Wednesday, February 17, 2021

శాంతి మంత్రాలు

 శాంతి మంత్రాలన్నీ కూడా చివర్లో ఓం శాంతి ... శాంతి ... శాంతిః అని ముగుస్తాయి . 

ఏదో ఒక సందర్భంలో వేద పండితులు ఈ శాంతి మంత్రాల్ని పఠించడం మనందరం వినే ఉంటాం. మనుషులకు మూడు రకాల ఉపద్రవాలనుండీ ప్రమాదం ముంచుకొస్తుంది

మొదటి "శాంతి" పదం శారీరిక , మానసికపరంగా సంభవించే ఉపద్రవం ( అనారోగ్యం ) నుంచీ ఉపశమనం పొందడానికి . దీన్ని  "ఆధ్యాత్మికం" అంటారు .

రెండవ "శాంతి" పదం ఇతర జీవరాశులనుండీ , మనుష్యులు నుండీ ఏవిధమైన ఆపదలు / ముప్పు సంభవించకుండా సురక్షితంగా ఉండటానికి . దీన్ని  " ఆధిభౌతికము " అంటారు .

మూడవ " శాంతి " పదం ప్రకృతి పరంగా సంభవించే ( భూకంపాలు / అగ్నిప్రమాదాలు / వరదలు / తుఫాన్లు మొదలగునవి ) ఉపద్రవాలు వలన ఏవిధమైన ఆపదలు / ముప్పు కలగకుండా ఉండటానికి . దీన్ని " ఆధిదైవికము " అంటారు.

ఈ మూడు ఉపద్రవాలనుండీ రక్షించమని వేడుకుంటూ  

" శాంతి " మంత్రం చివర్లో " శాంతి " పదాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తారు

No comments:

Post a Comment

సనాతన ధర్మం

 రచన.                ఋుషి/ కవి 1-అష్టాధ్యాయి -  పాణిని 2-రామాయణం -  వాల్మీకి 3-మహాభారత—  వేదవ్యాస్ 4-ఎకనామిక్స్ -    చాణక్య 5-మహాభాష్య -    ...