Thursday, December 18, 2025

భోజన వడ్డన, భోజన విధి

 1.భోజనానికి ముందుగా చతురస్రమండలం చేయాలి.

2.తూర్పు, దక్షిణ, పడమర ముఖంగా కూర్చుని తినాలి. 

3..మోదుగ, అరటి, పనస, మేడి ఆకులలో భోజనం ఉత్తమం 

4.ఎడమవైపుగా కొస ఉండాలి.

5.ఆకును నీటితో కడిగి మండలంపై ఉంచి ముందుగా నీతి చుక్కని ఆకు మీద వేసి వడ్డన చేయాలి.

6.ఎదురుకుండా కూరలు తరువాత మధ్యలో అన్నం, కుడివైపు పాయసం, పప్పు ఎడమవైపు పిండివంటలు చారు లేక పులుసు, చివర పెరుగు కలిపిన లవణం వడ్డన చేయాలి.

అన్ని వడ్డన అయ్యాక నెయ్యి వడ్డన చేయాలి.

7.ఆజ్య అభిఘారం లేకుండా అన్నము తినరాదు.

8.'త్రిసుపర్ణం' గాని 'అహంవైశ్వానరో భూత్వా '

మొదలగునవి పఠించవలయును.

9.చేతిలో నీరు గ్రహించి గాయత్రీ మంత్రముచే అన్నము పరిషేచన చేయవలెను. 

10.తర్జనీ మధ్యమ అంగుష్ఠములచేత ఎదుటభాగం నుండి ఓం ప్రాణా...స్వాహా అని ఆహుతి గ్రహించవలేను 

11.అనామిక, అంగుష్ఠములచేత దక్షిణభాగం నుండి ఓం అపానా...స్వాహా అని

12.కనిష్ఠ, అనామిక అంగుష్ఠములచేత 

పడమర భాగం నుండి ఓంవ్యాన..స్వాహాఅని

13.కనిష్ఠికా తర్జనీ అంగుష్ఠములచేత ఉత్తరభాగం నుండి ఓం ఉదానా.. స్వాహా అని

14.అన్ని వేళ్ళు కలిపి మధ్యభాగం నుండి ఓం సమానా...స్వాహా అని ప్రాణాహుతులు దంతములకు తగలకుండా ఇవ్వవలయును. 

15.ఉదయం రాత్రిపూట మాత్రమే భోజనము గృహస్తు చేయవలెను. 

16. మౌనంగా భోజనం చేయవలెను. 

17 భోజనకాలమందు మంచినీరు కుడిభాగమందు ఉంచవలెను. 

18.భోజనకాలమందు జలపాత్రను కుడిచేతి మణికట్టుపై ఉంచి ఎడమ చేతితో పట్టుకొని త్రాగవలయును.

19.భోజనం చేయుచూ పాదములు ముట్టుకొనరాదు. 

20. చిరిగిన ఆకులో తినరాదు.

21.కాళ్ళకి చెప్పులతోను, మంచాలపైన కూర్చుండి, ఓడిలో పెట్టుకొని భోజనం చేయరాదు.

22.భోజనం అయిన పిదప చేతిని కడుగుకొని 

నీరు పుక్కిలించి పాదప్రక్షాళన చేయవలెను. 

23భోజనమునకు ముందు వెనుక ఆచమనం చేయవలయును.


ఏమి తింటే ఏమి లాభాలు

* అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

* కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

* నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

* గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

* అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.

* జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

* బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.

* సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

* మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

* బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.

* మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

* దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

* ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.

* అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.

* కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.

* మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.

* ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.

* బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

* క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

* మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

* ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

* అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.

* పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.

* సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.

* దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.

* ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.

* చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

* కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.

* క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.

* యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

* వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

* పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.

* ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.

* ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.

* ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.

* జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

* ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

* నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

* మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.

* మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

బల అతిబల

 #అఖండ సినిమాలో బల అతిబల గురించి చెబుతారు కదా. అది ఏమిటంటే...*

✍️ఆదిత్యయోగి

విశ్వామిత్రుడు శ్రీరాముడికి బోధించిన బల – అతిబల సాధారణ మంత్రాలు కాదు. అవి ప్రకృతి శక్తులతో మమేకమై జీవించే జీవన విజ్ఞానం అని చెప్పాలి.


బల – అతిబల అంటే ఏమిటి?


బల అంటే,

శరీరానికి ఆహారం లేకుండా, నిద్ర లేకుండా శక్తిని నిలబెట్టే విద్య. ఆకలి, దాహం, అలసటలను జయించే మంత్రశక్తి. ప్రాణశక్తి ని నియంత్రించే సామర్థ్యం


అతిబల అంటే,

మానసికంగా భయం, మోహం, శోకంను జయించే శక్తి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా స్థిరచిత్తం, అంతర్గత దృష్టి, అవగాహన పెంపొందించే విద్య


పై రెండూ కలిసే ఉంటే

శరీరం + మనస్సు + ప్రకృతి ఒకే లయలో పనిచేస్తాయి.


ప్రకృతితో మమేకం ఎలా?


బల–అతిబల సాధించిన రాముడు, 

అడవుల్లో నడిచినా అలసట లేకుండా ముందుకు సాగాడు

పర్వతాలు, నదులు, వృక్షాలు ఇవన్నీ శత్రువులు కాదు, సహచరులు అని భావించాడు

ప్రకృతి సంకేతాలను (గాలి, పక్షులు, జంతువుల ప్రవర్తన) అర్థం చేసుకునే స్థితి లో తనని తాను జయించాడు

“నేను ప్రకృతిలో లేను – నేనే ప్రకృతి” అన్న భావన రాముడిలో ఉంది. 


సీతాన్వేషణలో బల–అతిబల పాత్ర ప్రముఖంగా కనిపిస్తుంది. 


సీతాన్వేషణ అనేది కేవలం భౌతిక ప్రయాణం కాదు.

బల వల్ల.

దీర్ఘకాలం అడవుల్లో తిరగగలిగారు

ఆహారం దొరకకపోయినా శక్తి నిలిచింది

శరీరం క్షీణించలేదు


అతిబల వల్ల:

సీత వియోగంలో కూడా ధైర్యం కోల్పోలేదు

కోపం, నిరాశలో చిక్కుకోలేదు

ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘటనను ధర్మ దృష్టితో చూశారు


అందుకే, శబరి మాటల్లో సత్యాన్ని చూశారు

హనుమంతునిలో అపార శక్తిని గుర్తించారు

వానరులను కేవలం జంతువులుగా కాక ధర్మసహచరులుగా స్వీకరించారు


ఈ విద్య వల్లే రాముడు:

ప్రకృతిని నాశనం చేయలేదు

కానీ అధర్మాన్ని నిర్మూలించారు.


ఇది ఇప్పుడు మనం చెయ్యడం సాధ్యమా అని గూగుల్ లో చుస్తే సాధ్యమే… అని చెప్పింది 


బల–అతిబల ఇప్పుడు నేర్చుకోవాలంటే మంత్రాలకంటే ముందుగా జీవన పద్ధతి (Lifestyle Yoga) మారాలి. ఇది 3 స్థాయిల్లో సాగుతుంది — శరీరం → ప్రాణం → చిత్తం.


బల (శరీర + శక్తి నియంత్రణ)

ఉదయం (30–40 నిమిషాలు)

సూర్యోదయానికి ముందు లేవడం

గోరువెచ్చని నీరు తీసుకోవడం, 

ప్రాణాయామం

నాడీశోధన – 7 చక్రాలు

భస్త్రిక – 3 రౌండ్లు (తేలికగా)

కపాలభాతి – 20–30 (బలవంతం కాదు)

“నా శరీరం, ప్రాణం ధర్మయాత్రకు సిద్ధమవుతుంది” అనే సంకల్పం...


ఇక ఆహారం విషయానికి వస్తే, 

తేలికపాటి సాత్విక భోజనం

వారానికి 1 రోజు ఉపవాసం / ఫలాహారం


సాయంత్రం నిశ్శబ్ద నడక (ఫోన్ లేకుండా) – 15 నిమిషాలు

అడుగుల శబ్దం, శ్వాస మీద దృష్టి

దాని ఫలితం: ఆకలి, అలసటపై నియంత్రణ


అతిబల (మనస్సు + స్థిరత్వం) వస్తుంది.


ధ్యానం (రోజుకు 20 నిమిషాలు)

కూర్చొని శ్వాస చూడడం

భావాలు వచ్చినా తీర్పు ఇవ్వక గమనించడం

మంత్రస్మరణ - “రామ” నామ జపం (శబ్దం కాదు, భావంతో)


మానసిక సాధన

రోజుకు ఒకసారి అడగాలి: “ఇది ధర్మమా? లేక నా కోరికనా?”


వీటి ఫలితం: భయం, ఆందోళన తగ్గుతుంది

ప్రకృతితో ఐక్యత – కొనసాగింపు సాధనగా, వారానికి 1 రోజు

చెట్టు కింద 10 నిమిషాలు కూర్చోవడం నేలపై పాదాలు పెట్టి శ్వాస తీసుకోవడం చెయ్యాలి. 


ఇక త్యాగ సాధన

వారానికి ఒక అలవాటు తగ్గించంకుంటే సమూల మార్పులు వస్తాయి. 


వీటి ఫలితం: ప్రకృతి సంకేతాల పట్ల సున్నితత్వం

కొన్ని రోజుల తర్వాత మార్పులు

శరీర శక్తి నిలకడ

మనస్సు స్థిరత

నిర్ణయాల్లో స్పష్టత

ప్రకృతితో అనుబంధ భావన


ఇదే ఆధునిక బల–అతిబల సాధన మార్గం 


- ఇన్ని చేసే ఓపిక ఈ రోజుల్లో ఎవరికి ఉంది. వాళ్ళని వీళ్ళని తిట్టడానికే సమయం సరిపోవడం లేదు ఇక్కడ. అంత చేసి రాముడికి కొబ్బరికాయ కొడితే సరిపోతుంది అనే ఆలోచనలో ఉన్నారు.🙏🙏

ప్రశ్నలు - సమాధానాలు

👉ఆండాళ్ అని ఎవరికి పేరు?

= గోదాదేవి.


👉తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?

= సుప్రభాతం బదులుగా.


👉ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?

= భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే మంచిరోజు.


👉గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?

= శ్రీ విష్ణుచిత్తులు.


👉ఆళ్వారులు ఎంతమంది?

= 12మంది.


👉గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?

= భూదేవి.


👉గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?

= తమిళభాష.


👉తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?

= నాలాయిర్ దివ్యప్రబంధము.


👉శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?

= 108.


👉గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?

= శ్రీవిల్లి పుత్తూరు.


👉దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?

= దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.


👉శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?

= 196 అడుగులు.


👉‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?

= మూడవ పాశురం.


👉శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?

= తిరుసాదము.


👉శ్రీవిష్ణుచిత్తులు వారు తానకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?

= కోదై (గోదా)


👉పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?

= గరుడాంశము.


👉తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?

= శ్రీవ్రతము.


👉మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?

= పరమాత్మ చేతిలోని శంఖమువలే.


👉శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?

= మన్మధుని


👉తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?

= సింహం పిల్లవలె.


👉తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?

= ధృడమైన కోరిక, పట్టుదల.


👉కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?

= మొదటి పాశురం.


👉శ్రీకృష్ణుడు యశోద గర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?

= దేవకీ పుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)


👉ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?

= రెండవ పాశురం.


👉తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?

= వామన అవతారం.


👉ఆళ్వార్లకు మరో పేరేమిటి?

= వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.


👉నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?

= మూడు.


👉మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?

= పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.


👉శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమటి?

= ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).


👉‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్న నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?

= యమునా నది.


👉మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?

= దానగుణం.


👉లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?

= వర్షానికి.


👉పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?

= పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.


👉విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?

= ఐదవ పాశురం.


👉విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= నమ్మళ్వారు.


👉తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= బుద్ధివ్రతం.


👉గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?

= పిళ్ళాయ్ (పిల్లా).


👉తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?

= ఆళ్వార్లతో.


👉గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?

= పూదత్తాళ్వారు.


👉తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?

= శ్రీ పెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.


👉కీచుకీచుమని అరిచే ఏ పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?

= భరద్వాజ (చాతక) పక్షులు.


👉తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?

= కులశేఖరాళ్వార్.


👉సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?

= విష్ణుపోతము (విష్ణువనే ఓడ)


👉పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?

= ఆయన దాసులే గొప్ప.


👉ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?

= ఎన్ని జన్మలకైనా అని అర్థము.


👉ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?

= అయోధ్య.


👉వజ్గం అంటే ఏమిటి?

= ఓడ.


👉ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?

= అమృత కలశం.


👉ముప్పయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?

= తిజ్గళ్ తిరుముగత్తు- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.


👉గోపికల దివ్యాభరణములేవి?

= కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.


👉శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?

= అణి పుదువై- ఈ జగత్తుకే మణివంటిది.


👉శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?

= పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.


👉గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?

= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).


👉తిరుప్పావై ఎటువంటి మాల?

= ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.


👉శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?

= గోదాదేవి.


👉శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?

= గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.


👉భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= తొండరపడిప్పొడి యాళ్వార్....స్వస్తి...


ఆండాళ్ తిరువడిగలే శరణం ...జై శ్రీమన్నారాయణ....

ధనుర్మాసం – శివ ప్రాశస్త్యం

ఈరోజు (18-Dec-2025) నుండి ధనుర్మాసం ప్రారంభం గోదాదేవి ఎవరు ?  పాశురాలు అంటే ఏమిటి ?   వాటి పరమార్ధం ఏమిటి ?

గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు పన్నిద్దరాళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో (4000 పాశురాలు) గోదాదేవి పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి తనని తాను రేపల్లెలో గొల్లభామగా భావించుకుంది. 

తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం , రాత్రివేళ చూడలేని తాపం , తెల్లవారే వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన , ఆత్రం కలబోసిన భావరాగానురాగాల పారిజాతాల మాల తిరుప్పావై. 

పాశురాల పరమార్ధం

తిరుప్పావైలో ఉన్న మొత్తం పాశురాలు 30. వీటిలో మొదటి అయిదు ఉపోద్ఘాతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని , చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాయి. భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని , పంటలు నిండుగా పండుతాయని , దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది. 

తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు , అక్కడి శిల్పసౌందర్యాల వర్ణనలు , రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంటుంది. 

చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది. 

👉 ధనుర్మాసం – శివ ప్రాశస్త్యం 

ఋషిపీఠం 

మార్గశిరమాసం ఆర్ద్రానక్షత్రం నాడు శివుడు అగ్నిలింగంగా అరుణాచలంలో వ్యక్తమైనాడని శైవపురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలోని ఒకానొక సోమవారం నాడు శివపార్వతుల కళ్యాణం జరిగిందని శివపురాణ వచనం. ఉషఃకాలంలో శివార్చన వైశిష్ట్యాన్ని కూడా పురాణాలు పేర్కొన్నాయి. అత్యంత ప్రాచీన కాలం నుండి నేటివరకు వైదిక శైవ సిద్ధాంతానుసారం తమిళనాట శైవాలయాలలో ఉషఃకాల పూజ జరుగుతోంది. ఆ సమయంలో మాణిక్యవాచకుని ‘తిరువెంబావై-తిరుప్పళి ఎళుచ్చి' పఠనం చేయడం కూడా ఆనవాయితీ. అయితే వైష్ణవం కూడా శ్రీరామానుజుల పరంపర ద్వారా దక్షిణాదిలో వ్యాప్తి చెంది 'తిరుప్పావై' ఇక్కడి వైష్ణవాలయాలలో పారాయణ చేయడం అలవాటు అయింది. కానీ ఆ ప్రచార ధాటిని తమిళ శైవమతం అవలంబించకపోవడం చేత ఇక్కడి శివాలయాలకు 'తిరువెంబావై' తెలియలేదు. తిరుప్పావై, తిరువెంబావై రెండూ అవశ్య పఠనీయాలుగా ప్రస్తావించి వ్యాప్తి చేసినది కాంచీ పరమాచార్యులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు. ఆ మహాస్వామి వారి చరణాలను ధ్యానిస్తూ వారి హృదయానుసారం ఈ ఉభయ గ్రంథాలను ఈ ధనుర్మాస సమయంలో పారాయణ చేసుకుందాం. 

భోజన వడ్డన, భోజన విధి

 1.భోజనానికి ముందుగా చతురస్రమండలం చేయాలి. 2.తూర్పు, దక్షిణ, పడమర ముఖంగా కూర్చుని తినాలి.  3..మోదుగ, అరటి, పనస, మేడి ఆకులలో భోజనం ఉత్తమం  4.ఎ...