Thursday, June 7, 2018

ఏకదండి.. ద్విదండి... త్రిదండి అంటే ఏమిటి ..


సన్యాసులు (స్వామీజీలు) వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా  చేతిలో పొడవాటి కర్రలు ఎల్లవేళలా పట్టుకుంటారు. ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి ఓ అర్థం ఉంది. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి, కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను ధరిస్తారు. ఈ కర్రలలో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలు ఉన్నాయి. (దండి అంటే కర్ర అని అర్థం)

ఒక కర్రను (ఏకదండి ) ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు (ఆది శంకరాచార్యులు). అద్వైతం అనగా జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టునుండి సేకరించిన ఒక కర్ర ఉంటుంది.

రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు (మధ్వాచార్యులు). వీరిని ‘ద్విదండి స్వాములు’ అంటారు వీరు విష్ణుభక్తులు. వీరు దేవుడు వేరు– జీవుడు వేరు అని బోధిస్తారు. జీవాత్మ, పరమాత్మ వేరువేరు అనే ఈ సిద్ధాంతాన్నే శ్రీకృష్ణుడు అర్జునునికి బోధిస్తాడు.

మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు, దీనిని తత్వత్రయం అంటారు. ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు. వీరిది రామానుజాచార్యుల పరంపర.

శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుండి విముక్తులై, మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు !!

🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻

Wednesday, June 6, 2018

ప్రదోషకాల ప్రాధాన్యత ఏమిటి?

 వందే శంభు ముమాపతి, సురగురుం వందే జగత్కారణమ్
వందే పన్నగభూషణం, మృగధరం, వందే పశూనాం పతిమ్ !

వందే సూర్య శశాంకవహ్ని నయనం, వందే ముకుంద ప్రియమ్
వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరమ్ !!

ప్రదోష కాలం ఎంతో పవిత్రమైన కాలంగా హైందవ పురాణంలో తెలుపబడింది. ప్రదోషకాలం నెలకి రెండుసార్లు వస్తుంది ఆ సమయంలో పరమేశ్వరుడిని పూజిస్తే శివానుగ్రహానికి పాత్రులు అవుతారని వేదపండితులు తెలియజేస్తున్నారు.

 శుక్లపక్షం (అమావాస్య నుండి పౌర్ణమి వరకు 15రోజులు)లో వచ్చే త్రయోదశి రోజు మరియు కృష్ణపక్షంలో (పౌర్ణమి నుండి అమావాస్య వరకు 15రోజులు)లో వచ్చే త్రయోదశి రోజు. సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అని కొందరు, సూర్యాస్తమయం అయ్యాక మూడు గడియలు 'ప్రదోషోరజనీముఖమ్' రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు. ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషం అంటే పాపా నిర్మూలన అని అర్థం.

ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదలికల వలన ఏర్పడేది ప్రదోషము అంటే చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సందులలో సూర్యాస్తమయం అయితే, అప్పుడు ప్రదోషం అంటారు. అందుకే ప్రతోరోజూ సూర్యాస్తమయ సమయానికి తిథి మారితే, అప్పుడు ప్రదోషం కలిగే అవకాశం ఉంది. త్రయోదశి రోజున కలిగే ప్రదోషాన్ని 'మహా ప్రదోషం' అని అంటారు.

ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాలను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎడమ భాగంలో పార్వతి కుడి భాగాన పరమేశ్వర రూపంగా 'అర్థనారీశ్వరుడిగా' దర్శనం ఇచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడింది. పరమశివుడు సదా ప్రదోషకాలంలో నాట్యం చేస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు అర్థనారీశ్వరుడిగా దర్శనం ఇవ్వడం ద్వారా ఒకే శరీరంలో రెండు రూపాలను ప్రదర్శిస్తున్నాడు. ప్రదోషకాలంలో ఉమామహేశ్వర స్వరూపాన్ని ధ్యానించాలని మనకు గుర్తు చేసేదే ఈ శ్లోకం ...

శ్లో - సాధారణే స్మరజయే నిటలాక్షి సాధ్యే
భాగీ శివో భజతు నామ యశః సమగ్రమ్ !

వామాంచి మాత్ర కలితే జనని త్వదీయే
కావా ప్రసక్తిరిహ కాలజయే పురారే !!

* త్రయోదశి  రోజున సాయంతం 4:30 నుండి 6:00 గంటలవరకు ప్రదోషకాలం ఉంటుంది. ఈ ప్రదోషకాలంలో పరమేశ్వరుడిని పూజించినట్లయితే                     ఎటువంటి పాపాలు అయినా దహించుకు పోతాయి.

* ప్రదోషకాలంలో శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘాయుష్మంతులు అవుతారు.

* ప్రదోషకాలంలో శివలింగాన్ని ఆవునేయ్యితో అభిషేకం చేస్తే మోక్షం లభిస్తుంది.

* మంచి గంధంతో అభిషేకం చేసినట్లయితే శ్రీమహాలక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.

త్రయోదశి ఆదివారం రోజు వస్తే రవి ప్రదోషం అనీ, త్రయోదశి సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషం అనీ, త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషం అనీ, త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషం అనీ, త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషం అనీ, త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం అనీ, త్రయోదశి శనివారం వస్తే శని త్రయోదశి అనీ, శని ప్రదోషం అని పిలుస్తారు. అన్ని త్రయోదశులలో కూడా శివపూజ తప్పనిసరి. ప్రదోషకాలం రోజూ వస్తున్నా, త్రయోదశి రోజున వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది.

Tuesday, June 5, 2018

దేవుడున్నాడా?? – గౌతముడి అద్భుత సమాధానం…!!

సద్గురు

దేవుడు ఉన్నాడా లేదా అన్న ప్రశ్నకి గౌతమ బుద్ధుడి సమాధానం మనల్ని ఆలోచించేలా చేస్తుంది. ఇంతకీ బుద్ధుడు సమాధానమేంటి? ఎందుకలా ఇచ్చాడో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

మీరు గౌతమ బుద్ధుడి గురించి విన్నారా..? ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కూర్చొని ఉన్నాడు. అది తెల్లవారు ఝామున…సూర్యుడు ఇంకా ఉదయించలేదు. ఇంకా చీకటిగానే ఉంది. అక్కడికి ఒక మనిషి వచ్చి నిలుచున్నాడు. అలా మూలగా నీడ చాటుగా నిలుచున్నాడు. ఆయన రాముడికి గొప్ప భక్తుడు.

భక్తులు వాళ్ళు జీవితాల్లో ఏమి చేసినా సరే ప్రతిదానిని రాముడిగానే మార్చేస్తారు. వాళ్ళు భగవంతుడి నామం తప్ప మరొకటి ఉచ్చరించరు. మిమ్మల్ని రమ్మని చెప్పాలంటే రామ-రామ అంటారు. మిమ్మల్ని వెళ్ళమని చెప్పడానికి కూడా రామ-రామ అంటారు. వాళ్ళకి ఏమి కావాలన్నా సరే రామ-రామ అంటారు. వారు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని అనుకుంటే రామ-రామ అంటారు. వాళ్ళు ఏమి చేసినా సరే, రాముడు మాత్రమే..! రాముడు తప్ప మరేదీ లేదు. వాళ్ళు భాగవన్నామం తప్ప ఇంకేదీ ఉచ్చరించరు. ఈ మనిషి భగవంతుడిని ఎంతో గంభీరంగా తీసుకున్నాడు. ఆయన జీవితంలో కేవలం రాముడే. మరొకటి లేదు.
అసలు భగవంతుడు ఉన్నాడా..? అని. గౌతముడు ఈ మనిషిని చూసి, “లేడు” అని నిక్కచ్చిగా చెప్పారు.

సరే..! వయసు మీద పడిపోతుంది. ఇప్పుడాయనకు ఒక సంశయం కలిగింది. ఒకవేళ భగవంతుడు లేడనుకో అప్పుడు నా జీవితమంతా రామ-రామ అని అంటూ వృధా అయిపోతుంది కదా….? ఆయనకి భగవంతుడు ఉన్నాడని తెలుసు. ఆయన ఆలయాలను కూడా నిర్మించారు. అయినా..ఎక్కడో ఒక చిన్న సంశయం. ఆయన దానిని తేల్చుకోవాలనుకున్నాడు. ఇప్పుడు, ఇక్కడ ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఉన్నారు. అందుకని ఈయనని, ఆ విషయం అడగడం కోసం ఇక్కడికి వచ్చి అలా చాటుగా నిలుచుని ఈ ప్రశ్న అడిగాడు. అసలు భగవంతుడు ఉన్నాడా..? అని. గౌతముడు ఈ మనిషిని చూసి, “లేడు” అని నిక్కచ్చిగా చెప్పారు. ఈ మాట వినేసరికి శిష్యులందరూ కూడా “ష్..హమ్మయ్య.. ఎంత పెద్ద ఉపశమనం” అనుకున్నారు. నిజంగానే ఎంతో పెద్ద ఉపశమనం కదా..? మొట్టమొదటి సారి బుద్ధుడు ఖచ్చితంగా భగవంతుడు లేడని చెప్పారు. అంతటా సంతోషం నిండిపోయింది. ఒకసారి ఊహించుకోండి, భగవంతుడు లేడు అంటే ఎంత స్వేచ్చ..! మీ జీవితమంతా మీదే. అంతా సంతోషంతో నిండిపోయింది. సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు.  సరే, సాయంత్రం అందరూ మళ్ళీ గొప్ప ఆనందంతో సమావేశం అయ్యారు.

మరో మనిషి ఇలా వచ్చి మూలలో వెళ్ళి నిలుచున్నాడు. ఇతను ఒక చార్వాకుడు. మీరు, చార్వాకులగురించి విన్నారా..? చార్వాకులంటే పూర్తిగా లౌకికవాదులు. వాళ్ళు దేనినీ పూర్తిగా చూస్తే తప్ప నమ్మరు. ఈ చార్వాకుడు ఎంత గొప్ప నిపుణుడు అంటే, మీరు ఏ నమ్మకానికి చెందినవారైనా, మీరాయనతో కనుక పది నిముషాలు మాట్లాడితే, ఆయన మీకు, “భగవంతుడు లేడు” అని నిరూపించగలడు. ఎన్నో వేల మంది ప్రజలకు ఈయన “దేవుడు లేడు..దేవుడు లేడు….” అని నిరూపించాడు. ఆయనికి వయసు మీద పడుతోంది. ఒక సంకోచం వచ్చింది. “ఒకవేళ దేవుడు ఉంటే..” అనే సంశయం కలిగింది..! ఒకవేళ దేవుడు ఉంటే, ఈ దేవుడిని నమ్మేవాళ్ళందరూ – ఒక నరకం ఉంటుంది, అక్కడ చాలా హింసలు పెడతారు అని చెబుతారు. ఒకవేళ నేను గనక అక్కడికి వెళితే, నేను దేవుడు లేడు..అని చెబుతున్నాను కాబట్టి, ఆయన నన్ను ఊరికే వదిలేస్తాడా..? అన్న ఒక చిన్న సంశయం వచ్చింది. దానిని నిర్ధారణ చేసుకోవాలనుకున్నాడు.

నేను భగవంతుడు ఉన్నాడని నమ్మవచ్చు లేదా లేడనీ  నమ్మవచ్చు.

సరే..! ఇక్కడ ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఉండడంతో ఈయన వచ్చి బుద్ధుడిని ఆ ప్రశ్న అడిగాడు, “అసలు భగవంతుడు ఉన్నాడా..? “ అని. గౌతముడు ఆయనని చూసి “ఔను ”  అన్నాడు. మళ్ళీ శిష్యులందరూ ఒక రకమైన అయోమయంలో పడిపోయారు. పొద్దున్న ఈయన లేరు – అని చెప్పారు. అప్పుడు ఎంతో ఆనందం నిండిపోయింది. ఇప్పుడు ఉన్నాడు అంటున్నారు. ఈయన ఏమైనా ఆట ఆడుతున్నాడా..? అనుకున్నారు. నిజానికి మీరు ఒక విషయాన్ని నమ్మినా, నమ్మకపోయినా….నేను నమ్మవచ్చు. నేను భగవంతుడు ఉన్నాడని నమ్మవచ్చు లేదా లేడనీ నమ్మవచ్చు. ఈ రెండూ, రెండు ప్రత్యేకమైన స్థానాలు కావు. రెండిటిలోనూ మీరు, దేనినో నమ్ముతున్నారు. మీకు నిజమేమిటో తెలియదు. మీ సమస్య ఏమిటంటే  మీకు తెలియనిది, “నాకు తెలియదు” అని ఒప్పుకునేంత నిజాయతీ మీలో లేకపోడమే..!! అదే మీ సమస్య. ఔనా..? కాదా..?

మీరు నిజంగా ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, మొట్టమొదటి అడుగు ఏమిటంటే, మీకు తెలియనిది మీకు తెలియదు అని చూడగలగడం. ఒకసారి మీరు నాకు తెలియదు అని చూడగలిగిన తరువాత మీకు తెలుసుకోవాలి అని ఆకాంక్ష కలుగుతుంది. ఈ తృష్ణ వచ్చిన తర్వాత, నిజంగా మీకు తెలియనిది ఏదో తెలుసుకోవడం – అన్నది జరగవచ్చు. ఔనా ..? కాదా ..? మీకు ఏదైతే తెలియదో, దానిని మీరు నమ్మారనుకోండి..మీరు ఆ తృష్ణని పాడు చేసుకుంటున్నట్లే..! “నాకు తెలియదు” అనే విషయాన్ని తెలుసుకోవడం ఎంత శక్తివంతమైనదో, ఎంత గొప్పదో మీకు తెలియడం లేదు. మీ సమస్య అంతా అదే..! దీని గురించి మంచి విశ్లేషణ మంచి సత్సంగం చేయాలని కోరుచున్నాను గురుభ్యోనమః గురుభ్యోనమః

Sunday, June 3, 2018

What are the different forms of meditation?

7 Types of meditation

Loving-kindness meditation. With the many types of meditation to try, there should be one to suit most individuals. ...
Body scan or progressive relaxation. ...
Mindfulness meditation. ...
Breath awareness meditation. ...
Kundalini yoga. ...
Zen meditation. ...
Transcendental meditation.

What are the two main types of meditation?
Theravada Buddhist meditation practices:
Anapanasati – focusing on the breath.
Satipatthana – Mindfulness of body, sensations, mind and mental phenomena.
The Four Immeasurable – including compassion karuna and loving-kindness Metta.
Kammaṭṭhāna.
Samatha – calm abiding.
Vipassana – insight.
Mahasati Meditation.

Is yoga a form of meditation?

It is the branch of yoga that concentrates on physical health and mental well-being. Hatha yoga uses bodily postures (asanas ), breathing techniques (pranayama ), andmeditation (dhyana ) with the goal of bringing the body-mind-breath in alignment. ... The eighth limb of yoga is samadhi (meditation).

What is a chakra meditation?
The chakras are important centers of energy that appear throughout your body. ... Through chakra meditation, you can improve the balance of your key chakras and bring yHow do you do transcendental meditation?

Transcendental Meditation technique. The Transcendental Meditation technique or TM is a form of silent mantra meditation, developed by Maharishi Mahesh Yogi. The meditation practice involves the use of a mantra and is practiced for 15–20 minutes twice per day while sitting with one's eyes closed.

What is a mantra in meditation?

Om or aum is the most basic and powerful mantra you can chant. This universalmantra will create powerful, positive vibrations in your lower abdomen. It is often combined with the mantra “Shanti,” which means peace in Sanskrit. You can repeat aum as many times as you wish for your chanting.

What are good meditation techniques?

How to meditate: Simple meditation for beginners
1. Sit or lie comfortably. You may even want to invest in a meditation chair or cushion.
2. Close your eyes. ...
3. Make no effort to control the breath; simply breathe naturally.
4. Focus your attention on the breath and on how the body moves with each inhalation and exhalation.

What is the difference between yoga and meditation?

What is the difference between meditation and yoga? ... The eight steps of yoga are yama, niyama, aasana, pranayama, pratyahar, dhyana, dharana and samadhi. Yoga is also said to be a way of life and when practised gives all-round benefits. Meditation is a part of yoga, which deals with mental relaxation and concentration.

Do you meditate in yoga?

' Set aside just a few minutes at first. Choose a time of day when you're able tomeditate without interruption. You might coordinate your meditation so you do it right before or after a physical yoga practice. ' Sit with good posture either on the floor, cross-legged, or in a chair if it's more comfortable.

How long does it take to meditate?

If you are just starting out, I recommend you meditate for anywhere from 5 to 10 minutes every day. You can start with even less. Maybe try it for 1 minute in the morning. And when you can sit still and relax for that long, move to 2 minutes.

How should I sit when meditating?

First Point of Posture: Sitting Down

1. The Quarter Lotus. Here you can sit on your meditation seat with your legs loosely crossed and both feet resting below the opposite thigh or knee. ...
2. The Half Lotus. This is a variation on the above. ...
3. The Full Lotus. ...
4. The Burmese Position. ...
5. Seiza. ...
6. Chair.

What are the three benefits of meditation?

This article reviews 12 health benefits of meditation.
Reduces Stress. Stress reduction is one of the most common reasons people try meditation.

Controls Anxiety. ...
Promotes Emotional Health. ...
Enhances Self-Awareness. ...
Lengthens Attention Span. ...
May Reduce Age-Related Memory Loss. ...
Can Generate Kindness. ...
May Help Fight Addictions.


How do you get rid of negative thoughts?
Here are seven ways to clear your mind of negative thinking.
1. Change your body language. Take a moment to observe your body language. ...
2. Talk it out. ...
3. Spend one minute calming your mind of all thought. ...
4. Change the tone of your thoughts. ...
5. Be creative. ...
6. Take a walk. ...
7. Start listing out what you're grateful for.

How do you free your mind?

Here are 30 ways that you can free your mind immediately:

1. Forgive. Forgiving another person (or yourself) can help you to move on from the past and release yourself from negative emotions and thoughts.
2. Meditate. ...
3. Exercise. ...
4. Let go of the past. ...
5. Be mindful. ...
6. Practice EFT. ...
7. Stop feeling guilty. ...
8. Smile and laugh.

How do you empty your mind?

Sit upright, on the floor or a chair, close your eyes and start focusing on your breath. Take a few breaths and follow your breath. Think of a few things that you're thankful for and name them in your mind, then smile. As you continue to smile, follow your breath; inhale and exhale.

How do you quiet your mind?

He shares three simple steps you can take to quiet your mind:

1. Get into a good position. Take a deep breath and sigh it out. ...
2. Get in touch with your breathing. Close your eyes and find the place in your body where you feel your breath most prominently. ...
3. Detach from your thoughts.
How do you clear your mind and relax?
Method 1 Practicing Deep Breathing and Meditation
Sit in a quiet space. Find a quiet room and draw the curtains so there is no light to distract you. ...
Try progressive muscle relaxation. ...
Practice a five minute meditation exercise. ...
Do deep breathing exercises. ...
Listen to calming music.

ప్రాణాయామం

I. ప్రాణాయామ విశేషాలు

II. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు

III. తీసుకోవలసిన జాగ్రత్తలు

IV. వివిధ ప్రాణాయామ విధానాలు

1. నాడీ శోధన ప్రాణాయామం

2. భస్త్రిక ప్రాణాయామం

a. చంద్రాంగ భస్త్రిక

b. సూర్యాంగ భస్త్రిక

c. సుషుమ్న భస్త్రిక

d. చంద్రాంగ సూర్యాంగ భస్త్రిక

3. భ్రామరి ప్రాణాయామం

4. శీతలి ప్రాణాయామం

5. శీతకారి ప్రాణాయామం

6. సూర్య భేది ప్రాణాయామం

7. చంద్ర భేది ప్రాణాయామం

8. ఉజ్జయి ప్రాణాయామం

9. మూర్చప్రాణాయామం

10. ప్లావని ప్రాణాయామం

11. కపాలభాతి ప్రాణాయామం

I.ప్రాణాయామ విశేషాలు:

ప్రాణం + ఆయామం = ప్రాణాయామం, ప్రాణం వుంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుటలేక నియంత్రించియుంచుట అని అర్థం. ఇఃకో అర్థంలో ప్రాణాయామం అంటే ప్రాణాన్ని కష్ట పెట్టడం అని కూడా అర్థం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్రాల ప్రకారం శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించి యుంచడమే ప్రాణాయామం అని తీర్మానించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు. శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్ధం చేయడం ద్వారా అంతర్గత  ప్రాణాన్ని కూడా అదుపులో వుంచవచ్చు.

నాడీ మండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచరిస్తూ వుంటుంది. ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ లభిస్తాయి. కనుకనే “ప్రాణాయామేన యుత్తేన సర్వరోగ క్షయం భవేత్ ” అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచారం అయింది.

ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములను 5 రూపాలు వున్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్మానం గుదం, సమానానికి స్మానం నాభి, ఉదానానికి స్మానం కంఠం, వ్యానానికి స్థానం శరీరమంతా, శ్వాస క్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్త ప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి.

శ్వాసను బయటికి వదిలే క్రియను రేచకం అని, లోపలికి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని నిలిపి వుంచడాన్ని అంతర్ కుంభకం అని, తిరిగి బయటికి వదిలి ఆపివుంచడాన్ని బాహ్య కుంభకం అని అంటారు. యీ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.

మెడికల్ సైన్సు ప్రకారం రెండు ముక్కు రంధాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు యీ రెండిటికి మధ్య గల భేదం గ్రహించారు. వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందువల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్ర ప్రభావం చల్లని దనం, అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. యీ రెండిటికి మధ్య సమన్వయం సాధించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం యివ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ఠ అను అక్షరం సూర్యుడికి గుర్తులుగా నిర్మారించారు. అందువల్ల హఠయోగం వెలువడింది. హఠయోగమంటే చంద్రసూర్యనాడులకు సంబంధించిన విజున మన్నమాట. హఠం అనగా బలవంతం అని కాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర సూర్య స్వరాలకు (స్వరము అంటే శ్వాస) సంబంధించినదే.

II. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు:

1) ఊపిరితిత్తులు బాగా పని చేస్తాయి.

2) శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.

3) రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా బయటికి వెళ్ళి సత్తువ లభిస్తుంది.

5) మెదడు చురుగ్గా పని చేస్తుంది.

6) పేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.

7) జఠరాగ్ని పెరుగుతుంది.

8) శరీరం ఆరోగ్యంగా వుంటుంది.

9) ఆయువు పెరుగుతుంది. యిది అన్నిటి కంటే మించిన విశేషం.

III. తీసుకోవలసిన జాగ్రత్తలు:

1) మైదానంలో గాని, తోటలో గాని, తలుపులు తెరిచి యున్న గదిలో గాని, కంబళీ లేక బట్టలేక ఏదేని ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.

2) గాలి విపరీతంగా వీస్తూ వుంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.

3) మురికిగా వున్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం ప్రాణాయామం చేయకూడదు.

4) సిగరెట్టు, బీడీ, చుట్ట పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.

5) పొట్ట నిండుగా వున్నప్పుడు ప్రాణాయామం చేయకూడదు.

6) ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా యితర యోగాసనాలు చేయవచ్చు. అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.

7) ప్రాణాయామం చేస్తున్నప్పడు బట్టలు తక్కువగాను, వదులుగాను ధరించాలి.

8) పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువైన ఆసనాలు. నేల మీద కూర్చో లేని వాళ్లు కుర్చీ మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.

9) నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా వుంచి ప్రాణాయామం చేయాలి.

10) ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఒక సారి కుడి ముక్కు రంధాన్ని మరో సారి ఎడమ ముక్కు రంధాన్ని మూయ వలసి వస్తుంది. కుడి ముక్కు రంధాన్ని కుడి చేతి బొటన ప్రేలితోను, ఎడమ ముక్కు రంధాన్ని కుడి చేతి ఉంగరం ప్రేలితోను మూయాలి.

11) ముక్కు రంధాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనే తి క్రియులు సక్రమంగా చేయూలి. అలా చేస్తే ప్రాణాయామం చేస్తున్నప్పడు శ్వాస సరిగా

ఆడుతుంది.

12) ప్రాణాయామ క్రియలు చేసూ వున్నప్పడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస ప్రక్రియలపై కేంద్రీకరించాలి. వేరే యోచనలకు తావుయీయ కూడదు.

IV. వివిధ ప్రాణాయామ విధానాలు:

పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనిషి యొక్క శ్వాస ప్రశ్వాసలు అడుతూనే వుంటాయి. వీటిని మనస్సు గ్రహించగలగడమే ప్రాణాయామం అన్నమాట. యోగాభ్యాసం చేస్తున్నప్పడు శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం జరుగుతుంది.

అందువల్ల ప్రతి ఆసనం ప్రాణాయనామంతో పరిణతి సాధిస్తుంది. ప్రాణాయామాల్ని ప్రత్యేకించి 108 విధాలుగా విభజించారు. అయితే వాటిల్లో 8–10 ముఖ్యమైనవి.

1) నాడీ శోధన ప్రాణాయామం,
2) భస్త్రిక ప్రాణాయామం,
3) భ్రామరి ప్రాణాయామం,
4) శీతలీ ప్రాణాయామం,
5) శీతకారి ప్రాణాయామం,
6) సూర్యభేది ప్రాణాయామం,
7) చంద్రభేది ప్రాణాయామం,
8) ఉజ్జయీ ప్రాణాయామం,
9) మూర్చప్రాణాయామం,
10) ప్లావని ప్రాణాయామం,
11) కపాలభాతి ప్రాణాయామం.

1. నాడీశోధన ప్రాణాయామం:



దీన్ని సరళ ప్రాణాయామం లేక అనులోమ విలోమ ప్రాణాయామం అని కూడా అంటారు.

విధానం :
నిటారుగా కూర్చొని, కండు మూసుకొని, రెండు కనుబొమల మధ్య గల భృకుటి మీద కొద్దిసేపు దృష్టి సారించాలి. ఆ తరువాత కుడి చేతి బోటన ప్రేలితో కుడి ముక్కు రంధాన్ని మూసి, ఎడమ ముక్కు రంధాన్నుంచి, మొదట లోపలి గాలిని మెల్లగా బయటికి వదలాలి. తరువాత ఎడమ రంధ్రం నుంచి గాలిని లోనికి పీల్చాలి. లోపల గాలి నిండిన తరువాత ఎడమ ముక్కు రంధ్రాన్ని ఉంగరం ప్రేలితోమూసి కుడి ముక్కు రంధాన్నుంచి నెమ్మదిగా వదలాలి. తిరిగి కుడి ముక్కు రంధాన్నుంచి గాలిని పీల్చాలి. దీనితో ప్రాణాయామ క్రమం ఒకటి పూర్తి అవుతుంది. మొదట మూడు క్రమాలు, తరువాత వీలును బట్టి ఎన్ని క్రమాలైనా చేయవచ్చు.

ప్రారంభంలో రేచకం, తరువాత పూరకం చేయాలి. కొద్ది రోజులు అభ్యాసం అయిన తరువాత అంతర్ కుంభకం చేయాలి. అది అభ్యాసం అయిన కొద్ది రోజుల తరువాత బాహ్య కుంభకం కూడా చేయాలి. కొద్ది రోజుల అభ్యాసం తరువాత వీటిని చేయు సమయం క్రింది విధంగా నిర్ణయించాలి.

1) రేచకం 10 సెకండు
2) బాహ్యకుంభకం 5 సెకండు
3) పూరకం 5 సెకండు
4) అంతర్ కుంభకం 20 సెకండు

అనగా 2/1/1/4 మాత్రల సమయ విధానమన్నమాట. బాగా ప్రాక్టీసు అయిన తరువాత రేచకం 64 సెకండు, బాహ్యకుంభకం 2 సెకండు, పూరకం 2 సెకండు, అంతర్ కుంభకం 128 సెకండ్ల సేపు చేయవచ్చు సెకండ్లు తెలిపే గడియారం ఎదురుగా పెట్టుకొని జాగ్రత్తగా యీ క్రియలు చేయాలి.

లాభాలు :
యీ ప్రాణాయామం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి తగుతాయి. టెన్షను వుండదు. మనస్సుకు శాంతి లభిస్తుంది. ముక్కు రంధ్రాలు, నరాలు శుభపడతాయి.

2. భస్త్రిక ప్రాణాయామం:

భస్త్రిక అంటే కొలిమి తిత్తి అని అర్ధం. కొలిమితిత్తి కొలిమికి గాలి అందజేస్తుంది. యీ క్రియ యందు ముక్కుతో పీల్చే గాలి కొలిమి తిత్తి గాలిలా ధ్వని చేస్తుంది.

విధానం :
ఇది నాలుగు రకాలు

(1) చంద్రాంగ భస్త్రిక,
(2) సూర్యాంగ భస్త్రిక,
(3) సుషుమ్న భస్త్రిక,
(4) చంద్రాంగ సూర్యాంగ భస్త్రిక.

a. చంద్రాంగ భస్త్రిక:

కూర్చొని లేక నిలబడి కూడా యీ క్రియ చేయవచ్చు. నడుము, వీపు, వెన్నెముక, మెడను నిటారుగా వుంచి కుడి ముక్కు రంధాన్ని కుడి చేతి బొటన ప్రేలుతో మూయాలి. ఎడమ ముక్కు రంధ్రాన్నుంచి ఫోర్సుగా గాలిని వదిలి వెంటనే గాలిని ఫోర్సుగా పీల్చాలి, వరుసగా 10 సార్లు గాని లేక సాధ్యమైనంత వరకు గాని యీ క్రియ చేసూ వుండాలి. కొలిమి తిత్తితో వూదినట్లు గాలి స్వరూపం ఉండాలి. రేచకంతో బాటు నాభిని లోనికి ముడవాలి. పూరకంతో బాటు నాభిని, పొట్టను ఉబ్చిసూ వుండాలి. ఈ క్రియను రక్తపు పోటు, ఉష్ణం వున్నవాళ్లు ఎక్కువగా చేయాలి. ఉబ్బసం వున్నవాళ్లు తక్కువగా చేయాలి.

b. సూర్యాంగ భస్త్రిక:

ఎడమ ముక్కు రంధాన్ని ఉంగరం ప్రేలితో మూసి కుడి ముక్కు రంధ్రంతో పై విధంగా ఫోర్చుతో చేయాలి. శరీరంలో శీతలం ఎక్కువగా వున్న వాళ్లు, శ్వాస బాధ వున్న వాళ్లు యీ క్రియ ఎక్కువగా చేయాలి. రక్తపుపోటు, ఉష్ణం వున్నవాళ్లు తక్కువగా చేయాలి.

c. సుషుమ్న భస్త్రిక:

కుడి ముక్కు రంధాన్ని కుడి బొటన ప్రేలితో మూసి ఫోర్సుతో ఎడమ ముక్కు రంథాన్నుంచి గాలిని వదలాలి. ఎడమ ముక్కు రంథాన్నుంచి ఫోర్సుగా గాలిని పీల్చి ఉంగరం ప్రేలితో ఎడమ ముక్కు రంధాన్ని మూసి కుడి ముక్కు రంధాన్నుంచి ఫోర్సుగా వదలాలి. వెంటనే కుడి రంథ్రాన్నుంచి పీల్చాలి. యీ విధంగా కుడి, ఎడమ ముక్కు రంధ్రాల ద్వారా గాలిని మాటిమాటికీ సాధ్యమైనంత సేపు వదులుతూ పీలుస్తూ ఉండాలి. పొట్టను త్వరత్వరగా వెనుకకు ముందుకూ కదుపుతూ ఉండాలి. నాడీ శోధన ప్రాణాయామం వలె ఇది త్వరగా జరిపే శ్వాస ప్రశ్వాసల ప్రక్రియ. దీనివల్ల పొట్ట యందలి పెద్ద చిన్న పేగులకు, లివరు, స్త్రీను, మూత్రపిండాలు, పేంక్రియాస్ గ్రంధులకు స్ఫూర్తి లభిస్తుంది.

d. చంద్రాంగ సూర్యాంగ భస్త్రిక:

రెండు ముక్కు రంధాల నుంచి గాలిని ఫోర్చుగా వదిలి తిరిగి పీలుసూ వదులుతూ వుండాలి. నాభిని లోనికి గుంజుతూ, ఉబ్బిస మెల్ల మొల్లగా గాలిపేగం పెంచాలి. కొలిమితిత్తి నుంచి వెలువడే విధంగా గాలిపేగం వుండాలి. శక్త్యానుసారం యీ క్రియను చేసిన తరువాత విశ్రాంతి తీసుకోవాలి. పొట్ట యం

దు ఉష్ణం పెంచుటపై ధ్యానం నిలపాలి. ఆరోగ్యంగా వున్న వాళ్లు భస్త్రిక ప్రాణాయామం చేయాలి. గుండె జబ్బు, రక్తపువోటు, అల్సరు, కళ్లు త్రిప్పట వున్నవాళ్లు యీ క్రియ చేయకూడదు. యీ క్రియ చేయు వారు వెన్న పాలు, నెయ్యి వాడుతూ వుండాలి.

లాభాలు :
భస్త్రిక ప్రాణాయామం వల్ల కొవ్వు, స్థూలకాయం తగ్గుతుంది. జఠరాగ్ని పెరుగుతుంది. శ్లేష్మం తగ్గి ఉష్ణం పెరుగుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. ఆస్తమా” తగుతుంది. శారీరిక మానసిక శక్తి పెరిగి మెదడు చురుగా పని చేస్తుంది.

3. భ్రామరి ప్రాణాయామం:



భ్రమరం అంటే తుమ్మెద, తుమ్మెద ఝంకారంలా ధ్వని వచ్చే ప్రాణాయామం కనుక దీనికి (భామరి ప్రాణాయామం అని పేరు వచ్చింది.)

విధానం:
నిటారుగా కూర్చొని, రెండు చెవుల్లో రెండు బొటన వ్రేళ్లు పెట్టి వుంచాలి. మోచేతుల్ని భుజాలతో సమానంగా ఎత్తి పూరకం చేసి గాలిని కుంభకం చేయాలి. తరువాత లోపలి గాలిని తుమ్మెద రంకారంలా  చేస్తూ నోరు మూసి వుంచి, ముక్కు రంధ్రాల ద్వారా రేచకం చేయాలి. నాలుకను సామాన్య స్థితిలోనే వుంచాలి. ప్రారంభంలో ఒక్క పర్యాయం చేసి, తరువాత ఇరవై సార్ల వరకు చేయవచ్చు. ఏకాంతంలో ప్రశాంతంగా కండ్లు మూసి యీ ప్రాణాయామ క్రియ చేయాలి.

లాభాలు :
ఈ ప్రాణాయామం వల్ల కంఠం తీయగా, కోమలంగా, లయబద్ధంగా వుంటుంది. గొంతుకు సంబంధించిన జబ్బులు రావు, వచ్చిన జబ్బులు నయమవుతాయి. మెదడు శుద్ధి అవుతుంది. టెన్షను తగుతుంది.

సూచన :
మనస్సును ధ్యానంలో లీనం చేసి, భ్రామరీ ప్రాణాయామ క్రియ కావించి, తరువాత మనస్సును సామాన్య స్థితికి తీసుకొని రావాలి.

శిశువు జన్మించగానే రోదిస్తాడు. అదే ప్రధమ భ్రామరీ క్రియ.

4. శీతలి ప్రాణాయామం:



విధానం :
నాలికను ముందుకు చాపి, గొట్టంలా మడిచి నెమ్మదిగా ధ్వని చేస్తూ, నోటి ద్వారా గాలిని లోనికి పీల్చి, గాలిని ముక్కు రంధాల నుంచి రేచకం చేయాలి. నాలికను అంగిడికి అంటించి ధ్వని చేస్తూ నాలిక మధ్య నుంచి గాలి పీల్చి నోరు మూయాలి. తిరిగి ముక్కునుంచి వదిలివేయాలి. మొదట మూడు సార్లు, తరువాత పదిహేను సార్లు చేయవచ్చు. వేసవి కాలంలో చేయాలి. చలికాలంలో ఎక్కువగా చేయకూడదు. దాహంవేస్తే, త్రాగుటకు మంచి నీళ్లు దొరక్కపోతే యీ ప్రాణాయామ క్రియ చేస్తే నీరు లేకుండానే దాహం తీరుతుంది.

లాభాలు :
రక్తపు పోటు వున్నవారికి ఎంతో ప్రయోజనకారి. నోరు, గొంతు, నోటిలో  బొబ్బలు, టాన్సిళ్లు, చర్మరోగాలు, కండ్ల వేడి యీ ప్రాణాయామ క్రియ వల్ల తగుతాయి.

5. శీతకారి ప్రాణాయామం:



విధానం :
కూర్చొని రెండు పళ్ల వరసలు నొక్కి పట్టి, నాలుక కొసను పళ్ల లోపలి భాగానికి ఆనించి, నాలుక మిగతా భాగాన్ని నోటి లోపలి భాగానికి అన్చాలి. పెదవులు తెరచి వుంచి గాలిని పళ్ల మధ్య నుంచి లోనికి పీల్చాలి.

గాలిని లోనికి పీల్చిన తరువాత పెదవుల్ని మూసివేయాలి. పీల్చిన గాలిని కొద్దిసేపు లోపల ఆపి, తరువాత ముక్కు రంధాల నుంచి బయటికి వదిలి వేయాలి. ప్రారంభంలో మూడు సార్లు, తరువాత పదిహేను లేక ఇరవై సార్లు  ప్రాణాయామ క్రియను చేయాలి.

సూచన :
యీ క్రియను చలికాలంలో చేయకూడదు. వేసవి కాలంలో చేయాలి. శ్లేష్మం ఎక్కువగా వున్న వాళ్లు యి” క్రియను చేయకూడదు.

లాభాలు :
శీతలి ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలన్నీయీ ప్రాణాయామం వల్ల కలుగుతాయి. నోరు పూర్తిగా చల్ల బడుతుంది.

6. సూర్య భేది ప్రాణాయామం:

విధానం :
కుడి ముక్కు రంధ్రాన్ని సూర్యనాడి లేక సూర్య స్వరం అని, ఎడమ ముక్కు రంథాన్ని చంద్ర నాడి లేక చంద్ర స్వరం అని పేర్కొన్నాము. యీ క్రియ యందు ప్రతి పర్యాయం సూర్యనాడి నుంచి అనగా కుడి ముక్కు రంధాన్నుంచి గట్టిగా నెమ్మదిగా గాలి పీల్చి చంద్రనాడి నుంచి అనగా ఎడమ ముక్కు రంధ్రాన్నుంచి వదలాలి. ప్రారంభంలో రెండు సార్లు తరువాత పది పదిహేను సార్లు చేయవచ్చు. ఉష్ణం పెంచుతుంది గనుక యీ క్రియను వేసవి కాలంలో చేయకూడదు.

లాభాలు :
దీని వల్ల కఫం, దగ్గు, ఆస్తమా తగ్గిపోతాయి. శరీరబలం పెరుగుతుంది.

సూచన :
ఉష్ణం ఎక్కువగా వున్నవాళ్లు, హెచ్చు రక్తపుపోటు వున్న వాళ్లు జాగ్రత్తగా కొద్దిసేపు చేయాలి.

7. చంద్ర భేది ప్రాణాయామం:

విధానం :
యీ క్రియ యందు ప్రతి పర్యాయం చంద్రనాడి నుంచి అనగా ఎడమ ముక్కు రంధాన్నుంచి గాలి గట్టిగా నెమ్మదిగా పీల్చి, సూర్యనాడి నుంచి అనగా కుడి ముక్కు రం(ధాన్నుంచి వదలాలి. దీన్నివేసవి కాలంలో చేయాలి.

లాభాలు :
దీని వల్ల శరీరానికి చల్లదనం వస్తుంది. పెట్టాబ్లడ్ (పెషరు, కోపం తగ్గుతాయి.

సూచన
ఆస్తమా రోగులు యీ ప్రాణాయామం చేయకూడదు.

8. ఉజ్జాయి ప్రాణాయామం :

విధానం :
ఈ ప్రాణాయామం చేయునప్పుడు గొంతు నుంచి పెద్దగా ధ్వని రావాలి. పూరకం చేసి కుంభకం చేయాలి, పూరకం, రేచకం రెండూ, నాసికా రంధాల రెండిటి ద్వారా చేయాలి. యిందు గొంతును కొంచెం ముడిచి, నాలుకను మడిచి నోటి లోపలి అంగిడికి అంటించి, ముక్కు రంధాలనుంచి గాలిని లోనికి పీల్చాలి. తరువాత అదే విధంగా లోపలి గాలిని చేస్తూ ముక్కు రంధ్రాల ద్వారా బయటికి వదలాలి.

లాభాలు :
ఉజ్జయీ ప్రాణాయామం వల్ల కంఠం, ఊపిరితిత్తులు, గుండెపై మంచి ప్రభావం పడుతుంది. ముక్కు- చెవి, గొంతుకు సంబంధించిన జబ్బులు దగు, ఆస్తమా, బ్లడ్ ప్రషర్,  తగ్గుతాయి

.

9. మూర్చ ప్రాణాయామం :

విధానం :
రెండు ముక్కు రంధాల నుంచి గాలిని లోనికి పీల్చి చుబుకాన్ని ఛాతీకి ఆనించి అంటే జాలంధర బంధం చేసి సాధ్యమైనంత సేపు గాలిని లోపల ఆపాలి. తల తిరిగినట్లు అనిపిస్తుంది. అప్పడు మెల్లగా గాలిని ముక్కు రంధాల నుంచి వదలాలి. ఇది కొంచెం కఠినమైన క్రియ. మొదట జాగ్రత్తగా నిపుణుల పర్యవేక్షణలో ఈ క్రియ చేయడం మంచిది.

లాభాలు :
దీని వల్ల మెదడుకు శాంతి లభించి చురుకుదనం లభిస్తుంది.

సూచన :
పిచ్చి వున్నవాళ్లు యీ క్రియ చేయకూడదు.

10. ప్లావనీ ప్రాణాయామం :

విధానం
నిటారుగా కూర్చొని నోటితో శ్వాసను ఒక్కొక్క గుక్కగా లోపలికి పీల్చాలి. పొట్టను ఉబ్చిస్తూ వుండాలి. ఆ గాలిని లోపల ఆపి కొద్దిసేపు కుంభకం చేయాలి. తరువాత వంగి నాలుకను బయటకు పెట్టి గాలిని నెమ్మదిగా పూర్తిగా వదిలి పేయాలి. మొదట ఒకటి రెండు సార్లు చేయాలి.

లాభాలు
యీ క్రియవల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. పని చేయుటకు ఉత్సాహం పెరుగుతుంది. మెదడుకు సంబంధించిన వ్యాధులకు యిది పని చేస్తుంది. బాగా అభ్యాసం చేసిన తరువాత యీ ప్రాణాయామం చేస్తూ నీళ్లపై నావవలె తేలుతూ ఉండవచ్చు.

9. కపాలభాతి ప్రాణాయామం:

దీనికి కపాల శుద్ధి అని అర్థం. యీ క్రియ వల్ల మెదడు చురుగ్గా వుంటుంది. జ్ఞానం పెరుగుతుంది. నాభి వరకు గాలిని లోపలికి బాగా పీల్చాలి. తరువాత ఆ గాలిని ఫోర్సుగా బయటికి వదలాలి. బయటికి వదిలివేసే గాలికి వత్తిడితో కూడిన గట్టి ఫోర్సు వస్తుందన్నమాట. శక్తిని బట్టి మూడు నాలుగు నిమిషాలు వరకు యీ క్రియను చేయవచ్చు. శ్వాస సహజంగా లోనికి వస్తుంది. యీ క్రియ చేయునప్పుడు ముక్కు ద్వారా ధ్వని రావాలి.


వీలును, సమయాన్ని అవసరాన్ని బట్టి పైన తెలిపిన వివిధ ప్రాణాయామ క్రియలు ప్రశాంత హృదయంతో చేసి సాధకులు లాభం పొందాలి.


ఔత్సహికుల అవగాహన కోసం కొన్ని ప్రాణాయామ పద్ధతులు అవగాహన కోసము ఇచ్చాము. వీటిని నిష్ణాతుడైన ఆచార్యుని వద్ద నేర్చుకొని practice చేయుట ఉత్తమము. శుభం భూయాత్.

Saturday, June 2, 2018

Power of Sree Lalitha Sahasranama - 1000 names of Sree Lalithambika

Sree Lalitha Sahasranama is a text from Brahmananda Purana. It is a secred text to the Hindu worshippers of the Goddess Lalitha Devi. i.e., the Divine Mother, in the form, Shakthi. Lalitha is the Goddess of bliss, an epithet for Shiva's wife Goddess Parvathi.

Sree Lalitha Sahasranama (1000 names of devi) is a secret and very sacred text or mantra in Hindu religion.This mantra has been revealed to mankind through the discussion between lord Hayagriva and the great sage Agasthya. This is the most favored form of prayer to Goddess Lalithambika and it is also very secret and powerful than any other forms of Tantra or Mantra.

🔯Days for chanting Lalitha Sahasranama:

On the birthdays of self and his family members
On full moon days
On all Fridays
On Maha Navami Day (9th day of waning moon in the month of August-september. This coincides with durga festival in India. 9th day of durga festival is called maha navami).


Types of Chanting:


Stotram Form:
 Lalitha Sahasranamam can be chanted in many different ways. In Stotram form, all 1,000 namams are separated into stotrams of a few namams each and recited in this way.


Mantra Form:
In mantra form, each namam is said individually, preceded by "Aum" and followed by "Namah". When chanted in mantra form, the endings of each namam are generally changed to "e" or "yai". Mantra form is commonly used to recite Lalitha Sahasranamam during archana.


Homa Form:
In the homam form, homam is conducted by ending each namam with Swaha.


What to observe while chanting:


Should be physically clean - Take a bath or wash your hands and feet before chanting.

Choose a good place and seat to sit - It should be a comfortable place. The best seat to sit is a  mat placed in front of Goddess in Pooja room

Should be mentally clean. Try to have only positive thoughts

Chant with correct pronunciation. Use a CD of Lalithasahasranamam for it or approach a sanskrit scholar.

Chant with shradha  & respect - Know that Shri Lalitha Parameshvari is listening to your chanting & watching you.

Chant slowly, clearly & loud enough so that you can hear.

Try not to hurt others physically or mentally throughout the day

You don’t have to chant/do the nyasam if you are not initiated.  If you are initiated then learn the way from your Guru. Start with chanting the dhyana shlokam (just one will do).

Try to understand the literal meaning & the implied meaning.

Ponder over the meaning & try implementing it in daily life

Offer the chanting to the Devi at the end of the chanting.

Benefits of chanting Sree Lalitha Sahasranama:


Regular chanting of Sree Lalitha Sahasranama is as beneficial as visiting religious places, taking bath in a holy river, offering food, offering materials. It is an indirect blessing to those who cannot do these kind of offerings to God.


Regular chanting of Sree Lalitha Sahasranama will ward off the evil from uncompleted pooja vidhis or rituals etc. It will also form a way of penance.


Regular chanting of Sree Lalitha Sahasranama will ward off premature death, will provide a long and contended healthy life.


Fever can be cured by religiously chanting Sree Lalitha Sahasranamam by touching on a persons forehead. The number of times you chant the more benefit you are likely to get. The vibhuti used for Sree Lalitha Sahasranama archana can be applied then on the forehead, which will give much relief to fever and headache.


It is said that if one chants religiously Sree Lalitha Sahasra Namam keeping a glass of water (or in a vessel) in front and then pours it over the head, all sorts of troubles related to once planetary positions and from evil spirits will be warded off.


It is said that if a person chants Sree Lalitha Sahasranama keeping in mind a picture of Sree Lalitha Devi situated in the divine ocean which contains `Amrut' , he will be cured from any kind of disease related to poison.


It is said that if a person consumes ghee, which is kept while chanting Sree Lalitha Sahasra namam, he will be cured of impotency and will have children.


Regular chanting of Sree Lalitha Sahasra namam will ward off any kind of evil deeds or rituals (black magic) aimed at the person who chants the namam. The power derived from the chanting supersedes all other forms of prayers and the person will no more require to consult astrologers or any sorts of occultists. He will have tremendous self confidence in himself.


Through the regular chanting of Sree Lalitha Sahasra namam, the atmosphere will be purified. Each nerve in our body will be invigorated and subtle energies will be awakened in the person.


Sree Lalitha Devi will protect a person who regularly chants Sree Lalitha Sahasra namam from accidents and from the attacks of enemy and will make him victorious in all his good deeds.


Regular chanting of Sree Lalitha Sahasra namam will make a person blessed with word power, fame, good will etc. Particular importance should be given to chant Sree Lalitha Sahasra namam on Friday's which is very auspicious for the blessing of Devi.


Sree Lalitha Sahasra namam is the form of prayer that any one and every one can chant at any time and every time. It does not matter if one could not complete it. Because each of the namam in itself is powerful and will provide all sorts of benefits. It depends on what you wish and how you go about it.


It is said that chanting the name of Lord Siva once is as good as chanting the name of Mahavishnu a thousand times. And chanting the name of Devi once is as good as chanting the name of Siva, a thousand times. And of which Sree Lalitha Sahasra namam is the most important one to Sree Lalitha Devi herself


 It is very beneficial if all members of the family unite and chants Sree Lalitha Sahasra namam once in a day in the evening or whenever time permits. A family that prays together stays together. It will bring about unity, peacefulness, clear mind to perform and by thus prosperity.


In homes where Sree Lalitha Sahasra namam is chanted regularly there will never be any shortage of the basic necessities of life. This is the reason why the ancient Gurus would instruct their desciples to chant Sree Lalitha Sahasra namam even after initiating them into the mantras of other deities such as Lord Krishna, Lord Rama and other Gods and Goddesses.

It is also to be noted that by religiously chanting Sree Lalitha Sahasra namavali, we are seeking the blessings of Sree Lalithambika, who is also called Kali ma, Durga ma, Devi, Parasakthi, Bhagavathi etc, who in turns is the universal mother. And how can a mother ignore her children when they are in distress or duress or troubles of any sorts? So keep utmost faith in her and start chanting.
Each one of the namam by itself is a powerful weapon for many sorts of day-to-day problems.
Sahasra Sai

Om Sri Mathrey Namaha

శ్రీవారి ఆలయం చేరుకోవటానికి ఎన్ని నడకదారులు ఉన్నాయో తెలుసా ?


ప్రపంచంలో ఎక్కువ మంది హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ఏటా లక్షల సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శిస్తుంటారు భక్తులు. కొండ మీద ఉన్న శ్రీవారికి దర్శించుకొనేందుకు భక్తులు సాధారణంగా నడక మార్గాన, టాక్సీలలో, జీపులలో మరియు బస్సులలో వెళుతుంటారు. చాలా మందికి తెలిసిన దారి అలిపిరి. కానీ ఎంతమందికి తెలుసు అలిపిరి కాకుండా ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయని ??

అలిపిరి - తిరుమల మెట్ల మార్గం !!

తిరుమలలో ఏడు కొండలు ఉన్నాయని తెలుసుకదా ? ఈ ఏడు కొండలు నడకదారి గుండా ప్రయాణిస్తే తిరుమల ఆలయానికి చేరుకోవచ్చు. ఇప్పుడు ఆ మార్గాల గురించే తెలుసుకుంటున్నాం ఇక్కడ.

మీకు తాళ్ళపాక అన్నమాచార్యులు గురించి తెలుసు కదా ? ఆయన గొప్ప వైష్ణవ భక్తుడు మరియు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి, మర్యాద, గౌరవం, ప్రేమ, వాత్సల్యం. ఆయన వ్రాసిన 32 వేల కీర్తనలలో వెవెంకటేశ్వరస్వామి కీర్తనలే ఎక్కువ. అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కిన మొట్టమొదటి భక్తుడు అన్నమాచార్యుల వారే.

అన్నమాచార్య

అలిపిరి నుండి అన్నమాచార్యులు వెళ్లిన దారే మొదటి నుండి గుర్తింపు పొందినది. శ్రీవారి కొండకు చేరుకోవటానికి తక్కువ టైం పట్టే మార్గాలలో ఇది ఒకటి. ఈ దారే కాకుండా తిరుమల చేరుకోవటానికి అనేక దారులు ఉన్నాయి. అయితే సౌకర్యాలు అంతంత్రమాత్రమే.

మొదటి మెట్టు

శ్రీవారికి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం 8 దారులు ఉన్నాయి. వాటిలో మొదటిది మరియు ప్రధానమైనది అలిపిరి. అలిపిరి అంటే 'ఆదిపడి' అనగా మొదటిమెట్టు అని అర్థం.

అలిపిరి

అలిపిరి మార్గంలో తిరుమల చేరుకోవటానికి గంటన్న సమయం పడుతుంది. దూరం 11- 12 KM లు ఉంటుంది.

రెండవ దారి

తిరుపతి కి 10 KM ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడికి 5 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి గుండా మూడు కిలోమీటర్లు నడిస్తే శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు. పట్టే సమయం గంట. చంద్రగిరి కోట నిర్మించిన తర్వాత ఈ దారి వెలుగులోకి వచ్చింది.
చంద్రగిరి కి 8 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. చంద్రగిరి రాజులు ఈ దారి గుండా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొనేవారు.
కృష్ణదేవరాయలు చంద్రగిరి దుర్గం లో విడిది చేసి, ఈ మార్గం గుండా శ్రీనివాసుడిని ఏడు సార్లు దర్శించుకున్నాడని స్థానికులు చెబుతారు. ఇప్పటికీ కొండ పైకి కూరగాయలు, పాలు, పెరుగు, పూలు వంటివి ఇదే దారిలో చేరుస్తారు. స్థానికులకు తప్ప ఈ దారి గురించి బాహ్య ప్రపంచానికి తెలీదు.

మూడవ దారి

మూడవ దారి మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్యాన కలదు. దీనికి మించిన దారి మరొకటిలేదు అంటారు పూర్వీకులు. కడప, రాజంపేట, కోడూరు, కర్నూలు, ప్రకాశం నుండి వచ్చే భక్తులు ఈ దారి గుండా శ్రీవారి ఆలయం చేరుకుంటారు. విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం రాతి మెట్లను ఏర్పాటుచేశారు.

నాల్గవ దారి

తిరుమల కొండకు పశ్చిమం వైపున కల్యాణి డ్యాం ... దానికి ఆనుకొని శ్యామలకోన అనే దారి ఉంది. రంగంపేట, భీమవరం వచ్చే భక్తులు ఈ దారిగుండా వెళుతారు.

నాల్గవ దారి

డ్యాం వద్ద నుండి దారి గుండా 3 కిలోమీటర్లు ముందుకు వెళితే ఒక మలుపు వస్తుంది. అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది. డ్యాం నుండి తిరుమల మధ్య దూరం : 15 KM.

ఐదవ దారి

కడప బోర్డర్ లో చిత్తూర్ ఎంట్రెన్స్ వద్ద కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి తుంబురుతీర్థం --> పాపవినాశనం --> తిరుమల చేరుకోవచ్చు. తుంబురుతీర్థం, పాపవినాశనం మధ్య దూరం 12 KM.

ఆరవ దరి

అవ్వాచారి కొండ/ అవ్వాచారికోన దారి గుండా వెళితే కూడా తిరుమల కొండ చేరుకోవచ్చు. రేణిగుంట సమీపంలో కడప - తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉన్నది. ఇక్కడి నుండి లోయలో ఉన్న అవ్వాచారికోన దారి గుండా పడమరవైపుకి వెళితే మోకాళ్ళపర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.

ఏనుగుల దారి

ఏనుగుల దారి అంటే ఏనుగులు ప్రయాణించిన దారి. పూర్వం చంద్రగిరి శ్రీవారి మెట్టు నుండి అవ్వాచారికోన వరకు దారి ఉండేది. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గానే చేరవేసేవారు.

తలకోన

తలకోన నుండి కూడా తిరుమలకు దారి కలదు. జలపాతం వద్ద నుండి నడుచుకుంటూ జెండాపేటు దారిలోకి వస్తే ... మీరు తిరుమలకు చేరుకున్నట్లే. నడక మార్గం 20 కిలోమీటర్లు.

తిరుమల గురించి మరికొన్ని విషయాలు

తిరుమలలో క్రీ.శ.1387 లో మోకాళ్ళపర్వతం వద్ద మెట్లు నిర్మించారు. విజయనగర రాజులు అలిపిరి - గాలి గోపురం మార్గం 15 వ శతాబ్దంలో వేశారు.

గాలిగోపురం నుండి కిందకు చూస్తే ..

అలిపిరి మెట్లు ఎక్కగానే గోపురం, కుమ్మరి దాసుని సారె, గజేంద్రమొక్షం, గాలిగోపురం వస్తాయి. అలానే ఇంకాస్త ముందుకు వెళితే గాలిగోపురం కనిపిస్తుంది. గాలిగోపురం నుండి కిందకు చూస్తే గోవిందరాజస్వామి, అలివేలుమంగమ్మ దేవాలయాలు , తిరుపతి పరిసరాలు అందంగా కనిపిస్తాయి.

ఆంజనేయస్వామి

గాలిగోపురం లోపలి వెళితే సీతారాముల ఆలయం, హనుమంతుని పెద్ద విగ్రహం, విష్ణుమూర్తి అవతారాలు తారసపడతాయి. దక్షిణంవైపు అడవిలోకి వెళితే ఘంటామండపం, నామాలగవి, అవ్వా చారి కోన కు వెళ్తుంటే అక్కగార్ల గుడి కనిపిస్తాయి. ఆతర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యుల వారి మందిరం కలదు.

మోకాళ్ళ మిట్ట

మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక సారె పెట్టెలను గమనించవచ్చు. అది దాటితే లక్ష్మీనరసింహ ఆలయం వస్తుంది. అలానే ఇంకాస్త ముందుకు మండపాలను దాటుకుంటూ వెళితే శ్రీవారి ఆలయం కనిపిస్తుంది.

శ్రీవారి మెట్టు

శ్రీవారి మెట్టు శ్రీనివాస మంగాపురం వద్ద కలదు. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీవారు, ఆయన భార్య పద్మావతి ఇక్కడే వివాహం చేసుకొని శ్రీవారి మెట్టు దారిలో కొండ పైకి వెళ్ళి వెలిశారు.

శ్రీవారి మెట్టు

తిరుపతికి శ్రీవారి మెట్టు కు మధ్య దూరం 15 కి.మీ. శ్రీవారి మెట్టు నుండి ఆలయానికి మధ్య 2500 - 2800 మెట్లు ఉన్నాయి. ఇవి ఎక్కటానికి పట్టే సమయం 1-2 గంటలు. ప్రతి 50/100 మెట్లకు నీటి సదుపాయాలు కలవు.

కౌంటర్

శ్రీవారి మెట్టు గుండా వెళితే 1000 వ మెట్టు వద్ద దివ్య దర్శనం టికెట్లు ఇస్తుంటారు. వెళ్ళి తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నవి 2000 మెట్ల దగ్గర స్టాంప్ వేసుకుంటే చెల్లుతాయి. 1100 మెట్ల వద్ద శ్రీవారి పాదాలు ఉన్నాయి.

మెట్ల దారిన వెళ్తున్నప్పుడు గుర్తించుకోవాల్సినవి

1. తిరుపతి బస్ స్టాండ్ నుండి ఉచితబస్సు సౌకర్యం ఉంది. మీరు బస్సును అందుకోలేకపోతే జీప్/ కార్ మాట్లాడుకొని వెళ్ళవచ్చు

2. శ్రీవారి మెట్టు కు వెళ్ళే మార్గంలోనే అలిపిరి వస్తుంది. అలిపిరి వద్ద లాకర్ సౌకర్యం ఉంది. శ్రీవారి మెట్టు వద్ద ఆ సౌకర్యం లేదు.

3.మెట్లమార్గం లో తాగునీటి సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. కనుక బాటిల్ తీసుకుపోవాల్సిన అవసరం లేదు. వీలైతే తినుబండారాలను తీసుకొని పోవచ్చు. కొండపైన, ఆలయ పరిసరాలలో ప్లాస్టిక్ వస్తువులు నిషేధం.

వసతి

వసతి ససౌకర్యాలకు తిరుమల లో కొదువలేదు. ఉత్సవాలు, పండుగలు తప్పనిచ్చి మిగితా అన్ని దినాలలో బస దొరుకుతుంది. టిటిడి విశ్రాంతి గదులు, గెస్ట్ హౌస్ లు, సత్రాలు, హోటళ్ళు, లాడ్జీలు లాంటి ఎన్నో వసతులు ఇక్కడ ఉన్నాయి.

గైడ్ తప్పనిసరి

ఈసారి తిరుమలకు వెళ్ళే యాత్రికులు పైన పేర్కొన్న దారుల గుండా వెళ్ళటానికి ప్రయత్నించండి. అయితే వెళ్ళేటప్పుడు గైడ్ లేదా స్థానికుల సహకారం తప్పనిసరి. కొత్త రూట్లు కదా !!

చేరుకోవడం ఎలా ?

అన్ని మార్గాలకు కేంద్ర బిందువు తిరుపతి. కనుక యాత్రికులు తిరుపతి చేరుకొని అక్కడి నుండి ఈ మార్గాలకు చేరుకొని శ్రీవారి ఆలయాన్ని దర్శించండి