Thursday, June 26, 2025

వారాహీ నవరాత్రులు


వారాహీ నవరాత్రులు మొదలు,

అంటే26 జూన్ 2025 నుంచి మొదలు.

  

వీటిని గుప్త నవరాత్రులంటారు. 

రాత్రి సమయాలలో చేస్తారు కాబట్టి వీటికి గుప్త నవరాత్రులని పేరు. 


ఆషాడ మాస పాడ్యమి నుంచి నవమి వరకూ వచ్చే నవరాత్రులను "శ్రీ వారాహీ నవరాత్రులు" అని పిలుస్తారు. 

శ్రీ లలితా దేవి యొక్క దండనాయిక (సేనానాయిక) శ్రీ వారాహీ మాత.

ఈమె రక్షణ శక్తి. ఎంతటి ఘోర కష్టాల్లో ఉన్నవారైనా ఈ తల్లిని స్మరించినంత మాత్రాన ఉద్దరింపబడతారని శాస్త్ర వచనం.

ఆషాడ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం కోసం పూజించాలి. ఆరోగ్యం కోసం పూజించాలి. 


ఆమె భూదేవికి మరో రూపం, వరాహ స్వామి యొక్క స్త్రీ రూపం.


లలితా దేవి యొక్క దండిని రూపం వారాహి మాత.

ఈమె అన్యాయాన్ని ఎదిరించి, చెడును శిక్షించి ఆశ్రితులకు రక్షణ ఇచ్చే దేవత.

ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేది కలగనీయదు.


శత్రు సంహారం జరుగుతుంది.


రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది. పాడిపంటలు, నీటిని అనుగ్రహిస్తుంది. 


ఈ తల్లి మంత్రం సిద్దిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది.

వారాహి దేవత మాతృకా దేవత. సముద్రపు లోతులలో దాచి పెట్ట బడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం. అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మ తత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య. అతి బలవత్తరమైన శక్తి. సమస్యలను కూకటి వేళ్ళతో పెకలించి పారేయగలదు.

ఈ తల్లిని రాత్రివేళల్లో పూజించాలి 

శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి.

దుష్టశిక్షణ కోసమూ, భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరైన వారాహి దేవత వరాహుని స్త్రీతత్వం.

వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీరఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో... 

శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది.

వారణాసి లో ఉన్న ఈమె ఆలయానికి ప్రాధాన్యత ఎక్కువ. ఈమే వారణాశికి గ్రామదేవత కూడా. 


లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ, తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. 


వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం.

(గురు ముఖతా మంత్రం స్వీకరించాలని మనవి)

లలితాదేవి ఆజ్ఞా చక్రము నుంచి ఉద్భవించింది అంటారు. 

ప్రతీ మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో వుండి మణిపూర , స్వాధిష్ఠాన , మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .


వారాహి దేవి కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తి అవుతాయి.

బౌద్ధ మతం వారు వజ్ర వారాహి మాతగా పూజిస్తారు .

ఈమె ఉత్తర దిక్కుకు అధిదేవత .


ఈమె చేతిలో నాగలి రోకలి ఉంటుంది. నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతం ఈ తల్లి. రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతం.

ఇది బాహ్యార్ధం .


అంతరార్థం ఏమిటంటే అహంకార నివారించి జ్ఞానం ప్రసాదిస్తుంది యని.


ప్రతీ మనిషిలోనూ వారాహీ శక్తి నాభి ప్రాంతంలో ఉంటుంది. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులలో క్రియా శక్తి రూపం వారాహి దేవి. 


ఆషాఢ పాడ్యమి నుంచి ఈ వారాహీ నవరాత్రులలో వారాహీ దేవిని కొలుస్తుంటారు. 


“1.పంచమి, 

2. దండనాథా, 

3. సంకేతా, 

4. సమయేశ్వరి, 

5. సమయ సంకేతా, 

6. వారాహి, 

7. పోత్రిణి , 

8. వార్తాళి ,

9. శివా, 

10. ఆజ్ఞా చక్రేశ్వరి ,

11. అరిఘ్ని 

12. మహా స్నానేశ్వరి

అన్న ఈ పన్నెండు నామాలు చదువుకున్నా చాలు ఈ తొమ్మిది రోజులు. 


లేదా 


“కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |” అన్న లలితా నామాలలో కాని, అమ్మవారి స్తోత్రం చేస్తే ఫలితాలు ఉంటాయి. 


ఆషాఢ వారాహి నవరాత్రులు రేపటి నుంచి మొదలు. 


1. ఉన్మత్త వారాహి 

ఆషాడ శుక్ల పాడ్యమి 

(ఇంద్రాణి దేవి)

2. బృహత్ వారాహి  

శుక్లపక్ష విదియ 

(బ్రహ్మి దేవి )

3 స్వప్నవారాహీ పూజ 

శుక్ల తదియ 

(వైష్ణవి దేవి)

4 కిరాతవారాహి  

ఆషాడ శుక్ల చవితి 

(మహేశ్వరి ) 

5. శ్వేత వారాహి  

తిథి శుక్ల పంచమి (విశేషం )

(వారహి )

6 : ధూమ్రవారాహి  

శుక్ల షష్టి 

(మహేశ్వరీ )

7,మహావారాహి  

శుక్ల సప్తమి (చాముండి )

8 :వార్తాలి వారాహి 

శుక్ల అష్టమి (విశేషం )

(మహాగౌరి, మహా లక్ష్మి, అష్ట మాతృకగా లక్ష్మి దేవిని పూజిస్తారు )

9 :దండిని వారాహి పూజ

శుక్ల నవమి (లలితా )

10: ఆది వారాహి మహపూజ మరియు ఉద్యాపన (Parana) 

శుక్ల నవమి /దశమి


అందరూ ఆ జగదంబను వారాహీ రూపములో సేవించి ఉత్తమఫలితాలు పొందటానికి అనువైన కాలమిది.

Tuesday, June 24, 2025

అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?

వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు. 

కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు.

కానీ...!!

ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. 

ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 లోపే అంతిమయాత్ర అవుతుంది.

ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. 

శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది, శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు.

ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు.

బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదనలో లీనమై పోతుంది. 

ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. 

శరీరాన్ని దహనం చేసే దాకా ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది.


పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని (డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు.

 ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ళ మీద, ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. 

అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే. 

అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ తిరిగి మొదటి నుండి లెక్కించాలి.


శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. 

ఎందుకంటే కుండా నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది.

 కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. 

కుండను కింద పడేసి పగలగొడతారు , అంటే ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తారు,

ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో అని ఆత్మకు మనమిచ్చే సంకేతం.


మన సాంప్రదాయంలో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. 

కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు, అదే మన ఖర్మ.

ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే , ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేసాడు నేను ఇలాగే చేస్తున్నాను

కానీ ఎందుకు చేస్తున్నానో తెలియదు.


ఎవరూ భారత ఆచార, సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి, అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది.

లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం పది వాక్యాలలో..

01. మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి, మీ ఆధీనంలోంచి దూరం అవుతారు.  వారి ఆధీనంలోకి మీ...