👉ఆండాళ్ అని ఎవరికి పేరు?
= గోదాదేవి.
👉తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?
= సుప్రభాతం బదులుగా.
👉ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?
= భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే మంచిరోజు.
👉గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?
= శ్రీ విష్ణుచిత్తులు.
👉ఆళ్వారులు ఎంతమంది?
= 12మంది.
👉గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?
= భూదేవి.
👉గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?
= తమిళభాష.
👉తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?
= నాలాయిర్ దివ్యప్రబంధము.
👉శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?
= 108.
👉గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?
= శ్రీవిల్లి పుత్తూరు.
👉దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?
= దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.
👉శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?
= 196 అడుగులు.
👉‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?
= మూడవ పాశురం.
👉శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?
= తిరుసాదము.
👉శ్రీవిష్ణుచిత్తులు వారు తానకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?
= కోదై (గోదా)
👉పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?
= గరుడాంశము.
👉తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?
= శ్రీవ్రతము.
👉మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?
= పరమాత్మ చేతిలోని శంఖమువలే.
👉శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?
= మన్మధుని
👉తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?
= సింహం పిల్లవలె.
👉తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?
= ధృడమైన కోరిక, పట్టుదల.
👉కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?
= మొదటి పాశురం.
👉శ్రీకృష్ణుడు యశోద గర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?
= దేవకీ పుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)
👉ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?
= రెండవ పాశురం.
👉తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?
= వామన అవతారం.
👉ఆళ్వార్లకు మరో పేరేమిటి?
= వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.
👉నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?
= మూడు.
👉మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?
= పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.
👉శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమటి?
= ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).
👉‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్న నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?
= యమునా నది.
👉మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?
= దానగుణం.
👉లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?
= వర్షానికి.
👉పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?
= పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.
👉విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?
= ఐదవ పాశురం.
👉విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?
= నమ్మళ్వారు.
👉తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?
= బుద్ధివ్రతం.
👉గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?
= పిళ్ళాయ్ (పిల్లా).
👉తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?
= ఆళ్వార్లతో.
👉గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?
= పూదత్తాళ్వారు.
👉తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?
= శ్రీ పెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.
👉కీచుకీచుమని అరిచే ఏ పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?
= భరద్వాజ (చాతక) పక్షులు.
👉తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?
= కులశేఖరాళ్వార్.
👉సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?
= విష్ణుపోతము (విష్ణువనే ఓడ)
👉పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?
= ఆయన దాసులే గొప్ప.
👉ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?
= ఎన్ని జన్మలకైనా అని అర్థము.
👉ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?
= అయోధ్య.
👉వజ్గం అంటే ఏమిటి?
= ఓడ.
👉ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?
= అమృత కలశం.
👉ముప్పయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?
= తిజ్గళ్ తిరుముగత్తు- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.
👉గోపికల దివ్యాభరణములేవి?
= కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.
👉శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?
= అణి పుదువై- ఈ జగత్తుకే మణివంటిది.
👉శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?
= పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.
👉గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?
= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).
👉తిరుప్పావై ఎటువంటి మాల?
= ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.
👉శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?
= గోదాదేవి.
👉శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?
= గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.
👉భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?
= తొండరపడిప్పొడి యాళ్వార్....స్వస్తి...
ఆండాళ్ తిరువడిగలే శరణం ...జై శ్రీమన్నారాయణ....