Monday, November 30, 2020

పంచారామాలు

 ఆంధ్రదేశములో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రములే పంచారామాలని కథనం.

పంచారామములు

శ్రీనాధుడు (క్రీ.శ. 14 నుండి 15వ శతాబ్డము) రచించిన బీమేశ్వర పురాణములో ఈ పంచారామాల ఉద్భవం గురించి ఒక కథ ఇలా ఉంది. క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపము ధరించి సురాసురులకు పంచుచుండగా, పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల, నాధుల నేత్రత్వములో తీవ్రమైన జపతపములను ఆచరించగా శివుడు మెచ్చి, వారికి వరములిచ్చాడు. కొత్తగాసంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేయడంతో వారు మహదేవుని శరణువేడుకున్నారు. దేవతల మోర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులనూ వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిధ్దికెక్కినది. ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురులు పూజ చెసిన ఒక పెద్ద లింగము మాత్రము చెక్కుచెదరలేదు. దీనినే మహదేవుడు ఐదు ముక్కలుగా ఛెదించి ఐదు వేరు వేరు ప్రదేసములందు ప్రతిష్ఠించుటకు గాను పంచిపెట్టడం జరిగింది. లింగ ప్రతిష్ఠ చెసిన ఈ ఐదు ప్రదేశములే పంచారమములుగా ప్రసిద్ధికెక్కినవి.

స్కాంద పురాణంలోని తారాకాసుర వధా ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తోంది.

హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లా తనకు మరణం లెకుందా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా! సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడమూ, వారతనిని గెలవలేకపొవటము జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలీ, పరమేశ్వర రక్షితుడూ అయిన తారకుడిని సామాన్య బాలకులేవ్వరూ గెలవడం అసాధ్యని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు - కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు.

శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః

యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహబలః

- స్కాందము

తారకాసురుడు నేలకూలడంతో అతని యందున్న ఆత్మలింగం ఐదు ఖండాలుగా మారింది. దేవతలు ఆ ఐదు లింగ శకలాలను ఐదు చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచారామ క్షేత్రాలు. అవి:

భీమేశ్వరుడు- దక్షారామము (ద్రాక్షారామము, తూర్పు గోదావరి జిల్లా)

భీమేశ్వరుడు- కుమారారామము (సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా)

రామలింగేశ్వరుడు- క్షీరారామము (పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా)

సోమేశ్వరుడు- భీమారామము (భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)

అమరేశ్వరుడు- అమరారామము (అమరావతి, గుంటూరు జిల్లా)

అమరారామము

అమరావతి క్షేత్రం గుంటూరు జిల్లా కేంద్రమైన గుంటూరుకు 35 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నెలకొన్న శివలింగాన్ని ఇంద్రుడు నెలకొల్పడని ప్రసిద్ధి. ఇక్కడ శివుడు అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.

దక్షారామము

తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు ముఫ్పై కిలోమీటర్ల దూరంలో దక్షారామ క్షేత్రం ఉంది. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో క్రీ.శ. 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్తంభాలపై, గోడలపై 800 పైగా శాసనాలు ఉన్నాయి. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ..క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. శివాలయంతో పాటు విష్ణ్వాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం దక్షారామము. దక్షప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేసాడని ప్రసిధ్ది . తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలకున్నారు. మార్గమధ్యమంలో తుల్యఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋుషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋుషులను గోదావరులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్యభగవానుడు శివలింగానికి ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋుషులను వేదవ్యాసుడు ఓదార్చి తాను సప్తగోదావరులను పుష్కరిణితో చేర్చానాని అది సప్తగోదావరిగా పిలువబడుతుందని, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు.

నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్యప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్యప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజ స్ధంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్లనీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరనారాయణ స్వాములని పిలుస్తారు.

భీమేశ్వర లింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది. ఆలయం రెండో అంతస్తులో ఉందు. అభిషేకాదులు పై అంతస్తులో లింగ భాగానికి చేస్తారు.

సోమారామము

పశ్చిమ గోదావరి భీమవరం (గునిపూడి) లో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు (కోటీశ్వరుడు) అమ్మ వారు రాజరాజేశ్వరి. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావస్య రోజున గోధుము వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యధారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను అన్నపూర్ణా దేవి అమ్మవాు పెఅంతస్తులోనూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి.

కుమారభీమారామము

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు తల్లి బాలా త్రిపుర సుందరి.

ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఈయనే దక్షరామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా, నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది. ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై సుమారు 922 వరకు సాగింది.

క్షీరారామము

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామి వారు రామలింగేశ్వర స్వామి, అమ్మ వారు పార్వతి. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతా యుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్ధుడు. ఆలయ విశేషం తొమ్మిది అంతస్తులతో20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం. చివర అంతస్తు దాకా వెళ్లడానికి లోనికి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగగం రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్దగోపురం నుండి శివలింగంపే పడతాయి.

Thursday, November 26, 2020

ఇంద్రియనిగ్రహం....

నిర్గుణోపాసకులకు ప్రత్యేకంగా 3 జాగ్రత్తలను భగవానుడు తెలియజేసాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చేసే పనులు వ్యర్థమైపోతాయి. కళాయిలేని పాత్రలో వండిన పులుసు చిలుమెక్కి విషపూరితం అవుతుంది. దానిని పార బొయ్యవలసిందే. అలాగే హృదయనైర్మల్యం లేకుండా, ఇంద్రియ నిగ్రహం లేకుండా భగవంతుని ఎలా ఉపాసించినా సాకారంగా నైనా, నిరాకారంగా నైనా ఎలా అర్చించినా ఫలితం కలగదు.


అందుకే నిర్గుణోపాసకులు ముఖ్యంగా తీసుకోవలసిన జాగ్రత్తలు మూడు...

1. సంనియమ్యేంద్రియ గ్రామం = అన్ని ఇంద్రియాలను గ్రహించుట.

2. సర్వత్ర సమబుద్ధయః = అన్నివేళలా, అందరి పట్ల సమబుద్ధి.

3. సర్వభూత హితే రతాః = సమస్త ప్రాణులకు మేలు కలిగించుట యందు ఆసక్తి.

ఈ 3 జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం...

1. సంనియమ్యేంద్రియ గ్రామం...

ఇంద్రియగ్రామం సంనియమ్య. అంటే ఇంద్రియ సమూహాన్ని = అన్ని ఇంద్రియాలను లెస్సగ నిగ్రహించుట. నిరాకార నిర్గుణ పరమాత్మను ధ్యానించాలన్నా, ఉపాసన చేయాలన్నా ఇంద్రియాలన్నింటిని చక్కగా నిగ్రహించాలి. ఏదో ఒక ఇంద్రియాన్ని గాక అన్నింటిని పూర్తిగా నిగ్రహించాలి.
బయటి ప్రపంచంలో ఎన్నో విషయవస్తువులు, ఎన్నో ప్రలోభాలు ఉన్నాయి. అవి మనలో ప్రవేశించి తుఫానులు రేపటానికి ముఖ్య ద్వారాలు మన ఇంద్రియాలే. అవే కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. వీటిని మన అధీనంలో ఉంచక అవి చెప్పినట్లు మనం విన్నామా మనను అవి అల్లకల్లోలం చేస్తాయి. మన జీవశక్తిని వ్యర్థం చేస్తాయి. అందుకే వీటిని మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. వాటికి బానిసలం కాకుండా యజమానులం కావాలి.

ఇంద్రియాలు గుర్రాల వంటివి. వాటిని స్వేచ్ఛగా వదిలితే అవి ఎటు పడితే అటు మనను పరుగెత్తించి ఎక్కడో మనను పడవేస్తాయి. అలాగాక వాటిని మన చెప్పుచేతల్లో ఉంచుకున్నామా ప్రయాణం సాఫీగా సాగుతుంది. చేరవలసిన చోటికి చేరతాం. కనుక ఇంద్రియాలను నిగ్రహించాలి. అంటే వాటిని ప్రపంచం మీదకు వదలకుండా అంతర్ముఖం చేయాలి. లోపలకు త్రిప్పాలి. ఆత్మవైపుకు త్రిప్పాలి. అప్పుడే ఆత్మజ్ఞానాన్ని పొందటానికి తగిన అర్హత లభిస్తుంది. మనకు కావలసింది పుస్తకజ్ఞానం కాదు, మస్తకజ్ఞానం. బయట నుండి లోపలకు కూరేది గాక, లోపల నుండి బయటకు ఊరేది కావాలి.

మన ఇంద్రియాలకు 3 అవస్థలున్నాయి. అవి...

1. ప్రపంచంలో తిరుగాడటం.
2. నిద్రపోవటం.
3. భగవంతుని వైపుకు తిరగటం.

మొదటి రెండూ అందరికీ సాధారణమే. ఐతే 3 వదే కష్టమైనది. తీవ్రంగా ప్రయత్నించవలసింది. భగవంతుని కొరకు, భగవత్పరమైన కర్మలు చేసేవారు ఆ ఉత్తమస్థితిని.. ఇంద్రియ నిగ్రహాన్ని సాధించగలుగుతారు.

TVలో వచ్చే ప్రోగ్రాములను చూడాలనుకున్న మీ కళ్ళను నిగ్రహించి, ఎందుకూ పనికిరాని విషయాలను, లోకాభిరామాయణాన్ని వినాలనుకొనే మీ చెవులను నిగ్రహించి ప్రతిరోజూ ఇలా గంటల తరబడి కూర్చొని ఈ గీతా ప్రవచనాలను మీరు వినగలుగుతున్నారంటే మీ కళ్ళను చెవులను ఈ కొద్దిసేపైనా నిగ్రహించినట్లే. నోటికి చేతికి తెంపు లేకుండా ఏదో ఒకటి నోట్లోకి విసిరే చేతులను, తినే నోటిని కూడా నిగ్రహించినట్లే. ఇలా ఆయా ఇంద్రియాలను, ఆయా విషయాలలో తిరగకుండా నిగ్రహించి, గీతాశ్లోకాలను కంటితో చూస్తూ, వాక్కుతో పలుకుతూ, గీతాప్రవచనాలను చెవులతో వింటూ,
గీతాశాస్త్రాన్ని చేతులతో పట్టుకుంటూ, భగవత్ సంబంధమైన పనులను చేతులతో ఇంద్రియాలతో చేస్తూ, ఇలా నిత్యము అభ్యాసం చేస్తూ ఇంద్రియాలను పూర్తిగా అధీనంలో ఉంచుకోగలిగితే నిర్గుణోపాసన చేయటం సులభమవుతుంది.

ఇంద్రియనిగ్రహం లేనివానికి నిర్గుణోపాసన సాధ్యం కాదు. ధ్యానం కుదరదు. ఇంద్రియాలు బయటకు లాగుతుంటే మనస్సు నిరాకార పరమాత్మపై నిలువలేదు. కనుక ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇక్కడ 'నియమ్య అనక సంనియమ్య' అన్నారు. అంటే మాములుగా నిగ్రహిస్తే చాలదు. లెస్సగా నిగ్రహించాలి. బాగుగా నిగ్రహించాలి. నేను ఇంద్రియాలను నిగ్రహించాను. కనుక హాయిగా గుండెల మీద చేయి వేసుకొని ఉండవచ్చు అని ఎవ్వరూ భరోసాతో ఉండకూడదు. ఎందుకంటే..

విశ్వామిత్రుని వంటి పట్టుదల కలిగిన తపశ్శాలి కూడా ఇంద్రియాలకు లొంగిపోయి తన తపశ్శక్తిని వృధా చేసుకున్నాడు. విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు యొక్క అగ్నిజ్వాలలు స్వర్గాన్ని తాకినవి. దానితో దేవేంద్రుడు భయపడిపోయి అప్సరసలలో శ్రేష్ఠురాలైన మేనకను పంపించాడు. ఆమె తన అభినయంతో, నాట్యంతో, సౌందర్యంతో విశ్వామిత్రుని తపస్సు నుండి మరలించింది. విశ్వామిత్రుడు కామానికి లొంగిపోయాడు. అతడి ఇంద్రియాలు అతణ్ణి దాసునిగా చేసుకున్నాయి. దానితో అతడు మేనక పొందుకోసం తహతహ లాడిపోయాడు. వారి కలయికతో శకుంతల జన్మించింది. ఆ తరువాత తన తప్పును తెలుసుకున్నాడు. తన తపస్సు భగ్నమైనందుకు పశ్చాత్తాపం చెంది తిరిగి ఘోరమైన తపస్సు చేశాడు. ఇక ఎన్నటికీ కామానికి లొంగి కామదాసుడు కాకూడదని నిశ్చయించుకున్నాడు.

తిరిగి విశ్వామిత్రుని తపోగ్నిజ్వాలలు స్వర్గాదిలోకాలను తాకినవి. దానితో దేవేంద్రుడు ఈ సారి రంభను పంపించాడు. ఆమె విశ్వామిత్రుణ్ణి తనవైపుకు ఆకర్షించాలని విశ్వప్రయత్నం చేసింది. కాని విశ్వామిత్రుడు ఎంతో పట్టుదలతో నిగ్రహంతో ఉన్నాడు. అయినా సరే రంభ వదిలి పెట్టలేదు. తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నది. చివరకు విశ్వామిత్రుడు తీవ్రమైన కోపంతో కళ్ళు తెరచి రంభను బండరాయివై పోదువుగాక అని శపించాడు. అప్పుడు కామానికి లొంగి తపస్సును భగ్నం చేసుకున్నాడు. ఇప్పుడు క్రోధానికి లొంగి తపస్సును భగ్నం చేసుకున్నాడు. మొత్తం మీద ఇంద్రియాలకు లొంగిపోవటం జరిగింది. అంతటి విశ్వామిత్రుడే ఇంద్రియాలకు లొంగిపోతే మనలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటి.. కనుక ఇంద్రియ నిగ్రహాన్ని లెస్సగా సాధించాలి. అట్టి ఇంద్రియ నిగ్రహపరుడే నిర్గుణోపాసనకు అర్హుడు.

నిర్గుణోపాసన అనేది కత్తి మీద సాములాంటిది. మనస్సు ఏమాత్రం చలించినా పతనం తప్పదు. అందుకే ఇంద్రియనిగ్రహాన్ని గురించి చెప్పటం జరిగింది...

|| ఓం నమః శివాయ ||

హిందూ సనాతన ధర్మమునకు సంభదిత విషయములు తెలుసుకొనుటకు కొరకు టెలిగ్రామ్ యాప్ వాడే వారు ఈ క్రింది లింక్ ద్వారా మన సమూహం నందు జాయిన్ అవచ్చును.....

Wednesday, November 25, 2020

క్షీరాబ్ధి ద్వాదశి (చిల్కు ద్వాదశి) అంటే ఏమిటి...

కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే! అయితే ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశి (చిలుక ద్వాదశి) అత్యంత పవిత్రమైంది. 

కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని ప్రారంభం చేసిన రోజు కనుక ఈ రోజును క్షీరాబ్ధి ద్వాదశి అని పిలుస్తారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరమథనం ప్రారంభించినది ఈరోజే. అందుకే ఈ రోజుకి మధన ద్వాదశి అని, అమృతం కోసం సాగరాన్ని మందర పర్వతంతో చిలికారు కనుక చిలుక ద్వాదశి అని అంటారు. ఈ రోజునే దామోదరద్వాదశి, యొగీస్వరద్వాదశి అని కూడా అంటారు. 

ఉత్థానైకాదశి అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధ ఏకాదశినాడు తన యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశినాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అనే పేరు. ఉత్థాన ఏకాదశి(నిన్న) నాడు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. అందుచేతనే తులసి మొక్క వద్ద క్షీరాబ్ధి ద్వాదశి నాడు దీపములు వెలిగించి పూజలను జరపడం అనాదిగా వస్తున్న ఆచారం. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. 

ఈ రోజున తులసి మొక్క వద్ద శ్రీమహావిష్ణువు స్వరూపంగా ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తారు. ముఖ్యంగా చాలామంది చేసే పెద్దపొరపాటు ఉసిరి చెట్టులేదని బజార్లలో అమ్మే ఉసిరి కొమ్మలను తీసుకొని వెళ్లి తులసి వద్ద పెట్టి పూజ చేస్తుంటారు. అది శాస్త్ర విరుద్ధం. ఉసిరి చెట్టు వద్దనే పూజ చేసుకోవడం లేదా నర్సరీ (చెట్టు పెంచే)వద్ద చిన్న కుండీల్లో ఉసిరి చెట్టును తెచ్చుకునైనా పూజచేసుకుంటే మంచిది. కార్తీకమాసంలో ఎట్టిపరిస్థితుల్లో ఉసిరి చెట్టు కొమ్మలను విరవడం, నరకడం వంటి పనులు చేయకూడదని శాస్త్రవచనం. క్షీరసాగర మధనములో జన్మించిన తేజోభరితమైన అమృతకలశాహస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు దేవ దానవ సమక్షములో వివాహమాడుతాడు . అందుకనే కొన్ని ప్రాంతాలలో ఆచరమును బట్టి శ్రీ మహాలక్ష్మికి, శ్రీమన్నారాయుణునికీ వివాహము చేసెదరు. 

బృందా దేవి శాపము వల్ల లోకానికి మహోపకారం జరిగి శ్రీమహావిష్ణువు సాలగ్రామ రూపమును ధరించినది ఈ మహోత్కృష్టమైన రోజే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి.

క్షీరాబ్ధి ద్వాదశి నాడు శివకేశవ అభేదంగా ఉదయం శ్రీమహావిష్ణువును కార్తీక దామోదరునిగా భావించి పూజలను చేసి, సాయంత్రం తులసి, ఉసిరి మొక్కలకు సభక్తి పూర్వకంగా పూజలనుచేసి సాలగ్రామ, దీపదనములను చేయుటవల్ల గత జన్మలలో చేసిన పాపరాశి ధ్వంసం అవుతుందని ప్రతీతి

Tuesday, November 24, 2020

హిందూ పురాణాల ప్రకారం స్నానం ఎలా చెయ్యాలి

పురాణాల ప్రకారం స్నానం ఎలా చెయ్యాలి ?

స్నానం చేసే విధానం:

హిందూ పురాణాల ప్రకారం స్నానం ఎలా చెయ్యాలి..ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు చేసుకున్న తర్వాత మనం స్నానం చేస్తాం. కొందరు సూర్యుడు రాకముందు స్నానం చేస్తారు. ఇంకొందరు సూర్యుడు వచ్చాక మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం స్నానం ఎప్పుడు చేయాలి. ఏ సమయంలో చేస్తే మంచిది. ఇష్టం వచ్చినప్పుడు స్నానం చేస్తే కలిగే అనర్ధాలు ఏమిటి. ఇలాంటి వాటికి సంబంధించిన వాటి గురించి కూడా తెలుసుకుందాం.

మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలు బడదు. అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.

 

“మంత్ర స్నానం”

మంత్ర స్నానం వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది.

“భౌమ స్నానం”

భౌమ స్నానం పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్ట మన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేనునది.

“ఆగ్నేయ స్నానం”

ఆగ్నేయ స్నానం సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును మంత్ర సహితముగా లేదా శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేయునది.

“వాయువ్య స్నానం”

వాయువ్య స్నానం ముప్పది మూడు కోట్ల దేవతులు నివసించు గోమాత పాద ధూళి చేత చేయునది.

“దివ్య స్నానం”

దివ్య స్నానం లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం.

“వారుణ స్నానం”

ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి. వారుణ స్నానం పుణ్య నదులలో స్నానం ఆచరించడం.

“మానస స్నానం”

మానస స్నానం నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం. ఇది మహత్తర స్నానం. మహా ఋషులచేత ఆచరింప బడుతుంది. ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి. దైవాన్ని స్మరిస్తూ, మనసును నిలిపి చేయు స్నానం.

క్రియాంగ స్నానం:

జపం, మంత్రతర్పణ చేయుటకు చేసే స్నానం.

దైవ స్నానం:

ఉదయం 4-5 గంటల మధ్య చేయు స్నానం.

మంత్ర స్నానం:

వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానం.

రుషి స్నానం:

ఉదయం 5-6 గంటల మధ్య చేయు స్నానం.

మానవ స్నానం:

ఉదయం 6-7 గంటల మధ్య చేయు స్నానం.

రాక్షస స్నానం:

ఉదయం 7 గంటల తరవాత చేసే స్నానం.

ఆతప స్నానం:

ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకునే స్నానం.

మలాపకర్షణ స్నానం:

మాలిన్యం పోవుటకు చేయు స్నానం.

ఇప్పుడు తెలుసుకున్నారు కదా స్నానం ఎలా చేయాలో. మన సంస్కృతి సంప్రదాయాలను పాటించే ఆరోగ్యంగా ఉండండి. మన సంస్కృతి సంప్రదాయాల వెనుక శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి వాటిని తెలుసుకోవడమే ఆలస్యం అంతే. మన పద్ధతులను ఆచారాలను పాటిస్తే ఎటువంటి రోగాలు దరికి రావు. ఈ విషయాలు తెలియని వారికి తెలియజేయండి.

రుద్రాభిషేకాలు 8 విధములు

 శివ.. శివ అంటే చాలు మంగళం, శుభం, సర్వకార్యజయం, సర్వపాపహరం అని వేదార్థాలు....

మహాదేవున్ని శివుడని పరమశివుడని పలు పేర్లతో పిలుస్తారు. పండితుడు నుంచి పామరుడు వరకు, మహా చక్రవర్తి నుంచి కటిక పేదవాడి వరకు మనఃపూర్వకంగా ఒక్కసారి శివ అంటే చాలు కోరిన కోర్కిలు తీర్చే భోళాశంకరుడు ఆయన. శివున్ని అభిషేక ప్రియుడు అంటారు. శివునికి నిత్యం అభిషేకం చేస్తే చాలు అన్ని ఉన్నట్లే. శివలింగం చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. దేశం శాంతిగా ఉంటుందని వేదోక్తి. అయితే శివుడికి అభిషేకాలు చేస్తుంటాం.. అయితే అభిషేకాలు ఎన్నిరకాలు ఏ విధంగా శివాభిషేకాలు చేస్తారో తెలుసుకుందాం…

శివాభిషేకాలు మంత్రపూర్వకంగా అంటే రుద్రభిషేకాలుగా వర్ణిస్తారు. అదేవిధంగా చేసే ద్రవ్యాలను బట్టి అభిషేకాలకు పేర్లు ఉన్నాయి. కానీ శాస్త్రం ప్రకారం రుద్రాభిషేకాలు రకాలనే పరిగణనలోకి తీసుకుంటాం. పదార్థాలు మన కామ్యాలు అంటే కోరికలు తీరడానికి ఆయా పదర్థాలతో, పుష్పాలతో చేస్తాం.



రుద్రాభిషేకాలు 8 విధములు అవి..

రుద్రం అంటే నమకాలు -11, చమకాలు-11 అనువాకాలుగా (సింపుల్‌గా చెప్పాలంటే 11 స్టాన్జాలు అని ఇంగ్లిష్ మీడియం వారికి) సాధారణంగా రుద్రాభిషేకం అంటే 11 నమకాలను, 11/1 చమకాన్ని చెప్పితే ఒక అభిషేకంగా ఇంట్లో నిత్యం చేసుకునేవారు చేసే పద్ధతి. ఇక అసలు అభిషేక సంప్రదాయ పరిశీలిస్తే…

1. వారాభిషేకం- నమకం 11 అనువాకాలను చెప్పి చమకంలో ఒక్కొక్క అనువాకం చొప్పున చెప్పవలెను. ఆ విధంగా నమకం 11 సార్లు (11X11) చెప్పిన, చమకం 11 అనువాకాలకు పూర్తగును. (నమకం 11సార్లు, చమకం 1 సారి) దీన్ని వారాభిషేకం అంటారు.

2. ఆవృత్తి – నమకం 121 సార్లు, చమకం 11 సార్లు చెప్పితే ఆవృత్తి అంటారు.

3. రుద్రం- నమకం 121 సార్లు, చమకం – 11 సార్లు

4. ఏకాదశ రుద్రం- నమకం 14,641 సార్లు, చమకం-1331 సార్లు

5. శతరుద్రం- నమకం 1,61,051 సార్లు,చమకం 14,641 సార్లు

6. లఘురుద్రం- నమకం 17,71,561 సార్లు, చమకం- 1,61,051 సార్లు

7. మహారుద్రం- నమకం 1,94,87,171 సార్లు, చమకం- 17,71,561 సార్లు

8. అతిరుద్రం- నమకం 21,43,58,881 సార్లు, చమకం -1,94,87,171 సార్లు

9.ఇలా 8 రకాలుగా రుద్రాభిషేకాలను చేస్తారు

సోమవారం ఉపవాసo ఏ విధంగా, ఎందుకు చేయాలి

కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారము నాడయినా సరే - స్నాన, జపాదులను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రతవిధి ఆరురకాలుగా ఉంది.

1. ఉపవాసము 2 ఏకభక్తము 3 నక్తము 4 అయాచితము 5.స్నానము 6.తిలదానము

1.ఉపవాసము:     

        శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము (ఉపవాసము)తో గడిపి, సాయంకాలమున శివాభిషేకం చేసి, నక్షత్ర దర్శనానంతరమున తులసితీర్ధము మాత్రమే సేవించాలి.

2 ఏకభక్తము: సాధ్యం కాని వాళ్లు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసికొని - మధ్యాహ్నమున భోజనము చేసి, రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసీ తీర్ధమో మాత్రమే తీసుకోవాలి.

3.నక్తము: పగలంతా ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమునకు గాని, ఉపాహారమును గాని స్వీకరించాలి.

4 అయాచితము: భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా - వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము"

5.స్నానము  :పై వాటికి వేటికీ శక్తి లేని వాళ్లు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికిన్నీ చాలును.

6. తిలదానము : మంత్ర జపవిధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారము నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది.

పై ఆరు పద్ధతులలో దేవిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. ఈ వ్రతాచరణము వలన అనాథలూ, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యమును పొందుతారు. 

సోమవార వ్రతాన్ని చేసే వాళ్లు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలిసికోవాలి.

సూచన:  శివుడు భోళాశంకరుడు. ఆయన నాకు ఇది చేయాలి, అది చేయాలి అని భక్తుల వద్ద కోరడు. పెద్దలు సూచించినవి  విధి విధానాలు మాత్రము  తెలుపుటకోసం మాత్రమే తెలుపడమైనది.

వ్రతం ఎవరికి అనుకూలమైన పద్దతిలో వారు చేసుకోవాలి అంతే.  ముఖ్యమైనది మీ అంతరాత్మ. దానికి ద్రోహం చేయకుండా మీరు చేయకల్గిన పద్ధతి ఆచరించండి,

1.స్నానము ప్రతిరోజు చేసేదే. 

2. దైవ ధ్యానం ప్రతిరోజు చేసేదే.  పూజ ఈ రోజు కొంత ఎక్కువ సమయం  శివు పూజ కు కేటాయించండి చాలు. 

3.మీ శరీర పరిస్థితిని బట్టి ఉపవాసం చేయండి. కొన్ని జబ్బులు కలవారు మాత్రలు వేసుకోవాలి. అందుకు అవసరమైతే ఆహారం తీసుకొనండి తప్పులేదు.

4. మీ శరీరo మీకు అవసరం. మీ ఆత్మ ప్రభోధం మేరకు, వీలైనంత వరకు ఆచారాన్ని పాటిస్తూ వ్రతమాచరించండి. 

5. వ్రతం చేయాలి కనుక  వ్రతం చేస్తున్నాను అనే భావన మనసులో రానియక చేసే పూజ, చేయ కల్గితే చాలు. అధిక ఫలం మీకే.

Monday, November 23, 2020

కార్త వీర్యార్జున జయంతి


కార్తీక మాస శుద్ధ అష్టమి - కార్త వీర్యార్జున  జయంతి,, 

ఈయన శ్రీ దతాత్రేయుని ఆరాధించి,..

స్వామి చే వరాలు పొందిన సహస్ర బాహువులు 

కలవాడు   ఈ మంత్రం పోయినవాటిని తిరిగి తెస్తుందా*...


 ఖచ్చితంగా తెస్తుంది. అని ఈ మంత్రం ఉపయోగించే వారందరికీ తెలుసు*

 

*ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, 

*ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయినా, 

*భార్యా భర్తల మధ్య మనశ్శాంతి కరువయినా.....


ఒకేఒక మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి. ఇంతకీ ఏమిటా మంత్రమని ఆలోచిస్తున్నారా? అదే *కార్తవీర్యార్జున మంత్రం. 


స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే  పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. అది డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళయినా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెపుతున్నారు మన పండితులు. ఆ మంత్రం ఈ విధంగా ఉంటుంది.


                                         * ఓం కార్తవీర్యార్జునో నామ రాజ బాహుః సహస్రవాన్*


                                                *తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే*


ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకుని రోజూ పూజ చేసేటప్పుడు స్మరిస్తే పోయినవన్నీ తిరిగి మనకు దక్కుతాయి. 


ఇంతకీ ఈ కార్తవీర్యార్జునుడు ఎవరూ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ. 


తను చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించ గలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడటంతో అది గ్రహించిన స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు. కాని భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు. 


చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి వెయ్యి చేతులు కలవాడిగా మారతాడు. అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు. 


అంతేకాదు తనకి కేవలం శ్రీ హరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు. ఇతను ఎంత బలశాలి అంటే అతి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకుని పోయి తరువాత పులస్త్య మహర్షి అభ్యర్ధన విని అతనిని వదిలేస్తాడు.


ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మాహిష్మతిపురము.

 ఇతని పురోహితుడు గర్గ మహర్షి. 


ఒకసారి కార్తవీర్యుడు వేట కోసమై అడవికి వెళ్తాడు. అక్కడ అలసిపోయి దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన కార్తవీర్యునికి స్వాగతం పలికి జమదగ్ని విశేషమైన విందు పెడతాడు. అంత రుచికరమైన ఆహారపదార్థాలు కామదేనువు సంతతి అయిన గోమాత ద్వారా లభించాయన్న నిజం తెలుసుకుని దానిని తనకి ఇచ్చేయ్యమని అడుగుతాడు,.


అందుకు జమదగ్ని నిరాకరించటంతో మహర్షి తలను ఖండించి ఆ గోమాతను తీసుకెళ్ళిపోతాడు. ఆశ్రమానికి తిరిగివచ్చిన జమదగ్ని కొడుకు పరాశరుడు విషయం తెలుసుకుని కార్తవీర్యునితో పాటు 21 మంది క్షత్రియులని చంపుతానని శపథం పూనుతాడు. అన్న మాట ప్రకారమే కార్తవీర్యుడిని సంహరిస్తాడు. పరసురాముడు విష్ణుమూర్తి అవతారం కావటంతో కార్తవీర్యుని కోరిక కూడా తీరి మళ్లీ శ్రీహరి చేతిలో సుదర్శునుడిగా మారి, గర్వం విడిచిపెట్టి తన జన్మ సార్ధకం చేసుకుంటాడు.


అలా అతి బలపరాక్రముడు అయిన కార్తవీర్యుడు తనకు లేని చేతులని తపస్సు చేసి పొందటమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్లీ అతని కుడి చేతిలోనే సుదర్శన చక్రమై ఆ జన్మాంతం నిలిచి ఉంటాడు.


 *శ్రీ కార్తవీర్యార్జున ద్వాదశ నామ స్తోత్రం *


కార్తవీర్యార్జునో నామ రాజ బాహుః సహస్రవాన్

తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || 1 ||


కార్తవీర్యః ఖలద్వేషీ కృతవీర్యసుతో బలీ

సహస్రబాహు శత్రుఘ్నో రక్తవాసా ధనుర్దరః || 2 ||


రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తుర బీష్టదః

ద్వాదశైతాని నామాని కార్తవీరస్య యః పఠేత్ || 3 ||


సంపదస్తత్ర జాయంతే జనస్తత్ర వశం గతః

ఆనయత్యాశు దూరస్తం క్షేమలాభయుతం ప్రియం || 4 ||


సహస్రబాహుసశరం మహితం

సచాపం రక్తాంభరం రక్తకిరీటకుండలం

చోరది దుష్టభయ నాశం ఇష్ట తం

ధ్యాయేత్ మహాబల విజ్రుంభీత కార్తవీర్యం


యయ స్మరణ మాత్రేణ సర్వదుఖఃక్షయో భవేత్

యన్నామాని మహావీర్యార్జునః క్రుతవీర్యవాన్


హైహయాధిపతేః స్తోత్రం సహస్రావృత్తికారితం

వాంచితార్ధప్రదం సృణాం స్వరాజ్యం సుకృతం యది


ఇతి శ్రీ కార్తవీర్యార్జున ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం

Friday, November 20, 2020

పరమ పవిత్రమైన స్కంద షష్టి

స్కంద షష్టి కార్తీక మాస శుక్ల షష్ఠి రోజున తమిళనాడులో జరుపుతారు. మన తెలుగు రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటాం కానీ ఈ స్కంద షష్ఠి వేరు, సుబ్రహ్మణ్య షష్ఠి వేరు అని గమనించాలి. ఆది దంపతులైన ఆ శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించే అతి పవిత్రమైన రోజు ఈ స్కంద షష్టి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే మనం జరుపుకునే సుబ్రహ్మణ్య షష్ఠి అయినా, తమిళనాడులో జరిపే స్కంద షష్ఠి అయినా రెండిటిలోనూ సుబ్రహ్మణ్యుని ఆరాధన ఒకే విధంగా ఉంటుంది. అంతే కాదు, ఏ మాసంలో అయినా షష్ఠి తిథి రోజున ఇలా ఆరాధించడం అత్యంత ఫలప్రదం.



శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ వృత్తాంతాన్ని క్లుప్తంగా తెలుసుకుందాము.

తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలనూ భయభ్రాంతులకు గురిచేస్తూ లోకకంటకుడుగా ఉన్నాడని దేవతలు అందరూ బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు.

ఈ తారకాసురుడు అమిత బలశాలి, తపోబల సంపన్నుడు. ఈశ్వర తేజాంశ వలన సంభవించిన వాని వల్ల మాత్రమే మరణము పొందగలడు అని వరము కలిగి ఉన్నాడు. అందుచేత, మీరందరూ ఆ మహాశివుని శరణు వేడి, ఆయనకు మరియు హిమవంతునకు పార్వతీ దేవి రూపమున జన్మించిన సతీదేవికీ, వివాహం జరిపించిన, వారికి కలిగే సంతానము ఈ లోకకంటకుని సంహరించగలడు అని సెలవిచ్చాడు. అప్పటికే తపోనిష్ఠలో ఉన్న పరమశివునికి, వారిని సేవిస్తూ సర్వోప చారములూ చేస్తున్న పార్వతీ దేవికీ మధ్య ప్రణయ బంధాన్ని పెంపొందించే విధంగా మన్మధుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో మన్మధుడు తన ప్రాణాలను పోగొట్టుకున్నప్పటికీ, పార్వతీ పరమేశ్వర వివాహం సంపన్నమయింది. వారి వివాహానంతరమూ దేవతల విన్నపము మేరకు మన్మధుని పునర్జీవిమ్పజేస్తాడు మహాశివుడు.

అటు పిమ్మట పార్వతీ పరమేశ్వరుల ఏకాంత సమయాన అగ్నిదేవుడు ఒక పావురము రూపమున ఆ ప్రణయ మందిరమందు ప్రవేశిస్తాడు. అది గ్రహించిన మహాశివుడు తన దివ్య తేజస్సును అగ్నియందు ప్రవేశపెడతాడు. ఆ శక్తిని భరించలేక అగ్నిహోత్రుడు ఆ తేజమును గంగానదిలో విడిచిపెడతాడు. గంగానది తనలోకి చేరిన ఆ తేజమును ఆ సమయంలో నదీస్నానం ఆచరిస్తున్న షట్ కృత్తికలనబడే దేవతల గర్భాన ప్రవేశపెడుతుంది. ఆ రుద్ర తేజమును తాళలేక ఆ దేవతా స్త్రీలు రెల్లు పొదలయందు విడిచిపెడతారు. ఈ ఆరు తెజస్సులు కలిసి ఆరు ముఖాలు కలిగిన దివ్య బాలునిగా ఉద్భవిస్తాడు. ఆరు ముఖములు కలిగిన వాడు కావున షణ్ముఖుడు అని పిలువబడతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీపరమేశ్వరులు ఆ బాలుని కైలాశానికి తీసుకునివెళ్లి పెంచుకుంటారు.

ఈ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందున గాంగేయుడు అని, షట్ కృత్తికలు పెద్ద చేసిన కారణాన కార్తికేయుడు అని, ఆరు ముఖాలు కలిగి ఉండటం వలన షణ్ముఖుడు అని, గౌరీశంకరుల పుత్రుడు అయిన కారణాన కుమార స్వామి యని పిలువబడతాడు.

ఈతడిని దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడు శూలం, పార్వతీ దేవి శక్తి, మరియు ఇతర ఆయుధాలను అందించి సర్వశక్తి సంపన్నుడిని చేసి దేవతలకు సర్వ సైన్యాధ్యక్షునిగా చేస్తారు. దేవసైన్యానికి సైన్యాధ్యక్షుడైన ఈ సుబ్రహ్మణ్యుడు తారకాసురుడనే అసురుడితో రకరకాలైన శక్తులతో మరియు రూపాలతో పోరాడి సంహరించాడు. యుద్ధ మధ్యలో సర్ప రూపం దాల్చి రాక్షస సేనను చుట్టుముట్టి వారిని సంహరించాడు.

ఆయన రెల్లుపొదలలో జన్మించడం చేత ఆయనను శరవణభవుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసుర సంహారం అనంతరం బ్రహ్మ పట్ల తన అహంభావాన్ని ప్రదర్శించడంతో ఆతని తండ్రి అయిన ఆ మహాశివుడు హెచ్చరించాడు. ఆ తరువాత తన తప్పు తెలుసుకుని కఠోరమైన తపస్సును చేస్తాడు. శరీరంలో కొలువై నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తిని మేల్కొలిపి సమస్త దుర్గుణాలను జయించాడు. ఆయన మహాకఠోర తపస్సాధన వలన సహస్రాకారం చేరుకొని బుద్ధిని వికసింపజేసుకున్నాడు. స్వచ్ఛమైన మనసు మరియు వికసించిన  బుద్ధి కలవాడిగా మారిన కారణంగా ఆయనను సుబ్రహ్మణ్యుడు అని పిలుస్తారు.

తారకాసుర సంహారసమయానికి ఆయన బ్రహ్మచారి. అటు తర్వాత శ్రీ మహావిష్ణువు కోరిన కారణంగా ఆయన వల్లీ మరియు దేవసేనలను వివాహమాడెను. ఈ స్కంద షష్టి నాడు నాగ ప్రతిమలను మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించుకుని ఆయన ఆరాధన చేయడం మనం చూస్తూ ఉంటాము.

స్కంద షష్ఠి పూజా విధానం :

స్కంద షష్టి నాటి ఉదయాన్నే శుచిగా స్నానమాచరించి ఎటువంటి ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకుని పువ్వులు, పళ్ళు మరియు పడగల రూపాలను స్వామికి సమర్పించవచ్చు. 

పిండి దీపం అంటే వరి పిండి, బెల్లము కలిపి చేసిన మిశ్రమంతో ప్రమిదలు చేసి, నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఇవి ఉదయం మరియూ సాయంత్రం వేళల్లో వెలిగించవచ్చు. రోజంతా ఉపవాసం ఉండి, సుబ్రహ్మణ్యుని చరిత్ర, స్తోత్రాలు పఠించాలి. వీలైతే సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్లి దర్శించుకోవాలి. చలిమిడి, చిమ్మిలి, వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఈనాడు వల్లీ మరియు దేవసేనాదేవిలతో సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా జరిపించడం చూస్తాము.

బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసేవారు ఈనాడు బ్రహ్మచారి పూజ చేసి ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజాదికాలు అర్పించి బట్టలు పెట్టి భోజనాలు పెట్టడం ఒక ఆచారం. కొన్ని ప్రాంతాలలో షష్టినాటి రోజంతా ఉపవాస దీక్షలో ఉండి మరుసటి రోజు అనగా సప్తమి నాడు బ్రహ్మచారి పూజ చేసుకోవడం కూడా చూస్తాము.

ఎంతో ప్రసిద్ధి కాంచిన కావడి మొక్కు తీర్చుకునే రోజు తమిళనాట ఎన్నో ప్రాంతాలలో ఈరోజే చూస్తాము. ఈ కావడి కుండలను పంచదార, పాలు, పెరుగు, పూలు, వెన్న, నెయ్యి, తేనె ఇలా వివిధ ద్రవ్యాలతో నింపుతారు. ఈనాటి రోజున సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ట చేసినవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం చాల ప్రాంతాలలో ఉంది.

ఈ వ్రతం సందర్భంగా ఎంతోమంది కంబళ్ళు, దుప్పట్లు లాంటివి దానంగా పంచిపెట్టడం చూస్తాము. ఇది ఒకరకం గా సమాజ శ్రేయస్సు గా కూడా చెప్పుకోవచ్చు. చలి మొదలై బీదలు సరైన నీడ లేక ఇబ్బంది పడే ఈ సమయం లో ఇటువంటి దానాలు భక్తులకున్న భక్తిని మరియు సమాజ శ్రేయోదృక్పదాన్ని కూడా చాటి చెప్పుతాయి.

ఇంతటి పవిత్రమైన రోజున సుబ్రహ్మణ్య స్తోత్రాలు మరియు సంతాన సాఫల్యం కలగజేసే షష్టి దేవి స్తోత్రం పఠించడం అత్యంత ఫలప్రదం!

ఓం శరవణభవ

హిందూ ఋషులు జాబితా

అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు

అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ - త - థ - ద - ధ - న - ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్ష

దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.

బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.

మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.

రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.

అగ్ని మహర్షి

అగస్త్య మహర్షి

అంగీరస మహర్షి

అంగిరో మహర్షి

అత్రి మహర్షి

అర్వరీవత మహర్షి

అభినామన మహర్షి

అగ్నివేశ మహర్షి

అరుణి మహర్షి

అష్టావక్ర మహర్షి

అష్టిక మహర్షి

అథర్వణ మహర్షి

ఆత్రేయ మహర్షి

అథర్వాకృతి‎

అమహీయుడు

అజామిళ్హుడు‎

అప్రతిరథుడు‎

అయాస్యుడు‎

అవస్యుడు

అంబరీషుడు

ఇరింబిఠి‎

ఉపమన్యు మహర్షి

ఉత్తమ మహర్షి

ఉన్మోచన

ఉపరిబభ్రవుడు

ఉద్దాలకుడు‎

ఉశనసుడు

ఉత్కీలుడు

ఊర్ఝ మహర్షి

ఊర్ద్వబాహు మహర్షి

ఋచీక మహర్షి

ఋషభ మహర్షి

ఋష్యశృంగ మహర్షి

ఋషి

ఔపమన్యవ మహర్షి

ఔరవ మహర్షి

కపిల మహర్షి

కశ్యప మహర్షి

క్రతు మహర్షి

కౌకుండి మహర్షి

కురుండి మహర్షి

కావ్య మహర్షి

కాంభోజ మహర్షి

కంబ స్వాయంభువ మహర్షి

కాండ్వ మహర్షి

కణ్వ మహర్షి

కాణ్వ మహర్షి

కిందమ మహర్షి

కుత్స మహర్షి

కౌరుపథి‎

కౌశికుడు‎

కురువు

కాణుడు‎

కలి

కాంకాయనుడు

కపింజలుడు‎

కుసీదుడు

గౌతమ మహర్షి

గర్గ మహర్షి

గృత్సమద మహర్షి

గృత్సదుడు‎

గోపథుడు‎

గోతముడు

గౌరీవీతి

గోపవనుడు

గయుడు

చ్యవన మహర్షి

చైత్ర మహర్షి

చాతనుడు‎

జమదగ్ని మహర్షి

జైమిని మహర్షి

జ్యోతిర్ధామ మహర్షి

జాహ్న మహర్షి

జగద్బీజ

జాటికాయనుడు‎

తండి మహర్షి

తిత్తిరి మహర్షి

త్రితుడు

తృణపాణి

దధీచి మహర్షి

దుర్వాస మహర్షి

దేవల మహర్షి

దత్తోలి మహర్షి

దాలయ మహర్షి

దీర్ఘతమ మహర్షి

ద్రవిణోదస్సు‎

నచికేత మహర్షి

నారద మహర్షి

నిశ్ఛర మహర్షి

సుమేధా మహర్షి

నోధా

నృమేధుడు

పరశురాముడు

పరాశర మహర్షి

పరిజన్య మహర్షి

పులస్త్య మహర్షి

ప్రాచేతస మహర్షి

పులహ మహర్షి

ప్రాణ మహర్షి

ప్రవహిత మహర్షి

పృథు మహర్షి

పివర మహర్షి

పిప్పలాద మహర్షి

ప్రత్య్సంగిరసుడు

పతివేదనుడు

ప్రమోచన‎

ప్రశోచనుడు‎

ప్రియమేథుడు

పార్వతుడు

పురుహన్మ‎

ప్రస్కణ్వుడు

ప్రాగాథుడు

ప్రాచీనబర్హి

ప్రయోగుడు

పూరుడు

పాయు

భరద్వాజ మహర్షి

భృగు మహర్షి

భృంగి మహర్షి

బ్రహ్మర్షి మహర్షి

బభ్రుపింగళుడు

భార్గవవైదర్భి‎

భాగలి

భృగ్వంగిరాబ్రహ్మ

బ్రహ్మస్కందుడు‎

భగుడు‎

బ్రహ్మర్షి

బృహత్కీర్తి‎

బృహజ్జ్యోతి‎

భర్గుడు

మరీచి మహర్షి

మార్కండేయ మహర్షి

మిత మహర్షి

మృకండు మహర్షి

మహాముని మహర్షి

మధు మహర్షి

మాండవ్య మహర్షి

మాయు

మృగారుడు‎

మాతృనామ‎

మయోభువు‎

మేధాతిథి

మధుచ్ఛందుడు

మనువు

మారీచుడు

యాజ్ఞవల్క మహర్షి

యయాతి‎

రురు మహర్షి

రాజర్షి మహర్షి

రేభుడు

వశిష్ట మహర్షి

వాలఖిల్యులు

వాల్మీకి మహర్షి

విశ్వామిత్ర మహర్షి

వ్యాస మహర్షి

విభాండక ఋషి

వాదుల మహర్షి

వాణక మహర్షి

వేదశ్రీ మహర్షి

వేదబాహు మహర్షి

విరాజా మహర్షి

వైశేషిక మహర్షి

వైశంపాయన మహర్షి

వర్తంతు మహర్షి

వృషాకపి

విరూపుడు‎

వత్సుడు‎

వేనుడు

వామదేవుడు‎

వత్సప్రి

విందుడు

శంఖ మహర్షి

శంకృతి మహర్షి

శతానంద మహర్షి

శుక మహర్షి

శుక్ర మహర్షి

శృంగి ఋషి

శశికర్ణుడు

శంభు‎

శౌనకుడు

శంయువు‎

శ్రుతకక్షుడు

సమ్మిత మహర్షి

సనత్కుమారులు

సప్తర్షులు

స్థంభ మహర్షి

సుధామ మహర్షి

సహిష్ణు మహర్షి

సాంఖ్య మహర్షి

సాందీపణి మహర్షి

సావిత్రీసూర్య

సుశబ్దుడు‎

సుతకక్షుడు‎

సుకక్షుడు‎

సౌభరి

సుకీర్తి‎

సవితామహర్షి సామావేదానికి మూలము.

సింధుద్వీపుడు

శునఃశేపుడు

సుదీతి

హవిష్మంత మహర్షి

హిరణ్యరోమ మహర్షి

Wednesday, November 18, 2020

ప్రతి మనిషి కలిగిఉండవలసిన లక్షణాలు

తపస్సు :


 భగవంతున్ని(పరమాత్ముణ్ణి) నిరంతరం తపించడాన్నే ‘తపస్సు’’ అంటారు. (భగవద్గీత)


🌹ధ్యానం :


ఒంటరిగా కూర్చొని భ్రుమధ్యమున ద్రుష్టి నిలిపి మనసులో మరియు మనసుతో పరమాత్ముణ్ణి ధ్యానించడాన్నే ‘‘ధ్యానం’’ అంటారు. (భగవద్గీత)


🌹సన్యాసం :


బాహ్యంగా అన్ని పనులు చేస్తూ, అంతరంగా మనసులో సమస్తాన్ని త్యజించడాన్నే ‘‘సన్యాసం’’ అంటారు. (భగవద్గీత)



🌹వైరాగ్యం :


ప్రతి పనిని చేస్తూ (ఆచరిస్తూ) దాని మీద అనురాగాన్ని మరియు మమకారాన్ని మనసులో వదిలి వేయడాన్ని ‘‘వైరాగ్యం’’ అంటారు. (భగవద్గీత)



🌹జ్ఞానం :


భగవంతుడు నిరాకారుడు మరియు నేను ఆత్మను (జ్యోతిని లేక శక్తిని) అని గ్రహించి మరియు కనిపించే ఈ ప్రక్రుతి అంతా కూడ భగవంతుని యొక్క మాయచే నిర్మితమై భగవంతుడే అయి ఉన్నాడు. ప్రళయ సమయంలో కనిపించే ప్రకృతి అంటా తిరిగి మరల శక్తిగా మారుతుంది అని తెలుసుకోవడమే ‘‘జ్ఞానం’’ అంటారు. (భగవద్గీత)



🌹బ్రహ్మచర్యం:


ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని పరమాత్మ సన్నిధిలో జీవనము గడపడమే ‘బ్రహ్మచర్యం’ అంటారు. (రమణ మహర్షి)



🌹మదర్ థెరిస్సా లాంటి సమభావం (అంటే అందరిని సమానంగా భావించడం)


🌹సాయిబాబా లాగ నిదానత్వం, నిబ్బర మరియు శ్రద్ధ.


🌹రామకృష్ణ పరమహంస లాగ భగవంతుని దర్శనం పొందాల అన్న పట్టుదల.


🌹 రమణ మహర్షి లాగ ఆత్మానాత్మ వివేకం.


🌹వివేకానంద స్వామి లాగ ఏకాగ్రత.


🌹అర్జునుని గురువు(శ్రీకృష్ణుడు) పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలి.


🌹 గౌతమ బుద్దుని లాగ ప్రశాంతంగా ఉండడం.


🌹మహాత్మాగాంధీ గారిలా అహింసావాదిగా మరియు శాంతీయుతంగా ఉండడం.


🌹భక్త ప్రహ్లాదుడిలా భగవంతుని మీద సంపూర్ణ మరియు పరిపూర్ణ విశ్వాసం .


🌹భగవంతున్ని హృదయంలో దర్శించాలని ధ్రువుడి మాదిరి కఠోరమైన దీక్ష మరియు తపన కలిగి ఉండాలి.


🌹ఆంజనేయ స్వామి మాదిరి భగవంతుని మీద భక్తిని కలిగి ఉండాలి.

Tuesday, November 17, 2020

రుద్రక్షా దీపం

ముందుగా ఒక ప్రమిధలో రుద్రాక్షలు కొన్ని పెట్టండి దానిపైన బియ్యం పిండితో చేసిన ప్రమిధను ఉంచి అందులో నూనె కానీ ఆవునేతిని గాని వేసి రెండు ఒత్తులు పెట్టి , దీపం వెలిగించండి ఇదే రుద్రాక్ష దీపం అంటే, ప్రతి సోమవారం ఇలా పెట్టడం చాలా మంచిది, "ప్రదోషకాలే శివనామ స్మరణ సకలపాపహరణం "  ప్రదోషకాలంలో ఇలా చేయడం విశేషం ఫలితం ఉంటుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి అలాగే మీ జన్మ నక్షత్రం రోజున ఇలా రుద్రాక్ష దీపం పెట్టడం శివానుగ్రహం పొందగలరు..

ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్యంతో గాని, అప్పులతో ఉన్న వారికి, ఏది ముందుకు సాగకుండా పనులు ఆగిపోయిన వారికి గృహంలో ఈ దీపం ప్రతి సోమవారం పెట్టడం వల్ల సమస్య పరిస్కారం అవుతుంది.. కుటుంబం లో పిల్లలు ఎవరైనా మొండి వైఖరితో ఉన్నా, లేదా ఇంట్లో ఎవరైనా అతి కోపం మోడితనంతో ఇబ్బంది పెడుతున్న వారి జన్మ నక్షత్రం రోజున ఇలా రుద్రాక్ష దీపం పెట్టి శివునికి కొబ్బరి నైవేద్యం (కొబ్బరి అన్నం అయితే ఇంకా మేలు) పెట్టి శివ స్త్రోత్రాన్ని చదివి హారతి ఇస్తూ ఉంటే వారిలో మార్పు కచ్చితంగా వస్తుంది వారి చేతితో పెట్టిస్తే ఇంకా మంచి ఫలితం త్వరగా లభిస్తుంది.. ఇన్ని వారాలు అని లెక్క ఏమీ లేదు ,ప్రతి సోమవారం పెట్టుకోవచ్చు, ఇది ఖర్చు తో చేసేది కాదు.. అదే ప్రమిద అవే రుద్రాక్ష లు జీవిత కాలం వాడుకోవచ్చు ఆ పిండి దీపం కొండ ఎక్కగా నీటిలో కలిపి చెట్టుకు పోయవచ్చు. 

ఈ రుద్రక్షదీపం పరమ శ్రేష్టం అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికీ ఇష్టమైన దీపం.. భక్తిగా వెలిగించి శివానుగ్రహం పొందండి.

హర హర మహాదేవ శంభోశంకర

Sunday, November 15, 2020

మన ఇతిహాసాలు

ఆది పర్వము

వ్యాసుడు రచించిన, మహాభారతములో మొత్తం 18 ఉపపర్వాలు, 8 అశ్వాసాలు ఉన్నాయి. సంస్కృత భారతంలోని ఆది పర్వంలో మొత్తం 9,984 శ్లోకాలు ఉంటే, శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలో మొత్తం పద్యాలు, గద్యాలు కలిపి 2,084 ఉన్నాయి.


మహాభారతంలోని పద్ధెనిమిది పర్వాలలో విషయ క్రమణిక ఇలా ఉంది.


1.ఆది పర్వము: పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం.


2.సభా పర్వము: కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.


3.వన పర్వము (లేక) అరణ్య పర్వము: అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.


4.విరాట పర్వము: విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.


5.ఉద్యోగ పర్వము: కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.


6.భీష్మ పర్వము: భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.


7.ద్రోణ పర్వము: ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.


8.కర్ణ పర్వము: కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.


9.శల్య పర్వము: శల్యుడు సారథిగాను, అనంతరం నాయకునిగాను సాగిన యుద్ధం. దుర్యోధనుని మరణం.


10.సౌప్తిక పర్వము: నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.


11.స్త్రీ పర్వము: గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం.


12.శాంతి పర్వము: యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.


13.అనుశాసనిక పర్వము: భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)


14.అశ్వమేధ పర్వము: యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.


15.ఆశ్రమవాస పర్వము: ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.


16.మౌసల పర్వము: యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.


17.మహాప్రస్ధానిక పర్వము: పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.


18.స్వర్గారోహణ పర్వము: పాండవులు స్వర్గాన్ని చేరడం.


వీటిలో మొదటి అయిదు పర్వాలను ఆదిపంచకము అనీ, తరువాతి ఆరు పర్వాలను యుద్ధషట్కము అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను శాంతిసప్తకము అనీ అంటారు. ఇవి కాక తరువాతి కథ అయిన శ్రీకృష్ణుని జీవితగాథను తెలుగు మహాభారతంలో భాగంగా కాక హరివంశ పర్వము అనే ప్రత్యేక గ్రంథంగా పరిగణించారు. నన్నయ మొదలుపెట్టిన కథావిభాగాన్నే తిక్కన, ఎఱ్ఱన అనుసరించారు.



ఆది పర్వం ఈ క్రింది సంస్కృత మంగళ శ్లోకంతో ప్రారంభం అవుతుంది. ఈ సంస్కృత శ్లోకం తెలుగు సాహిత్యానికే మంగళ శ్లోకం అనవచ్చును.


శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజ్గేషు యే

లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం

తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై

ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్శ్రేయసే.


ఆ తరువాత ఒక వచనం, తరువాత ఈ క్రింది ఉత్పలమాలతో ప్రారంభం అవుతుంది.


రాజకులైకభూషణుడు, రాజమనోహరు, డన్యరాజతే

జోజయశాలిశౌర్యుడు, విశుద్దయశశ్శరదిందు చంద్రికా

రాజితసర్వలోకు, డపరాజితభూరిభుజాకృపాణధా

రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్



ఈ ఆదిపర్వంలో నన్నయ తాను ఎందుకు ఈ మహా భారతాన్ని తెలుగు సేయుచున్నాడో, అందుకు ఎవరు తోడ్పడుతున్నారో వివరించాడు. అంతే కాకుండా మహాభారత ప్రశస్తిని, అందులో ఏయే విభాగాలలో ఏ కథాంశం ఉన్నదో కూడా వివరించాడు. ఇది తరువాతి కవులకు, పరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా ఉంది.


ఉపపర్వాలు


మహా భారతంలోని మొత్తం 100 ఉపపర్వాలలో 19 ఉప పర్వాలు ఆది పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.


సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు


1.అనుక్రమణికా పర్వం (పర్వాల సంగ్రహం)


2.పౌష్యం


3.పౌలోమం


4.ఆస్తిక పర్వం


5.ఆదివంశావతరణం


6.సంభవ పర్వము


7.లాక్షాగృహ దహనం


8.హిడింబాసురని వధ


9.బకాసురుని వధ


10.చైత్రరథం


11.ద్రౌపదీ స్వయంవరం


12.వైవాహిక పర్వము


13.విదురాగమనం


14.రాజ్యలాభ పర్వం


15.అర్జునుని వనవాసం


16.సుభద్రా కల్యాణం


17.హరణ హారిక


18.ఖాండవ వన దహనం


19.మయసభా దర్శనం


ఆంధ్ర మహాభారతం


అవతారిక, మొదలగున్నవి, శమంత పంచకాక్షౌహిణీ సంఖ్యా కథనము, ఉదంకుడు కుండలాలు తెచ్చి గురుపత్నికిచ్చు కథ, సర్పయాగముకై ఉద్ధవుడు జనమేజయుడిని ప్రోత్సహించుట మొదలగునవి కలవు

Thursday, November 12, 2020

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమ్

 శ్రీ గణేశాయ నమః | శ్రీ దత్తాత్రేయాయ నమః ||

ఋషయ ఊచుః

కథం సంకల్పసిద్ధిః స్యాద్ వేదవ్యాస కలౌ యుగే | ధర్మార్థకామ మోక్షాణాం సాధనం కిముదాహృతమ్ ||

వ్యాస ఉవాచ

శృణ్వంతు ఋషయ స్సర్వే శీఘ్రం సంకల్పసాధనమ్ | సకృదుచ్చారమాత్రేణ భోగమోక్షప్రదాయకమ్ ||

గౌరీశృంగే హిమవతః కల్పవృక్షోపశోభితమ్ | దీప్తే దివ్యమహారత్న హేమమండపమధ్యగమ్ ||

రత్నసింహాసనాసీనం ప్రసన్నం పరమేశ్వరమ్ | మందస్మితముఖాంభోజం శంకరం ప్రాహ పార్వతీ ||

శ్రీ దేవి ఉవాచ

దేవదేవ మహాదేవ లోకశంకర శంకర | మంత్రజాలాని సర్వాణి యంత్రజాలాని కృత్స్నశః ||

తంత్రజాలాన్యనేకాని మయా త్వత్తః శృతాని వై | ఇదానీం ద్రష్టుమిచ్ఛామి విశేషేణ మహీతలమ్ ||

ఇత్యుదీరితమాకర్ణ్య పార్వత్యా పరమేశ్వరః | కరేణామృజ్య సంతోషాత్ పార్వతీం ప్రత్యభాషత ||

మయేదానీం త్వయా సార్ధం వృషమారుహ్య గమ్యతే | ఇత్యుక్త్వా వృషమారుహ్య పార్వత్యా సహ శంకరః ||


యయౌ భూమండలం ద్రష్టుం గౌర్యాశ్చిత్రాణి దర్శయన్ | క్వచిత్ వింధ్యాచలప్రాంతే మహారణ్యే సుదుర్గమే ||

తత్ర వ్యాహర్తుమాయాంతం భిల్లం పరశుధారిణమ్ | వధ్యమానం మహావ్యాఘ్రం నఖదంష్ట్రాభిరావృతమ్ ||

అతీవ చిత్రచారిత్ర్యం వజ్రకాయసమాయుతమ్ | అప్రయత్నమనాయాసమఖిన్నం సుఖమాస్థితమ్ ||

పలాయంతం మృగం పశ్చాద్వ్యాఘ్రో భీత్యా పలాయతః | ఏతదాశ్చర్యమాలోక్య పార్వతీ ప్రాహ శంకరమ్ ||


శ్రీ దేవి ఉవాచ


కిమాశ్చర్యం కిమాశ్చర్యమగ్రే శంభో నిరీక్ష్యతామ్ | ఇత్యుక్తః స తతః శంభుర్దృష్ట్వా ప్రాహ పురాణవిత్ ||


శ్రీ శంకర ఉవాచ


గౌరి వక్ష్యామి తే చిత్రమవాఙ్మనసగోచరమ్ | అదృష్టపూర్వమస్మాభిర్నాస్తి కించిన్న కుత్రచిత్ ||

మయా సమ్యక్ సమాసేన వక్ష్యతే శృణు పార్వతి | అయం దూరశ్రవా నామ భిల్లః పరమధార్మికః ||

సమిత్కుశప్రసూనాని కందమూలఫలాదికమ్ | ప్రత్యహం విపినం గత్వా సమాదాయ ప్రయాసతః ||

ప్రియే పూర్వం మునీంద్రేభ్యః ప్రయచ్ఛతి న వాంఛతి | తేऽపి తస్మిన్నపి దయాం కుర్వతే సర్వమౌనినః ||


దలాదనో మహాయోగీ వసన్నేవ నిజాశ్రమే | కదాచిదస్మరత్ సిద్ధం దత్తాత్రేయం దిగంబరమ్ ||

దత్తాత్రేయః స్మర్తృగామీ చేతిహాసం పరీక్షితుమ్ | తత్ క్షణాత్ సోऽపి యోగీంద్రో దత్తాత్రేయః సముత్థితః ||

తం దృష్ట్వాశ్చర్యతోషాభ్యాం దలాదనమహామునిః | సంపూజ్యాగ్రే విషీదంతం దత్తాత్రేయమువాచ తమ్ ||

మయోపహూతః సంప్రాప్తో దత్తాత్రేయ మహామునే | స్మర్తృగామీ త్వమిత్యేతత్ కింవదంతీం పరీక్షితుమ్ ||

మయాద్య సంస్మృతోऽపి త్వమపరాధం క్షమస్వ మే | దత్తాత్రేయో మునిం ప్రాహ మమ ప్రకృతిరీదృశీ ||

అభక్త్యా వా సుభక్త్యా వా యః స్మరేన్మామనన్యధీః | తదానీం తముపాగమ్య దదామి తదభీప్సితమ్ ||

దత్తాత్రేయో మునిం ప్రాహ దలాదనమునీశ్వరమ్ | యదిష్టం తద్ వృణీష్వ త్వం యత్ ప్రాప్తోऽహం త్వయాస్మృతః ||

దత్తాత్రేయం మునిం ప్రాహ మయా కిమపి నోచ్యతే | త్వచ్చిత్తే యత్ స్థితం తన్మే ప్రయచ్ఛ మునిపుంగవ ||


శ్రీ దత్తాత్రేయ ఉవాచ


మమాస్తి వజ్రకవచం గృహాణేత్యవదన్మునిమ్ | తథేత్యంగీకృతవతే దలాదమునయే మునిః ||

స్వవజ్రకవచం ప్రాహ ఋషిచ్ఛందః పురస్సరమ్ | న్యాసం ధ్యానం ఫలం తత్ర ప్రయోజనమశేషతః ||


అస్య శ్రీదత్తాత్రేయ వజ్రకవచస్తోత్ర మంత్రస్య, కిరాతరూపీ మహారుద్ర ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీదత్తాత్రేయో దేవతా, ద్రాం బీజం, ఆం శక్తిః, క్రౌం కీలకమ్,


ఓం ఆత్మనే నమః

ఓం ద్రీం మనసే నమః

ఓం ఆం ద్రీం శ్రీం సౌః

ఓం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లః

శ్రీ దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః


కరన్యాసః


ఓం ద్రాం అంగుష్టాభ్యాం నమః

ఓం ద్రీం తర్జనీభ్యాం నమః

ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః

ఓం ద్రైం అనామికాభ్యాం నమః

ఓం ద్రౌం కనిష్ఠికాభ్యాం నమః

ఓం ద్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః


హృదయాది న్యాసః


ఓం ద్రాం హృదయాయ నమః

ఓం ద్రీం శిరసే స్వాహా

ఓం ద్రూం శిఖాయై వషట్

ఓం ద్రైం కవచాయ హుం

ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్

ఓం ద్రః అస్త్రాయ ఫట్


ఓం భూర్భువః స్వరోమితి దిగ్బంధః


ధ్యానమ్


జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే | దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే ||

కదా యోగీ కదా భోగీ కదా నగ్నః పిశాచవత్ | దత్తాత్రేయో హరిః సాక్షాద్ భుక్తిముక్తి ప్రదాయకః ||

వారాణసీపురస్నాయీ కొల్హాపుర జపాదరః | మాహురీపురభిక్షాశీ సహ్యశాయీ దిగంబరః ||

ఇంద్రనీలసమాకారశ్చంద్రకాంతిసమద్యుతిః | వైదూర్యసదృశస్ఫూర్తిశ్చలత్కించిజ్జటాధరః ||

స్నిగ్ధధావల్య యుక్తాక్షోऽత్యంతనీలకనీనికః | భ్రూవక్షఃశ్మశ్రునీలాంకః శశాంకసదృశాననః ||

హాసనిర్జితనీహారః కంఠనిర్జితకంబుకః | మాంసలాంసో దీర్ఘబాహుః పాణినిర్జితపల్లవః ||

విశాలపీనవక్షాశ్చ తామ్రపాణిర్దలోదరః | పృథులశ్రోణిలలితో విశాలజఘనస్థలః ||

రంభాస్తంభోపమానోరుర్జానుపూర్వైకజంఘకః | గూఢగుల్ఫః కూర్మపృష్ఠో లసత్వాదోపరిస్థలః ||

రక్తారవిందసదృశరమణీయపదాధరః | చర్మాంబరధరో యోగీ స్మర్తృగామీ క్షణే క్షణే ||

జ్ఞానోపదేశనిరతో విపద్ధరణదీక్షితః | సిద్ధాసనసమాసీన ఋజుకాయో హసన్ముఖః ||

వామహస్తేన వరదో దక్షిణేనాభయంకరః | బాలోన్మత్త పిశాచీభిః క్వచిద్ యుక్తః పరీక్షితః ||

త్యాగీ భోగీ మహాయోగీ నిత్యానందో నిరంజనః | సర్వరూపీ సర్వదాతా సర్వగః సర్వకామదః ||

భస్మోద్ధూలితసర్వాంగో మహాపాతకనాశనః | భుక్తిప్రదో ముక్తిదాతా జీవన్ముక్తో న సంశయః ||

ఏవం ధ్యాత్వాऽనన్యచిత్తో మద్వజ్రకవచం పఠేత్ | మామేవ పశ్యన్సర్వత్ర స మయా సహ సంచరేత్ ||


దిగంబరం భస్మసుగంధ లేపనం

చక్ర త్రిశూలం డమరుం గదాయుధమ్ |

పద్మాసనం యోగిమునీంద్రవందితం

దత్తేతినామస్మరణేన నిత్యమ్ ||


పంచోపచార పూజా


ఓం లం పృథివీతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, గంధం పరికల్పయామి

ఓం హం ఆకాశతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, పుష్పం పరికల్పయామి

ఓం యం వాయుతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, ధూపం పరికల్పయామి

ఓం రం అగ్నితత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, దీపం పరికల్పయామి

ఓం వం అమృతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, అమృతనైవేద్యం పరికల్పయామి

ఓం సం సర్వతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి


అనంతరం "ఓం ద్రాం" ఇతి మూలమంత్రం 108 వారం జపేత్


ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం

అథ వజ్రకవచమ్


ఓం దత్తాత్రేయః శిరః పాతు సహస్రాబ్జేషు సంస్థితః | భాలం పాత్వానసూయేయశ్చంద్రమండలమధ్యగః ||

కూర్చం మనోమయః పాతు హం క్షం ద్విదలపద్మభూః | జ్యోతీరూపోऽక్షిణీ పాతు పాతు శబ్దాత్మకః శ్రుతీ ||

నాసికాం పాతు గంధాత్మా ముఖం పాతు రసాత్మకః | జిహ్వాం వేదాత్మకః పాతు దంతోష్ఠౌ పాతు ధార్మికః ||

కపోలావత్రిభూః పాతు పా త్వశేషం మమాత్మవిత్ | సర్వాత్మా షోడశారాబ్జస్థితః స్వాత్మాऽవతాద్ గలమ్ ||

స్కంధౌ చంద్రానుజః పాతు భుజౌ పాతు కృతాదిభూః | జతృణీ శత్రుజిత్ పాతు పాతు వక్షఃస్థలం హరిః ||

కాదిఠాంతద్వాదశారపద్మగో మరుదాత్మకః | యోగీశ్వరేశ్వరః పాతు హృదయం హృదయస్థితః ||

పార్శ్వే హరిః పార్శ్వవర్తీ పాతు పార్శ్వస్థితః స్మృతః | హఠయోగాది యోగజ్ఞః కుక్షీం పాతు కృపానిధిః ||

డకారాదిఫకారాంత దశారసరసీరుహే | నాభిస్థలే వర్తమానో నాభిం వహ్న్యాత్మకోऽవతు ||

వహ్నితత్వమయో యోగీ రక్షతాన్మణిపూరకమ్ | కటిం కటిస్థబ్రహ్మాండవాసుదేవాత్మకోऽవతు ||

బకారాదిలకారాంత షట్పత్రాంబుజబోధకః | జలత్వమయో యోగీ స్వాధిస్ఠానం మమావతు ||

సిద్ధాసన సమాసీన ఊరూ సిద్ధేశ్వరోऽవతు | వాదిసాంతచతుష్పత్రసరోరుహనిబోధకః ||

మూలాధారం మహీరూపో రక్షతాద్ వీర్యనిగ్రహీ | పృష్ఠం చ సర్వతః పాతు జానున్యస్తకరాంబుజః ||

జంఘే పాత్వవధూతేంద్రః పాత్వంఘ్రీ తీర్థపావనః | సర్వాంగం పాతు సర్వాత్మా రోమాణ్యవతు కేశవః ||

చర్మం చర్మాంబరః పాతు రక్తం భక్తిప్రియోऽవతు | మాంసం మాంసకరః పాతు మజ్జాం మజ్జాత్మకోऽవతు ||

అస్థీని స్థిరధీః పాయాన్మేధాం వేధాః ప్రపాలయేత్ | శుక్రం సుఖకరః పాతు చిత్తం పాతు దృఢాకృతిః ||

మనోబుద్ధిమహంకారం హృషీకేశాత్మకోऽవతు | కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజః ||

బంధూన్ బంధూత్తమః పాయాచ్ఛత్రుభ్యః పాతు శత్రుజిత్ | గృహారామధనక్షేత్రపుత్రాదీన్ శంకరోऽవతు ||

భార్యాం ప్రకృతివిత్ పాతు పశ్వాదీన్ పాతు శార్‍ఙ్గభృత్ | ప్రాణాన్ పాతు ప్రధానజ్ఞో భక్ష్యాదీన్ పాతు భాస్కరః ||

సుఖం చంద్రాత్మకః పాతు దుఃఖాత్ పాతు పురాంతకః | పశూన్ పశుపతిః పాతు భూతిం భూతేశ్వరో మమ ||

ప్రాచ్యాం విషహరః పాతు పాత్వాగ్నేయ్యాం మఖాత్మకః | యామ్యాం ధర్మాత్మకః పాతు నైరృత్యాం సర్వవైరిహృత్ ||

వరాహః పాతు వారుణ్యాం వాయవ్యాం ప్రాణదోऽవతు | కౌబేర్యాం ధనదః పాతు పాత్వైశాన్యాం మహాగురుః ||

ఊర్ధ్వం పాతు మహాసిద్ధః పాత్వధస్తాజ్జటాధరః | రక్షాహీనం తు యత్ స్థానం రక్షత్వాదిమునీశ్వరః ||


హృదయాది న్యాసః


ఓం ద్రాం హృదయాయ నమః

ఓం ద్రీం శిరసే స్వాహా

ఓం ద్రూం శిఖాయై వషట్

ఓం ద్రైం కవచాయ హుం

ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్

ఓం ద్రః అస్త్రాయ ఫట్


ఓం భూర్భువః స్వరోమితి దిగ్బంధః


ఏతన్మే వజ్రకవచం యః పఠేత్ శృణుయాదపి | వజ్రకాయశ్చిరంజీవీ దత్తాత్రేయోऽహమబ్రువమ్ ||

త్యాగీ భోగీ మహాయోగీ సుఖదుఃఖ వివర్జితః | సర్వత్ర సిద్ధసంకల్పో జీవన్ముక్తోऽద్య వర్తతే ||

ఇత్యుక్త్వాంతర్దధే యోగీ దత్తాత్రేయో దిగంబరః | దలాదనోऽపి తజ్జప్త్వా జీవన్ముక్తః స వర్తతే ||

భిల్లో దూరశ్రవా నామ తదానీం శృతవానిదమ్ | సకృచ్ఛ్రవణమాత్రేణ వజ్రాంగోऽభవదప్యసౌ ||

ఇత్యేతద్ వజ్రకవచం దత్తాత్రేయస్య యోగినః | శృత్వా శేషం శంభు ముఖాత్ పునరప్యాహ పార్వతీ ||


శ్రీ దేవి ఉవాచ


ఏతత్ కవచమాహాత్మ్యం వద విస్తరతో మమ | కుత్ర కేన కదా జాప్యం కియజ్జాప్యం కథం కథమ్ ||

ఉవాచ శంభుస్తత్ సర్వం పార్వత్యా వినయోదితమ్ | శృణు పార్వతి వక్ష్యామి సమాహితమనావిలమ్ ||

ధర్మార్థకామమోక్షాణామిదమేవ పరాయణమ్ | హస్త్యశ్వరథపాదాతిసర్వైశ్వర్యప్రదాయకమ్ ||

పుత్రమిత్ర కలత్రాది సర్వసంతోషసాధనమ్ | వేదశాస్త్రాది విద్యానాం విధానం పరమం హి తత్ ||

సంగీత శాస్త్ర సాహిత్య సత్కవిత్వ విధాయకమ్ | బుద్ధి విద్యా స్మృతి ప్రజ్ఞా మతి ప్రౌఢిప్రదాయకమ్ ||

సర్వసంతోషకరణం సర్వదుఃఖనివారణమ్ | శత్రుసంహారకం శీఘ్రం యశః కీర్తి వివర్ధనమ్ ||

అష్టసంఖ్యా మహారోగాః సన్నిపాతాస్త్రయోదశః | షణ్ణవత్యక్షిరోగాశ్చ వింశతి ర్మేహరోగకాః ||

అష్టాదశ తు కుష్ఠాని గుల్మాన్యష్టవిధాన్యపి | అశీతిర్వాతరోగాశ్చ చత్వారింశత్తు పైత్తికాః ||

వింశతి శ్లేష్మరోగాశ్చ క్షయ చాతుర్థికాదయః | మంత్ర యంత్ర కుయోగాద్యాః కల్పతంత్రాదినిర్మితాః ||

బ్రహ్మరాక్షస వేతాల కూష్మాండాది గ్రహోద్భవాః | సంగజా దేశకాలస్థాస్తాపత్రయసముత్థితాః ||

నవగ్రహసముద్భూతా మహాపాతక సంభవాః | సర్వే రోగాః ప్రణశ్యంతి సహస్రావర్తనాద్ ధ్రువమ్ ||

అయుతావృతిమాత్రేణ వంధ్యాపుత్రవతీ భవేత్ | అయుతద్వితయావృత్త్యా హ్యపమృత్యుజయో భవేత్ ||

అయుతత్రితయాచ్చైవ ఖేచరత్వం ప్రజాయతే | సహస్రాదయుతాదర్వాక్ సర్వకార్యాణి సాధయేత్ ||

లక్షావృత్త్యా సర్వసిద్ధిర్భవత్యే న సంశయః ||


విషవృక్షస్య మూలేషు తిష్ఠన్ వై దక్షిణాముఖః | కురుతే మాసమాత్రేణ వైరిణం వికలేంద్రియమ్ ||

ఔదుంబరతరోర్మూలే వృద్ధికామేన జాప్యతే | శ్రీ వృక్షమూలే శ్రీకామీ తింత్రిణీ శాంతికర్మణి ||

ఓజస్కామోऽశ్వత్థమూలే స్త్రీకామైః సహకారకే | జ్ఞానార్థీ తులసీమూలే గర్భగేహే సుతార్థిభిః ||

ధనార్థిభి స్తు సుక్షేత్రే పశుకామైస్తు గోష్ఠకే | దేవాలయే సర్వకామైస్తత్కాలే సర్వదర్శితమ్ ||

నాభిమాత్ర జలే స్థిత్వా భానుమాలోక్య యో జపేత్ | యుద్ధే వా శాస్త్రవాదే వా సహస్రేణ జయో భవేత్ ||

కంఠమాత్రే జలే స్థిత్వా యో రాత్రౌ కవచం పఠేత్ | జ్వరాపస్మారకుష్ఠాదితాపజ్వరనివారణమ్ ||

యత్ర యత్ స్యాత్ స్థిరం యద్యత్ ప్రసక్తం తన్నివర్తతే | తేన తత్ర హి జప్తవ్యం తతః సిద్ధిర్భవేద్ధృవమ్ ||

ఇత్యుక్తవాన్ శివో గౌర్యై రహస్యం పరమం శుభమ్ | యః పఠేత్ వజ్రకవచం దత్తాత్రేయ సమో భవేత్ ||


ఏవం శివేన కథితం హిమవత్సుతాయై

ప్రోక్తం దలాదమునయేऽత్రిసుతేన పూర్వమ్ |

యః కోऽపి వజ్రకవచం పఠతీహలోకే

దత్తోపమశ్చరతి యోగివరశ్చిరాయుః ||


ఇతి శ్రీ రుద్రయామళే హిమవత్ఖండే మంత్రశాస్త్రే ఉమామహేశ్వర సంవాదే శ్రీ దత్తాత్రేయ వజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్.


!!శ్రీ గురు దత్త - జయ గురు దత్త!!


*శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమ్ - తాత్పర్యం*


పూర్వం వేదవ్యాస మహర్షిని సంకల్పసిద్ధి పొందే ఉపాయం చెప్పమని ఋషులు అడిగిరి. అందుకు వేదవ్యాస మహర్షి, ఒక్కసారి చదివితే చాలు సంకల్పాన్ని సిద్ధింపచేసేది, భోగమోక్షాలను ప్రసాదించేది చెపుతాను, అందరూ వినండి అంటూ ఉపక్రమించాడు.


హిమవత్పర్వత గౌరీశృంగంపై రత్నసింహాసనం మీద ఆసీనుడై ఉన్న పరమేశ్వరునితో ఒకనాడు పార్వతీ దేవి, "ఓ లోక శంకరా! నీవల్ల అనేక మంత్రాలను, యంత్రాలను, తంత్రాలను తెలుసుకున్నాను, ఇప్పుడు మహీతలాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను" అని పలికింది. పార్వతి కోరికను సంతోషంతో అంగీకరించిన పరమేశ్వరుడు వృషభవాహనం పై బయలు దేరి భూలోక వింతలు చూపించసాగాడు. వారు వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక దుర్గమమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ వారికి గొడ్డలి ధరించి సమిధలను సేకరిస్తున్న ఒక కిరాతుడు కనిపించాడు. అతని శరీరం వజ్రము వలె ధృఢముగా ఉన్నది. ఇంతలో ఒక పెద్ద పులి అతని పై దాడి చేయుటకు వేగముగా వచ్చినది. అయితే దానిని చూచిన కిరాతుడు తనను రక్షించుకొనుటకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా సంతోషముతో నిర్భయముగా నిలబడి ఉన్నాడు. అదే సమయములో ఒక లేడి పరిగెత్తుకుంటూ అక్కడకు రాగా దానిని చూచిన పులి బెదిరి పారిపోయింది.


ఈ వింతను చూసిన పార్వతి శంకరునితో "ఏమాశ్చర్యం! ప్రభూ, ఎదురుగా చూడు" అన్నది. దానికి పరమేశ్వరుడు "దేవీ! మేము చూడనిదంటూ లోకంలో ఏ కొంచమూ లేదు. వాక్కులకు, మనస్సుకు అందని అద్భుతం నీకు చెబుతాను, విను" అంటూ చెప్పనారంభించాడు.


ఈ భిల్లుని పేరు దూరశ్రవుడు. పరమ ధార్మికుడు. ప్రతీరోజూ అడవికి వెళ్ళి కష్టపడి సమిధలూ, దర్భలూ, పుష్పాలూ, కందమూల ఫలాలూ తెచ్చి మునీంద్రులకిస్తాడు. ప్రతిఫలంగా తానేమీ కోరడు. ఆ మునులందరూ కూడా అతని పట్ల దయతో ఉంటారు.


అక్కడే దలాదనుడను మహాయోగి ఉన్నాడు. ఒకనాడు దలాదనుడు, "దత్తాత్రేయుడు స్మర్తృగామి (స్మరించిన‌వారి వద్దకు తక్షణమే వెళతాడు)" అని విన్న కథను తలుచుకొని, దత్తుని స్మరించాడు. మరుక్షణంలో దత్త యోగీంద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దలాదన మహర్షి ఆశ్చర్యానందాలు పెల్లుబికగా ఆయనను పూజించి, "ఓ దత్తాత్రేయ మహామునీ! నా ఆహ్వానం విని నీవు విచ్చేశావు. స్మర్తృగామివని విని, కేవలం పరీక్షించడానికే నిన్ను స్మరించాను.

ఓం నమః శివాయ

నా అపరాధం మన్నించు." అన్నాడు. అందుకు దత్త భగవానుడు ఆ మునితో "నా ప్రకృతి ఇటువంటిది. భక్తితోగాని, భక్తి లేకుండా కాని అనన్యచిత్తంతో నన్ను స్మరించిన వారి వద్దకు వెళ్ళి వారి కోరికలు తీరుస్తాను" అని చెప్పాడు. "నీవు తలచుకున్నందుకు వచ్చాను గదా, నీకు ఏమి కావాలో కోరుకో" అని దత్తుడు అడుగగా, దలాదుడు, "ఓ మునిపుంగవా! నేనేమీ అడగను. నీ మనస్సులో ఉన్నది, నాకు శ్రేయస్కరమైనది నాకు ప్రసాదింపుము" అన్నాడు.


శ్రీ దత్తాత్రేయుడు, "నా వజ్రకవచం ఉన్నది, తీసుకో" అని చెప్పగా, దలాదుడు అంగీకరించాడు. దత్తుడు తన వజ్రకవచమునకు సంబంధించిన ఋషినీ, ఛందస్సునూ చెప్పి, న్యాసం, ధ్యానం, ప్రయోజనము అన్నీ వివరించి చెప్పాడు.


దత్తాత్రేయ ధ్యానమ్ :


జగత్తు అనే మొక్కకు దుంప వంటి వాడు, సచ్చిదానంద మూర్తి, యోగీంద్రచంద్రుడు, పరమాత్మ అయిన దత్తాత్రేయునికి నమస్కారము. ఒకప్పుడు యోగి, ఒకప్పుడు భోగి, ఒకప్పుడు నగ్నంగా పిశాచి వలె ఉండే దత్తాత్రేయుడు ప్రత్యక్ష హరి స్వరూపుడు. భుక్తి ముక్తి ప్రదాయకుడు. ఆయన ప్రతిదినమూ వారణాసిలో స్నానము, కొల్హాపురంలో జపము, మాహురీపురంలో భిక్ష స్వీకరించి, సహ్యాద్రిపై శయనిస్తాడు. ఆయన శరీరం ఇంద్రనీలమణి వలె, కాంతి వెన్నెల వలె, జటలు వైఢూర్యం వలే ఉంటాయి. కన్నులు తెల్లగా మైత్రితో, కనుపాపలు చాలా నీలంగా ఉంటాయి. కనుబొమలూ, గుండెలపై రోమాలూ, గెడ్డమూ, మీసాలూ నల్లగా ఉంటాయి. నవ్వు పొగమంచు కంటే చల్లగా, కంఠం శంఖం కంటే అందంగా ఉంటాయి. భుజాలు పుష్ఠిగా ఉంటాయి. బాహువులు పొడవుగా, చేతులు చిగుళ్ళ కంటే కోమలంగా ఉంటాయి. వక్షస్థలం విశాలంగా బలిసి ఉంటుంది. పలుచటి ఉదరంతో, విశాలమైన పిరుదులతో, అందంగా ఉంటాడు. కటి స్థలం విశాలంగా, తొడలు అరటిబోదెల వలె ఉంటాయి. చక్కటి మోకాళ్ళు, పిక్కలూ కలిగి ఉంటాడు. చీలమండలు గూఢంగా ఉంటాయి. పాదాల పైభాగాలు తాబేటి డిప్పల వలె ఉంటాయి. అరికాళ్ళు ఎర్ర తామర పువ్వుల వలె అందంగా ఉంటాయి.


ఆయన మృగచర్మమును వస్త్రంగా ధరిస్తాడు. ప్రతీక్షణమూ తనను తలచుకున్న వారి వద్దకు వెళుతుంటాడు. జ్ఞానోపదేశం చేయటమంటే ఇష్టం. ఆపదలు తొలగించటం ఆయన దీక్ష. సిద్ధాసనంలో నిటారుగా కూర్చుని ఉంటాడు. నవ్వు ముఖం. ఎడమచేత వరదముద్ర, కుడిచేత అభయ ముద్ర. బాలురు, ఉన్మత్తులు, పిశాచాలతో కలిసి తిరుగుతుంటాడు. త్యాగి. భోగి. మహాయోగి. నిత్యానందుడు. నిరంజనుడు, సర్వరూపి, సర్వదాత, సర్వగామి. సర్వకామదుడు. భస్మోద్ధూళిత శరీరుడు. మహాపాతకాలను నాశనం చేసేవాడు. భోగ మోక్ష ప్రదాయకుడు.


"ఇలా ధ్యానం చేసి అనన్యచిత్తంతో నా వజ్రకవచాన్ని పఠించాలి. సర్వత్రా నన్నే దర్శిస్తూ, నాతో సంచరించాలి" అని దత్తుడు తెలిపాడు.


దత్తుడు దిగంబరుడు, భస్మ సుగంధం పూసుకున్నవాడు. చక్రం, త్రిశూలం, డమ్రువు, గద అనే ఆయుధాలు ధరించినవాడు. పద్మాసనుడు. యోగీంద్రులూ, మునీంద్రులూ నిత్యమూ ఆయనను "దత్తా, దత్తా" అంటూ నమస్కరిస్తూంటారు.


దత్తాత్రేయ వజ్రకవచమ్ :


ఓం, దత్తాత్రేయుడు సహస్రార కమలంలో ఉండి, శిరస్సును రక్షించుగాక. అనసూయేయుడు చంద్రమండల మధ్యభాగంలో ఉండి ఫాలాన్ని కాపాడుగాక. మనోమయుడు హం క్షం ద్విదళ పద్మభవుడై భ్రూమధ్యమును రక్షించుగాక. జ్యోతిరూపుడు రెండు కన్నులను, శబ్ద స్వరూపుడు రెండు చెవులను, గంధ స్వరూపుడు ముక్కును, రస స్వరూపుడు నోటిని, వేద స్వరూపుడు నాలుకను, ధర్మ స్వరూపుడు దంతాలను మరియూ రెండు పెదవులను కాపాడుగాక. అత్రిభవుడు నా చెక్కిళ్ళను, ఆ తత్వవేత్త నా ముఖమంతటినీ కాపాడుగాక. సర్వస్వరూపుడు, నా ఆత్మలో ఉండేవాడు షోడశారకమలంలో ఉండి, నా కంఠాన్ని రక్షించుగాక. చంద్రానుజుడు నా భుజ శిరస్సులను, కృతాదిభవుడు నా భుజాలను, శత్రుజిత్తు కొంకులను, హరి వక్షస్థలాన్ని కాపాడుగాక. కకారాది ఠకారాంతమైన ద్వాదశారకమలంలో ఉన్న వాయు స్వరూపుడు యోగీశ్వరేశ్వరుడు నా హృదయాన్ని రక్షించుగాక. పార్శ్వస్థితుడనే హరి నా పార్శ్వాలను, హఠయోగాది యోగజ్ఞుడు మరియు కృపానిధి నా కుక్షినీ కాపాడుగాక. డకారాది ఫకారాంతం కల దశారకమలంలో ఉండే అగ్ని స్వరూపుడు నా నాభిని, వహ్నితత్వమయుడైన యోగి నా మణిపూరకాన్ని రక్షించుగాక. కటిలోని బ్రహ్మాండ వాసుదేవ స్వరూపుడు నా కటిని కాపాడుగాక. బకారాది లకారాంతమైన షట్పత్రకమలాన్ని వికసింపచేసే జలతత్వమయుడైన యోగి నా స్వాధిష్ఠాన చక్రాన్ని రక్షించుగాక. సిద్ధాసనంలో కూర్చున్న సిద్ధేశ్వరుడు నా ఊరువులను కాపాడుగాక. వకారాది సకారాంతమైన నాలుగు రేకుల కమలాన్ని వికసింపచేసే మహీరూపుడైన వీర్యనిగ్రహశాలి, మోకాళ్ళపై హస్తపద్మాలు పెట్టుకున్నవాడు నా మూలాధార చక్రాన్ని, ఇంకా అన్ని వైపులనుండీ నా పృష్ఠాన్ని రక్షించుగాక. అవధూతేంద్రుడు నా పిక్కలను, తీర్థపావనుడు నా రెండు పాదాలను, సర్వాత్ముడు నా సర్వాంగాలను కాపాడుగాక.


కేశవుడు నా రోమాలను రక్షించుగాక. చర్మాంబరుడు నా చర్మాన్ని, భక్తిప్రియుడు నా రక్తాన్ని, మాంసకరుడు నా మాంసాన్ని, మజ్జాస్వరూపుడు నా మజ్జను, స్థిరబుద్ధి గలవాడు నా అస్థులను, వేధ నా మేధను, సుఖకరుడు నా శుక్రాన్ని కాపాడుగాక. దృఢాకృతి నా చిత్తాన్ని, హృషీకేశాత్మకుడు నా మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని, ఈశుడు నా కర్మేంద్రియాలను, అజుడు నా జ్ఞానేంద్ర


ఓం నమః శివాయ

ియాలను రక్షించుగాక. బంధూత్తముడు నా బంధువులను కాపాడుగాక. శత్రుజిత్తు నన్ను శత్రువులనుండి కాపాడుగాక. శంకరుడు నా ఇల్లు, తోట, ధనం, పొలం, పుత్రులు మొదలైనవి రక్షించుగాక. ప్రకృతివిదుడు నా భార్యను కాపాడుగాక. శార్ ఙ్గభృత్తు నా పశువులను రక్షించుగాక. ప్రధానజ్ఞుడు నా ప్రాణాలను, భాస్కరుడు నా భక్ష్యాదులను, చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక. పురాంతకుడు నన్ను దుఃఖం నుండి రక్షించుగాక. పశుపతి నా పశువులను, భూతేశ్వరుడు నా ఐశ్వర్యాన్ని పాలించుగాక.


విషహరుడు తూర్పున, యజ్ఞస్వరూపుడు ఆగ్నేయాన, ధర్మాత్మకుడు దక్షిణాన, సర్వవైరిహృత్ నైరృతి మూల, వరాహుడు పడమటి దిక్కున, ప్రాణదుడు వాయువ్యపు మూల, ధనదుడు ఉత్తరాన, మహాగురుడు ఈశాన్యాన, మహాసిద్ధుడు ఊర్ధ్వదిక్కున, జటాధరుడు అధోదిశన రక్షించాలి. ఆది మునీశ్వరుడు ఏ దిక్కు రక్షణ లేకుండా ఉంటే ఆ దిక్కును కాపాడాలి.


"ఈ నా వజ్రకవచాన్ని ఎవడు చదివినా విన్నా వాడు వజ్రకాయుడు చిరంజీవి కాగలడు. అతడు త్యాగి, భోగి, మహాయోగి, సుఖ దుఃఖ రహితుడు, సర్వత్ర సిద్ధసంకల్పుడు, జీవన్ముక్తుడు అయి వర్తమానంలో ఉంటాడు." అని చెప్పి దత్తాత్రేయ యోగి అంతర్థానం చెందాడు. దలాదుడు కూడా అది జపించి జీవన్ముక్తుడైనాడు. దూరశ్రవుడు అనే భిల్లుడు అప్పుడు దీనిని విన్నాడు. ఒక్కసారి విన్నంతనే వజ్రకాయుడయ్యాడు.


దత్తాత్రేయ కవచమంతా శివుని నోట విన్న పార్వతి, "ఈ కవచం మహత్మ్యమూ, ఉపయోగించే విధానమూ తెలియచేయ"మని అన్నది. వినయంగా అడిగిన పార్వతి ప్రశ్నకు, "ఓ పార్వతీ ఏకాగ్రతతో విను. ధర్మార్థకామ మోక్షాలకు ఇదే ఆధారం"


"ఇది ఏనుగులనూ, గుర్రాలనూ, రథాలనూ, కాలిబంట్లనూ, సర్వైశ్వర్యాన్ని ఇస్తుంది. పుత్ర మిత్ర కళత్రాది సర్వసంతోష సాధనము. వేదశాస్త్రాది విద్యలకు నిధానము. సంగీత, శాస్త్ర సాహిత్య, సత్కవిత్వాలను ప్రసాదిస్తుంది. బుద్ధిని, విద్యను, తలపును, ప్రజ్ఞను, మతిని, నేర్పును ఇస్తుంది. శత్రువులను శీఘ్రమే సంహరిస్తుంది. యశస్సును, కీర్తినీ పెంచుతుంది."


"దీనిని వెయ్యి సార్లు జపిస్తే ఎనిమిది మహారోగాలూ, పదమూడు సన్నిపాతాలూ, తొంభై ఆరు కంటిజబ్బులూ, ఇరవై మేహ రోగాలూ, పద్దెనిమిది కుష్ఠు రోగాలూ, ఎనిమిది విధాల గుల్మాలూ, ఎనభై వాత రోగాలూ, నలభై పైత్య రోగాలూ, ఇరవై శ్లేష్మ రోగాలూ, క్షయ, చాతుర్థికం మొదలైనవీ, మంత్ర యంత్ర, కుత్సిత యోగాదులూ, కల్పతంత్రాదుల వల్ల కలిగించినవీ, బ్రహ్మరాక్షసులూ, భేతాళులూ, కూష్మాండాది గ్రహాలూ, వీటి వల్ల కలిగినవీ, ఆయా దేశకాలాలలో ఉన్నవీ, తాపత్రయం వల్ల కలిగినవీ, నవగ్రహాల వల్ల ఏర్పడినవీ, మహాపాతకాల వల్ల కలిగినవీ, అన్ని రోగాలూ పూర్తిగా నశిస్తాయి. ఇది నిశ్చయం."


"పది వేలసార్లు జపిస్తే గొడ్రాలు పుత్రవతి అవుతుంది. ఇరవై వేలసార్లు జపిస్తే అపమృత్యుజయం లభిస్తుంది. ముప్ఫై వేల సార్లు జపిస్తే ఆకాశ సంచారం అలవడుతుంది. కోటిమార్లు జపిస్తే సర్వకార్యాలు సాధ్యమవుతాయి. లక్ష సార్లకే కార్యసిద్ధి కలుగుతుంది. సంశయం లేదు."


"విషముష్టి చెట్టు మొదట దక్షిణాభిముఖంగా ఒక్క నెల జపిస్తే శత్రువు వికలేంద్రియుడవుతాడు. వృద్ధికి మేడి చెట్టు మొదటా, సిరి కోసం లక్ష్మీ బిల్వం మొదటా, అరిష్టాదుల శాంతికి చింతచెట్టు మొదటా, ఓజస్సు కోసం రావి చెట్టు మొదటా, భార్య కొరకై తీయ మామిడి చెట్టు మొదటా, జ్ఞానార్థం తులసి చెంతా జపించాలి. సంతతి కావాలనుకొనేవారు గర్భగృహంలో, ధనార్థులు మంచి క్షేత్రాలలో, పశువులు కోసం గోశాలలో, ఏ కోరిక గలవరైనా దేవాలయంలోనూ జపించాలి."


"బొడ్డులోతు నీటిలో నిలబడి సూర్యుని చూస్తూ వేయిసార్లు జపించినవాడు యుద్ధంలోగానీ, శాస్త్రవాదంలో గానీ జయిస్తాడు. గొంతులోతు నీటిలో రాత్రిపూట కవచం పఠిస్తే, జ్వరం, అపస్మారం, కుష్ఠు మొదలైన రోగాలూ తాపజ్వరాలూ తొలిగిపోతాయి."


"ఏది ఏది ఎక్కడ స్థిరంగా ఉంటుందో, ఏది ఏది ప్రసన్నమైతే అది నివారణమౌతుందో దాని కొరకు అక్కడ జపిస్తే సిద్ధి కలుగుతుంది. ఇది నిశ్చయం."


అని శివుడు చెప్పాడు. ఈ వజ్రకవచాన్ని పఠించినవాడు దత్తాత్రేయ సమానుడౌతాడు. ఈ విధంగా దత్తాత్రేయుడు దలాదునికి చెప్పినది, శివుడు పార్వతికి తెలియచేశాడు. ఈ కవచమును పఠించినవాడు ఈ లోకంలో దత్తుని వలె యోగి, చిరాయుష్మంతుడు అయి చరిస్తాడు.



దత్తాత్రేయ వజ్రకవచ మహత్మ్యాన్ని "శ్రీ దత్తాత్రేయ గురుచరిత్ర"లో కూడా తెలియజేశారు. లలితాదేవికి మంత్రానికి తోడుగా ఎన్నిరకాల స్తోత్రాలు ఉన్నా సహస్రనామాల మహిమ ఏవిధంగా అత్యున్నతమో, చండీ మంత్రానికి తోడుగా ఎన్ని ఉన్నా సప్తశతికి మిగిలినవేవీ ఎలా సాటిరావో, అదేవిధ‌ంగా దత్తమంత్రానికి దత్తాత్రేయ వజ్రకవచమని మనం అర్థం చేసుకోవచ్చు.


గురుచరిత్ర నుండి:

"స్మర్తృగామి అనేది స్వామికి సార్థకమైన బిరుదు. అంగన్యాస కరన్యాసాలతో స్వామిని అర్చించే విధానం ఒకటి ఉంది. దీనిని దత్తకవచమంటారు. బహిరంతశ్శుద్ధుడైన భక్తుడు దత్తనామాలను ఒక్కొక్కటిగా జపిస్తూ శిరస్సు మొదలుకొని కాలివేళ్ళకొనల వరకూ ఒక్కొక్క అంగాన్ని అంగసంధినీ స్పృశించాలి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలలో మనోబుద్ధి చిత్తాహంకారాలలో దత్తనామాలను నిక్షేపించాలి. హృదయస్థానంలో అయిదు నామాలను స్థిరపరచాలి (హరి, కాదిఠాంత ద్వాదశా


ఓం నమః శివాయ

రపద్మగో, మరుదాత్మకః, యోగీశ్వరేశ్వరః, హృదయస్థితః). గురువును ఆశ్రయించి ఈ కవచాన్ని ధరించాలి. దత్తకవచధారులకు ఏ రంగంలోనూ అపజయమంటూ ఉండదు. శత్రుభయాలూ దుష్టగ్రహపీడలూ భూతప్రేతపిశాచాల హింసలూ దరిదాపులకైనా రావు. భక్తరక్షణలో ఇది వజ్రకవచం."


మైసూర్ఓరియంట ల్లైబ్రరీ


#శామాశాస్త్రి  గారు వెలికితీసిన పోయింది అనుకున్న వేల ఏండ్ల ప్రాచీన గ్రంథ పరిజ్ఞానం!!!

ఇది 70,000 కన్నా ఎక్కువ మాన్యుస్క్రిప్ట్స్ మరియు 40,000 అరుదైన పుస్తకాల సేకరణతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.వాటిలో ఒకటి అర్థశాస్త్రం, #తంజాంజవూర్సరబోజీలైబ్రరీలో చాలా మాన్యుస్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి.

#కౌటిల్య (చాణక్య) రాసిన గణాంక శాస్త్రం, 

#సైనిక_వ్యూహం యొక్క పురాతన వృత్తాంతం 

సా.శ.పూ 3 వ శతాబ్దం నాటిది.

#చాణక్యనీతిపుస్తకం నుండి అతని ప్రసిద్ధ ఉల్లేఖనాలు ఉన్నాయి ,అతను తక్షశిల విశ్వవిద్యాలయం విద్యార్థి కావడం కూడా ఒక ప్రదానాంశం ఇది ప్రపంచంలోనే పురాతన విశ్వవిద్యాలయం గా పేరుగాంచింది.  

పరిపాలన మరియు పౌర వ్యవహారాలపై ఒక స్మారక గ్రంథం అయిన అర్థశాస్త్రానికి చాణక్య యొక్క మరింత ముఖ్యమైన సహకారం ఉంది.  ఈ సమగ్ర రచన సా.పూ 321–296 మధ్య కొంతకాలం వ్రాయబడి ఉండాలి.ఇది ప్రభుత్వ సంస్థలను నడిపించటంలోనే కాకుండా, 

రాజులు, 

మంత్రులు, 

స్థానిక అధికారులు, 

దౌత్యం యొక్క పద్ధతులు మొదలైన వాటి యొక్క విధులను మరియు శత్రువును ఓడించే మార్గాలతో సహా వ్యవహరించే పని.ఎన్సైక్లోపెడిక్ దాని కవరేజీలో చాలా మంది పండితులు ఒక తల ఇంత విస్తారమైన జ్ఞానాన్ని ఎలా తీసుకువెళుతుందో అని ఆలోచించేవారు.

ఇది 2400 సంవత్సరాల క్రితం, మరియు ఈ పుస్తకం ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు మరియు నిర్వహణపై విద్యావిషయక చర్చలలో అంతర్భాగంగా ఉంది;  ఇది అదృశ్యమైన 12 వ శతాబ్దం వరకు.

#పుస్తకం_పోగొట్టుకున్నట్లు భావించినప్పటికీ, ఇది జానపద కథలలో ఇప్పటికీ జ్ఞాపకం ఉంది.  ప్రజలు దీనిని ఒక పురాణ వచనంగా భావించారు, ఇందులో స్టాట్‌క్రాఫ్ట్ యొక్క పెద్ద రహస్యాలు, మరెవరికీ తెలియని రహస్యాలు ఉన్నాయి.1905 వరకు ఇది 1000 భాగాల మాన్యుస్క్రిప్ట్స్ గ్రంధాలలో కనుగొనబడింది.

మైసూరులోని ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ORI) తో మైసూర్ విశ్వవిద్యాలయం క్రింద పనిచేసే పురాతన జ్ఞానం యొక్క పురాతనమైన తాటి ఆకు(తాళ పత్రం) కాపీని ఇప్పుడు తిరిగి కనుగొన్నారు.1905 లో పండితుడు #రుద్రపట్నం #శాస్త్రీ మైసూర్ ఓరియంటల్ లైబ్రరీకి విరాళంగా ఇచ్చిన తాటి ఆకు మాన్యుస్క్రిప్ట్‌లను మరియు #టాంజోర్ సరస్వతి మహల్ లైబ్రరీ నుండి వచ్చిన తెలియని బ్రాహ్మణులను జాబితా చేసే పని ఇవ్వబడింది.  ఈ ప్రాపంచిక పని సమయంలోనే అర్థశాస్త్రం యొక్క పూర్తి కాపీని అతను కనుగొన్నాడు.ఒక సహస్రాబ్దికి పైగా పోగొట్టుకున్నట్లు భావించే ఒక పురాణ పుస్తకాన్ని కనుగొనడం ఊహించుకోండి!  ఈ లైబ్రరీకి తంజావూర్‌కు చెందిన ఒక వ్యక్తి ఈ మాన్యుస్క్రియాట్‌ను ఇచ్చాడని ఒక అభిప్రాయం ఉంది.

ఈ వచనం గ్రంథ లిపిలో వ్రాయబడింది (6 వ శతాబ్దం CE లో ఉపయోగించిన సంస్కృతం రాయడానికి ఉపయోగించే దక్షిణ భారత లిపి).  స్క్రిప్ట్‌ను కనుగొన్న 3 నెలల తర్వాత కూడా దానిని అనువదించలేకపోయారు.అతను ఒక రాత్రి కలలో కీని ఆలోచనచేసి కనుగొన్నాడు మరియు మరుసటి రోజు స్క్రిప్ట్‌ను అర్థం చేసుకోగలిగాడు. 

అతను దానిని 1909 లో ప్రచురించాడు మరియు 1915 లో ఒక ఆంగ్ల అనువాదం ప్రచురించబడింది

 20 వ శతాబ్దం ఆరంభం వరకు, ప్రాచీన భారతదేశంలో సామ్రాజ్యాలు మతాలు మరియు పౌరాణిక విశ్వాసాల ఆధారంగా నడుస్తున్నాయని పాశ్చాత్య ప్రపంచంలో చాలా మంది విశ్వసించారు.  అర్థశాస్త్రం తిరిగి కనుగొన్న తరువాత ఈ మనస్తత్వం చెదిరిపోయింది.

అలెగ్జాండర్ దాడి తరువాత ప్రాచీన భారతదేశం గ్రీకుల నుండి పరిపాలన కళను నేర్చుకుందని పాశ్చాత్య పండితులు (western people)ఎప్పుడూ వాదించారు.  అర్థశాస్త్రం ఈ సిద్ధాంతాలను తప్పుగా నిరూపించింది, మరియు గ్రంథాల యొక్క తదుపరి అధ్యయనాలు ఇది ఇతర మార్గాల్లో, టెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా పరిపాలనలను ఎలా ప్రభావితం చేసిందో చూపించింది.

కనుగొన్న #శామాశాస్త్రి వచనంలో #భట్టా స్వామి వ్యాఖ్యానం కలిగి ఉన్నారు.  ఇది పండితుల ప్రపంచాన్ని  తేజోవంతం చేసింది అనే చెప్పాలి. మరియు "#శామాశాస్త్రి & #మైసూరు" ఒకే సారి  ప్రసిద్ది చెందినట్టుగా చెప్తారు.  ఎంతగా అంటే, #నల్వాడికృష్ణరాజా_వాడియార్, తన జర్మనీ పర్యటనలో, అర్ధశాస్త్రం కనుగొనబడిన శామాశాస్త్రి స్వస్థలమైన మైసూరు నుండి వచ్చిన మహారాజాగా పరిచయం చేయబడింది!

Wednesday, November 11, 2020

ఇడా - పింగళ నాడులు

 ఇడా నాడి :

భౌతిక శరీరంలో, సూక్ష్మ శరీరంలో ప్రాణశక్తిని మోసే వాహకాలే నాడులు. ఈ నాడులన్నీ, శరీరంలో అక్కడక్కడ కలుస్తూంటాయి. వాటిని "చక్రాలు" అంటారు. ఒక విధంగా చెప్పాలంటే, అవి నాడీకూటములు. 

ఈ నాడులు యోగాభ్యాసంలో, ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. యోగశాస్త్రాన్ననుసరించి, ప్రాణము...ఎప్పుడైతే "సుషుమ్నా" నాడిలో ప్రవేశిస్తుందో, అప్పుడు "కుండలినీ శక్తి" ప్రచోదనమై, ఊర్థ్వ గమిత్వము చెంది, మోక్షం వైపు దారి తీస్తుంది.

ఇక సూక్ష్మ శరీర పరిభాషలో చెప్పాలంటే, సుషుమ్న నాడి, మోక్షానికి దారి తీసే మార్గము.

ఇడా-పింగళ నాడులు "సుషుమ్న నాడి" చుట్టూ, మెలికలు తిరిగినట్లు తిరుగుతూ...జీవ పరిణామానికి దారితీసేటట్టు చేస్తున్నాయి.

మానవుల దేహములో, ఈ నాడులు , కోట్లాదిగా...స్థూల-సూక్ష్మ దేహములలో...విస్తరించి యున్నాయి.

ఇడా నాడి ..... ప్రాణశక్తి ప్రవాహానాడుల్లో...చాలా ముఖ్యమైనది. సంస్కృతంలో, "ఇడా" అనగా "సౌఖ్యం". నాడి అనగా శక్తి ప్రవాహం. యోగ మార్గంలో, నాడీ ప్రవాహ మార్గాలలో, ఆటంకాలు లేకుండా ఉంటే...ప్రాణ శక్తి...నిరాటంకంగా ప్రవహిస్తుంది. మన నాడులలో నిరంతరం ప్రాణ శక్తి ప్రవాహం నిరంతరం జరగాలి. ప్రాణ ప్రవాహం లేకపోతే...మనిషి...శవంగా మారతాడు. నిరంతర ప్రాణ శక్తి ప్రవాహానికై, మనం నిరంతరం, శాస్త్ర విహిత సాధనలు చేయాలి. ఈ ప్రాణశక్తి నిరంతర ప్రవాహం వలన ఆది-వ్యాదులు రావు. (ఆదులు అనగా మానసిక వ్యాదులు. వ్యాదులు అనగా శారీరక బాధలు). ఈ ప్రాణ శక్తి నిరంతర ప్రవాహం వలన, మన మానసిక-శారీరక ఆరోగ్యాలు బాగుంటాయి. ఈ ఇడా నాడి, మానసిక శక్తికి ప్రతీక. ఈ నాడి షట్చక్రాలను చుడుతూ, వెనుబాము యొక్క ఆమూలాగ్రము చరిస్తూ యుంటుంది. ఇడా-పింగళా నాడుల ఉద్దీపనం, కుండలినీ శక్తి ఉద్దీపనం కూడా.

ఇడా నాడిని "చంద్ర నాడి" అంటారు. పింగళా నాడిని, సూర్య నాడి అంటారు. ఈ ఇడానాడి ప్రవాహం...చంద్రుని శక్తితో అనుసంధానించబడి ఉన్నది. ఈ నాడి "మూలాధార చక్రం" నుండి జనించి, షట్చక్రాలను చుట్టుకుంటూ, వెనుబాము పర్యంతమూ పయనిస్తుంది. ఇడా-పింగళా నాడులు ఒకదానికొకటి ప్రతిబింబాలనుకోవచ్చును. ఈ నాడి మూలాధార చక్రం నుండి ప్రారంభమై ఎడమ ముక్కు రంధ్రం వరకు ప్రవహిస్తుంది.

ఇడా నాడి మానసిక స్థితి గతులను నియంత్రిస్తుంది. ప్రాణశక్తిని నాడీ వ్యవస్థకు పంపిస్తుంది. తత్ఫలితంగా, మనస్సుకు శాంతి, శరీరానికి విశ్రాంతి కలుగుతుంది.  యోగశాస్త్ర సిద్ధాంతాల ప్రకారము, మెదడులో గల భాగములలో ఎడమ భాగమునకు కుడి నాసాగ్రముతొను - మెదడు లోని కుడిభాగము నకు ఎడమ నాసాగ్రముతోను సంబంధము కలదు .అనగా సింపతిటిక్, పారా సింపతిటిక్ అండ్ సెంట్రల్ నెర్వస్ సిష్టమ్. ( యోగ సిద్ధాంతాల ప్రకారం - ) మెదడులోని ప్రతీ కణమునకు నాడులు కలుపబడి ఉన్నాయి. ఆనాడులు మానవ శరీరమందలి అన్ని భాగములకు ప్రాణశక్తిని అందించుచున్నవి.

ఈ నాడీ ప్రభావం వలన, మనకు అంతర్ముఖత్వం వస్తుంది. ఈ నాడి మనలో ఉండే స్త్రీ శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. ఇడానాడీ శక్తి, పింగళా నాడీ శక్తిని సంతులితం చేస్తుంది. హఠయోగ సాధనల్లో, ముఖ్యమైనది...ఈ ఇడ-పింగళాలను సమన్వయం చేయడం.

హఠయోగ అభ్యాసాలలో, ముఖ్యమైన "నాడీ శోధన ప్రాణాయామం"...ఈ ఇడా-పింగళల నాడులను సంతులనం చేస్తుంది.

Monday, November 9, 2020

తారక మంత్రం

భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో మంత్రానికి ఒక విశిష్ట స్థానం ఉంది. పరమాత్మతో ఆత్మానుసంధానానికి, భక్తికి మంత్రం కీలకమైందని యజుర్వేదం చెబుతోంది. మనం దైవానికి చేసుకొనే విన్నపాలు మంత్రంలోని బీజాక్షర శక్తి కారణంగా నేరుగా చేరతాయన్నది పౌరాణికుల భావన. పూర్వ కాలంనుంచీ వైదిక మంత్రాలను మూర్తిలోకి దైవత్వాన్ని ఆవాహన చేసేందుకు ప్రయోగించడం సంప్రదాయం. మూర్తిలోకి అంటే మన హృదయంలోకి అనే భావార్థమూ ఉంది. మంత్రాలు మౌలికంగా ప్రచలిత సంహితాలు. ఏ మంత్రాన్నైనా ఓం అక్షరం చేర్చి ఉచ్చరిస్తే ఆ మంత్ర ధ్వని సత్య వ్యక్తీకరణకు కారణమవుతుందని మంత్రోపనిషత్తు వివరిస్తోంది. మంత్రాలన్నింటికీ భిన్నమై, మానసాన్ని భక్తికి గురిచేసే మంత్రం తారక మంత్రమని రామ రహస్యోపనిషత్తు తెలుపుతోంది. శ్రీరామ నామమే తారకమంత్రం. శుక్ల యజుర్వేదానికి చెందిన అద్వయ తారకోపనిషత్తులో తారక మంత్రం మహత్తు గురించిన సంపూర్ణ వివరణ ఉంది. తొలుత ఈ మంత్రం శివుడు పార్వతికి ఉపదేశించినట్లు చెబుతారు.

‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే’ అన్నదే తారక మంత్రం. కుండలినీ శక్తికి రా అనే బీజాక్షరమే మూలాధారమని స్యావన స్మృతి వెల్లడిస్తోంది. మ అనే బీజాక్షరం సహస్రార చక్రాన్ని చైతన్యపరుస్తుంది. రామ అనే నామాన్ని పలికినంతనే కుండలినీ శక్తి సర్పం ఆకారంలో పడగెత్తి కపాలాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తుందని ఈ స్మృతి వివరిస్తోంది. యోగిగా మారే యోగ్యత కోసం మానవుడు సదా ఈ నామాన్ని స్మరిస్తూనే ఉండాలని పార్వతికి శివుడు చెప్పాడంటారు. ధరణిలోని మానవుడి ధన్యత కోసం రెండు మంత్రాలు అమేయమైనవని వసిష్ఠుడు దశరథుడితో అంటాడు. ఒకటి ప్రణవం, మరోటి రామ శబ్దం! అందుకే వసిష్ఠుడు దశరథుడి పెద్ద కుమారుడికి శ్రీరామ అని నామకరణం చేశాడట.

రామ రహస్యోపనిషత్తు అధర్వణ వేదానికి సంబంధించినది. శ్రీరామ అనే పదంలోనే విశ్వాల ఆవిర్భావానికి కారణమైన రహస్యం ఉందని సప్తర్షుల్లో ఒకడైన గౌతముడు తాను రాసిన ధర్మశాస్త్రంలో వివరించాడు. అగస్త్యుడు రామ రహస్యోపనిషత్తును హనుమంతుడికి ఉపదేశించాడంటారు. స్వాయంభువ మన్వంతరంలో మానవులందరి నిజ నామం చివర రామ అని ఉండేదట. అలా ఒకరినొకరు పిలుచుకునేందుకు అనుకోకుండానే రామ నామం పలికేవారు. అందుకే ఆ మన్వంతరంలో నరకంలో పని లేక యముడు సదా నిద్రలోనే ఉండేవాడన్నది కథనం.

కాశీ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి- మానవుడు తనువు చాలించే ముందు అతడి కుడిచెవిలో విశ్వనాథుడు తారకమంత్రం ఉపదేశిస్తాడన్నది ఒక నమ్మకం.

రాముడు తన వంశానికి చెందినవాడని సూర్యుడికి గర్వమట. భూమిపై శ్రీరామనవమి ఉత్సవాలు చూసేందుకు సూరీడు అందుకే ఒకింత కిందికి వస్తాడట. అందువల్లే ఆ సమయంలో ఎండలు మండుతాయన్నది ఒక కవి హృదయం! అష్టాక్షరిలోని రా అక్షరం, పంచాక్షరిలోని మ అక్షరం... ఈ రెండు జీవాక్షరాలూ కలిసి రామ అయిందని పౌరాణికుల వ్యాఖ్య! అలా తారకమంత్రం ఉచ్చరించినంత మాత్రాన శివకేశవులు సంతుష్టులవుతారట.. 

శ్రీరామకృష్ణ పరమహంస తొలుత నరేంద్రుడికి తారక మంత్రమే ఉపదేశించాడు. ఆ తరవాతే నరేంద్రుడు వివేకానందుడయ్యాడు. కబీరు గురుబోధనతో తారకమంత్రం లభించిన కంచర్ల గోపన్న ‘తారక మంత్రము కోరిన దొరికెను... ధన్యుడనైతిని’ అంటూ (ధన్యాసి రాగం) ఆలపించాడు. ‘రమించు వారెవరురా-రఘోత్తమా నిను వినా’ (సుపోషిణి), ‘మనవిని వినుమా-మరువ సమయమా’ (జయనారాయణి) అంటూ ఆర్ద్రతతో రాముణ్ని స్మరిస్తూ త్యాగయ్య నాదయోగం సాధించాడు. తారక మంత్రంలోని మహత్తు అదే! 

 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.

Sunday, November 8, 2020

వేంకటేశాయ మంగళమ్

 శ్రియః కాంతాయ కళ్యాణ 

నిధయే నిధయేర్థినాం

శ్రీవేంకటనివాసాయ 

శ్రీనివాసాయ మంగళమ్ ||


లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమచక్షుషే

చక్షుషే సర్వలోకానాం 

వేంకటేశాయ మంగళమ్ ||


శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే

మంగళానాం నివాసాయ 

శ్రీనివాసాయ మంగళమ్ || 


నిత్యాయ నిరవద్యాయ సత్యానందచిదాత్మనే

సర్వాంతరాత్మనే 

శ్రీమద్ వేంకటేశాయ మంగళమ్ || 


స్వతస్సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే

సులభాయ సుశీలాయ 

వేంకటేశాయ మంగళమ్ ||


శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీతటే

రమయా రమమాణాయ 

వేంకటేశాయ మంగళమ్ || 


మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః

సర్వైశ్చ పూర్వైరాచార్యైః 

సత్కృతాయాస్తు మంగళమ్ ||


 ఓం హరిచందనగోత్రేంద్రస్వామినే నమః

తెలుగు పద్యం

"మనమే మనమని మనమన మనుమని మనుమని మనుమనిమన నమ్మేనా?"

"మన మేనమామ మామను మునునేమిన మౌనిమౌని మనమున మౌనమే!"

భావం

"మనమే = మనం అందరమూ....,"

 "మనమని = శాశ్వతం కాదని"

"మనమన = బుద్ధీ హెచ్చరిస్తూన్నా"

"మనుమని మనుమని మనుమని" = 

"పౌత్రునకు పౌత్రునకుృ పౌత్రుని (తన తర్వాత తరాల 7 తరాలు గురించి)"

"మననమ్మేనా? = తాపత్రయ పడడమేనా? (కాదు),"

"మన మేనమామ =మన మేన మామ అయిన చంద్రుడికి,"

"మామను = మామగారైన దక్షప్రజాప్రతిని,"

"మును+నేమిన = పూర్వం శిక్షించిన,"

"మౌనిమౌని = మునీశ్వరులకి మునీశ్వరుడైన, మునులలో అగ్రగణ్యుడైన శివుని"

"మౌనమే = మౌనంగా"

 "మనమున = మనస్సు నందు ధ్యానించుట మేలు!!"

"అనగా జన్మ పరంపరను కోరడం కంటే జన్మ రాహిత్యమును పొందడానికి మోక్షప్రదాత అయిన శివుని ఆశ్రయించడం మేలు!!"

"ఎంతో లోతైన  జన్మ రాహిత్యాన్ని భావం చెడకుండా  మోక్ష పదమైన మకారంతో  మలిచారు."

" తెలుగు భాష గొప్పదనం ఎంత అని చెప్పగలం, మాధుర్యాన్ని ఆస్వాదించడం  మినహా..."

Friday, November 6, 2020

శిరిడీ సాయి


షిర్డీ సాయిబాబా తత్వమేమిటని పరిశీలిస్తే, మత సమన్వయాన్ని ప్రబోధించి, మత సామరస్యాన్ని పెంపొందించి, మతంలో వున్న లోపాల్ని సరిదిద్ది, సంఘం ఆచరించాల్సిన సరైన విధానాన్ని బోధించారని సాయి తత్వాన్ని కూలంకషంగా పరిశీలించిన పెద్దలు చెబుతారు. భక్తి, జ్ఞాన, కర్మ మార్గాలు మూడింటినీ మేళవించి, వీటిని ఒకే మార్గంలో ఆచరించడం సాధ్యమని తాను ఆచరించి మరీ సామాన్యులకు చూపించారు.

షిర్డీ సాయి భక్తి మార్గాన్ని అనుసరించినప్పటికీ ఎలాంటి మంత్ర తంత్రాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆయన ఎవరికీ ఏ మంత్రాన్నీ ఉపదేశించలేదు. ఏ యోగ మార్గాన్నీ ఆయన ఆచరింపచేయలేదు. పూజా విధానమంటూ ఏ ప్రత్యేక పూజా విధానాన్నీ ఆయన ప్రతిపాదించలేదు. హఠయోగాన్ని, షట్కర్మల్ని ఆచరిస్తానని తన వద్దకు వచ్చిన కన్నడ ప్రాంతానికి చెందిన యోగిని కూడా ఆ పద్ధతుల నుంచి విముఖుడిని చేశారు.  ఏకాదశి నాడు ఉపవాసాలనే తంతు నుంచి కూడా ఆస్తికులను విముక్తులను చేయించి, వారికి తిండి తినిపించమే కాకుండా ఉల్లిపాయలు కూడా వారిచేత తినిపించారు. తిథి, వార, నక్షత్రాలకు ఆయన ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. ధ్యాన మార్గానికి పట్టం కడుతూనే, భక్తి, ప్రేమల్ని ప్రోత్సహించారు. ధ్యాన మార్గంలో నడవలేమని అనుకునే వారిని సాకారం నుంచి నిరాకారం వైపు ప్రయాణం చేయమని ప్రబోధించారాయన.

రాధాబాయి దేశ్‌ముఖ్ అనే వృద్ధ మహిళ దగ్గర మాత్రమే ఆయన నిజమైన ధ్యానమార్గాన్ని సవివరంగా బోధించారు. గురుశిష్య బంధాన్ని, గురువుకున్న ప్రాధాన్యాన్ని, ధ్యాన సాధన ప్రాధాన్యాన్ని ఆయన కూలంకషంగా వివరించారు. ఆత్మజ్ఞాన, సాధన మార్గంలో నడవాలనుకునే వారికి హృదయ వైశాల్యం వుండాలని,  ఎల్లప్పుడూ ఆత్మను చూసుకోగలిగే శక్తిని సాధన ద్వారా అభివృద్ధి చేసుకోవాలని సాయిబాబా సూచించారు. ఆత్మజ్ఞాన సాధకుడయినప్పటికీ ఇంద్రీయ నిగ్రహం అంత తేలిగ్గా అలవడని, దాన్ని ప్రతినిత్యం సాధనతో అలవరుచుకోవాలని తార్కాణాలతో సహా నిరూపించారు.

ప్రారబ్ధ కర్మలతో బాధల్ని అనుభవిస్తున్న మానవుల బాధలన్నిటినీ తాను స్వీకరించి వాళ్ళను బాధల నుంచి విముక్తులను చేశారని అనిపిస్తూ వుంటుంది. కొలిమిలో పడిన పసిబిడ్డను తన చేతిని కాల్చుకుని బాబా రక్షించారు.  భక్తుడి చెడు కర్మను తానే అనుభవించి అతని కష్టాన్ని తొలగించిన బాబా విధానమే ఆయన అసలైన మార్గం అని మనకు అవగతం అవుతుంది. కుచేలుడి దారిద్ర్యం మొత్తాన్నీ మూడు పిడికిళ్ళ అటుకులు తీసుకోవడం ద్వారా  తొలగించిన శ్రీకృష్ణుడి తరహాలో బాబా తన భక్తుల బాధల్ని, ఆకలిని, వ్యాధులను తొలగించారు. వారి బాధలను ఆయన భరించారు. ఇలాంటి తత్త్వాన్ని బాబా తప్ప మరే సిద్ధ పురుషుడూ ప్రదర్శించలేదు.

శ్రీదుర్గాభుజంగస్తోత్రం

 1) దుర్గమాజ్ఞానగమ్య దుర్గమార్గబాంధవీం

   దుర్వికారమలనాశ దుర్గతోద్ధారిణీం 

   దుర్గమాసురహంత దుర్నిమిత్తవారిణీం 

   దుర్గమారణ్యచర దుర్గాభవానీం ||

2) దుంబీజాత్మరూప దుఃస్స్వప్నవారిణీం 

   దుర్మార్గకుటిలచిత్త మహిషాసురభంజనీం 

   దుర్లభానందప్రద దుఃఖశమనకారిణీం 

   దుర్గమారణ్యచర దుర్గాభవానీం ||

3) దుష్టదక్షయజ్ఞనాశ దృఢచిత్తశాంభవీం   

   దుర్మేధచండముండ మధుకైటభనాశనీం 

   దుర్నిరీక్ష్యమహోజ్జ్వల జ్వాలామాలినీం 

   దుర్గమారణ్యచర దుర్గాభవానీం ||

4) దుర్బేధ్యసంసార తారభయహారిణీం 

   దృష్టిదోషవారక సౌభాగ్యదాయినీం 

   దుర్గమాగమరూప దేవవిఘ్ననాశినీం  

   దుర్గమారణ్యచర దుర్గాభవానీం || 

5) దుర్గాచలవాస శివవామభాగినీం 

    దురాచారనిర్మూల సదాచారకారిణీం 

    దుర్జనాసహవాస భావనాభంజనీం   

    దుర్గమారణ్యచర దుర్గాభవానీం ||

     సర్వం శ్రీ దుర్గా దివ్యచరణారవిందార్పణమస్తు

Thursday, November 5, 2020

నారాయణతే నమో నమో...

త్రిమూర్తులకు ప్రతిరూపం నారాయణుడని యజుర్వేదం చెబుతోంది. 


రుగ్వేదం, భాగవతం, భగవద్గీత వంటివీ నారాయణుడే పరమదైవమని కీర్తిస్తున్నాయి.


 నారాయణుడు ఆత్మస్వరూపుడు. సకల జీవుల్లోని ఆత్మకు నారాయణుడికి నిత్య సత్య సంబంధం ఉంటుందని సూర్యోపనిషత్తు వివరిస్తోంది.


 శంకరాచార్యుడి పంచాయతన విధానాన్ని అనుసరించి నారాయణుడే పరబ్రహ్మం.


 యాస్కుడి నిరుక్తం నారాయణుడు అంతటా వ్యాపించి ఉన్నాడని చెబుతోంది. 


రుగ్వేదంలోని దశమ మండలంలో ప్రస్తావించిన పురుష సూక్తంలో శ్రీమన్నారాయణుడి స్వరూప స్వభావ విశేషాలు తెలుస్తాయి.


 ఈ దైవమే పరమ పురుషుడు. 


ఈ సూక్తంలోని రెండో శ్లోకం నుంచి అయిదో శ్లోకం వరకు నారాయణుడి స్వరూపాన్ని వర్ణించారు. 


విశ్వం, విశ్వాంతరాళాల్లో నారాయణుడు అనంతమై, అగణితమై వ్యాపించి ఉన్నాడని, జగత్సంబంధమైన అపూర్వ, దివ్యమైన ఆ రూపాన్ని చూడలేమని అధర్వణ వేదం చెబుతోంది.



నారాయణుడి రూపం వర్ణనకు అతీతమైంది. 


ఇతర శక్తుల ఊహకు సైతం ఆ దైవస్వరూపం అందనిదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించాడు


. కావ్య సరణిగా పరమ పురుషుడికి వేయికాళ్లు, వేయిచేతులు ఉన్నాయని పురుష సూక్తంలో చెప్పినా- ఆ స్వరూపం ఇంత టిదని నిర్వచించ లేనిది, అభివ్యక్తీకరణకు అందనిదని ఉపనిషత్తులు తెలియజెబుతున్నాయి.


 నారాయణుడు వేలాది కోట్ల సూర్య నక్షత్రాలకన్నా శక్తిమంతుడు. ఆయన సృజించిన నక్షత్రాలు గ్రహాలు లెక్కించ లేనివని వాజసనేయి సంహిత వివరిస్తోంది. 


అంతరిక్ష పరిశోధకులూ ఇదే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నక్షత్రాలు, గ్రహాలు ఊహకు అంద నంతగా ఉన్నాయని, అందులో ఎన్నో కోట్లు అంతరించి మరెన్నో కోట్ల నక్షత్రాలు ఉద్భవిస్తున్నాయని తేల్చారు. 


తైత్తిరీయ ఆరణ్యకం- అంతరిక్షంలో నిరంతరం ఉద్భవించి నశించే నక్షత్ర రాశులన్నీ పరమ పురుషుడి లోనుంచి జనించి లయమవుతున్నాయని చెబుతోంది. 


నారాయణుణ్ని సంపూర్ణంగా తెలుసుకొన్నవారు ఉన్నారు. కాని, వారు పురుష సూక్తంలో చెప్పినట్లు ఆ పరమ పురుషుడిలో లయమైపోయారు.


 ఆ దీప్తిని మనిషి చర్మ చక్షువులు చూడలేవు. సూర్యుణ్ని మనం సూటిగా చూడలేం. అలాంటి అగణిత సూర్య శక్తులను సృజించే నారాయణుడిలోని వెలుగును మనం తట్టుకోలేం.



మూడు వందల అరవై కల్పాల తరవాత మహా ప్రళయం సంభవిస్తుందంటారు. ఈ అనంత కోటి విశ్వాలన్నీ మహా పురుషుడిలో కలిసిపోతాయట. అప్పుడు ఎక్కడ చూసినా నీరే! ఆ నీటిపై రావి ఆకుపై పడుకొని తన కాలి బొటన వేలిని నోట్లో పెట్టుకొని బ్రహ్మానందం అనుభవించే వట పత్ర శాయి నారాయణుడు.

నారాయణుడు సృజన శీలి.


 ఆయనే రక్షకుడు. నారాయణుడే లోకాలకు తండ్రి. జీవరాశులు, చలనాలు అచలనాలన్నింటికీ ఆయనే కారకుడు.


 ఆధ్యాత్మిక భావంతో ఆయనను చేరడం సులువని భాగవతం చెబుతోంది.


 ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం భవజలధిని దాటించే సాధనం. నారదుడు నిరంతరం ‘నారాయణ నారాయణ’ అంటూ లోకాలన్నీ తిరుగుతాడట.


 అన్నమాచార్యులు సైతం నారాయణతే నమో నమో అంటూ శిరస్సు వంచి నమస్కరించారు.


----అప్పరుసు రమాకాంతరావు



🍁🍁🍁🍁

64 కళలతో, 64 యోగి నీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు

 ఒకసారి శ్రీశంకరా చార్యుల వారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగి నీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించారు. అవి.



1. అర్ఘ్యం,పాద్యం, ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం.



2. అభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం.


3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం.



4. మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం.



5. మణి పీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం.



6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట.



7. ఉష్ణోదక స్నానము – వేడి నీటితో స్నానము చేయించుట.



8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము.



9. ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం.



10. అరుణ దుకూల పరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం.



11. అరుణ కుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం.



12. ఆలేపన మంటప ప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం.



13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం.



14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం.



15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమ మాల సంప్రయం - వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం.



16. భూషణ మండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము.



17. మణి పీఠోపవేశనము - అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము.



18. నవమణి మకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం.



19. దానిపైన చంద్ర శకలం పెట్టడం.



20. సీమంతంలో సిధూరాన్ని దిద్దడం.



21. తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం.



22. కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం.



23. పాళీయగళం – అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం.



24. మణికుండళ యుగళం - మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం.



25. నాసాభరణం – ముక్కుకి నాసాభరణం అలంకరించడం.



26. అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం.


27. ఆర్య భూషణం - ప్రధాన భూషణం అలంకరించడము.



28. మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట.



29. హేమచింతాకం – బంగారుతో కూడిన చింతా మణుల మాల వేయడం.



30. పతకం – బంగారు పతకం.



31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం.



32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం.



33. ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం.



34. చన్నభీరము – యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము.



35. కేయూర యుగళ భూషణ చతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు కేయీరములు ( దండ కడియాలు)



36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు.



37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు.



38. కాంచీధామము – వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము.



39. కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము.



40. సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు). 



41. పాదకటకం – కాలి అందెలు.



42. రత్ననూపురములు – దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు.



43. పాదంగుళీయములు - మట్టెలు.



44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు.



45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం.



46. పుండ్రేక్షు చాపము – క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు. 



47. పుష్పబాణములు – కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు.



48. శ్రీ మణి మాణిక్య పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు.



49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం.



50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట.



51. అమృతచషకము – అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట.



52. ఆచమనీయము – జలమునందించుట.



53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం అంటే ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది).



54. ఆనందోల్లాస విలాస హాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము.



55. మంగళార్తికం – దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం.



56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట.



57. చామరము – అమ్మవారికి చామరము వీచుట.



58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట.



59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట.



60. చందనం – గంధం పమర్పించుట.



61. పుష్పం – పుష్పాలను సమర్పించుట.



62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట.



63. దీపము – దీప దర్శనము చేయించుట.



64. నైవేద్య, తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట ఏకాంతము.

Wednesday, November 4, 2020

అరుణాచల గిరి ప్రదక్షిణ




 

ప్రసాదాల లోగుట్టు ( medical benfits of hindu prasadam)

ప్రతి ప్రసాదానికి విశిష్టత ఉంది . ఈ ప్రసాదాల్లో ఉన్న మిశ్రమాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు .

జీర్ణశక్తిని పెంచే ' కబెట్టె పొంగళి

" బియ్యం , పెసరపొప్పు , జీలకర్ర , ఇంగువ , నెయ్యి , అల్లం , శొంఠిపొడి , ఉప్పు , కరివేపాకు , జీడిపప్పుల మిశ్రమంలో తయారయ్యే కట్టెపొంగలి రోగనిరోధకశక్తిని , జీర్ణశక్తిని పెంచు తుంది . మంచి ఆకలిని కలిగిస్తుంది .

జీర్ణకోశ వ్యాధుల నివారిణి ' పులిహోర

' బియ్యం , చింతపండుపులుసు , శనగపప్పు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఎండుమిర్చి ఉప్పు , ఇంగువ , పసుపు , బెల్లం , నూనె , వేరుశన గలు , జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది . జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది మేధస్సును పెంచే దద్ధోజనం

' బియ్యం , పెరుగు , ఇంగువ , కొత్తిమీర , అల్లం , - మిర్చి కొంఠి పొడిల మిశ్ర మంతో తయారు చేసే ఈ - ప్రసాదం మేధస్సును పెంచుతుంది . శరీరానికి కి మంచి శక్తిని ఇచ్చి ఆరో గ్యాన్ని కల్గిస్తుంది .

వార్ధక్యాన్ని నిలువరించే ' కదంబ '

బియ్యం , చింతపండు , ఎండుమిర్చి పోపులు , ఇంగువ , నూనె , ఉప్పు , కందిపప్పు పసుపు , బెల్లం , నెయ్యి , బెండకాయ , వంకాయ , గుమ్మడికాయ , చిక్కుళ్లు , బీన్స్ , దోసకాయ , క్యారెట్ , టమోటా , చిలకడదుంపల మిశ్రమంలో తయారు చేసే కదంబ ప్రసాదం అత్యంత బలవర్థకం . సప్తధాతువుల పోషణ చేస్తుంది . వార్ధక్యాన్ని నిలువరిస్తుంది . అన్ని వయస్సుల వారికి మంచి పౌష్టికాహారం .

శ్లేష్మాన్ని తగ్గించే ' పూర్ణాలు "

పచ్చిశనగపప్పు , బెల్లం , కొబ్బరి చురుము , యాలకుల మిశ్ర మంతో ఈ ప్రసాదం సప్తధాతు వుల పోషణ చేస్తుంది . శ్లేష్మాన్ని తగ్గిస్తుంది . మంచి బలవర్ధకం .

రోగనిరోధకశక్తిని పెంచే చలిమిడి

' బియ్యం పిండి , బెల్లం , యాలుకలు , నెయ్యి , పచ్చకర్పూరం , జీడిపప్పు , ఎండుకొబ్బరికో రుతో తయారుచేసే చలిమిడి మంచి బలవర్ధకం

కొబ్బరి పాల పాయసం

కొబ్బరి పాలు పచ్చ కర్పూరం యాలకుల పొడి బాదంపప్పు కుంకుమపువ్వు పంచదార ఆవు పాలు కలకండ పొడి తో చేసే ఈ ప్రసాదం వెంటనే శక్తినిస్తుంది. మంచి బలవర్ధకం. శ్రేష్మాన్ని హరిస్తుంది.

గణపతి - సంకటహర చతుర్థి


గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి  అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం  అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.

ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం  ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3, 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.

సంకటహర చతుర్థి ‬ వ్రత పూజా విధానం :- సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి.

ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి, తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.

సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.

సంకట హర చతుర్ధి వ్రత కథ :- ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు.

అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!

అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు.

అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేషుని దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.

ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.


గణపతి ప్రార్ధన :-

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే!!


గణనాయకాష్టకం :-

ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్

లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్


మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతమ్

బాలేందుశకలం మౌళీ, వందేహం గణ నాయకమ్


చిత్రరత్నవిచిత్రాంగం, చిత్రమాలా విభూషితమ్

కామరూపధరం దేవం, వందేహం గణనాయకమ్


గజవక్త్రం సురశ్రేష్ఠం, కర్ణచామర భూషితమ్

పాశాంకుశధరం దేవం వందేహం గణ నాయకమ్


మూషికోత్తమ మారుహ్య దేవాసురమహాహవే

యోద్ధుకామం మహావీరం వందేహం గణ నాయకమ్


యక్షకిన్నెర గంధర్వ, సిద్ధ విద్యాధరైస్సదా

స్తూయమానం మహాబాహుం వందేహం గణ నాయకమ్


అంబికాహృదయానందం, మాతృభి: పరివేష్టితమ్

భక్తిప్రియం మదోన్మత్తం, వందేహం గణ నాయకమ్


సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితమ్

సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణ నాయకమ్


గణాష్టకమిదం పుణ్యం, యః పఠేత్ సతతం నరః

సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్


ఇతి శ్రీ గణనాయకాష్టకం


సంకటహర గణపతి స్తోత్రం:-

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం

తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం

లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ

సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం

నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం

ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్

ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం

నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో

విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం

పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్

జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్

సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్

తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః


విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం :-


జయ విఘ్నేశ్వర! నమో నమో, జగద్రక్షకా! నమో నమో

జయకర! శుభకర! సర్వపరాత్పర! జగదుద్ధారా! నమో నమో


మూషిక వాహన! నమోనమో, మునిజనవందిత! నమో నమో

మాయా రాక్షస మదాపహరణా! మన్మధారిసుత! నమో నమో


విద్యాదాయక! నమో నమో, విఘ్నవిదారక, నమో నమో

విశ్వసృష్టి లయ కారణ శంభో! విమల చరిత్రా! నమో నమో!


గౌరీప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో

అధర్వాద్భుతగానవినోదా! గణపతిదేవా! నమోనమో!


నిత్యానంద! నమో నమో, నిజఫలదాయక! నమో నమో

నిర్మలపురవర! నిత్యమహోత్సవ! రామనాథ సుత నమో నమో

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...