వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు.
కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు.
కానీ...!!
ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది.
ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 లోపే అంతిమయాత్ర అవుతుంది.
ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి.
శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది, శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు.
ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు.
బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదనలో లీనమై పోతుంది.
ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది.
శరీరాన్ని దహనం చేసే దాకా ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది.
పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని (డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు.
ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ళ మీద, ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది.
అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే.
అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ తిరిగి మొదటి నుండి లెక్కించాలి.
శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు.
ఎందుకంటే కుండా నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది.
కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది.
కుండను కింద పడేసి పగలగొడతారు , అంటే ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తారు,
ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో అని ఆత్మకు మనమిచ్చే సంకేతం.
మన సాంప్రదాయంలో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది.
కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు, అదే మన ఖర్మ.
ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే , ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేసాడు నేను ఇలాగే చేస్తున్నాను
కానీ ఎందుకు చేస్తున్నానో తెలియదు.
ఎవరూ భారత ఆచార, సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి, అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది.
No comments:
Post a Comment