Wednesday, May 12, 2021

సమస్యలను తొలగించే పూజలు

కొన్ని రకాల సమస్యలు ఎప్పటికీ పట్టి పీడిస్తుంటాయి. అలంటి సమస్యలు మనం భగవంతుడిని భక్తి శ్రధలతో పూజిస్తే కాని తొలగిపోవు. ఆ సమస్యలు ఏమిటో వాటికీ ఏఏ దేవుడిని ఆరాధించాలో వివరంగా తెలుసుకుందాము...

మానసిక బలం, శరీర దృఢత్వం కోసం రాజరాజేశ్వరిని, శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్ధించాలి.

ఆయురారోగ్యాల కోసం రుద్రుడిని పూజించాలి.

వ్యాధులు, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలి అంటే శ్రీ ధన్వంతరీని పూజించాలి.

విద్యారంగలో రాణించాలి అంటే శ్రీ సరస్వతిని, శారదాంబని కొలవాలి.

గృహం, భూమిని కొనాలంటే శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని, అంగారకుడిని పూజించాలి.

వివాహ అడ్డంకులు తొలగిపోవాలి అంటే శ్రీ కామాక్షి దేవిని, శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి.

మాంగల్య దోషాలు తోలగిపోవాలి అంటే శ్రీ పార్వతిదేవిని పూజించాలి.

శత్రుబాధలు తొలగిపోవాలి అంటే నారసింహుని పూజించటం ఉత్తమం.

వ్యాపారంలో లాభం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లాభం.

సంతాన ప్రాప్తికోసం సంతాన గోపాలుని, సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి

No comments:

Post a Comment

సనాతన ధర్మం

 రచన.                ఋుషి/ కవి 1-అష్టాధ్యాయి -  పాణిని 2-రామాయణం -  వాల్మీకి 3-మహాభారత—  వేదవ్యాస్ 4-ఎకనామిక్స్ -    చాణక్య 5-మహాభాష్య -    ...