగడం అందరికీ అత్యవసరం.

🍥జీవితంలో వ్యతిరేక పరిస్థితులు ఎవరికైనా తప్పవు. అయితే అన్నీ భగవంతుని నిర్ణయం ప్రకారమే జరుగుతాయని తెలుసుకుని, భారాన్ని ఆయన మీద వేసి, వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి.

🍥మన మనసులోని తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు. ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేక మేడలే. వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి, వాటి మీది నుంచి దృష్టిని మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోక తప్పదు.

🍥సజ్జనులతో సహవాసం జన్మజన్మల వాసనలను రూపుమాపడంలో తోడ్పడుతుంది.

🍥మనం నమ్మిన వారిని భౌతికంగా మాత్రమే కాదు, వారిని స్మరించడం, ధ్యానించడం, వారితో మానసికంగా అనుబంధం పెట్టుకోవడం ద్వారా కూడా వారి సాయం లభిస్తుంది.

🍥నీ విశ్వాసమే నీ ఆయుధం.

🍥“ నిన్ను నీవు తెలుసుకోకుండా, జగత్తును తెలుసుకోవాలను కుంటే, అది నిన్ను చూసి వెక్కిరి స్తుంది. నీ మనస్సు యొక్క ఫలితమే, ప్రపంచం. ముందు ఆ మనస్సుని తెలుసుకో. తర్వాత జగత్తును చూడు. అప్పుడు అది ఆత్మ కంటే అన్యంగా, భిన్నంగా , విడిగా లేదని తెలుసుకుంటావు” అంటారు రమణులు.

🍥ఒక భక్తుడు “ ఉద్యోగానికి రాజీనామా చేసి , నిరంతరం భగవాన్ సన్నిధిలో వుండాలనే తలంపు వుంది నాకు “ అని అడిగినప్పుడు భగవాన్ ఇలా సమాధానమిచ్చారు. “ భగవాన్ ఎప్పుడూ మీతోనే, మీలోనే మీరయ్యే వున్నారు. ఈ సత్యా సాక్షాత్కారా నికి ఉద్యోగానికి రాజీనామా చేయనవసరం లేదు. ఇంటి నుంచి పలాయనం చేయనవ సరం లేదు. పరిత్యాగమంటే వస్త్రాల్ని మార్చడం, కుటుంబ బండాల్ని బహిష్కరిం చడం, ఇంటిని, ఇల్లాలిని వదలడం కాదు. కానీ, వాటిపై వున్న కోర్కెల్ని,బంధాల్ని, అనుబంధాల్ని విడుచుటే. ఉద్యోగానికి రాజీనామా చేయవలసి పని లేదు. కానీ, ఈ సమస్త భారాల్ని మోసే భగవంతునితో రాజీపడు. అందరి భారాల్ని మోసే వాడు అతనే. కోర్కెల్ని పరిత్యుజించువాడు విశ్వంలో లీనమై, సమస్త ప్రపంచాన్ని ప్రేమించగలుగుతాడు. ప్రేమ, వికాసం, అనురాగం కలిగివుండటం నిజమైన దైవభక్తుని లక్షణాలు. పరిత్యాగం కంటే . ఎందుకంటే, సన్నిహితమైన తన బంధాన్ని, ప్రేమను, జాతి-మత-కుల పరిమితులను దాటుటే, వాటిని అధిగమించుటే నిజమైన పరిత్యాగం.

🍥సన్యాసి తన వస్త్రాల్ని, ప్రపంచాన్ని, ఇంటిని విసర్జిస్తున్నాడంటే, విరక్తి వల్ల కాదు. అట్లా చేయడం కానీ, తన చుట్టూ వున్న ప్రపంచాన్ని ప్రేమించి, సేవించాలనే కోరికతో అలా పరిత్యాగం చేస్తాడు. ఆ వికాసం కలిగినప్పుడు , తాను ఇంటి నుండి పారిపోతున్నాననే భావన వుండదు. కానీ, అది చెట్టు నుంది రాలిపోయిన పండు వలె సహజంగా జరుగుతుంది. పరిపక్వత రానంత వరకూ ఇల్లు , ఉద్యోగం వదులుట తెలివితక్కువ తనం.” అని ఎంతో సమగ్రంగా, వివరంగా అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు చెప్పారు భగవాన్.
〰〰 🌸🙏🌸. 〰〰

శివుడు - విష్ణువు

🍀👌🍀

అనగనగా ఒక రామ భక్తుడు .

రాముడంటే వల్లమాలిన ప్రేమ . పోనీలే అని విష్ణువన్నా నమస్కరిస్తాడు .


శివుడి పేరు ఎత్తడు .

ఒక సారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇమ్మన్నాడు .


ఆ పెద్దాయనకీ తెలుసు ఇతడికి శివుడు అంటే పడదని . సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు .


విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను . మీ విష్ణువు సంతోషిస్తాడు చదువుకో అంటూ .


గవీశపాత్రో నగజార్తిహారీ కుమారతాతః శశిఖండమౌళిః
లంకేశ సంపూజితపాదపద్మః పాయాదనాదిః  పరమేశ్వరో నః


ఆశ్చర్య పోయాడు చదవగానే .

అందులో ఏమని చెప్పబడింది ? పరమేశ్వరః నః పాయాత్  అని .


అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం .


తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి  విశేషణాలు . అర్ధం చూడండి :


గవీశపాత్రః .... గవాం ఈశః  గవీశః ....

ఆవులకు ప్రభువు అయిన వృషభం .అది వాహనం గా కలవాడు గవీశపాత్రః . అంటే సదాశివుడు .


నగజార్తి హారీ ... నగజ అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే .


కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్ధమ్...


కుమారస్వామి యొక్క తండ్రి అయిన వాడూ , శివుడే నిస్సందేహంగా .


శశి ఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.


లంకేశ సంపూజిత పాద పద్మ:

లంకాధిపతి అయిన రావణుని చే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ.


అనాదిః ... ఆది లేని వాడూ  ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ .

అటువంటి....  పరమేశ్వరః నః పాయాత్ ....  


వృషభ వాహనుడూ , పార్వతీ పతి , కుమార స్వామి తండ్రీ , చంద్రశేఖరుడూ , రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం .


అర్ధం తెలియ గానే మతి పోయింది . వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది .


అది పట్టుకుని తెగ తిరిగాడు .


చివరికి ఒకాయన అది విష్ణువుని కీర్తించేదే  ... ఏమీ అనుమానం లేదు అని అతడిని ఓదార్చాడు .


ఇది మరో ఆశ్చర్యం .

అనాది అనే మాటలో ఉంది అంతా .

కిటుకు చూడండి ....


 పరమేశ్వరుడు ఎలాటివాడూ  అంటే అనాదిః అట .


అంటే ఆది లేని వాడు . అంటే పరమేశ్వర లో ఆది అక్షరం లేనివాడు .

ఇప్పుడు ఏమయ్యింది ?


రమెశ్వరః అయ్యింది . అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా !


గవీశపాత్రః... లో గ తీసెయ్యండి .. వీశపాత్రః అవుతుంది .


విః  అంటే పక్షి అని అర్ధం .


వీనామ్  ఈశః  వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు , ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు .


నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి .... గజార్తి హారీ ... గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు .


కుమారతాతః .... ఆది అక్షరం తీసేస్తే ... మారతాతః .... మన్మధుని తండ్రి అయిన విష్ణువు .


శశి ఖండ మౌళి: ... మొదటి అక్షరం లేక పోతే శిఖండమౌళిః... నెమలిపింఛము ధరించిన విష్ణువు .


లంకేశ సంపూజిత పాద పద్మ:...

మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ...


కేశ సంపూజిత పాద పద్మ:... క అంటే బ్రహ్మ ,


ఈశః  అంటే రుద్రుడు ... అంటే బ్రహ్మ రుద్రేన్ద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు .


అతడు మనలను కాపాడు గాక ....


గరుడ వాహనుడూ , గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ , మన్మధుని తండ్రీ , నెమలి పింఛము దాల్చిన వాడూ , బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .... విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .


ఇప్పటికి అతడు శాంతించాడు. సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి .


సర్వదెవతలలొ  విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు .


సర్వ దేవతలలో శివుని దర్శించగలిగితే వాడు  శైవుడు . అందమైన ఈ శ్లోకపు కర్త తెలియదు .

💟 🍀 👌 🍀 💟 🍀 👌 🍀 💟

Wednesday, December 28, 2016

హైందవ సంస్కృతి లో 8,18 అంకెలకు గల ప్రాధాన్యత

🕉🕉🕉🕉🕉 🕉🕉 🕉 🕉

అష్ట లక్ష్మి: ఆది లక్ష్మి, ధాన్యలక్ష్మి , ధైర్యలక్ష్మి , గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి
💜💜💜💜 💜💜 💜💜 💜

అష్టాదశ పీఠాలు:

1. శ్రీ శాంకరీదేవి ( ఎకోమలి , శ్రీలంక )
2. శ్రీ కామాక్షీదేవి (కంచి, తమిళనాడు)
3. శ్రీ శృంఖలాదేవి ( ప్రదుమ్నం, గుజరాత్)
4. శ్రీ చాముండేశ్వరీదేవి ( మైసూరు,కర్నాటక)
5. శ్రీ జోగులాంబాదేవి (అల్లంపురం, ఆంధ్రప్రదేశ్)
6. శ్రీ భ్రమరాంబాదేవి ( శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్)
7. శ్రీమహాలక్ష్మి దేవి ( కొల్హాపూర్, మహారాష్ట్ర)
8. శ్రీ ఏకవీరాదేవి ( నాందేడ్ , మహారాష్ట్ర )
9. శ్రీమహాకాళీదేవి ( ఉజ్జయినీ, మధ్యప్రదేశ్ )
10. శ్రీ పురుహూతికాదేవి (పీఠాపురం, ఆంధ్రప్రదేశ్ )
11. శ్రీ గిరిజాదేవి ( కటక్, ఒరిస్సా)
12. శ్రీ మానిక్యాంబాదేవి ( ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్)
13. శ్రీ కామరూపిణీదేవి (గౌహతి, అస్సాం)
14. శ్రీ మాధవేశ్వరి దేవి ( ప్రయాగ, ఉత్తరప్రదేశ్)
15. శ్రీ వైష్ణవీదేవి ( జ్వాలాకేతం, హిమాచలప్రదేశ్)
16. శ్రీ మాంగల్య గౌరీదేవి ( గయా, బీహార్)
17. శ్రీ విశాలాక్షీదేవి ( వారణాశి, ఉత్తరప్రదేశ్)
18. శ్రీ సరస్వతీదేవి ( జమ్మూ కాశ్మీర్)
💙💙💙💙 💙💙 💙💙 💙

అష్టా దశ పురాణాలు:

1. బ్రహ్మపురాణం
2. పద్మపురాణం
3. నారద పురాణం
4. మార్కండేయపురాణం
5. విష్ణుపురాణం
6. శివపురాణం
7. భాగవతపురాణం
8. అగ్నిపురాణం
9. భవిష్యపురాణం
10. బ్రహ్మవైవర్త పురాణం
11. లింగపురాణం
12. వరాహపురాణం
13. స్కందపురాణం
14. వామనపురాణం
15. కుర్మపురాణం
16. మత్స్యపురాణం
17. గరుడపురాణం
18. బ్రహ్మాండపురాణం
❤❤❤❤❤ ❤❤ ❤ ❤

అయ్యప్ప స్వామి గుడి మెట్లు:18

1. పొన్నంబలమేడు
2. గౌదేంమల
3. నాగమల
4. సుందరమల
5. చిత్తంబలమల
6. ఖల్గిమల
7. మాతంగమల
8. మైలదుమల
9. శ్రీపదమల
10. దేవరమల
11. నిలక్కలమల
12. తలప్పరమల
13. నీలిమల
14. కరిమల
15. పుతుసేరిమల
16. కలకేట్టిమల
17. ఇంచిప్పరమల
18. శబరిమల
💚💚💚💚💚 💚💚 💚 💚

అష్టదిక్పాలకులు:

1. తూర్పు (ఇంద్రుడు)
2. ఆగ్నేయం (అగ్ని)
3. దక్షిణం (యముడు)
4. నైరుతి (నిరుతి)
5. పశ్చిమం (వరుణుడు)
6. వాయువ్యం (వాయువు)
7. ఉత్తరం (కుబేరుడు)
8. ఈశాన్యం (ఈశానుడు)
💜💜💜💜 💜💜 💜💜 💜

అష్టమూర్తులు:

1. భూమి
2. ఆకాశం
3. వాయువు
4. జలము
5. అగ్ని
6. సూర్యుడు
7. చంద్రుడు
8. యజ్గ్యము చేసిన పురుషుడు.
💙💙💙 💙💙 💙💙 💙💙

అష్టఐశ్వర్యాలు:

1. ధనము
2. ధాన్యము
3. వాహనాలు
4. బంధువులు
5. మిత్రులు
6. బృత్యులు
7. పుత్రసంతానం
8. దాసిజనపరివారము
💛💛💛 💛💛 💛💛 💛💛

అష్టకష్టాలు:

1. అప్పు
2. యాచన
3. ముసలితనం
4. వ్యభిచారం
5. చోరత్వం
6. దారిద్యం
7. రోగం
8. ఎంగిలి భోజనం
❤❤❤ ❤❤ ❤❤ ❤❤

అష్టఆవరణాలు:

1. విభూది
2. రుద్రాక్ష
3. మంత్రము
4. గురువు
5. లింగము
6. జంగమ మాహేశ్వరుడు
7. తీర్థము
8. ప్రసాదము
💜💜💜 💜💜 💜💜 💜💜

అష్టవిధ వివాహములు:

1. బ్రాహ్మం
2. దైవం
3. ఆర్షం
4. ప్రాజాపత్యం
5. ఆసురం
6. గాంధర్వం
7. రాక్షసం
8. ఫైశాచం
💚💚💚💚💚 💚💚 💚 💚

అష్టభోగాలు:

1. గంధం
2. తాంబూలం
3. పుష్పం
4. భోజనం
5. వస్త్రం
6. సతి
7. స్నానం
8. సంయోగం
💙💙💙💙 💙💙 💙💙 💙

అష్టాంగ యోగములు:

1. యమము
2. నియమము
3. ఆసనము
4. ప్రాణాయామము
5. ప్రత్యాహారము
6. ధారణ
7. ద్యానము
8. సమాధి
☸☸☸ ☸☸ ☸☸ ☸☸
జయతు     హిందూ     సంస్కృతి
జయతు     భారతీయ  సంస్కృతి
🕉🕉🕉 🕉🕉 🕉🕉 🕉🕉🙏

అన్నం పరబ్రహ్మస్వరూపం" అని ఎందుకు అంటారంటే.......

ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఎప్పుడన్నా అన్నం వదిలేస్తే పెద్దవాళ్ళు అన్నం అలా పారవేయకూడదు, "అన్నం పరబ్రహ్మస్వరూపం" అని అంటారు.

అలా ఎందుకు అంటారు అని ఎప్పుడన్నా పెద్దవాళ్ళను అడిగినా చిన్నపిల్లలు 100శాతం నమ్మేలా కారణం చెప్పరు. నిజానికి ప్రతి జీవి పుట్టకముందే ఆ జీవికి కావలసిన ఆహారపదార్ధాలు ఈ భూమి మీద పుట్టిస్తాడు ఆ భగవంతుడు.అందుకే ఏ జీవి ఈ నేల మీద పడ్డా నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దవాళ్ళు అంటారు.

అంటే మనము ఈ భూమి మీద పడకమునుపే మనకు ఇంత ఆహారం అనీ, ఇన్ని నీళ్ళు అని ఆ భగవంతుడు మన పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల లెక్కలు వేసి ఆహారాన్ని, నీళ్ళను, మనము ఎవరికి పుట్టాలో కూడా నిర్ణయించి ఈ భూమి మీదకు పంపుతాడు.

ఎప్పుడైతే ఒక జీవికి ఆయన ప్రసాదించిన నీళ్ళు, ఆహారం అయిపొతాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లి ఆ జీవికి ఆయువు పూర్తి అయిపోతుంది.

అందుకే మీకు పెట్టిన ఆహారం కానీ, నీళ్ళు కానీ వృధా చేయకుండా, నీకు అక్కరలేదు అనిపించినప్పుడు ఎవరికన్న దానం ఇవ్వడం వలన నీకు పుణ్యఫలం పెరిగి, నీకు ఇచ్చిన ఆహారం కానీ నీళ్ళు కానీ మరి కొంచం పెరిగి ఆయుష్మంతుడవు అవుతావు

లేదా నీకు అని ఆ దేవదేవుడు ఇచ్చిన ఆహారాన్ని నేలపాలు చేస్తే నీకు లెక్కగా ఇచ్చిన ఆహారం తరిగి నీ ఆయువు తరిగిపోతుంది.

ఏ తల్లి అయినా చూస్తూ చూస్తూ బిడ్డ ఆయువు తరిగిపోవడం చూడలేక అన్నం పారవేయకు అని పదిసార్లు చెబుతుంది, అవసరమైతే దండిస్తుంది. ఇదంతా మీకు వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మస్వరూపం పారవేయవద్దు అని మాత్రమే చెబుతారు.

అందుకే అన్ని దానాలలోకి అన్నందానం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ఈ భూమి మీద ఉన్న ఏ జీవికైనా ఆహారం పెడితే కడుపునిండా తిని
నిండు మనస్సుతో పెట్టినవారిని ఆశీర్వదిస్తారు.

అన్నదాత సుఖీభవ!!!

{ ఆహారాన్ని వృధా చేయకండి, ఏ ఆసరా లేని అనాథ వృద్ధుల, అభాగ్యుల ఆకలి తీర్చండి}

జయతు     భారతీయ  సంస్కృతి.

స్త్రీ విరోధి కాదు

మనుధర్మ శాస్త్రం ఒక పరిశీలన -7

శోచంతి జామయో యత్ర నినశ్యత్యాశు తత్కులమ్
న శోచంతి తు యత్రైతా వర్థతే తద్ది సర్వదా

వ్యభిచారులు, అత్యాచారులు, దుర్మార్గులైన పురుషుల వలన శోకించి ధుఃఖించే స్త్రీలు ఉన్న ఇల్లు, లేదా వంశం నశిస్తుంది. ఉత్తమ పురుషులతో ప్రసన్నంగా స్త్రీలు ఉన్న ఇల్లు లేదా వంశం ఎప్పుడూ అభివృద్ది చెందుతూ ఉంటుంది.

అరక్షితా గృహే రుద్దాః పురుషైరాప్తకారిభిః
ఆత్మానమాత్మనాయాస్తు రక్షేయుస్తాః సురక్షితాః

గృహంలో తండ్రీ, భర్త మొదలైన పురుషులున్నా కూడా స్త్రీలు ఎవరైతే తమను తాము రక్షించుకుంటారో వారే సురక్షితంగా ఉంటారు.

సువాసినీః కూమారీశ్చ రోగిణీ గర్బీణీః స్త్రియః
అదతిభ్యో 2గ్రేవైతాన్ భోజయే దవిచారయన్

నూతన వధూవరులకు, అల్పవయస్సుగల కన్యలకు, రోగగ్రస్తులైన స్త్రీలకు, గర్భవతులైన స్త్రీలకు, వీరికి అతిధులకంటే ముందు గా భోజనం పెట్టాలి.

పై శ్లోకాల వల్ల మనకు అర్థంకావలసింది ఒక్కటే మనువు స్త్రీ విరోధి కాదు. ముందు పోస్ట్ లలో మనుమహర్షి ఆస్తి విషయం లో స్త్రీలకు ఎలాంటి రక్షణ కల్పించాడో చూద్దాం.

అభిషేకము

ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము చాలా విశేషము.

"ఓం నమఃశివాయః, నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీ మన్మహాదేవాయ నమః".

అని చెప్పుకుంటూ ఇంట్లో కూడా ఆ సదాశివునికి జలముతో అభిషేకము చేయవచ్చు.   లేక
 "ఓం నమఃశివాయః" అనుచూ 108 సార్లు జపము చేసిన మంచిది.

Telugu Numbers in Hinduism

✨☀✨పంచ గంగలు✨
1. గంగ
2. కృష్ణ
3. గోదావరి
4. తుంగభద్ర
5. కావేరి

✨☀✨షడ్గుణాలు✨☀
 హిందూ సాంప్రదాయం ప్రకారం మనలోని 6 గుణాలుంటాయి.
అవి.
1. కామం
2. క్రోధం
3. లోభం
4. మోహం
5. మదం
6. మత్సరం

✨☀✨షట్చక్రాలు✨☀
మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు
1. మూలాధార చక్రము
2. స్వాధిష్ఠాన చక్రము
3. మణిపూరక చక్రము
4. అనాహత చక్రము
5. విశుద్ధ చక్రము
6. ఆజ్ఞా చక్రము

✨☀✨షడ్విధ రసము
 షడ్విధ రసములు
1. ఉప్పు
2. పులుపు
3. కారం
4. తీపి
5. చేదు
6. వగరు

✨☀✨షడృతువులు✨☀షడృతువులు - ఋతువులు 6
అవి
1. వసంత ఋతువు
2. గ్రీష్మ ఋతువు
3. వర్ష ఋతువు
4. శరదృతువు
5. హేమంత ఋతువు
6. శిశిర ఋతువు

✨☀✨సప్త గిరులు✨☀కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ఏడు కొండలు కలవు.వీటినే సప్త గిరులు అని అంటారు.   అవి.
1 శేషాద్రి
2 నీలాద్రి
3 గరుడాద్రి
4 అంజనాద్రి
5 వృషభాద్రి
6 నారాయణాద్రి
7 వేంకటాద్రి

✨☀✨సప్త స్వరాలు✨☀మన భారతీయ సంగీతంలో 7 స్వరాలు కలవు. వీటినే సప్త స్వరాలు అని పిలుస్తారు.
అవి.

1. స = షడ్జమం (నెమలి క్రేంకారం)
2. రి = రిషభం (ఎద్దు రంకె)
3. గ = గాంధర్వం (మేక అరుపు)
4. మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)
5. ప = పంచమం (కోయిల కూత)
6. ధ = ధైవతం (గుర్రం సకిలింత)
7. ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)

✨☀✨సప్త ద్వీపాలు✨☀బ్రహ్మాండ పురాణములోను, మహాభారతంలోను, భాగవతం సప్త ద్వీపాలగురించి ప్రస్తావన ఉంది.   అవి .
1. జంబూద్వీపం - అగ్నీంద్రుడు
2. ప్లక్షద్వీపం - మేధాతిథి
3. శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
4. కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
5. క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
6. శాకద్వీపం - హవ్యుడు
7. పుష్కరద్వీపం - సేవనుడు.

✨☀✨సప్త నదులు✨
1. గంగ
2. యమున
3. సరస్వతి
4. గోదావరి
5. సింధు
6. నర్మద
7. కావేరి

✨☀✨సప్త అధొలోకములు
1. అతలము
2. వితలము
3. సుతలము
4. తలాతలము
5. రసాతలము
6. మహాతలము
7. పాతాళము

✨☀✨సప్త ఋషులు✨1.వశిష్టుడ
2.ఆత్రి
3.గౌతముడు
4.కశ్యపుడు
5.భరద్వాజుడు
6.జమదగ్ని
7.విశ్వామిత్రుడు

✨☀✨పురాణాలలో అష్టదిగ్గజాలు✨☀✨
1. ఐరావతం
2. పుండరీకం
3. వామనం
4. కుముదం
5. అంజనం
6. పుష్పదంతం
7. సార్వభౌమం
8. సుప్రతీకం

✨☀✨అష్ట జన్మలు✨☀1.దేవ జన్మ
2. మనుష్య జన్మ
3. రాక్షస జన్మ
4. పిచాచ జన్మ
5. పశు జన్మ
6. పక్షి జన్మ
7. జలజీవ జన్మ
8. కీటక జన్మ

✨☀✨ అష్ట భార్యలు✨శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలును అష్ట భార్యలు లేదా అష్టమహిషులు అని అంటారు.
వారు
1. రుక్మిణి
2. సత్యభామ
3. జాంబవతి
4. మిత్రవింద
5. భద్ర
6. సుదంత
7. కాళింది
8. లక్షణ

✨☀✨అష్ట కష్టములు✨అష్ట కష్టములు
1. ఋణము
2. యాచన
3. ముసలితనము
4. వ్యభిచారము
5. దొంగతనము
6. దారిద్ర్యము
7. రోగము
8. ఎంగిలి తిని బ్రతుకుట

✨☀✨అష్ట కర్మలు✨☀
1. స్నానము
2. సంధ్య
3. జపము
4. హూమము
5. స్వాధ్యాయము
6. దేవ పూజ
7. ఆతిధ్యము
8. వైశ్యదేవము

✨☀✨అష్టభాషలు.✨☀1. సంస్కృతము
2. ప్రాకృతము
3. శౌరసేని
4. మాగధి
5. పైశాచి
6. సూళికోక్తి
7. అపభ్రంశము
8. ఆంధ్రము

✨☀✨నవధాన్యాలు✨☀మన నిత్య జీవితంలో ఉపయోగించే 9 రకాల ధాన్యాలను నవ దాన్యాలు అని పిలుస్తారు అవి -
గోధుమలు ,వడ్లు  ,పెసలు,
శనగలు , కందులు , అలసందలు,
నువ్వులు, మినుములు ,ఉలవలు

✨☀✨నవ రత్నాలు✨1.మౌక్తికం = ముత్యము
2.మాణిక్యం = కెంపు
3.వైఢూర్యం = రత్నం
4.గోమేదికం = పసుపురంగులోని ఒక రత్నం
5.వజ్రం
6.విద్రుమం = పగడం
7.పుష్యరాగం = తెల్లటి మణి
8.మరకతం = పచ్చ
9.నీలమణి

✨☀✨నవధాతువులు
1. బంగారం
2. వెండి
3.ఇత్తడి
4.సీసం
5.రాగి
6.తగరం
7.ఇనుము
8.కంచు
9.కాంతలోహం

✨☀✨నవబ్రహ్మల
1.మరీచి
2.భరద్వాజుడు
3.అంగీరసుడు
4.పులస్త్యుడు
5.పులహుడు
6.క్రతువు
7.దక్షుడు
8.వసిష్టుడు
9.వామదేవుడు

✨☀✨నవ చక్రములు✨మానవ శరీరంలో గల చక్రస్థానాలు.
1. మూలాధార చక్రము
2.స్వాధిష్టాన చక్రము
3.నాభి చక్రము
4.హృదయచక్రము
5.కంఠ చక్రము
6.ఘంటికాచక్రము
7.భ్రూవుచక్రము
8.బ్రహ్మరంధ్రము
9. గగన చక్రము

✨☀✨నవదుర్గలు✨☀
1 శైలపుత్రి దుర్గ
2 బ్రహ్మచారిణి దుర్గ
3 చంద్రఘంట దుర్గ
4 కూష్మాండ దుర్గ
5 స్కందమాత దుర్గ
6 కాత్యాయని దుర్గ
7 కాళరాత్రి దుర్గ
8 మహాగౌరి దుర్గ
9 సిద్ధిధాత్రి దుర్గ

✨☀✨దిశలు✨☀✨
1. తూర్పు
2. ఆగ్నేయం
3. దక్షిణం
4. నైఋతి
5. పడమర
6. వాయువ్యం
7. ఉత్తరం
8. ఈశాన్యం
9.భూమి (క్రింది ప్రక్క)
10.ఆకాశం (పైకి)

✨☀✨దశావతారాలు
1. మత్స్యావతారము
2. కూర్మావతారము
3. వరాహావతారము
4. నృసింహావతారము లేదా నరసింహావతారము
5. వామనావతారము
6. పరశురామావతారము
7. రామావతారము
8. కృష్ణావతారము
9. బుద్ధావతారము
10. కల్క్యావతారము

✨దశవిధ సంస్కారములు✨
1. వివాహము
2. గర్బాదానము
3.పుంసవనము
4.సీమంతము
5.జాతక కర్మ
6.నామకరణము
7.అన్న ప్రాశనము
8.చూడకర్మ
9.ఉపనయనము
10.సమావర్తనము

✨☀✨దశవిధ బలములు
1. విద్యా బలము
2.కులినితా బలము
3.స్నేహ బలము
4.బుద్ది బలము
5.ధన బలము
6.పరివార బలము
7.సత్య బలము
8. సామర్ద్య బలము
9. జ్ఞాన బలము
10. దైవ బలము

వేదం గోప్పదా ????

వేదం గోప్పదా  ?? అదిఏలా ?

అసలు ఈ సాంకేతిక విప్లవం లేని రోజుల్లో పుస్తకాలు లేదా గ్రంధాలు కూడా లేని కాలం నుండి మన వేదం పదిలంగా గురు శిష్య పరంపర ద్వారా కొన్ని కోట్ల తరాలగా సాగుతూ వస్తోంది. అసలు తప్పులు లేకుండా ఎక్కడా కూడా ఒక ఒట్టు, పొల్లు పోకుండా ఎలా వస్తున్నది అని నిరుటి శాస్త్రజ్ఞులు పరిశోధించగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మన పూర్వులు ఒక అద్భుతమైన శాస్త్రీయ పద్ధతిలో విద్యాబోధను చేసేవారు. ప్రతి పదం మెదడులో నిక్షిప్తమయి నోటి ద్వారా ఒకరినుండి మరొకరికి నేర్పబడుతోంది.

వేదాలను శృతి అని అంటారు. అంటే విని మరల మననం చేసి శిష్యులకు సాంప్రదాయంగా నేర్పుతారు. ఒక వేదమంత్రానికి  వర్ణం, స్వరం, మాత్ర(ఎంతసేపు పలకాలో), బలం(ఎక్కడ ఒత్తి పెట్టి పలకాలో), సమం(ఏక పద్ధతి) మరియు సంతాన (ఎక్కడ విరవాలో, ఎక్కడ పోడిగించాలో) అనే 6 ముఖ్య ప్రామాణిక సూత్రాలకు లోబడి వుంటుంది. వీటిలో ఏది మారినా ఆ మంత్రానికి మొత్తం అర్ధం మారిపోతుంది. వాటి వలన అనుకున్న దానికి వ్యతిరిక్త ఫలితాలు రావచ్చును.  ఇది నమ్మబుద్ధి కావడం లేదా.

ఒక ఉదాహరణ తీసుకుని ఆలోచిద్దాం. ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ తీసుకుని చర్చించుకుందాం
“ I never said she stole my money” - నేను   ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు
ఒక వేళ నేను ఒక  పదం మీద ఒత్తి పలికితే ఆ పదానికి వున్న అర్ధం మొత్తం మారిపోతుంది. ఈ పైన చెప్పిన వాక్యంలో ఒకొక్క పదం మీద బలం పెట్టి చూద్దాం

1. “ I” never said she stole my money – నేను   ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు. ( అంటే ఇంకెవరో అన్నారు )

2.  I “never” said she stole my money – నేను “ఎప్పుడూ” ఆ ఆమ్మాయి డబ్బు తీసింది అనలేదు ( ఇది సూటిగా అర్ధమయ్యే వాడుక )

3. I never “said” she stole my money – నేనెప్పుడూ ఆ అమ్మాయి డబ్బు తీసింది “అనలేదు” ( అనలేదు కానీ నాకు అనుమానం వుంది, లేదా నమ్మకం వుంది)

4. I never said “she” stole my money – ఆ అమ్మాయి తీసిందని నేను  అనలేదు ( మరెవ్వరో తీసి వుండ వచ్చును )

5. I never said she “stole” my money – ఆ అమ్మాయి దొంగాలించింది అని నేను అనలేదు ( మామూలుగా తీసుకుని ఉండవచ్చును, చేబదులు లేక మరో రకంగా)

6. I never said she stole “my” money – ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు ( కానీ పక్క వాడి డబ్బు దొంగలించి ఉండవచ్చును, లేక ఆ డబ్బు నాది కాక పోవచ్చును)

7. I never said she stole my “money” – ఆ అమ్మాయి నా “డబ్బు” దొంగాలించలేదు ( కానీ మరోకటేదో దొంగలించి ఉండవచ్చు)

చూసారా ఒకొక్క పదం మీద ఒత్తి పలకడం వలన ఒకొక్క అర్ధం మామూలు మన మాటల్లోనే వస్తున్నది. వేద ప్రోక్తమైన మంత్రాలలో ఉచ్చారణ, స్వర, అనుస్వరం ఎంత ప్రాముఖ్యమో మీకు ఈ పాటికి అర్ధమయి వుంటుంది.

ఈ వేదం మంత్రరాశిని కాపాడుకోవడానికి ఎన్నో పద్ధతులను మన ఋషులు వాడారు” వాక్య, పద, క్రమ, జత, మాల, శిఖా, రేఖా, ధ్వజ, దండ, రథ, ఘన” పద్ధతులలో నేర్చుకునేవారు. ఇవన్నీ అత్యంత గుహ్యమైన గొప్ప ఎర్రర్ కర్రెక్టింగ్ కోడ్స్.

క్రమ పాఠంలో 1-2; 2-3; 3-4; 4-5; పద్ధతిలో మంత్రాన్ని పఠిస్తారు. జట లో 1-2-2-1-1-2; 2-3-3-2-2-3;3-4-4-3-3-4; పద్ధతిలో, అదే ఘనంలో 1-2-2-1-1-2-3-3-2-1-1-2-3; 2-3-3-2-2-3-4-4-3-2-2-3-4 పద్ధతిలో పాఠం నేర్చుకుంటారు. దీని వలన ఎక్కడా కూడా ఏ అక్షరం, స్వరం పొల్లు పోకుండా కాపాదబడుతుంది.

ఒక ఘనాపాఠీ కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితను నేర్వాలంటే 2000 పైగా పంచశతి( 1 పంచశతి = 50 పాదాలు  => 109,308 పాదాలు. ప్రతి పాదానికి రమారమి 3 పదాలు => 3,30,000 పదాలు, 1 ఘనం 13 సార్లు ఉచ్చరించడం => 4,290,000 ఉచ్చారణలు పైన చెప్పిన 6 మూల సూత్రాలతో  )  చెప్పుకోవాలి. ఇది గురువుగారి దగ్గర శుశ్రూష చేసి నేర్చుకోవాలంటే రమారమి 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చూడండి వారు ఎంత త్యాగం చేసి శ్రద్ధతో నేర్చుకుంటే వారు ఘనాపాఠీలు అవుతారు. ఇంత క్లిష్టమైన మన సాంప్రదాయాన్ని కొందరు అయోగ్యులు పిలక బ్రాహ్మణులను, వాళ్ళేమి చేసేది, మేము చదివేస్తాము అని డాంబికాలు పలుకుతారు. ముందుగా ఒకరి పని వారిని చేయ్యనివ్వాలి. పక్కవారిని అగౌరవ పరచకూడదు. అందరం ఎవరి పనులు వారు చేసుకుంటూ సమాజోద్ధారణకు పాటు పడాలి. ఒకరి మీద ఒకరికి అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టిపోయారు తెల్లవాళ్ళు.  మనం మన సంస్కృతిని కాపాడుకోవాలి. వేదం నిత్యం బ్రతికి వుండాలి. ఇది మన అందరి కర్తవ్యం. పేద్దల సహకారంతో   ..

!! జై శ్రీమన్నారాయణ్!!

చట్టానికీ న్యాయానికి ధర్మానికీ తేడా ??

ఓ మిత్రుడు ఓ ప్రశ్న వేశాడు.. చట్టానికీ న్యాయానికి
ధర్మానికీ తేడాలేంటీ అని..!
.
.
ఒక వ్యక్తి నువ్వు అడగ్గానే లక్ష రూపాయలు ఎలాంటి
ప్రామిసరీ నోట్లు, గ్యారంటీలు లేకుండా ఇచ్చి నిన్ను నిలబెట్టాడు.

 బాగుపడ్డావు.

ఈలోపు తను దెబ్బతిని చివరకు తనే పోయాడు... ఆయన
భార్యాపిల్లలు బజార్నపడ్డారు...

ఏ కాగితాలూ లేనందున ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిన
అవసరం లేదు
 ... అదీ చట్టం

తప్పకుండా ఆ డబ్బు వడ్డీతో సహా చెల్లించాలి
........ అదీ న్యాయం

డబ్బు, వడ్డీ ఇచ్చి ఆ కుటుంబం నిలదొక్కుకునేదాకా
మద్దతుగా నిలబడాలి
....... అదీ ధర్మం

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...